Thursday, October 13, 2011

బీసీల అభివృద్ధికి ‘చే’యూతనివ్వాలి! By R Krishnaiah Surya News Paper Dated 13/10/2011

బీసీల అభివృద్ధికి ‘చే’యూతనివ్వాలి!
ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి చేయూతనందించవలసిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అవకాశం వచ్చిన సందర్భాలలో బీసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయాభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీల అభ్యున్నతికి తోడ్పడే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు కారణంగా పంచాయతీ రాజ్‌ సంస్థలలో బీసీ రిజర్వేషన్లను ఇప్పటికే ఉన్న 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించే ప్రయత్నం జరిగింది. అయితే బీసీ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సన్నాహాలు చేయడంతో ఈ రిజర్వేషన్ల తగ్గింపు ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.

వివిధ పార్టీలలో ఉన్న బీసీ నాయకులలో కొందరు మినహా, మెజారిటీ నాయకులు తమ పదవులు ఉంటే చాలు, తమ జాతి ఏమైపోతేనేమి అనే భావనతో బీసీ లను పట్టించుకోవడం లేదు. రాజకీయ కోణంలో చూ స్తున్నారే తప్ప, మెజారిటీ ప్రజలను విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ, సామాజిక రంగాలలో అభివృద్ధి చేయాలనే దిశగా ఆలోచించడం లేదు. దీనిని అలుసుగా తీసుకొని అగ్ర కుల నాయకత్వం బీసీలను అన్ని రంగాలలో తొక్కి పెడుతున్నది. గత ఎన్నికలలో బీసీలు కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇచ్చా రు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ బీసీ కులాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందేందుకు తగిన చర్యలను తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నది. బీసీలు తెగించి పోరాడకపోతే వారి ఉనికే ప్రశ్నా ర్థకమవుతుంది.

1. బీసీలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని 2008లో క్యాబినెట్‌లో, అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఐనా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అఖిల పక్షం గాని, ప్రభుత్వం గాని కనీస ఒత్తిడి తేవడం లేదు. బీసీ ఉద్యమాల ఒత్తిడికి లొంగి తీర్మానాలు చేశారే తప్ప, వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవ డంలేదు. ఇది బీసీలను నిర్లక్ష్యం చేయడం కాదా! 2. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును సాకుగా తీసుకొని పంచాయతీరాజ్‌ సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతంకు తగ్గించడానికి కుట్ర చేశారు. బీసీలు ప్రతిఘటించడంతో తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టారు.ఈ సమస్య పరిష్కారం కోసం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. కాని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అందుకు పూనుకో లేదు.

3. ఎంబీబిఎస్‌ కన్వీనర్‌ కోటా బి- కేటగిరి బీసీ విద్యార్థులకు 2009 కౌన్సిలింగ్‌లో ప్రభుత్వమే ఫీజులు వసూలు చేయలేదు. జి.ఓ.నెం. 18లో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా - అని స్పష్టంగా ఉండ డంతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ కన్వీనర్‌ కోటా బి-కేటరిగి విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయలేదు. వాటిని ప్రభుత్వమే భరిస్తున్నందున, ఆర్థిక స్థోమత లేని వందలాది మంది పేద బీసీ కులాల విద్యార్థులు ఆ కేటగిరి కింద అడ్మిషన్లు తీసుకున్నారు. కానీ, బీసీ సంక్షేమ శాఖ వారికి ఫీజులు- స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయలేదు. విద్యార్థులు హైకోర్టులో కేసువేశారు. ఈ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు లు మంజూరు చేయవలసినదేనని హైకోర్టు తీర్పుచెప్పింది. కాని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్ళాలని నిర్ణయించింది. గత సంవత్సరం చేపట్టిన ఆమరణ దీక్షా డిమాండ్లలో ఇదికూడా ఉండగా, రోశయ్య ప్రభుత్వం ఈ తీర్పుపై బీసీలకు వ్యతిరేకంగా అప్పీలుకు వెళ్ళరాదని, ఈ విద్యార్థుల ఫీజులు చెల్లించాలని జీఓ నెం. 222/ 2010 జారీచేసింది. కానీ ఆ జీఓను అమలు చేయలేదు.

4. బీసీ కులాలకు చెందిన జూనియర్‌ అడ్వకేట్లకు స్టైఫండ్‌ పెంచకుండా మూడు సంవత్సరాలుగా ఆర్థికశాఖ ఆ ఫైలును తొక్కిపెట్టింది. కానీ ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ల స్టైఫండును మూడు సంవత్సరాల క్రితం 2008 జూన్‌ నెలలో రూ. 500 నుంచి రూ. 1000 లకు పెంచింది. ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా? ఎస్సీ, ఎస్టీ లకు పెం చిన మాదిరిగా బీసీలకు కూడా పెంచితే సంవత్సరానికి రూ. 6 లక్షల బడ్జెట్‌ అవు తుంది. బీసీ జూనియర్‌ అడ్వకేట్లకు స్టైఫండ్‌గా నెలకు రూ. 500 అని 1984లో ఈ స్కీం పెట్టినప్పుడు నిర్ణయించారు. దానిని 25 సంవత్సరాలు గడిచినా పెంచలేదు. 5. 2010 జూన్‌లో మంజూరు చేసిన 300 బీసీ కాలేజి బాలుర హాస్టళ్ళను- రెండవ విద్యాసంవత్సరం గడుస్తున్నా ఒక్కటి కూడా ప్రారంభిం చలేదు. ఈ హాస్టళ్ళలో చేరదామని వచ్చిన విద్యార్థుల భవిష్యత్తు ఏంకావాలి? అలాగే 3 సంవత్సరాల క్రితం 2008లో మంజూరయిన 300 కాలేజి బాలికల హస్టళ్ళలో ఇంకా 64 హాస్టళ్ళు ప్రారంభం కాలేదు. ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా?

6. 2007 లో మంజూరైన (1) శాలివాహన (2) విశ్వబ్రహ్మణ (3) వాల్మీకి (4) మేదర (5) సగర (6) దర్జీ (7) దూదేకుల (8) కృష్ణ బలిజ/ పూసల (9) భట్రాజు తదితర 9 కులవృత్తుల ఫెడరేషన్లకు ఇంతవరకు బడ్జెట్‌ లేదు. ఈ మూడేళ్ళ కాలంలో ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధా నాల ద్వారా ప్రైవేటు రంగంలో పరిశ్రమలు రావడంతో కులవృత్తులు-చేతివృత్తుల వారు ఉపాధి కోల్పోయి విలవిలలాడుతున్నారు. రూ. లక్షా 28 వేల కోట్ల రాష్ట్ర బడ్జె ట్‌లో ఒక్కొక్క ఫెడరేషన్‌కు రూ. 5 కోట్లు ఇస్తే - ఈ కులాల ఆనందానికి అవధులే ఉండవు.7. బీసీ కార్పొరేషన్‌కు బడ్జెటు కేటాయించకుండ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది.

ఇతర రాష్ట్రాలలో రూ. 100 కోట్ల నుండి రూ. 300 కోట్ల వరకు బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. మన రాష్ట్రం రూ.10 కోట్లు కేటాయిస్తే, అవి సిబ్బంది జీత, భత్యాలకే సరిపోతోంది తప్ప ప్రజలకు రుణాలు ఇవ్వడానికి ఏమాత్రం చాలదు. బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ. 500 కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలోని 4 కోట్ల మంది బీసీలు ఆర్థికంగా ఎదిగే అవకాశం వస్తుంది. 8. రాష్ట్రంలోని 1450 ఎస్సీ, ఎస్టీ/ బీసీ కాలేజి హాస్టళ్ళు, 5 వేలపాఠశాల హాస్ట ళ్ళు, 617 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివే దా దాపు10 లక్షల మంది విద్యార్థులకు గత నాలుగు సంవత్సరాలుగా మెస్‌ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు నాసిరకం అన్నం పెడుతున్నారు. ధరలు పెరుగడంతో హాస్టళ్ళలో ‘మెనూ’ పాటించడం లేదు. చాలామంది హాస్టళ్ళు వదిలి వెళ్ళిపో తున్నారు.

krushnaya9.ఫీజుల రియింబర్స్‌మెంటు ఎంతో గొప్ప స్కీము. పేదకులాల వారు కూడా ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, ఫార్మసీ, పీజీ కోర్సులు చదువుకుంటే ఆ కులాలు శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయి. అటువంటి స్కీముకు గండి పడుతున్నది. సుప్రీంకోర్టు ఆదేశించినా, విద్యార్థులు ఉద్యమిస్తున్నా, 6 గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ఈ స్కీముకు బడ్జెటు కేటాయించడం లేదు. అవక-తవకలకు ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా మంజూరు చేసే ఈ స్కీముకు 9 మంది మంత్రుల ఉపసంఘం ఎందుకు? ఈ మంత్రివర్గ ఉపసంఘం సమా వేశం జరిగిన ప్రతిసారీ బీసీ వ్యతిరేక చర్యలు తీసుకుంటోంది. స్పాట్‌ అడ్మిషన్లకు ఫీజులు-స్కాలర్‌షిప్‌లు ఎత్తివేశారు. వయోపరిమితి నిబంధన విధించారు. పీజీ కోర్సులకు ఎత్తివేయాలనిచూస్తే, బీసీఉద్యమం తిప్పికొట్టింది. నామినేటెడ్‌ పోస్టుల లో, కలెక్టర్ల నియా మకాలలో బీసీలకు వాటా దక్కడం లేదు. ఇంత జరుగుతున్నా బీసీ మంత్రులు, నాయకులు, ప్రతి పక్ష పార్టీలు నోరుమెదపడంలేదు. బీసీల అభ్యున్నతి కోసం పార్టీలకు అతీతంగా బీసీ నేతలు పోరాటం చేయకతప్పదు.
రచయిత బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు

No comments:

Post a Comment