Monday, January 30, 2012

బాలలు.. హక్కులు.. చట్టాలు..


ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ్ఞాన శాస్త్రజ్ఞునిగా పని చేస్తున్న అనురూప్ దంపతులు తమ సంతానం మూడేళ్ల అభిజ్ఞాన్, ఏడాది పాప ఐశ్వర్యలపై మమతానురాగాలను చూపించడం లేదన్న కారణంగా అక్కడి బాలల సంరక్షణ చట్టాల ప్రకారం వారిపై కేసు నమోదయింది. కేసును విచారించిన కుటుంబ న్యాయస్థానం పిల్లలిద్దరినీ వారికి 1 ఏళ్లు నిండేవరకూ తల్లిదంవూడుల నుంచి విడదీసి పిల్లల సంరక్షణాలయానికి తరలించాల్సిందిగా ఆదేశించింది. భారత్‌కు తిరిగి వెళ్తున్నామని, తమ పిల్లల ను తమకు అప్పగించాలంటూ అనురూప్ దంపతులు చేసిన న్యాయపోరాటం ఫలించలేదు. చివరకు భారత విదేశాంగమంత్రి ఎస్.ఎం. కృష్ణ జోక్యంతో గత బుధవారం పిల్లలను వారి మేనమామకు అప్పగించడానికి నార్వే ప్రభుత్వం అంగీకరించినట్లు వార్తలొచ్చాయి.

ఈ ఘటనపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పిల్లలను కన్న తల్లిదంవూడుల నుంచి విడదీయడం అమానవీయమని, ఏ చట్టం పేరు చెప్పి చేసినా బిడ్డకు తల్లి బలవంతంగా తినిపించడం నేరమెలా అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. నార్వే ప్రభుత్వ చర్య తరతరాల భారత సంస్కృతిని, సంప్రదాయాలను అవమానపరచే విధంగా ఉందని అరోపిస్తున్నారు. భూత ల స్వర్గంగా భావించే నార్వేలో పసిపిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరి హక్కు ల పరిరక్షణకు సమగ్ర చట్టాలున్నాయని, ఆ చట్టాల ప్రకారం చర్యలు చేబట్టడాన్ని ఎలా తప్పు పట్టగలమని వాదించేవారూ లేకపోలేదు. బాలల హక్కులు, సంరక్షణ విషయంలో ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఒడంబడిక (జెనీవా కాన్వెనషన్)ను పాటించే దేశాల్లో నార్వే ముందువరుసలో ఉందని వారు చెబుతున్నారు.

ఈ వాదనల్లోని ఉచితానుచితాలను బేరీజువేసే ముందు బాలల హక్కులు, చట్టాల గురించిన నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎదిగిన వారితో పోల్చితే పిల్లలు అన్ని విషయాల్లో బలహీనులని, వారి పోషణ, పెంపకం బాధ్యత పూర్తిగా తల్లిదంవూడులదేనని పురాతన సమాజం నుంచే మానవులు గుర్తించారు. వారి ఆహారాన్ని వారు సమకూర్చుకునేస్థాయికి చేరేదాకా వాళ్లు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునేవారు. నాగరిక సమాజంలో మొట్టమొదటగా బాలల హక్కులను గుర్తించింది 150లలోనని చెప్పవచ్చు. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో పని చేయించరాదన్న నియమాలను కొన్ని దేశాలు పాటించాయి. వారిని పాఠశాలలకు పంపేందుకు వీలుగా చర్యలు చేబట్టాయి. 1924లో నానాజాతి సమితి బాలల హక్కులపై సమావేశమై ఓ డిక్లరేషన్‌ను విడుదల చేసింది.

1956లో ఐక్యరాజ్యసమితి ఆ డిక్లరేషన్‌ను సవరించిం ది. హక్కులతో పాటు పిల్లలను అర్థం చేసుకు ని వారిపై ప్రేమ కురిపించే విషయంలో గైడ్‌లైన్స్‌ను చేర్చింది. 1979ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించింది. ఇదే ఏడాదిలో డిక్లరేషన్ స్థానంలో బాలల హక్కులపై ఒక సమగ్ర పత్రాన్ని ఆమోదించాలంటూ పోలండ్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగి చివరకు 199 నవంబర్ 20న జెనీవాలో సమావేశమైన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కులపై ఒడంబడిక పత్రాన్ని ఆమోదించింది. ఈ పత్రంలో 1 ఏళ్ల లోపు వయసున్న వారిని బాలలుగా నిర్వచించారు. వయోజనులకు వర్తించే అన్ని హక్కులూ మరింత ఎక్కువగా పిల్లలకు వర్తిస్తాయని, ఎందుకంటే తమను తాము రక్షించుకోవడం వారికి తెలియదని ఇందులో పేర్కొన్నారు.

ఈ పత్రంపై మొదటగా సంతకం చేసిన దేశాల్లో నార్వే ఒకటి కాగా ఇప్పటి వరకు భారత్ సహా 191 దేశాలు ఒడంబడికకు కట్టుబడివున్నట్లు ప్రకటించాయి.
ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, సౌభ్రాతృత్వంలకు కట్టుబడివున్న దేశంగా పేరుగాంచిన నార్వే బాలల హక్కుల విషయంలో కూడా ముందు వరుస లో ఉంది. 174లోనే బాల కార్మిక వ్యవస్థను నిషేధించింది. 1900లో బాలల సంరక్షణ చట్టాన్ని ఆమోదించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో బాలలను సైనికులుగా పోరాటంలోకి దించడాన్ని, వారితో పరిక్షిశమల్లో పని చేయించడాన్ని వ్యతిరేకిస్తూ 1919లో ‘సేవ్ ద చిల్డ్రన్ ఫౌండేషన్’ నార్వేలోనే ఏర్పాటైంది. నానాజాతిసమితి డిక్లరేషన్‌ను, ఆ తర్వాతికాలంలో ఐక్యరాజ్యసమితి ఒడంబడికను వెంట ఆమోదించి చిత్తశుద్ధితో అమలు చేసింది. ఈ దిశలో కీలక చట్టాలను ప్రవేశపెట్టింది. 191లో బాలల వ్యవహారాల పర్యవేక్షణకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అంబుడ్స్‌మన్‌ను నియమించింది.

నార్వే ఆమోదించిన చట్టాల్లో బాలల చట్టం (191), బాలల సంక్షేమ చట్టం (1992), మానవ హక్కుల చట్టం (2003) ముఖ్యమైనవి. ఈ చట్టాల ప్రకారం సమాజంలో స్వేచ్ఛగా బతకడానికి వీలుగా పిల్లల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక వికాసానికి తల్లిదంవూడులు తోడ్పడాలి. వారిపై ఎలాంటి వివక్ష కొనసాగకుం డా చూడాలి. శారీరక, మానసిక, లైంగిక హింసలు జరగకుండా సంరక్షించాలి. తినడం లేదని, స్కూలుకు వెళ్లడం లేదని, హోంవర్క్ చేయడం లేదని, చెప్పినట్టు వినడం లేదని, కాని పనులు చేస్తున్నారని వారిని బెదిరించడం, వేధించడం, కొట్ట డం శిక్షార్హమైన నేరం. ఈ చట్టాల కింద నమోదయిన కేసులను విచారించడానికి కౌంటీల స్థాయిలో ఏర్పాటు చేసిన కుటుంబ న్యాయస్థానాలు పిల్లల ప్రయోజనాలే లక్ష్యంగా తీర్పులను ప్రకటిస్తాయి. కాగా, పిల్లల హక్కుల ఉల్లంఘనల విషయంలో వచ్చే ఫిర్యాదులను బాలల సంక్షేమ విభాగం చూసుకుంటుంది.

ఏ ఇంట్లోనైనా తల్లిదంవూడులు తమ పిల్లలను సరిగ్గా పట్టించుకోవడం లేదని, అనారోగ్యంతో ఉన్నా డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం లేదని, వారిని వేధిస్తున్నారని లేదా కొడుతున్నారని సమాచారం అందితే ఈ విభాగం నేరుగా రంగంలోకి దిగుతుంది. సంబంధిత బాలుడిని లేదా బాలికను ఆస్పవూతికో, కౌన్సెలింగ్ కేంద్రానికో పంపించి దర్యాప్తు ప్రారంభిస్తుంది. వాస్తవాలు రాబడుతుంది. తమ పొరుగిళ్లలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ పౌరుడైనా ఈ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు.

అనురూప్-సాగరిక దంపతుల విషయంలో ఇదే జరిగింది. మూడు సంవత్సరాల అభిజ్ఞాన్‌కు వాళ్లమ్మ తన చేతితో బలవంతంగా తినిపిస్తున్నదని బాలల సంక్షేమ విభాగానికి ఫిర్యాదు అందింది. వెంటనే వాళ్ల ఇంటిపై కొద్ది రోజుల పాటు నిఘా వేయగా భట్టాచార్య దంపతులు తమ పిల్లలను మమతానురాగాలతో పెంచ డం లేదని, వారితో మానసిక అనుబంధం కొరవడిందని, పైగా మూడు సంవత్సరాలు దాటిన అభిజ్ఞాన్‌ను తమ బెడ్‌రూంలోనే పడుకోబెడుతున్నారని తేలింది. ఈ మేరకు అభియోగాలను నమోదు చేసి పిల్లలను స్థానిక కుటుంబ కోర్టులో ప్రవేశపెట్టారు. అభియోగాలను వాస్తవాలుగా నిర్ధారించిన కోర్టు ఇద్దరు పిల్లలను 1 సంవత్సరాలు నిండేవరకు సంరక్ష కేంద్రంలో ఉంచాలని ఆదేశించింది.

ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తడం సహజం. భారతీయ సమాజంలో పిల్లల పెంపకానికి పశ్చిమ దేశాల్లో పిల్లల పెంపకానికి మౌలికంగా కొన్ని తేడాలున్నాయి. పెట్టుబడిదారీ విధానం బాగా అభివృద్ధి చెందిన యూరపులో, అమెరికాలో బాలలకు స్వేచ్ఛ ఎక్కువ. తల్లిదంవూడులిద్దరూ ఉద్యోగాలు చేస్తారు కనుక నెలల వయసులోనే పసికందులను బేబీ కేర్ సెంటర్లలో వేస్తారు. కాస్త పెద్దవగానే ప్లేస్కూలుకు పంపిస్తారు. ఇక వారి చదువుల బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుంది. వృత్తి-ఉద్యోగాల ఎంపికలో కూడా తల్లిదంవూడుల ప్రమేయం తక్కువే. తద్విరుద్ధంగా భారత్‌లో పిల్లలపై పెద్దల అజమాయిషీ కాస్త ఎక్కువేనని చెప్పవచ్చు. భూస్వామ్య విధానం నుంచి పెట్టుబడిదారీ విధానానికి పరివర్తన చెందుతూ ఆధునిక పోకడలు ఇప్పుడిప్పుడే పల్లెలకు పాకుతున్న దశలో మన సమాజం ఇటూ అటూ కాకుండా ఉంది. పట్టణాల్లో పెరిగే పిల్లల కు కాసింత స్వేచ్ఛ ఎక్కువ ఉన్నప్పటికీ పెంపకంలో తల్లిదంవూడులు ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. తప్పులు చేసిన పిల్లలను కొట్టడం ఇక్కడ తప్పు కాదు.

ఇళ్లలో తల్లిదంవూడులు, స్కూళ్లలో ఉపాధ్యాయులు బాలలను భయపెట్టడం, వినకపోతే రెండు దెబ్బలు వేయడం మామూలే. పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసమే తాము ఇలా చేస్తున్నామని వీళ్లు చెబుతారు. అలాగే, పేదరికం, ఉపాధిలేమి మూలంగా బాలలచే ఇంటా బయటా పని చేయించడం అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మనం అనురూప్ దంపతుల ప్రవర్తనను అర్థం చేసుకోవాలి.
మన దేశంలో కూడా బాలల హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు వచ్చాయి. 2005లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం(ఎన్‌సీపీసీఆర్) ఏర్పాటును పార్లమెంట్ ఆమోదించింది. జెనీవా ఒడంబడికలో పేర్కొన్న అంశాలు అమలయ్యేలా చూడడం ఈ కమిషన్ విధుల్లో ముఖ్యమైనది. 196లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిరోధక చట్టాలు, 2000లో జువెనైల్ జస్టిస్ చట్టం, 2002 లింగ నిర్ధార ణ పరీక్షల నిషేధ చట్టం, 2010లో బాలలందరికీ తప్పనిసరి ఉచిత విద్యను అందించే చట్టం అమలులోకి వచ్చాయి.

పలు పంచవర్ష ప్రణాళికల్లో బాలల సంక్షే మం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అయినప్పటికీ పరిస్థితుల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదు. ఓ వైపు మహిళలపై, మరోవైపు పిల్లలపై గృహహింస పెరుగుతూనేవుంది. రెచ్చిపోయిన ఉపాధ్యాయులు పలురకాల సాకులతో విద్యార్థులను శిక్షిస్తూనే వున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ వర్ధిల్లుతూనేవుంది. పోషకాహారం కరువైన వీధిబాలలు రోగాల బారిన పడుతూనేవున్నారు. బాలకార్మిక వ్యవస్థ కొనసాగుతూనే వుంది. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు అందనంత వరకు పెద్దలతో పాటు పిల్లల హక్కుల పరిరక్షణ మేడిపండు చందంగానే ఉంటుంది. నిలువ నీడే కరువైన పేదలు తమ పిల్లలకు వేరుగా పడక గదుల ను ఏర్పాటుచేయడం అసాధ్యం. బాలలు స్వేచ్ఛగా పెరగాలన్నా, పోషకాహారం అంది ఆరోగ్యంగా ఉండాలన్నా, కోరుకున్న చదువులు చదవాలన్నా, ఇష్టమైన వృత్తిని ఎంచుకోవాలన్నా ముందు ఇక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులు సమూలంగా మారాలి. ఈ దిశలో భారత ప్రభుత్వం చర్యలు చేప హక్కుల సంఘా లు, మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఒత్తిడి తేవాలి.
-డి. మార్కండేయ
dmknamaste@gmail.com 
Namasete Telangana News Paper Dated 31/1/2012

No comments:

Post a Comment