Saturday, November 5, 2011

విద్యుల్లత-విరసం సిటీ యూనిట్-గోపు By వరవరరావు,



పన్నెండు చేతులతో పనిచేసే గోపు లింగాడ్డి నిష్క్రియాపరుడై పోయి రెండున్నరేళ్లు గడిచిపోయినవి. 2009 ఫిబ్రవరిలో హఠాత్తుగా కోమాలోకి వెళ్లిపోయి, నిరంతరం మృత్యువుతో పోరాడుతూ మళ్లీ మాట, కాళ్లు, చేతులు కూడదీసుకుంటుండగా గుండె ఆగి చనిపోయాడు. అన్ని పనులకు సెలవు ఇచ్చి విశ్రాంత జీవితంలోకి, కాదు జీవన వ్యాపకాల నుంచే శాశ్వత శాంతిలోకి వెళ్లిపోయాడు. విద్యుల్లతతో, విరసంతో, తెలంగాణ రా ష్ట్ర ఉద్యమంతో మా అనుబంధం కళ్ల ముందు కదలాడింది. ఇద్దరమూ తెలుగు అధ్యాపకులుగా కాకతీయ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో పనిచేసాం కానీ, నా కన్నా పదేళ్లు చిన్నవాడు. 

నేను సికెఎం కాలేజీలో చేరిన కొత్తలోనే ‘త్రీ మస్కటీర్స్’గా మేము తర్వాత నామకరణం చేసిన బి.విజయకుమార్, గోపులింగాడ్డి, ఉమ్మెంతల వెంకటడ్డితో పరిచయమై అది ఎమ్జన్సీ విధించే దాకా గాఢానుబంధంగా కొనసాగింది. ఈముగ్గురు అప్పుడు జమ్మికుంట ఆదర్శ కళాశాల విద్యార్థులు. అంటే కథలు, నాటికలు, బతుకు, జీవన సమ రం నవలలు రాసిన సుప్రసిద్ధ రచయిత ఎం.వి. తిరుపతయ్య ప్రత్యక్ష శిష్యులు. తిరుపతయ్య అంటే వరంగల్ ‘మిత్ర మండలి’ కన్వీనర్‌గా, సృజన సాహితీ మిత్రునిగా ప్రారంభమై జమ్మికుంట ఆదర్శ కళాశాలలో తన సుతిమెత్తని, అనితర సాధ్యమెన పాఠాలతో, అంతవూస్సవంతి వంటి సాహిత్య సాంస్కృతిక ఆచరణతో ఆ కళాశాలలో నల్లా ఆదిడ్డి, శనిగరం వెంక (సాహు), మాసాని రవీందర్, తిరుపతి, నేలకొండ రజిత వంటి ఎందరో విప్లవ విద్యార్థులను ఓపికగా మలచిన వాడు. చిరునవ్వుతో, చేతిలో సిగిట్‌తో జమ్మికుంట కళాశాలను అక్షరాలా ‘విద్యుల్లత’గా విప్లవాకాశంలోకి విస్తరింప చేసినవాడు. ఆయన కనుసన్నల్లో ఆయన గైడెన్స్‌తో 1969లో అటు శ్రీకాకుళం పోరాటం, ఇటు కె.కె. డబ్ల్యు (ఖమ్మం,కరీంనగర్,వరంగల్) ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రెక్కలు విప్పుతున్న కాలంలో ఈ ‘త్రీ మస్కటీర్స్’విద్యుల్లత’ను ప్రారంభించారు. బి.విజయకుమార్ సంపాదకుడు. ఆయన తండ్రికి కరీంనగర్ మంకమ్మతోటలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. విరసం ఏర్పడే నాటికే ఈ బృందం చాలా సాహసాలు చేసింది. తెలంగాణ ఉద్యమానికి ఫ్రెంచి విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రేరణ ఇవ్వడానికి ‘రెక్క విప్పిన రెవల్యూషన్’ శ్రీశ్రీ అనువాదాన్ని ప్రచురించడం, ‘ప్రజ ను సాయుధం చేస్తున్న రెవల్యూషనరీ నేడు కవి’ అని విరసం ఆవిర్భావాన్ని నిర్వచిస్తూ 1970 జూలె 4న, ‘మార్చ్’ కవితా సంకలనాన్ని వెలువరించడం మాత్రమే కాదు, వరంగల్, కరీంనగర్‌ల నుంచి కరపవూతాలు వేసుకొని వచ్చిన విప్లవ సాంస్కృతి క కార్యకర్తల్లో ఈ ముగ్గురూ ఉన్నారు. అట్లా ఈ ముగ్గురూ విర సం సంస్థాపక సభ్యులయ్యారు. ఖమ్మం సుబ్బారావు పాణిక్షిగా హి నగర్‌లో జరిగిన విరసం ప్రథమ మహాసభల్లో బి.విజయకుమార్ ‘విద్యుల్లత’ సంపాదకుడుగా విరసం కార్యవర్గ సభ్యు డై, వరంగల్‌లో రెండవసారి జరిగిన సాహిత్య పాఠశాల (1979) దాకా కొనసాగాడు. 

‘మార్చ్’ కవితా సంకలనం పెండ్యాల కిషన్‌రావు సంపాదకత్వంలో వరంగల్‌లో రూపొందినా అచ్చయింది మాత్రం కరీంనగర్‌లో బి. విజయకుమార్ ఆధ్వర్యంలోనే. అందుకోసమూ, ఆ తర్వాత వెలువడిన తాడిగిరి పోతరాజు గారి ‘ఎపూరబుట్ట’ కథ కోసం నిషేధింపబడిన ‘బద్ లా’ కథా సంకలనం కోసమూ, ఎమ్జన్సీ దాకా అన్ని రకాల విప్లవానుబంధ ప్రజాకార్యకలాపాల కోసమూ ఎమ్జన్సీలో తీవ్ర నిర్బంధానికి గురైన వాళ్లు బి. విజయకుమార్, నారదాసు లక్ష్మణరావులు. చిన లక్ష్మణరావుగా పిలుచుకునే నారదాసు లక్ష్మణరావు వీపుపై ఎమ్జన్సీలో పోలీసులు పెట్రోలు పోసి తగులబెట్టారు. (ఇప్పటికీ ఆ వీపు మీద ఆ గాయపు కాయ ఉంటుంది. ఇపుడు పోలీసు అఘాయిత్యాల గురించి మాట్లాడుతున్న తెలంగాణ వాదులు భూస్వా మ్య, సామ్రాజ్యవాద దళారీ ప్రభుత్వ స్వభావాలను ఇటువంటి అనుభవాలతో అర్థం చేసుకోగలిగితే ఈ పోరాటం శత్రువును పోల్చుకొని ముందుకుసాగే పాఠాలనిస్తుందని గుర్తు చేయడానికే ఈ విషయం రాస్తున్నాను.) ఓపికగా లెక్కపెడుతూ బి. విజయకుమార్ తలపై ఉన్న వెంట్రుకలన్నీ ఒక్కక్కటే పీకుతూ ఆయనది బోడితల చేసిగానీ పోలీసులు తమ కసితీర్చుకోలేదు. ఉమ్మెంతల వెంకటడ్డిని తాడిగిరి పోతరాజు, శనిగరం వెంక పాటు బంగ్లాదేశ్ యుద్ధం (1971) రోజుల్లో ‘పిడి’ చట్టం కింద అరెస్టు చేశారు. అట్లే గోపు లింగాడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాడు. 

బీఎస్సీ పూర్తి చేసి ఓయూ ఆర్ట్ కాలేజీలో ఎం.ఎ. తెలుగులో చేరిన దగ్గర్నించీ 1974 దాకా విరసం సిటీ యూనిట్‌కు గోపు లింగాడ్డి కన్వీనర్‌గా వ్యవహరించాడు. ఆర్టిస్టు చంద్ర ఇంట్లో నూ, కథా, నాటక రచయిత సి.ఎస్. రావు ఇంట్లోనూ తరచుగా విరసం సిటీ యూనిట్ సమావేశాలు జరుగుతుండేవి. అప్పుడు విరసంలో జ్వాల, నిఖిల్, చెర, ఎం.టి.ఖాన్, శ్రీపతి, చంద్ర, సి.ఎస్. రావు మొదపూన వాళ్లంతా సిటీ యూనిట్ సభ్యులేనని గుర్తు చేసుకున్నపుడు కన్వీనర్‌గా గోపు లింగాడ్డిది ఎంత కత్తి మీద సామో అర్థమవుతుంది. విరసంలో 1985 దాకా అన్నీ ఘర్షణలూ పొలిమికలే. అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమంలో పంథా గురించి గాక ఎత్తుగడల గురించిన చర్చలే. 

సాయుధ పోరాటాలే ఏకైక మార్గం అంటే చారు మజుందార్ లైన్ అనీ, వ్యవసాయ విప్లవం అంటే చండ్ర పుల్లాడ్డి లైన్ అనీ, భూ పోరాటాలే అంటే నాగిడ్డి లైన్ అనీ, అట్లా ఆ ముగ్గురూ చెప్పినా చెప్పకపోయినా, స్వయంగా కె.ఎస్. ఆ విభజన యాం త్రికమెందని అన్నా అట్లా అనుకున్న యవ్వనోవూదేక కాలమది. 1971 ఆగస్ట్‌లో పిడి చట్టం కింద అరెస్టయి, విడుదలయ్యాక జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌లు అప్పుడు టి.ఎన్. లైన్‌గా, ఇప్పుడు డి.వి. లైన్‌గా పేర్కొంటున్న విప్లవ పంథా వెపు మొగ్గారు. అంతే తీవ్రంగా చెరబండరాజు చారుమజుందార్ లైన్ మొగ్గి ‘ఊరు మేలుకున్నది’ వంటి దీర్ఘ కవిత, మరికొన్ని పొలిమికల్ కవితలు కూడా రాసాడు. విరసం సిటీ యూనిట్ ఇటువంటి సిద్ధాంత విభేదాల యుద్ధ భూమిగా ఉండేది. యూనిట్ స మావేశం ముగియగానే ముగ్గురు పూర్వాక్షిశమ దిగంబర కవులు చెట్టపట్టాలేసుకొని సైకిళ్లపై వెళ్లిపోయే పాత స్నేహితు లే. 1974 జనవరిలో కర్నూలులో విరసం మహాసభలు జరిగే నాటికి వేరు కుంపట్లు పెట్టుకునే వాతావరణం ఏర్పడింది. సభా ప్రవేశం ముందు మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ బొమ్మలు కర్నూలు విరసం యూనిట్ పెడితే, సిటీ యూనిట్ మరొక చారు మజుందార్ బొమ్మ పెట్టింది. అంతేకాదు ‘ఉన్నదొక్కటే దారి చారు మజుందారి’ అని కూడా రాసింది.‘చారుమజుందారి’ అనే పదబంధం తయారు చేసినవాడు శ్రీశ్రీ. ఆయ న శబ్దలౌల్యం మనకు తెలిసిందే. ఆ తర్వాత ‘చారుమజుందారి’ పేరుతో బి. నర్సింగరావు సంపాదకత్వంలో కవితా సంకలనమే వెలువడింది.ఇంక కర్నూ లు సభల్లో భోజనాల సమయంలో ‘చారు’కావాలన్న దగ్గర్నించి ఊరేగింపులో ‘ఉన్నదొక్క దారి చారు మజుందారి’ నినాదాల దాకా ఆ వీరావేశం ఆ అభినివేశం అందులో గోపు లింగాడ్డి, కొల్లూరి చిరంజీవి, నల్ల మల్లాడ్డి, ప్రభంజన్ వంటి వాళ్లను ఇప్పుడు ఊహించుకుంటే ఎంత చిత్తశుద్ధితో కూడిన సెక్టేరియనిజం ఉన్న రోజులవి అని అబ్బురమనిపిస్తుంది.

అయితే కర్నూలు సభల తర్వాత కె.ఎస్. ఈ అన్ని విషయాలను సమీక్షిస్తూ సుతిమెత్తగా, చురకలు పెట్టాడు. (ఇటువంటి యువకోవూదేకానికంతా విరసంలో నాయకత్వం ఇచ్చిన బాధ్యత చెరబండరాజు, నేను తీసుకోవాల్సిందే కదా.) ‘చారు మజుందా రి అయితే మావో ఆలోచనా విధానం సంగతి ఏమిటి మరి’ అన్నాడు కె.ఎస్. ‘కవిత్వంలో పదబంధమెంది రాజకీయాల్లో పంథా అనుకుంటే ఎట్లా? ఈ కాలపు మార్క్సిజం లెనినిజమైన మావో ఆలోచనా విధానాన్ని భారత విప్లవానికి నక్సల్బరీ పం థా ద్వారా అన్వయించ ప్రయత్నం చేసినవాడే.. ఈ దేశ పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు అవుతాడు చారుమజుందార్’ అన్నాడు కె.ఎస్. ‘ఊరేగింపులో ఆనినాదం ప్రజల నుంచి వస్తే వేరు గానీ విరసం వంటి సంస్థలో బాధ్యులుగా ఉన్నవాళ్లే ఇచ్చి ఉండాల్సింది కాద’న్నాడు.

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కొండపల్లి సీతారామయ్య సహచరుడు, ఆ తర్వాత కాలంలో సిద్దిపేటలో హిందీ పండిట్‌గా పనిచేసిన వెంక కుమార్తె అరుణతో లింగాడ్డి వివాహం కూడా ఒక విప్లవ సాంస్కృతిక కార్యక్షికమమే. అప్పటికే అక్కడ సుప్రసిద్ధ న్యాయవాదిగా ఉన్న చల్లా నరసింహాడ్డి ఆధ్వర్యం లో ఆ సభ జరిగింది. అపుడప్పుడే సిద్దిపేటలో సూరపనేని జనార్దన్ నాయకత్వంలో అజ్ఞాత విప్లవోద్య మం ప్రవేశిస్తున్నది. (చల్లా నరసింహాడ్డిఎమ్జన్సీలో జైలు పాలయ్యారు కూడ.) తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరిన తర్వాత గోపు లింగాడ్డి జానపద సాహిత్యంలో కృషికి అంకితమయ్యాడు. బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణ కుమారిల మెప్పు పొందాడు. శ్రామిక గేయాల మీద పరిశోధన చేసాడు. ఇంక కరీంనగర్‌లో ఆయన బహుముఖ కార్యకలాపాల్లో ఒకటైన సాహిత్య క్షేత్రం గురించి నాకంటే చెప్పగలిగిన సన్నిహితులు చెప్తూనే ఉన్నారు.

తెలంగాణ విద్యావంతుల వేదికకు ఆయన కరీంనగర్ జిల్లా కన్వీనర్‌గా చాల క్రియాశీలంగా పనిచేసాడు. రెగ్యులర్‌గా ‘ప్రజాతంవూత’లో రాస్తుండేవాడు. చొరవ ఉన్న మనిషి. శ్రామిక గేయా లు పరిశోధనా గ్రంథం పునర్మువూదణ జరిగినపుడు నాతో ముందుమాట రాయించాడు. ఆ పుస్తకావిష్కరణకు కూడా పిలిచాడు. ఆయన కుటుంబంలో వచ్చిన సమస్యల వల్ల కూడా మళ్లా ఆయన నాకు సన్నిహితుడయ్యాడు. నేను సహాయమూ చేయలేకపోయాను గానీ తరచూ మాట్లాడుకుంటుండేవాళ్లం.

‘జగిత్యాల జెత్రయాత్ర’ ముప్పై ఏళ్ల తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక జగిత్యాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెలంగాణ సదస్సులో పాల్గొనడానికి కోదండరామ్, పిట్టల రవీందర్‌లతో పాటు వెళ్తూ కరీంనగర్‌లో లింగాడ్డిని ఆయన ఇంట్లో ఆఖరిసారి చూశాను. పరస్పరం చూసుకొని, మాట్లాడుకోవడం కాదు. కేవలం ఆ స్థితిలో చూడడమే. అందుకే అప్పటికీ ఇప్పటి కీ నాకు విరసం సిటీ యూనిట్ వేడి వేడి సమావేశాలు, కర్నూలు విరసం మహాసభలు వాటిలో గోపు లింగాడ్డి యవ్వనోవూదేక విశ్వాస ప్రకటనలు, నినాదాలే గుర్తుకొస్తున్నాయి. మనుషుల్ని అట్లా సజీవ చెతన్యంతో గుర్తుపెట్టుకోవడమే బతికున్న వాళ్ల ఆరోగ్యానికి మంచిదనుకుంటాను.

-వరవరరావు
Namasete Telangana News  Paper Dated  06/11/2011

No comments:

Post a Comment