Saturday, October 8, 2011

అభివృద్ధి పేరుతో విధ్వంసం..By -వూకే రామకృష్ణ ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ Namasethe Telangana 09/10/2011

అభివృద్ధి పేరుతో విధ్వంసం...
వర్తమానంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం మనిషి ఉనికికే ప్రమా దం. పోలవరం ప్రాజెక్టు కూడా అలాంటి విధ్వంసంలో ఒక భాగం. ప్రకృతిని మనం రక్షించుకుంటే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. పాలక వర్గాలు ప్రజానీకానికి నీతులు చెప్పుతాయి . కానీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రజలందరూ సమానమనీ భారత రాజ్యాంగంలోని 14వ అధికరణంలో పొందుపర్చుకున్నాం. నవీన విజ్ఞానంతో పాటుగా వ్యవసా యం, పశువుల అభివృద్ధి కోసం కృషిచేయాలని, ప్రకృతి సిద్ధమైన వాతా వర ణాన్ని, అడవులు, చెరువులు, నదులను రక్షించుకోవాలి. వన్య ప్రాణుల వైవి ధ్యాన్ని కాపాడటానికి పెంపొందించుకోవడానికి జీవజంతు జాలం పట్ల కనికరం ప్రేమ చూపాలి. ప్రజలు జీవించడానికి వారికి కావలసిన వసతులు పొందడానికి రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలని ఆదేశిక సూత్రాల ద్వారా హామీలు ఇచ్చుకున్నాము. ఇవన్నీ చెప్పడానికి మాత్రమేనని ఇటీవలి పరి ణామాలు తెలియజేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు దీనికొక తాజా ఉదాహరణ. దీనితో ప్రాంతాల మధ్య వివక్ష మాత్రమే గాక, పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. అయినా.. పాల కులు దీనినేమీ పట్టించుకోకుండా.. పక్షపాత ధోరణితో పోలవరా న్ని నిర్మించడానికి పూనుకున్నారు.


గోదావరి నదిపై పోలవరం దగ్గర ఐదు వందల టీఎంసీల భారీ నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును 17,340 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నారు. 80 టీఎంసీల నీటిని కృష్ణా జిల్లాకూ, 181.53 టీఎంసీల నీటిని విశాఖ పట్టణం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకూ, కృష్ణాజిల్లాలోని570 గ్రామాలకు తాగు నీరుఅందించబోతున్నారు. అలాగే.. 960 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని కూడా చెప్పు కొస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఈ ప్రాజెక్టు కారణంగా తెలం గాణ ఖమ్మం జిల్లా లోని వరరామచంద్రాపురం, మండలంలోని 45 గ్రామా లు, కూనవరం మండలంలోని 48 గ్రామాలు, చింతూరు మండలంలోని 17 గ్రామాలు, కుక్కునూరు మండలంలోని 34 గ్రామాలు, భద్రాచలం మండలం లో 40 గ్రామాలు, బూర్గం పాడు మండలంలో 15 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నంలో 42 గ్రామాలు,ఒడిషా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాలు కొన్ని ముంపునకు గురవుతున్నాయి. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్ ) పరిశోధన ప్రకారం 276 గ్రామాలు మునిగిపోతున్నాయి. రెండు లక్షల ముప్ఫై వేలమంది నిర్వాసితులవుతున్నా రని నిపుణులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక అధ్యయ నాలు కూడా 94, 357 ఎకరాల భూమి, 650 చదరపు కిలోమీటర్ల షెడ్యూ ల్డు ప్రాంతం, ఇందులో 7, 964 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ నాశనం అవుతుం దని, ముంపుకు గురిఅవుతుందని తెలుపుతున్నాయి. అంతేగాక.. ఈ ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న జనాభాలో మొత్తం అదివాసీలే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు మూలంగా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, వారి ఉనికి, అడవులు, జంతుజాలం మొత్తం నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. వారి పునరావాసం గానీ, ఇతర జీవన సమస్యలు కానీ ఈ పాలక వర్గాల కు పట్టదు.

‘పోలవరం ప్రాజెక్ట్ వద్దే వద్దు’ అనే ప్రధాన డిమాండ్‌తో ఆదివాసీ విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలు, తెలంగాణ రాష్ట్ర సమితి, ఆదివాసీ దళిత తది తర ప్రజాసంఘాలన్నీ పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముంపు ప్రాంతా లలో పాదయాత్రలు చేశాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిషా, రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్షా లు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కుంట ఎమ్మెల్యే కొవ్వాసి లకా్ష్మ నేతృత్వంలో భారీ ర్యాలీలు , బహిరంగ సభలు జరిగాయి. వేల మంది ఆదివాసీలను సమీకరించగలిగారు.
పోలవరం కారణంగా ముంపునకు గురి అయ్యే ప్రాంతం అంతా పైరు పచ్చలతో అలరారు తుంటుంది.పత్తి, పెసరు, నువ్వు, మొక్కజొన్న, మిరప, చేన్లతో ఈ ప్రాంతమంతా స్థానిక గిరిజనులకు జీవనాధారంగా ఉంటోంది. అనేక రకాల మొక్కలు, ఔషధ మొక్కలతో అటవీ ప్రాంతమంతా ఎన్నటికీ తరగని గనిగా ఉంటోంది. అలాంటి సహజసిద్ధ వనరులను, వన సంపదను, పంట భూములను పోలవం ప్రాజెక్టు మింగేస్తోంది. అంతేగాక అనేక గ్రామా లు ముంపునకు గురై గిరిజనులు నిర్వాసితులు అవుతున్నారు. ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టుకు ఎగువ ఉన్న తెలంగాణ జిల్లాలకు ఇవ్వాల్సిన 680 టీఎంసీల నీటి నుంచి 500 టీఎంసీల నీటిని ఆంధ్రాకు తరలించి జలదోపిడీకి పాల్పడుతున్నారు. మరోవైపు ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఆంధ్రా పాలకులు మరిచే పోయారు. పీవీ నరసింహారావు కుంతనపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. దుమ్ము గూడెం ప్రాజెక్టు గురించి కాంట్రాక్టర్ల జేబు లు నింపే పనులే చేశారు.మొబిలైజేషన్ ఫండ్ పేరుతో.. 450 కోట్లు కాంట్రా క్టర్లకు ఇచ్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల రెండో దశ నిర్మాణ పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఇలా తెలంగాణలోని 13 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,450 కోట్లు అవసరం కాగా, ఇప్ప టికీ 2, 850 కోట్లు కూడా ఖర్చుచేయలేదు.
అభివృద్ధి అంటే ప్రకృతి వనరులు, వృక్ష సంపద , జంతుసంపదను నాశ నం చేయడం కాదనీ , అలాగే ఒక వర్గం ప్రజల ఆదాయ అవకాశాలను మెరు గుపర్చడం కోసం ఇతర ప్రాంత ప్రజలను బలిపెట్టడం కాదనీ డ్యాం నిర్మా ణంపై పరిశీలన కోసం ఏర్పాటైన అంతర్జాతీయ ప్రాజెక్టుల కమిషన్ తేల్చి చెప్పింది. ప్రపంచంలో 3600 పెద్ద డ్యాంలు ఉంటే, అందులో 40 శాతం డ్యాంలు భారతదేశంలోనే ఉన్నాయి. 1990 వరకు నిర్మించిన వివిధ ప్రాజె క్టు కింద రెండు కోట్ల 13 లక్షల మంది నిర్వాసితులయ్యారు. అపారమైన జలవనరులనూ ఒక చోట నిల్వచేయటం వల్ల భూమిపై ఒత్తిడి పెరిగి భూకం పాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ భారీ ప్రాజె క్టుల కమిషన్ తేల్చి చెప్పింది.అయినా మన పాలకులకు ఇవేవీ చెవికి ఎక్కడం లేదు. భారీ ప్రాజెక్టు వల్ల పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలుగుతుందని ప్రపంచ బ్యాంకు నియమించిన మోర్సు కమిటీ తేల్చి చెప్పింది. అలాగే భారీ ప్రాజెక్టులు వల్ల కలిగే ప్రయో జనం కేవలం పదిశాతం ప్రజలకు ఉపయోగ పడు తుందని చెప్పింది. ఇటీవలి కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొరకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల కాంట్రాక్టు కోసం రెండు మూడుసార్లు టెండర్లు పిలిచారు.

సీమాంధ్రకు చెందిన వారే కాంట్రాక్టు పొందారు. అంటే పోలవరం ప్రాజెక్టు ఆర్థికంగానూ, భౌతికం గానూ, వ్యవసాయ పరంగా, మంచినీరు, పారిశ్రామికంగా అన్ని రకాలుగా సీమాం ధ్రకు ఉపయోగపడుతుంది. తెలంగాణకు ఏ మాత్రం ఉపయో గపడటం లేదు. పైగా తెలంగాణ ప్రాంత భూములు మునిగి పోతున్నాయి. ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జంతువుల మీద చూపిన ఔదార్యం సామా న్య ప్రజలమీద చూపడంలేదు.

ఛత్తీస్‌గఢ్ జల్సాయిగిరి జిల్లాలో గూడ్సు రైలు ఢీకొని ఏడు ఏనుగులు చనిపోతే పర్యావరణ శాఖ చలించిపోయి ఏనుగుల రక్షణ గురించి రైలు మార్గం వెంబడి 168 కిలోమీటర్ల పరిధిలో ముళ్ళకంచే నిర్మాణానికి, వాచ్‌టవర్ల నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయాల ప్యాకేజీ ప్రకటించింది. కానీ ఇక్కడ పోలవరం ప్రాజెక్టు వల్ల 276 గ్రామాలు.. రెండు లక్షల ముఫె్పై వేల మంది ప్రజలు నిర్వాసితులు అవుతుంటే ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. 650 చదరపు కిలోమీటర్ల షెడ్యూల్ ప్రాంత విస్తీర్ణంలో 94. 357 ఎకరాల భూమి, 7,964 ఎకరాల రిజర్వు భూములు, అడవులు ముంపునకు గురి అవుతున్నాయి. పర్యావరణ వేత్తలు, మేధావులు, ఆదివాసీ సంఘాలు, వివిధ అధ్యయనాలు పోలవరం ప్రాజెక్టును కట్టవద్దని కోరుతున్నా యి. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో పాటుగా అదే ఉద్యమ స్ఫూర్తితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలని పోరాటం చేయాలి. 
-వూకే రామకృష్ణ
ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్, ఖమ్మం జిల్లా

No comments:

Post a Comment