Sunday, March 31, 2013

వికృత ప్రపంచంలో రేప్ సంస్కృతి --పళయ్ బాగ్చీ



rape
గత డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన తర్వాత..‘రేప్’ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. దేశ దేశాల్లో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారఘటనలపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. రోజురోజుకూ మహిళలపై హింసా దౌర్జన్యాలు పెరిగిపోతున్న తీరుపై ప్రపంచం తీవ్ర ఆందోళన చెందుతున్నది. నిర్భయ ఘటన ఒక్క మనదేశాన్నే కాదు, ప్రపంచాన్ని కుదిపేసింది. మహిళల భద్రతపై సమాజ భాద్యతను ప్రశ్నిస్తున్నది. ఈనేపథ్యంలో దేశంలో మహిళ భద్రత విషయంపై సుదీర్ఘ చర్చ జరిగింది. నేటికీ జరు గుతున్నది. నివారోపణోపాయాల గురించి వాద,వివాదాలు సాగుతున్నవి. చాలా ఏళ్ల కిందటే ఇందిరాగాంధీ అన్న మాటలు ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. ‘భారతదేశాన్ని అవినీతి, రేప్ సంస్కృతి పట్టి పీడిస్తున్నాయ’ని ఇందిరాగాంధీ వాపోయారు. ‘ఈరెంటీని రూపుమాపిన నాడే.. సమాజం బాగుపడుతుంద’ని ఆమెఅన్నారు. ఇన్నేళ్లు గడిచినా పరిస్థితిలో మార్పేమీ రాలేదు. పరిస్థితులేమీ చక్కబడలేదు. స్త్రీలపై అఘాయిత్యాలు తగ్గడం అటుంచి ఒకటికి రెండింతలుగా పెరిగిపోతున్నాయి.

‘రేప్’ అనేది ఇవ్వాల ఒక్క ఇండియా సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలూ, అన్ని ప్రాంతాలూ దీనికి మినహాయింపు ఏమీ కాదు. అత్యాచాట ఘటనలు కొన్ని ప్రాంతాల్లో తక్కువ,కొన్నింటిలో ఎక్కువ జరుగుతున్నాయి. అంతే కానీ.. మహిళలపై అత్యాచారాలు లేని చోటు అంటూ..ఈ మహిపై లేదు. గతకొంత కాలంగా చూస్తే.. ప్రతి ఉద యం అరడజన్ రేప్‌ల ఉదంతాలను చూస్తున్నాము. వాస్తవంగా జరుగుతున్న ఘటనల్లో సగం కూడా మీడియాలో ప్రచారం అయి, వెలుగు చూడటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.ఈ అత్యాచారాలు కూడా.. మూడేళ్ల పసిపాపలు మొదలు కొని 17 ఏళ్ల మధ్య వయసున్న వారిపై అత్యాచారాల సంఖ్య పెరుగుతున్నది. ఇందులో మైనర్లు, మైనర్లనే రేప్ చేసిన ఉదంతాలు కూడా ఎక్కువగా ఉం టున్నాయి.

ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఈ అత్యాచార ఘటనల్లో కేవలం ‘సెక్స్’ పాత్రను ఊహించడానికి కూడా ఉండదు. అలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తి తప్పకుండా మనిషికన్నా భిన్నిమైన(వికృతమైన) మానసిక స్థితిలో జంతువు సమానుడుగా ఉంటాడని చెప్పక తప్పదు. మానవీయత ఉన్నవాడు ఎవ్వ రూ ఆమోదించలేని, అంగీకరించలేని చేష్టలకు ఒడిగట్టిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇదంతా ఈ సమాజపు వికృత రూ పాన్నీ, విధ్వంసక స్థితినీ తేటతెల్లం చేస్తున్నది. ఇదిలా ఉంటే..ఈ అత్యాచారాలు (రేప్‌లు) మహిళల్లో కింది స్థాయి వర్గాలు, పేదలు, నిమ్న వెనుకబడిన వర్గాలపై అధికంగా జరుగుతున్నాయి. అంటే మహిళలను అబలగా చూడటమ నే ది ఒక పార్శమైతే..,బలహీన వెనుకబడిన వర్గా లకు చెందినవారైతే మరింత బలహీను లుగా బలి అవుతున్నారని తేటతెల్ల మవుతున్నది.
ఇక ఆఫ్రికా విషయానికి వస్తే.. స్త్రీలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. ‘కాంగో’ అయితే.. మహిళపాలిట అది మృత్యుకుహరమే అయ్యింది.

కాంగోలో మిలిటరీ బలగాలు ప్రజలను ముఖ్యంగా మహిళలను కిడ్నాప్ చేసి నెలల తరబడి బంధించి అత్యాచారాలు చేస్తున్నాయి. అక్కడ ఉన్న సాయుధ మూకలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈ పరిస్థితుల్లోనే కాంగో ప్రపంచంలోనే అత్యాచారాల్లో అగ్రస్థానంలో ఉన్నది. యుద్ధభూమిగా మారిన జిం బాబ్వే, అంగోలా, చాద్, నమీబియా, బురుండీ లాంటి దేశాల్లో స్త్రీలపై అత్యాచారాలు ఒక విధానంగా, యధేచ్చగా కొనసాగుతున్నాయి. ఒక సమూహాన్ని లొంగదీసుకోవడం కోసం, ఆధిపత్యం చేసేందుకు మహిళలను బంధీలుగా పట్టుకోవడం బలిచేయడం జరుగుతున్నది. కేన్యాలో కూడా జరిగిన అంతర్యుద్ధంలో మహిళలు ఎంతో మంది అత్యాచారాలకు బలయ్యారు.

ఒకానొక అధ్యయనం ప్రకారం అంతకలహాలతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశాల్లో మహిళ లింగత్వమే శాపంగా మారింది. ఈ దేశాల్లో ప్రతి 36 సెకన్లకు ఒక అత్యాచారం జరుగుతున్నది. రోజుకు154 రేప్‌ల చొప్పు న 2010-11సంవత్సరంలో 56,272 అత్యాచారాలు జరిగాయి. ఈ దేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంత పెద్ద ఎత్తున మహిళలపై అత్యాచారాలు జరిగినా కేవలం 200 మంది మాత్ర మే అత్యాచార కేసుల్లో దోషులుగా నిరూపించబడ్డారు. అక్కడి జనాభా లో 25 శాతం మంది పురుషులు ఎవరినో ఒకరిని ఎక్కడో ఒక చోట అత్యాచారానికి ఒడిగట్టారని తేలింది. అత్యాచారానికి గురైన వారిలో సగం మంది ఒకరికంటే ఎక్కువ మందితో అత్యాచారానికి గురయ్యారని తేలింది. ఇక సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో రేప్ ఒక అణచివేత ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. అక్కడి ప్రభుత్వ సాయుధ బలగాలు విచ్చలవిడిగా ప్రజలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నాయి. స్త్రీలను, పిల్లలను కూడా నెలల తరబడి నిర్బంధించి అత్యాచారాలు చేస్తున్నాయి.

కఠినమైన చట్టాలకు, నియమ నిబంధనలకు పేరుగాంచినదిగా చెప్పుకుంటున్న చైనాలో అత్యాచారాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఒక సంవత్సర కాలంలోనే చైనాలో రెండున్నర లక్షల మంది అత్యాచారాలకు గురయ్యారు. నాగరికతకు, అభివృద్ధికి కేంద్రంగా చెప్పుకుంటున్న అమెరికా పరిస్థితి కూడా అత్యాచారాల విషయంలో మిగతా ప్రపంచానికి ఏమీ తీసిపోలేదు.యూనివర్సిటీ, విద్యాలయాలన్నీ అఘాయిత్యాలకు నెలవుగా మారాయి. ఒక సర్వే ప్రకారం తమ చదువులు పూర్తయ్యే కాలం లో 25 వేలమంది విద్యార్థులు అత్యాచారాలకు గురయ్యారు. 80 వేల మంది పిల్లలు లైంగిక వేధింపులతో సతమతమయ్యారు. అమెరికాలోని ప్రతి ఆరుగురు స్త్రీలలో ఒకరు తమ జీవితంలో ఒకసారైనా అత్యాచారానికి బలయ్యారు, లేదా లైంగిక దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నారు.

బ్రిటన్‌లో కూడా స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోవడాన్ని అక్కడి సామాజిక, మానసిక శాస్త్ర వేత్తలను కలవరపరుస్తున్నది. చిన్న పిల్లలను సైతం కిడ్నాప్ చేసి నిర్బంధించి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. 85 వేలమంది ఇంగ్లాండులో అత్యాచారాలకు బలిఅయితే.., 800 మంది మాత్రమే దోషులుగా శిక్షలు అనుభవిస్తున్నారు. నగ్నత్వం పెద్ద నేరంగా పరిగణించని స్వీడన్ దేశంలో యూరప్ దేశాలన్నింటికన్నా అతి ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. 

ఈ విధంగా ప్రపంచంలో ఏదేశంలో చూసినా..మహిళల పరిస్థితి గొప్ప గా, భద్రంగా ఏమీలేదు. రోజురోజుకూ పెరిగిపోతున్న రేప్ సంస్కృతిపై అటు సామాజిక శాస్త్రవేత్తలు, మనస్తత్వ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. మహిళల బలహీనతను ఆసరాగా చేసుకుని ఎందుకు ఇంత అమానవీయంగా అత్యాచారాలకు ఒడిగడుతున్నారని వారు తమ అధ్యయనాలు కొనసాగించారు. అత్యాచారాలకు ప్రధానంగా రెండు కారణాలను గుర్తించారు. ఒకటి నేరమయ జీవితం, రెండవది-మనస్తత్వం. కడు బీద పరిస్థితుల్లో జీవిస్తూ.. కనీస విద్య కు నోచుకోని అట్టడుగు సామాజిక వర్గాల నుంచి ఎక్కువగా నేరమయ అత్యాచారాలు జరుగుతునాయని తే లింది. అలాగే మానసిక సమస్యల కారణంగా అత్యాచారాలు చేస్తున్న వారి లో ఎక్కువగా బాగా చదువుకున్నవారూ, సంపన్న వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఇలాంటి వికృత మనస్తత్వంతో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. 

సామూహిక అత్యాచారాలు జరగడాని కి ఆ అకృత్యంలో పాల్గొన్న గుంపులో తాము దోషులుగా పట్టుపడటం జరగదనే దాంతో ఘోరానికి పాల్పడుతున్నవారే ఎక్కువ. అలాగే.. మద్యం మత్తు లో, నిస్సహాయ స్థితిలోఉన్న వారిని గుంపులో ఒకరిగా అకృత్యానికి పాల్పడటం సులువుగా భావించడం కూడా సామూహిక అత్యాచారాలకు కారణం గా చెబుతున్నారు.

ప్రపంచమంతటా స్త్రీలపై సామాజిక హింసలో భాగంగా జరుగుతున్న హింస, అత్యాచారాలు ఒక ఎత్తు అయితే.., ప్రభుత్వ బలగాలు కూడా అణచివేత సాధనంగా మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టడం దారుణం. సామాజిక శాంతిని నెలకొల్పే పేరుతో ప్రభుత్వ సాయుధ బలగాలు సాధారణ ప్రజలపై ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నాయి. సామాజిక ఉద్యమాలను అణచేందుకు కూడా లైంగిక హింసను ఆయుధంగా ఎం చుకుంటున్నాయి. ప్రజలను భయభ్రాంతులను చేసి లొంగదీసుకునేం దుకు అత్యాచారాలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి కని పిస్తున్నది. దీన్ని మనదేశంలోనూ చూడవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభు త్వ పారామిలిటరీ దళాలు చేస్తున్న అత్యాచారాలకు పరాకాష్టగా గత పన్నెండేళ్లుగా ఇరోన్ షర్మిల చేస్తున్న పోరాటాన్ని చూడవచ్చు. ఈ పరిస్థితులన్నీటినీ చూస్తుంటే.. సమాజం ముందుకు పోతున్నదని చెబుతున్నా నాగరికగంగా, మానవీయంగా వెనక్కుపోతున్న తీరే గమనిస్తున్నాం. మహిళలను అత్యాచారాలతో హింసిస్తూ..,అంతం చేస్తూన్న సమాజంలో కేవలం కఠినమైన చట్టాలు, రక్షణ వ్యవస్థలు కట్టుదిట్టం చేయడంతోనే సరిపోదు. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలి. స్త్రీ అంటే లౌంగిక పరమైన వస్తువుగా చూసే సంస్కృతి అంతరించి మనసున్న మనిషిగా గుర్తించిన నాడే అత్యాచారాలు అంతం అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలుతున్న వస్తుమయ, వినియోగ విష సంస్కృతిలోనే రేప్ సంస్కృతికి మూలాలున్నాయి. ఈ విష సంస్కృతిని అంతమొందించినప్పుడే రేప్‌లు అంతర్థానమవుతాయి. రేప్ సంస్కృతి అంతరిస్తుంది. 


(ఇండియా న్యూస్ ఫీచర్స్ అలయెన్స్


Namasete Telangana Telugu News Paper Dated: 1/4/2013

మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పనికి రాదు - డా.జి లుకర శ్రీనివాస్




ఇండియాలోని ప్రతి వ్యక్తి చైతన్యం కుల సంబంధాల ప్రకారమే నిర్ణయించబడుతుందనేది వాస్తవం. చివరికి ధర్మ పరివర్తన చెందిన మూలవాసులూ ఈ కుల నిర్మాణం నించి విడిగా మనలేరు. కాబట్టి ఇంద్రియ చర్య కుల వ్యవస్థను పరావర్తనం చేస్తుంది. అంటే మానవుడి జ్ఞానంలో కుల వ్యవస్థ తాలూకు పరావర్తనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.


సాహిత్యంలో వాస్తవికత ఒక తిట్టుపదంగా మారిపోయింది. వాస్తవికత ఒక నిర్మాణం. గోపాలకృష్ణమ శెట్టి, కందుకూరి, గురజాడలు బ్రాహ్మణీయ వాస్తవికతను నిర్మాణం చేశారు. అయితే, బ్రాహ్మణీయ వాస్తవికత నికరంగా నిలబడకుండానే పలాయనవాదంలోకి జారుకుంది. అదే కాల్పనికవాదం. భావ కవిత్వం దానిలో ఒక పాయ. కుల వాస్తవికతను సైద్ధాంతిక, రాజకీయ క్షేత్రంలో కింది కులాలు వ్యక్తీకరించడమే కాదు దాని తార్కికతనూ నిర్ణాయకవాదాన్నీ ప్రశ్నిస్తున్న 'కాలం'లో తెలుగు సాంస్కృతిక 'స్థలం' బ్రాహ్మణీకపు కాల్పనికవాదంలోకి సచేతనంగానే పాదం మోపింది. అదే నడక అభ్యుదయ, విప్లవ రంగాలను కూడా నియంత్రించింది. దానికి మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పునాది. అభ్యుదయ, విప్లవ సాహిత్యాలకు మార్క్సు ప్రతిపాదించిన భౌతికవాదం పునాది. లెనిన్ మార్క్సు జ్ఞాన సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దానికి శాస్త్రీయతను చేకూర్చాడు. లెనిన్ ప్రతిపాదించిన 'పరావర్తన సిద్ధాంతం' (రిఫ్లెక్సివ్ థీయరీ) ప్రపంచ వ్యాప్తంగా జ్ఞాన సిద్ధాంతాలను విశేషంగా ప్రభావితం చేసింది. సాహిత్యంలో అభ్యుదయ, విప్లవ రచయితలు పరావర్తన సిద్ధాంతాన్ని బలంగానే ప్రచారం చేశారు. మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతానికి పరావర్తన సిద్ధాంతమే పునాది. ఈ సిద్ధాంతం నిజంగా అద్భుతమైంది. కాని, ఈ సిద్ధాంత స్ఫూర్తిని ఇక్కడి బ్రాహ్మణవాద రచయితలు గ్రహించలేదని విమర్శకుల భావన.

త్రిపురనేని మధుసూదనరావు 'సాహిత్యంలో వస్తు శిల్పాలు' అనే గ్రంథంలో 'పరావర్తన సిద్ధాంతం - సాహిత్యం' అనే ఉపశీర్షిక కింద పరావర్తన సిద్ధాంతాన్ని సోదాహరణంగా వివరించారు. "...ఇంద్రియ జ్ఞానాలకి ఆలోచనలకీ మూలాధారం ఏమిటి? అంటే చైతన్యానికి మనస్సుకీ సంబంధం ఏమిటి? పదార్థం ముందు, దాని నుంచీ చైతన్యం ఉత్పన్నం అవుతుంది అని చెప్పుకోవటం మాత్ర మే చాలదు. మనిషికి ఇంద్రియ జ్ఞానాలూ, ఆలోచనలూ, ఆవేశం వంటివి ఎలా వస్తాయి అనేది భౌతికవాద జ్ఞాన సిద్ధాంత మౌలిక ప్రశ్న. దీనికే లెనిన్ పరావర్తన సిద్ధాంతం సమాధానం చెపుతుంది'' అని తెలిపారు. మనిషి మనస్సు నుండే జ్ఞానం పుడుతుందని భావవాదులు తలుస్తారనీ, భౌతికవాదులు ఇంద్రియ జ్ఞానం వికసిస్తుందని చెపుతారని ఆయన పేర్కొన్నారు. జ్ఞాన సముపార్జనా క్రమంలో ఇంద్రియాల ద్వారా సమాచార గ్రహణం తొలి దశ. ఇంద్రియాలు లేకుండా మెదడుకు సమాచారం అందే వీలు లేదు. మెదడూ, ప్రపంచం రెండూ పదార్థ రూపాలే అంటాడు త్రిపురనేని. ఈ రెండింటి మధ్య వుండే సృజనాత్మకమైన, క్రియాశీలమైన సంబంధాన్ని పరావర్తన సిద్ధాంతం అంటారని ఆయన భావన. 

"అద్దంలో చూసుకున్నప్పుడు మొఖం బింబం. అద్ధంలో కనిపించే మొఖం ప్రతిబింబం. బింబం లేకుండా ప్రతిబింబం ఉండదు. అలాగే మెదడు అద్దం అయితే అందులో ప్రతిబింబించేది బాహ్యప్రపంచం. ఈ బింబ ప్రతిబింబ ఉదాహరణ చాలా ప్రాథమికమైన పోలికగా మాత్రమే గ్రహించాలి. ప్రతిబింబానికి పరావర్తనకీ చాలా తేడా వుంది. అద్దంలో ప్రతిబింబానికి బింబానికీ మధ్య క్రియాశీలమైన, సృజనాత్మకమైన పరావర్తనా శీలమైన సంబంధం ఉండదు. మెదడు కేవలం అద్దం కాదు. అదొక జీవ శారీరక వ్యవస్థ. నిర్ధిష్ట క్రియలను నిర్వహించే అనేక సూక్ష్మ భాగాల అవిభాజ్య సముదాయం. కాబట్టి బాహ్య ప్రపంచం జ్ఞానానికి మూలం. ఇంద్రియాలు జ్ఞానానికి సాధనాలూ, వాహికలూ మాత్రమే కానీ ఇంద్రియాలే జ్ఞానానికి మూలం కాదు. బాహ్య ప్రపంచం ఇంద్రియాల ద్వారా మెదడులో పరావర్తనం చెందకుండా జ్ఞానం అనేది ఉండదు'' అంటారు త్రిపురనేని మధుసూదనరావు. మార్క్సు పెట్టుబడిదారీ వ్యవస్థను విశ్లేషించడానికీ, ఉత్పత్తి విధానాన్ని సూత్రీకరించడానికీ కూడా పరావర్తన సిద్ధాంతమే మూలమని త్రిపురనేని భావన. పంటని ఉత్పత్తి చేసేందుకు భూమి, నీళ్లు, నాగలి, ఎద్దులు, ఎరువులు వంటివన్నీ అవసరమనీ, అవన్నీ బాహ్య ప్రపంచంలో దొరికేవనీ, అవి మనిషి చైతన్యంతో సంబంధం లేకుండానే ప్రపంచంలో ఉంటాయనీ, కానీ, వాటిని సృజనాత్మకంగా పరావర్తనం చేసుకోవటం వల్లే రైతులు పంటలు పండిస్తున్నారనే ఉదాహరణ సరిపోతుందని ఆయన అన్నాడు. మానవ చేతన కేవలం వాస్తవ ప్రపంచాన్ని ప్రతిబింబించటమే కాదు, దాన్ని పునర్ సృష్టిస్తుంది కూడా అని లెనిన్ తన వృద్ధాప్యంలో రాసుకున్న నోట్సులో పేర్కొన్నాడు. 

అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న బాహ్య ప్రపంచాన్ని మానవుడు తనకు అవసరమైన విధంగా నిర్మాణం చేసుకుంటాడని దీని అర్థం. ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని బట్టీ, చారిత్రక పరిమితుల్ని బట్టీ అది నిర్ణయించబడుతుందని కూడా త్రిపురనేని పేర్కొన్నారు. ఈ మొత్తం సిద్ధాంతంలో 'బాహ్య ప్రపంచం', 'వస్తుగత ప్రపం చం', 'ఇంద్రియ చర్య' అనేవి చాలా కీలకం. బాహ్య ప్రపంచం అంటే కేవలం భౌతిక వస్తు సముదాయం మాత్రమే కాదు. ఆ వస్తు సముదాయాన్ని నియంత్రించే లేదా ఉత్పత్తి చేసే లేదా ప్రకృతిలో అంతర్భాగంగా జీవించే మానవ సముదాయం కూడా. మానవుల మధ్య వుండే ఉత్పత్తి సంబంధాలు కూడా బాహ్య ప్రపంచం అనే భావనలో అంతర్భాగం. మానవుల మధ్య వుండే ఉత్పత్తి సంబంధాలు ఉత్పత్తి విధానంతో పాటు మారుతాయనేది మార్క్సిస్టు అవగాహన. కాని కులం అనేది ఒక సంబంధం. ఆయా కులాలకు వ్యవస్థలో నిర్దేశిత స్థానం అనుసరించే అనులోమ, విలోమ సంబంధాలు ఉంటాయి. ఇవి వందల యేళ్లుగా ఉత్పత్తిలో గుణాత్మకమైన మార్పు వచ్చిన తర్వాత కూడా మారకుండా కొనసాగుతూ వున్నాయి. ఇండియా సమాజంలోని మానవ సంబంధాలు కుల సంబంధాలుగా వున్నాయనే సంగతిని ఇంద్రియాల ద్వారా మెదడుకు నిరంతరం చేరవేయబడుతూనే ఉంటుంది. ఇండియాలోని ప్రతి వ్యక్తి చైతన్యం కుల సంబంధాల ప్రకారమే నిర్ణయించబడుతుందనేది వాస్తవం. చివరికి ధర్మ పరివర్తన చెందిన మూలవాసులు కూడా ఈ కుల నిర్మాణం నించి విడిగా మనలేరు. కాబట్టి ఇంద్రియ చర్య కుల వ్యవస్థను పరావర్తనం చేస్తుంది. అంటే మానవుడి జ్ఞానంలో కుల వ్యవస్థ తాలూకు పరావర్తనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. 

అదే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానంతోటే వివిధ కులాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటి అంతర్వును బట్టీ, స్థానం, స్థాయిని బట్టి ఆయా కులాల వ్యక్తుల మానసిక ప్రవర్తన ఉంటుంది. అది ఆ కులస్తుడి చైతన్యమై నిరంతరం అతని ప్రమేయ, ప్రవర్తనలను నిర్దేశిస్తుంది. ఇది వాస్తవిక దృశ్యం. ఈ వాస్తవిక దృశ్యం అనేక కుల నియమాల వల్ల నియతం అవుతూంటుంది. ఈ వాస్తవాన్ని మార్క్సిస్టు రచయితలు అంగీకరించలేదు. లెనిన్ వృద్ధాప్యంలో చెప్పిన మానవ చైతన్యం తిరిగి వాస్తవ ప్రపంచాన్ని సృష్టిస్తుందనే సూత్రీకరణను సారభూతంగా అర్థం చేసుకొంటే రచయితలు కుల సంబంధాలను, వాటిని నిర్ణయిస్తున్న భావజాలాన్ని సృజనాత్మకంగా చిత్రించేవారు. కానీ అలా చేయలేదు. అంటే బ్రాహ్మణవాద రచయితల చైతన్యం వాస్తవ ప్రపంచాన్ని పరావర్తనం చేయటం లేదనీ, కాల్పనికతను లేదా అబద్ధాన్ని నిర్మాణం చేస్తుందని అంగీకరించాలి.

పరావర్తన సిద్ధాంతం చారిత్రక భౌతికవాదంతో అంతస్సంబంధం కలిగి ఉంది. చారిత్రక భౌతికవాదం అనేది సమాజాన్ని అధ్యయనం చేసే విశ్లేషించే ఒక పద్ధతి. ఒక మెథడాలజీ. పాశ్చాత్య సమాజాన్ని విశ్లేషించినట్టే కుల నిర్మిత సమాజాన్ని విశ్లేషించే ప్రయత్నం జరిగింది. అది మెథడాలాజికల్ ప్రాబ్లెం. సమాజ పరిణామ క్రమాన్ని మార్క్సిస్టు పద్ధతిలో అర్థం చేసుకొనే ప్రయత్నం త్రిపురనేని చేశారు. రాంభట్ల కృష్ణమూర్తి కూడా అదే ప్రయత్నం చేశారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఈ సమాజానికి అన్వర్తింప చేసే కృషి రాంభట్ల కొనసాగించారు. ఆయన వాస్తవికతను పురాణ వాస్తవికత, ప్రబంధ వాస్తవికత, కాల్పనిక వాస్తవికత, సోషలిస్టు వాస్తవికతలుగా అనేక విభజనలు చేశారు. ఆ క్రమంలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నిర్మాణం వెనక ఉత్పత్తి పోషించిన పాత్రను తెలిపారు. ఉత్పత్తి క్రమంలో రూపొందిన సాహిత్యమే వేదాది సాహిత్యమని ఆయన భావించారు. ఈ కాల్పనిక ఆధిపత్యవాద సాహిత్యంలో ఆయన కెన్నో సానుకూల అంశాలు కనిపించాయి. రామ, రావణ వైరంలో కూడా ఆయనకు వర్గ సంఘర్షణ కనిపించింది. ఇతిహాస, పురాణాల పట్ల ఆయనకు బలమైన విశ్వాసం వుంది. ఆ రచనలను మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతాన్నీ, మార్క్సిస్టు వాస్తవికతను నిగ్గు తేల్చేందుకు ఉపయుక్తం చేసుకోవటమే వింత. వేదాలు యురేషియా నుండి ఇక్కడికి వచ్చినవి. హరప్పా నాగరికత నాటి మానవులకు వేదాలకు ఎలాంటి సంబంధం లేదు. వైదిక ధర్మం పూర్తిగా విదేశీయమైంది. 

యురేషియా సంచార జాతుల దురాక్రమణ వల్ల హరప్పా నాగరికత అంతరించింది. హరప్పా నాగరికతలో వర్గ అసమానతలు లేవు. వారు ఉత్పత్తి సాధనాలను అభివృద్ధి చేయటమే కాదు, శాస్త్రీయమైన జ్ఞానాన్ని కూడా నిర్మించారు. మరి హరప్పా నాగరికత కాలం నాటి పురాణాలేవి? ఇప్పుడు ప్రచలితంగా ప్రచారంలో వున్న పురాణాలకు ఎంత వయస్సు ఉంటుంది? ఇతిహాసాలు ఏ కాలంలో ఆవిర్భవించాయి? ఈ ప్రశ్నలకు మార్క్సి స్టు పద్ధతి సరైన సమాధానం చెప్పదు. ఉత్పత్తి పెరిగినప్పుడే వర్ణ వ్యవస్థ ఏర్పడిందనేది మార్క్సిస్టు అవగాహన. కానీ ఉత్పత్తి ఎక్కువగా జరిగిన హరప్పా నాగరికతలో వర్ణ వ్యవస్థ రూపొందలేదు. అంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ యురేషియా సంచార తెగల దురాక్రమణ ఫలితమని బోధపడుతుంది. అష్టాదశ పురాణాలు ప్రతివిప్లవం తర్వాత రూపొందినవి. కుల పురాణాలు కుల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఏర్పడినవి. క్రీ.పూ. 187లో మౌర్య చక్రవర్తి బృహద్రదున్ని హతమార్చిన పుశ్యమిత్రుడు వర్ణ వ్యవస్థను పునరుద్ధరించాడు. మనుధర్మం, భగవద్గీత, మహాభారత, రామాయణాలు, అష్టాదశ పురాణాలు రాయించాడు. అంటే వర్ణ వ్యవస్థను సమర్ధించే రచనలు మూలవాసీ చక్రవర్తి బృహద్రదుని రాజ్యాన్ని బ్రాహ్మణుడైన పుశ్యమిత్రుడు చేజిక్కించుకొన్నాకే జరిగింది. 

కానీ, వర్గ సిద్ధాంతం ప్రకారం పైన పేర్కొన్న రచనలన్నీ సమాజం తనకు తానే ఉత్పత్తి క్రమంలో కల్పించుకొన్నవి. అందుకే వాటిలో మార్క్సిస్టులు అనుకూల అంశాలను మాత్రమే చూడగలిగారు. కుల వ్యవస్థ పరిణామాన్ని సూత్రీకరించడానికి చారిత్రక భౌతికవాదం సరిపోదు. అది వర్గ ప్రాతిపదికన మాత్రమే సమాజాన్ని వ్యాఖ్యానించగలదు. సుమారు వేయి సంవత్సరాల పాటు ఉనికిలో వున్న బౌద్ధ రాజ్యాలలో ఎలాంటి సాహిత్యం ఉందో తెలుసుకొనే ప్రయత్నం మార్క్సిస్టు సాహిత్యకారులు చేయలేదు. వేద కాలంలోని రచనలను విశ్లేషించి, ఆ వెంటనే ప్రబంధ కాలానికి వెళ్లిపోయే ఒక పలాయన వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. బౌద్ధ రాజ్యాల్లో విలసిల్లిన సాహిత్య, సాంస్కృతిక, కళా సిద్ధాంతాలను గానీ, విద్యా, వైజ్ఞానిక రంగాల్లో జరిగిన అభివృద్ధిని గానీ ఏ మాత్రం ప్రస్తావించరు. అంటే, బ్రాహ్మణవాద చరిత్రకారులు ఏ ఆకరాలను ప్రామాణికమని సమాజం మీద రుద్దారో వాటిని మాత్రమే గ్రహిస్తే సమాజ పరిణామ క్రమం సవ్యంగా ఎలా అర్థం అవుతుంది? చారిత్రక భౌతికవాదం పేరుతో బ్రాహ్మణీయ చరిత్ర రాజ్యమేలింది. ఇయంఎస్ నంబూద్రిపాద్ రాసిన 'వేద భూమి' అందుకు నిదర్శనం. వాస్తవికవాదం బ్రాహ్మణవాదానికి మరో పేరుగా మారిపోవటమే విచారం. యూరోప్ సమాజంలో అది సాధించిన ఘన విషయాలు ఇక్కడ సాధించలేకపోవడానికి అది వక్రీకరణకు గురికావటమే కారణం.

వాస్తవికవాదం పేరుతో చలామణి అయిన సాహిత్య ఆధిపత్యానికి ప్రతిస్పందనగా వచ్చిందే 'ప్రతివాస్తవికవాదం' (కౌంటర్ రియలిజం). కులం ఒక వాస్తవం. అస్పృశ్య రచయితలు సాహిత్యంలో కుల వ్యవస్థ స్వరూప, స్వభావాలను చిత్రించిన తీరు, కులం ఒక అధికార వ్యవస్థగా ప్రజల జీవితాలను శాసించే సామాజిక నియతిని కళాత్మకంగా రూపుగట్టిన తీరును పఠించే ఒక పద్ధతే ప్రతివాస్తవికవాదం. అదొక పఠన పద్ధతి మాత్రమే కాదు. ప్రాపంచిక దృక్పథం కూడా. ప్రతివాస్తవికతను అర్థం చేసుకొనేందుకు అంబేద్కరిజం వెలుగులో కుల వాస్తవికతను అర్థం చేసుకోవాల్సిందే. బ్రాహ్మణ ధర్మంలోని కుల అంతర్వుల నియమాన్నీ, కులం పేరుతో కొనసాగుతున్న దాస్యాన్ని చిత్రించటమే సాహిత్యంలో ప్రతివాస్తవికత. కుల వ్యవస్థలో బానిస కులాల రచయితలు సమాజ పరివర్తన కోసం సృజించిన రచనలన్నీ ప్రతివాస్తవికత పరిధిలోకి వస్తాయి. కులం పేరుదో చీల్చబడిన మూలవాసుల కళా సృజనకు, బ్రాహ్మణవాదుల కళా దృష్టికీ మధ్య చాలా వైరుధ్యం తప్పకుండా వుంటుంది. అందుకే ప్రతివాస్తవికవాదం కళాతత్వానికి సంబంధించింది కూడా. పరావర్తన సిద్ధాంతంతో పీడిత కులాల నిజమైన జ్ఞాన సిద్ధాంతానికి సంధి కుదరదు. మసక బారిన పరావర్తన అద్దం సత్య రూపాన్ని ప్రతిఫలించదు. బ్రాహ్మణీయ జ్ఞాన సిద్ధాంత పద్ధతిలో చరిత్ర సమాలోచన చేస్తే సత్యం బోధ పడదు. మూడు దశాబ్దాల కింద అలవాటైన వాస్తవికతను పట్టుకొని వేళ్లాడే మూసవాదులకు ఈ కొత్త జ్ఞాన సిద్ధాంతం చికాకునూ చిరాకునూ కల్గిస్తుంది. అయినా సరే, సత్యాన్ని సత్యంగా చెప్పమని కదా అంబేద్కర్ బోధించింది!

- డా.జిలుకర శ్రీనివాస్
jilukara@gmail.com

Andhra Jyothi Telugu News Paper Dated: 1/4/2013

Thursday, March 28, 2013

వయోలెన్స్‌... సైలెన్స్‌ By G Vijayalaxmi



కఠిన చట్టాలకోసం, క్రూరమైన శిక్షలకోసం నగర రహదారులు ర్యాలీల రిబ్బన్లవుతున్నాయి. కొత్త చట్టాలు భద్రమైన సమాజాన్ని సృష్టిస్తాయని మధ్యతరగతి కలలు కంటున్నది. యాదృచ్ఛికంగా పెల్లుబికే ఆవేశాల అణచివేతకు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో కేంద్రప్రభుత్వం దారుణ శిక్షల చట్టాల చిట్టాను వెలుపలికి తీసింది.
స్త్రీ ఆదిశక్తి, భరతమాత, జగన్మాత, మహాకాళి, మాతృ దేవత- ఇది ఒక కోణంలో. మరో కోణంలో స్త్రీ బానిసకొక బానిస. ఈ బానిసత్వం ఒకనాటితో వచ్చింది కాదు. ఆదిమ సమాజంలో మానవుడు తండాలుగా వేటమీద ఆధారపడి జీవించే దశలో, నీది నాది అనే స్వంత ఆస్తి భావన లేని రోజుల్లో పురుషులు వేటకి వెడితే స్త్రీలు పోడు, సమాన శ్రమ విభజన ఉన్న వ్యవసాయం, పిల్లల సంరక్షణ చేస్తూ ఉండే వారు. ఈ దశలో స్త్రీ, పురుష సంబంధాల మధ్య ఎలాంటి ఆంక్షలూ లేవు. ఆస్తి లేదు. కాబట్టి ఆడ, మగ మధ్య సంపూర్ణమైన సమానత్వం ఉండేది. అంతేకాదు, ఈ మాతృస్వామ్య దశలో మానవజాతి సృష్టికి కారకురాలుగా ఆమె అత్యున్నతంగా గౌరవం పొందింది. ఆహార సేకరణ దశ, ఆహారోత్పత్తి దశకి చేరిన తర్వాత వ్యక్తిగతఆస్తి ఏర్పడి క్రమంగా నీదీ, నాదీ అనుకునే దశలో స్త్రీని ఇంటిపనికి కుదించి పురుషుడు వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఏకభర్తృత్వం ద్వారా వ్యక్తిగత ఆస్తి పుట్టుకకు ముందే పితృస్వామిక సమాజం ఆవిర్భవించడంతో స్త్రీపై మొదటి అణచివేత ప్రారంభమైంది. ఆ తర్వాత మిగులు ఉత్పత్తికి, ఆస్తికి పురుషుడు హక్కుదారుడయ్యాడు. వ్యక్తిగత ఆస్తి ఏర్పాటు కారణంగా తండా పద్ధతి నశిస్తూ కుటుంబ వ్యవస్థ గట్టిపడటం ప్రారంభమైంది. మాతృస్వామిక వ్యవస్థ స్థానంలో పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. స్వంత ఆస్తి పుట్టుక స్త్రీని పురుషుడికి శాశ్వతంగా బానిసగా చేసింది. 

స్త్రీని దశలవారీగా తండ్రి, భర్త, కుమారుల ఆధీనంలో నిర్బంధించి, సాంఘిక కట్టుబాట్లు ఏర్పరిచి గృహ కృత్యాలకు కట్టిపడేసి స్త్రీని ఈనాటి నికృష్ట జీవితానికి గురిచేసింది. దోపిడీకి గురయ్యే పీడితుల అణచివేతను సైతం సహజమైనదిగా, దైవ సమ్మతమైనదిగా భ్రమింప చేయడంలో మతం కీలకపాత్ర వహించింది. అందులో భాగంగానే స్త్రీలపై పురుషాధిక్యత దైవసృష్టి అని ప్రచారం చేసి చిన్నప్పటినుంచే స్త్రీల మెదళ్ళలో పాతివ్రత్యాన్ని నూరిపోసి ఇలా నడవకూడదు, అలా నవ్వకూడదు అని ఆంక్షలు విధించారు. బాల్యంనుంచే స్త్రీని బలహీను రాలిననే ఆత్మన్యూనతా భావానికి గురిచేసి అబల అన్నారు. ఏ మతమైనా స్త్రీని అణచి వేయడంలో ప్రధానపాత్రే వహించింది. 
లైంగిక అత్యాచారాలు, తిట్లు, తన్నులు, ఆంక్షలు, సూటిపోటి మాటలు, లైంగికత్వంపై దాడి- ఇవన్నీ స్త్రీలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సంఘటనలు. ఇవి కనిపించేవైతే గుట్టుచపడు కాకుండా జరిగేవి కొన్ని ఉన్నాయి. ఇంటిచాకిరీ, పిల్లల పెంపకం లాంటి ఆదాయం లేని పనులు వాళ్ళకి అప్పగించి, వాళ్ళ శ్రమకి విలువ లేకుండా చేసి వాళ్ళకి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేకుండా చేశారు. అసలు కుటుంబమే ఇప్పుడున్న రూపంలో హింస. దానిని నిలబెడుతున్న పితృస్వామ్య వ్యవస్థ ఈ హింస అంతటికీ మూలకారణం. రాజకీయ వ్యవస్థలకంటే బలమైనది కావడం వల్లనే ఇది మారకుండా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. స్త్రీలకు హక్కులివ్వడం, వాళ్ళకోసం చట్టాలు చెయ్యడం, కేవలం కాలానుగుణంగా చేసే మేకప్‌ మాత్రమే. 

మహిళలపై హింసను నిరోధించటానికి పదహారు అంశాల కార్యాచరణను ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. చట్టాలు అమలు చేసి రూపొందించటమే కాదు, జాతీయ స్థాయిలోనూ, స్థానికంగానూ పటిష్ఠ కార్యాచరణ వ్యూహాల్ని చెపుతోంది. మహిళా హక్కుల్ని తొక్కిపట్టే కాలం చెల్లిన చట్టాలు ఇంకా రాజ్యాంగంలో అనేకం ఉన్నాయని జాతీయ మహిళా సంఘం ఏనాడో ప్రస్తావించింది. ఇటీవల తెచ్చిన పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టం వంటివి, కొన్నేళ్ళ క్రితం నాటి గృహహింస చట్టం వంటివి మాత్రమే స్త్రీలకు రక్షణ కవచాలు కాలేవు. అత్యాచార కేసుల్లో నేరం రుజువైతే శిక్షలు పడుతున్నవి కేవలం 24 శాతమే. సమస్య మూలం ఎక్కడున్నది అనూహ్యం కాదు. ఇండియాలో 2010 కంటే 7.1 శాతం అధికంగా 2011లో మహిళలపై 2,28,650 నేరాలు జరిగినట్లు జాతీయ నేర నమోదు సంస్థ లెక్కతేల్చింది. అభాగ్య స్త్రీలను వ్యభిచారంలోకి నెట్టడంలో ప్రపంచంలో ఇండియా రెండోస్థానంలో ఉంది.

టాటా వ్యూహాత్మక నిర్వహణ బృందం తాజాగా బహుళ అధ్యయనాలను విశ్లేషించి (వెల్‌బీయింగ్‌ ఇండెక్స్‌) మహిళా రక్షణ సూచీలను వెలువరించింది. వీటిప్రకారం హర్యానా, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌లు అట్టడుగు స్థానాల్లో ఉంటున్నాయి. స్త్రీలపై సాధారణంగా జరిగే లైంగిక అత్యాచారాలకు అంతేలేదు. ఆరేళ్ళ పసివారినుండి అరవై ఏళ్ళ వృద్ధురాలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారు. ఇంటినుండి బయటికి వెళ్ళిన మహిళ క్షేమంగా ఇల్లు చేరుతుందో లేదో తెలియదు. అసలు తన ఇంట్లో తానే భద్రంగా ఉండగలదా అనేది మరో ప్రశ్న. 

మహిళలు వంటింటి కుందేళ్ళు మాత్రమే అనే దృక్పధాన్ని రాణి రుద్రమ నుంచి మదర్‌ ధెరిస్సా వరకు తప్పని ఏనాడో నిరూపించాం. నేటి ఆధునిక మహిళ అన్ని రంగాల్లో తన ఉన్నతిని చాటుతుంది. కొన్ని రంగాల్లో పురుషులను అధిగమించి దూసుకుపోతోంది. ఆర్థిక, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రభాగాన నిలచి విజయపతాక ఎగురవేస్తున్నది. మహిళలను గత చరిత్ర నీడలు భయపెట్టినా వర్తమాన, భవిష్యత్‌ చిత్రపటంలో తన హక్కులు నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాటాలు చేస్తూనేఉంది. ఆకాశంలో సగం కాకుండా అనంతమంతా నేను అంటుంది. 

నాణానికి రెండోవైపు చూస్తేచ అదే సమయంలో ఎంత విద్యావంతురాలైనా ఎన్ని ఉన్నత పదవులు నిర్వహించినా ఏదో హింసకు ప్రతి నిత్యం గురవుతోంది. వయోపరిమితి, వరస వావి లేకుండా ఇంటా బయటా అనేక హింసలను ఎదుర్కొంటోంది. ప్రతిరోజు మన సమాజంలో ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఏదో ఒక హింసకు బలవుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి 26 నిముషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది. ప్రతి 34 నిముషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ప్రతి 42 నిముషాలకు ఒక మహిళపై లైంగిక వేధింపులు, అలాగే వరకట్నం కోసం ప్రతి 99 నిముషాలకు ఒక వధువు బలి అవుతోంది.

వివాహమైన మహిళలకు కొందరి జీవితంలో పెళ్ళంటే నూరేళ్ళపంట అనేకంటే బ్రతుకంతా మంట అనవలసి వస్తుంది. కన్యాశుల్కం నాటి నుండి వరకట్నం దాకా ఇది కొనసాగుతూనే ఉంది. ఎవరైనా చైతన్యవంతురాలైన మహిళ, సాటి మహిళలకు సలహా ఇవ్వబోతే భర్తే ప్రత్యక్ష దైవం అంటూ తమను ఎంత హింసించినా సతీసావిత్రి సతీఅరుంధతి వంటి పతివ్రతలను తలుచుకొని ‘నా మొగుడు గాక నన్ను ఇంకెవరు కొడతారు, తిడతారు’ అనే వారు ఉన్నారు. మహిళ అయితే చాలు చిన్నారి అయినా, పిచ్చిదైనా, వికలాంగురాలైనా, అఖరికి వృద్ధురాళ్ళని కూడా అత్యాచారాలకు గురిచేస్తున్నారు. పెట్టుబడిదారులు తమ వ్యాపార ప్రకటనల్లో, సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో మహిళల్ని కేవలం వ్యాపార అభివృద్ధి వస్తువుగా చూపిస్తున్నారు. సెక్స్‌ సింబల్‌గా, జుగుప్సాకరంగా, విలన్లుగా చూపిస్తున్నారు. చదివిన దానికంటే కూడా చూసిన దృశ్యమే సమాజంపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఆ విధంగా చెడు ప్రభావానికి గురై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, హత్యలకు, నేర ప్రవృత్తికి దారితీస్తోంది.
అత్తగార్ని కోడలు తల్లిలా ఎలా గౌరవించాలి, కోడల్ని అత్తగారు కూతురులా ఎలా అభిమానిం చాలి, చిన్నపిల్లల్ని ఎలా ప్రేమగా చూసుకొని ప్రేమతత్వాన్ని నేర్పాలి, వృద్ధుల మనోభావాలు దెబ్బ తినకుండా ఏ విధమైన పద్ధతులు ప్రవేశపెట్టాలి, ఏ వయసు వారికి ఆ వయసుకు తగిన వ్యక్తిత్వం ఎలా ఉండాలి- ఇలాంటి విషయాలపట్ల కనీస అవగాహన కల్పించే సామాజిక స్పృహ, బాధ్యతలు ఈ పెట్టుబడిదారులకుగానీ, ప్రభుత్వానికి గానీ, రాజకీయ నాయకులకు గానీ లేవు. కేవలం తమ తమ లాభనష్టాలు, స్వార్థ ప్రయోజనాలు మాత్రమే వారికి ముఖ్యం.

స్త్రీలను మార్కెట్‌ సరుకుగా, సెక్స్‌ సింబల్‌గా చూపిస్తున్న అన్ని వాణిజ్య ప్రకటనల్ని రద్దుచేయాలి. స్త్రీలు కేవలం లైంగిక సుఖాన్ని ఇచ్చే యంత్రాలుగా చూసే భావజాలం మారాలి. స్త్రీనా పురుషుడా అని కాకుండా మనుషుల్ని ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారిగా గౌరవించే సంస్కృతి రావాలి. అప్పుడు మాత్రమే అత్యాచారాల్ని హత్యల్ని ఆపగలుగుతాం. మహిళలపై జరుగుతున్న అన్ని దాడులకు ప్రభుత్వమే కారణం కాబట్టి మహిళలపై జరుగుతున్న హింసకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు, యాసిడ్‌ దాడులకు పాల్పడిన నేరస్థులను ఎన్‌కౌంటర్లు చేయడం, సామాజిక అత్యాచారాలు జరిగినప్పుడు మరణ శిక్షలు విధించడం సమస్యకు పరిష్కారం కాదు. ప్రజాస్వామ్య విలువలకై పోరాడుతూ, రేపటి తరం యువతను సామ్రాజ్యవాద విషసంస్కృతినుండి రక్షించుకోవడం మనందరి బాధ్యత. వ్యవస్థే నేరమయ మైనపుడు వ్యక్తులు మాత్రమే ఎలా నేరస్థులవుతారు? ఈ వ్యవస్థను తయారు చేస్తున్న ప్రభుత్వాలు, రాజకీయపార్టీలే అసలు సిసలు నేరస్థులు. మహిళల వ్యక్తిత్వాల్ని దెబ్బతీస్తూ వారిని అంగడి సరుకుగా మారుస్తున్న మీడియా, పెట్టుబడిదారులు, ప్రభుత్వమే మహిళలపై జరిగే హింసకు కారణం.

ఫ్యాక్టరీల్లో యజమానుల లైంగిక వేధింపులు, కూలికెళ్తే కామందుల కామానికి బలి కావడాలు, మైనర్‌ బాలికల్ని పనుల్లో పెట్టుకొని- తండ్రి వయసున్న యజమానులు వారిపై అత్యాచారాలు చేయడం, కులంపేరుతో కింది కుల మహిళలపై అగ్రకుల పురుషులు గ్యాంగ్‌ రేప్‌లు, హత్యలు చేయడం, గురువుల కామాగ్నికి బలయ్యే విద్యార్థినులు, ప్రేమను కాదన్నందుకు యాసిడ్‌ దాడులు, హత్యలు, కట్నంకోసం కిరోసిన్‌ బాత్‌లు, భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, మాతంగులు, ఆడపిల్లల అమ్మకాలు, బలవంతంగా వ్యభిచారంలో దించడం, కులాంతర వివాహాలు చేసుకున్నందుకు వారిని కన్నవారే కసాయిలుగా నరకడం- ఈ జాబితాకు అంతే లేదు. ఇక పోలీసుల చేతుల్లో బలైన చిత్తాయి, సిలకమ్మలు ఎంతోమంది ఉన్నారు. దేశంలో రోజురోజుకీ స్త్రీలలో చైతన్యం అభివృద్ధి చెందుతోంది. స్త్రీలు తమ చరిత్రని తాము నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రలో, సమాజంలో, రాజకీయాలలో కుటుంబంలో తమ స్థానంకోసం పోరాటం చేస్తున్నారు.నిరంతరం మగపెత్తనానికి, పితృస్వామిక హింసకు గురవుతున్న భారత స్త్రీలకు తమపై అమలవుతున్న హింసను, ఆధిపత్యాన్ని వ్యక్తిగత స్థాయిలో, సమాజ స్థాయిలో ప్రతిఘటించ డంతో పాటు కరుడుగట్టిన పురుష దృక్పథంతో రూపుది ద్దుకున్న భారత న్యాయచట్టాల్లో స్త్రీలకు అనుకూలంగా మార్పులు తీసుకు రావడానికి భారత స్త్రీలు పోరాడాలి. స్త్రీలపై జరుగుతున్న హింసాకాండను, మగపెత్తనాన్ని, పితృస్వామిక భావజాలాన్ని రూపుమాపేందుకు మహిళలు పిడికిలి బిగించాలి. 

స్త్రీమూర్తుల్ని సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దకుండా సమానత్వం, సాధికారత రావు.వాణిజ్య ప్రకటనల్ని, అందాల పోటీల్ని, మద్యపానాన్ని నిషేధించాలి. మానవ సృష్టికి మూలమైన, సమాజంలో, సహజీవనంలో సగమైన స్త్రీవ్యక్తిత్వాన్ని కాపాడేలా ప్రభుత్వాలు పనిచేయాలి. మగపిల్లలకు చిన్ననాటినుండే ఎదుటి స్త్రీని గౌరవించే సంస్కారాన్ని తల్లిదండ్రులు నేర్పించాలి. స్త్రీల సమస్యలపై అవగాహన కల్పించాలి. అవసరం వచ్చినపుడు మాత్రమే కాకుండా ప్రాథమికవిద్యనుంచే ఆడపిల్లలకు మార్షల్‌ఆర్ట్‌‌స నేర్పించాలి. కార్యాలయాల్లో కంప్లెయింట్‌ బాక్సులు, కళాశాలల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలి. చట్టాల్లో మార్పు కన్నా సమాజంలో మార్పు, భావజాలంలో మార్పు కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచి నైతిక విద్యాబోధన జరగాలి. దుశ్శాసన సంతతిపై కఠిన శిక్షల కొరడా పడాలి. అశ్లీలతకు అడ్డుకట్ట వేయాలి. 

వీటన్నింటికోసం సమాజంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం పురివిప్పాలి. దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఢిల్లీ బస్సులో నిర్భయ ఉదంతం వరకూ అత్యాచారాల చిట్టా పెరుగుతూనే ఉంది. నిర్భయ ఉదంతం జాతి గుండెలను కలచివేసినా పరమ జుగుప్సా కరంగా అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయన్నది మరవకూడదు. జస్టిస్‌ జెఎస్‌ వర్మ సూచనల్ని కొన్నింటిని తోసిపుచ్చి అత్యవసర ఆదేశాన్ని జారీచేసిన కేంద్ర ప్రభుత్వం సామాజిక విలువలు పెంచటంలో తన వంతు ప్రయత్నం ఏం చేసిందో- ఇంకా ఏం చేస్తుందో వేచి చూడాలి.


జి. విజయలక్ష్మి
Surya  News Paper Dated: 28/3/2013
Email | Print |

తెలంగాణ ఉద్యమ దశ, దిశ ---హరగోపాల్,



telangana-map
తెలంగాణ ఉద్యమ దశ, దిశను మళ్లీ మళ్లీ అంచనా వేయవలసి రావడం బాధాకరంగా ఉన్నా, ఏ ఉద్యమానికైనా తన గమ్యాన్నే కాక తన గమనాన్ని విమర్శనాత్మకంగా చూడడం, ఆత్మావలోకనం చేసుకోవడం ఒక చారివూతక అవసరం. చాలా ఉద్యమాలు లక్ష్యం మీదే కేంద్రీకరించి, గమనాన్ని సరిగ్గా గమనించకపోవడం వల్ల తీరా లక్ష్యాన్ని చేరుకున్నాక, మనం ఇక్కడికెలా చేరుకున్నాం, ఈ గమ్యానికా మనం చేసిన పోరాటం అని పశ్చాత్తాపపడవచ్చు కూడా.

భారత స్వాతంవూత్యోద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన వారు, ఇప్పటి ఈ దేశ పరిస్థితులను చూసి చాలా బాధపడుతున్నారు. కాళోజీ చాలా సందర్భాల్లో ఆ మాట అంటూ కన్నీళ్లు పెట్టుకునేవాడు. వావిలాల గోపాలకృష్ణయ్య ఆరోగ్యం క్షీణించినప్పుడు చూడడానికి వెళితే నేను అక్కడ కూర్చున్నంత సేపు, దేశ పరిస్థితిని గురించి ఏడుస్తూనే ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆయనను చూడడానికి, మాట్లాడడానికి వచ్చానని గుర్తుచేసినా ఏడవడం మానలేదు. సరే తెలంగాణ ఉద్యమాన్ని స్వాతంవూత్యోద్యమంతో పోల్చడం ఎంత వరకు సబబో తెలియదు. కానీ తెలంగాణ ప్రజలకు రాబోయే తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా చాలా ఆశలున్నాయి. ఇవన్నీ నెరవేరతాయని కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితి కంటే మెరుగైన తెలంగాణ నిర్మించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే గమనాన్ని కూడా అంచనా వేయాలి. 

నిజానికి ఈ వ్యాసం మిత్రుడు పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి ‘నమస్తే తెలంగాణ’లో రాసిన ‘సమష్టి చైతన్యమే సడక్‌బంద్’ అనే వ్యాసాన్ని చదివిన తర్వాత తప్పక స్పందించాలనిపించింది. రాఘవాచారి క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన బలమైన ప్రజాస్వామిక గొంతుక. చాలా స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం కలిగి, అన్ని సమస్యలను సూక్ష్మంగా పరిశీలించి, స్థూలమైన భావాలను వ్యక్తీకరించగలిగిన కొద్దిమంది క్షేత్రస్థాయి మేధావులలో ఆయన ఒకడు. ఎందుకో ఆయన వ్యాసంలో ఒక ఆవేశం, ఒక తొందరపాటు కనిపించింది. తెలంగాణ రాష్ట్రాన్ని అతి త్వరగా సాధించుకోవాలి అనే తపన ఉంది. ఆ ఆవేశంలో ఎలాంటి తెలంగాణ అనే ప్రశ్న, అనుమానం వ్యాసంలో స్పష్టంగా వ్యక్తపరచలేదు. ఒక సునిశిత పరిశీలకుడు ఎందుకు ఇంత ఆవేశంగా భౌగోళిక తెలంగాణ గురించి ఆందోళన పడుతున్నాడు అనిపించింది. నాకు కూడా తెలంగాణ రాష్ట్రం త్వరలో ఏర్పడితే బావుండు అని మనసులో బలంగా ఉంది. 

కానీ ఆ తెలంగాణ మానవీయంగా, ప్రజాస్వామికంగా, పేద వూపజల పక్షాన, మతాతీత సంబంధా లు బలపడి, రాష్ట్రంలోని మైనారిటీలు కూడా ఆ రాష్ట్రం తమ రాష్ట్రమని, తాము ఏ పరిస్థితిలో కూడా భద్రంగా సమానమైన పౌరులుగా పరిగణింపబడతామనే విశ్వాసం వాళ్లలో ఉండాలి. అన్ని జీవన రంగా ల్లో మైనారిటీలు క్రియాత్మకంగా పాల్గొనేలా సామాజిక సంబంధాలు ఎదగాలి. నిజానికి తెలంగాణ ప్రాంతానికి ఆ గొప్ప వారసత్వముంది. ఆ వారసత్వ పునాది మీదే పునర్ నిర్మాణం జరగాలి. ముస్లిం మతతత్వ రాజకీయ నాయకులు కొంత సంకుచితంగా ఆలోచిస్తున్న మాట వాస్తవమే. తెలంగాణలో ముస్లిం ల మీద తమ పట్టు తప్పుతుందేమో అన్న అనుమానం వాళ్లకుంది. సాధారణ ముస్లింలలో ఆ అనుమానం బలపడకుండా ఉద్యమం చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎందుకో రాజకీయాలు ఆ దిశలో సాగుతున్నట్లుగా అనిపించడం లేదు.

తెలంగాణకుండే పోరాట చరివూతలో బందగీ, షోయబుల్లాఖాన్‌ల త్యాగం సమ ష్టి జ్ఞాపకంలో మెదులుతూనే ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం లో ముస్లిం మతతత్వ రాజకీయాలని, రజాకార్లను ఎదిరించిన అనుభవంతో పాటు ఒక సమష్టి సమాజ స్వప్నం ఆ పోరాటంలో ఉంది. తెలంగాణ ఒక గాయా ల వీణ అన్నప్పుడు ఉద్యమాల ఆటుపోటులన్న ఆ వ్యక్తీకరణలో ఉన్నాయి. ఇప్పటి ఉద్యమంలో ఆస్ఫూర్తి కంటే, మతతత్వ భావజాల ప్రభావం పెరుగుతున్నది. రెండు మతతత్వ పార్టీలు మరింత బలాన్ని పెంచుకుంటున్నాయి. అయితే ఎన్నటికైనా మైనారిటీ మతతత్వం కంటే మెజారిటీ మతతత్వం ప్రమాదకరమైంది అని నమ్మేవాళ్లలో నేనొకడిని.

మెజారిటీ మతతత్వం వెనక రాజ్యం కూడా ఉంటుంది. కనుక అది ఎక్కువ ప్రమాదకరం. ఇది మనం గుజరాత్‌లో స్పష్టంగా చూశాం. తెలంగాణలో బలపడుతున్న బీజేపీ ప్రధాన నాయకులు తెలంగాణ పోరాట స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ రాష్ట్ర బీజేపీ భిన్నంగా ఉం టుంది అన్న కనీస విశ్వాసాన్ని కలిగించే బదులు మొత్తం చరివూతను వెనక్కి నెట్టడానికి కష్టపడుతున్నారు. పార్టీ బలపడుతున్నకొద్దీ ఇంకా చాలామందిని, అన్ని వర్గాలను కలుపుకపోవాలి అని ప్రయత్నించే బదులు, తెలంగాణ బీజేపీ నాయకులు నరేంవూదమోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు. తెలంగాణపై నరేంవూదమోడీ వ్యక్తిగత అభివూపాయాలేమిటో మనకు తెలియదు. ఆయన తెలంగాణ గురించి ఎక్కడా మాట్లాడినట్టు తెలియదు. ఆయన గుజరాత్ రాష్ట్ర అస్మిత గురిం చే మాట్లాడాడు. నిజానికి తెలంగాణ గురించి చాలా స్పష్టంగా కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడిన బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్. 

ఆమె గురించి బీజేపీ నాయకులు ప్రస్తావించడం కూడా లేదు. కనీసం బీజేపీ నాయకత్వ సమ స్య ఎన్నికలైన తర్వాత పార్టీ నిర్ణయిస్తుంది అన్న కనీస ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా లేకుండా సరాసరి నరేంవూదమోడీ తమ నాయకుడని ప్రకటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి, ఈ ఉద్యమానికి నరేంవూదమోడీ ప్రధాని కావడాని కి ఏం సంబంధమో మనకు తెలియదు. బీజేపీ నుంచి మరెవరైనా ప్రధాని అయి తే తెలంగాణ ఇవ్వదా? అది పార్టీ నిర్ణయమే అయినప్పుడు ఎవరు ప్రధాని అయి తే ఏం అని అనకపోవడం, నరేంవూదమోడీ ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో జరిగిన మారణకాండను పరోక్షంగా సమర్థించడమే అవుతుంది. ఆ రాజకీయాలు తెలంగాణకు ఎలా ప్రయోజనం అన్న ప్రశ్నకు జవాబు రావలసే ఉన్నది.

ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్షికమంలో గుజరాత్‌లో జరిగిన మారణకాండకు మీరు విచారిస్తున్నారా అని అడిగితే, ఆ ప్రశ్న మళ్లీ మళ్లీ ఎలాగూ అడగబోతారు కాబట్టి దానికి నేను ఇప్పుడు సమాధానం చెప్పను అని దాటవేశాడు. ఒక వ్యక్తి ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో శాంతిభవూదతలు పూర్తిగా విఫలమై ప్రాణ నష్టం జరిగితే బాధపడకపోవడమేమిటి? చాలామంది మారణకాండకు ముఖ్యమంత్రి ఎలా బాధ్యుడు? న్యాయస్థానాలు కూడా ఆయనను తప్పుపట్టలేదు అని అంటున్నారు. ఆయన బాధ్యతా కాదా అని కాదు తన రాష్ట్రంలో అంతమంది మనుషులు (వాళ్లను మనుషులు అని ఆయన భావిస్తే) చనిపోతే కనీస మానవీయ స్పందన ఉండాలి కదా. ఒక రైలు ప్రమాదం జరిగితే లాల్‌బహదూర్ శాస్త్రి తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. రైలు ప్రమాదానికి శాస్త్రి ఎలా కారణమౌతాడు అని ఎవరైనా అంటే మన జవాబు ఏమిటి?

గుజరాత్ మొత్తం అభివృద్ధి నరేంవూదమోడీ వల్లే జరిగిందనే ప్రచారం ఎంత విచిత్రం! అభివృద్ధి ఆయన వల్ల జరిగింది, కానీ మారణకాండకు ఆయన బాధ్యు డు కాడు అనేది ఎంతవితండవాదం. గుజరాత్ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. గుజరాతీలు వ్యాపారంలో చాలా అనుభవమున్నవారు. 1970లో నేను అమెరికాలో ఏమాత్రం ఇంగ్లిష్ భాషా జ్ఞానంలేని గుజరాతీ మహిళలు చాకచక్యంగా వ్యాపారం చేయడం చూ శాం. ఒక రాష్ట్ర అభివృద్ధికి ఒకే ఒక వ్యక్తి కారణం అనడం చాలా అప్రజాస్వామికం. ఒక వ్యక్తే అభివృద్ధిని సాధించగలడు అంటే సాయిబాబా ఉంగరం లాంటి భ్రమే.

గుజరాత్ అభివృద్ధికి నరేంద్ర మోడే కారణం అని అనుకున్నా, ఆ నమూనా దేశానికి మొత్తం వర్తిసుం దా, వృద్ధిరేటు పదకొండు శాతమో, పద్నాలుగు శాత మో అనుకున్నా, ఆ వృద్ధిరేటులో మనుషుపూక్కడు న్నారు? మన దేశవృద్ధి రేటు పెరుగుతూ ఉంటే మానవాభివృద్ధి (Human Development) రేటు తగ్గుతున్నది. ఈ మధ్యే ప్రచురించిన ‘మానవాభివృద్ధి’ 2013 నివేదికలో ప్రపంచంలోని దేశాల్లో మనం132, 133 వ స్థానంలో ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో లక్షలాది సంఖ్యలో కుదించా రు. సంక్షేమ రంగం నుంచి రాజ్యం పారిపోతున్నది. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవే టు పరమవుతున్నది. అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యవసాయ, వాటా మొత్తం జాతీయాదాయంలో 13.5 శాతానికి తగ్గిపోయింది. అంటే 60 కోట్లమంది గ్రామీణ ప్రజలు 13 శాతం ఆదాయం మీద బతికితే, 20 మంది పారిక్షిశామికవేత్తల వాటా 22 శాతం. ఈ 22 శాతం సంపదను అనుభవిస్తున్న వాళ్లు గుజరాత్ అభివృద్ధి నమూనాను సమర్థిస్తున్నారు.

తమ మీడియా ద్వారా 24 గంటలు ప్రచారం చేస్తున్నారు. కోట్లాదిమంది నిరుపేదల గురించి మాట్లాడడం ఎందుకు మానేశారు? నిజానికి తెలంగాణ పోరాటాలు గతంలోనైనా ఇప్పటిడైనా ఈ ప్రశ్నలు ముందుకు తెస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలను వాటితో పాటు శ్రామిక ప్రజలను, రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్ర ఉద్యమం విస్మరించకూడదు. పోరాట వారసత్వ పునాదుల మీద నిర్మాణమైన తెలంగాణ ఉద్యమంలోను ఎక్కి వచ్చిన నిచ్చెనకు కిందికి తోయకూడదు. రాఘవాచారి లాంటి విద్యావంతులు తెలంగాణ గురించి ఆవేశంగా రాసేటప్పుడు ఈ ప్రశ్నలను సజీవంగా ఉంచాలి. పాలమూరు కరువులో పెరిగిన మనం కూడా ఈ ప్రశ్నలను విస్మరిస్తే నరేంద్రమోడీని, ఆయన నమూనాను సమర్థించే చేరుకునే ప్రమాదముంది. 

పొఫెసర్ జి. హరగోపా


Namasete Telangana Telugu News Paper Dated: 28/03/2013

ఆఫ్రికా విషాదమూ - అచెబే సాహిత్యమూ - డాక్టర్ కె. ఇంద్రసేనా రెడ్డి



చినువా అచెబే అస్తమయంతో సాహిత్య ప్రియులు ఒక స్నేహితుడిని కోల్పోయారు; నైజీరియన్లు ఒక తాత్వికుడిని కోల్పోయారు; ఆఫ్రికన్లు ఒక మార్గదర్శకుడిని కోల్పోయారు; సామాజిక ఆందోళనకారులు క్రియాశీలి అయిన ఒక రచయితను కోల్పోయారు... 'ఒక నిబద్ధత లేకుండా, నిరసన వ్యక్తం చేయకుండా ఆఫ్రికా గురించి రాయడం అసాధ్యమని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆఫ్రికాకు గతం అనేది లేదని భావించే వారు ఉన్నారు. మేము చేస్తున్నదల్లా ఆఫ్రికాకు గతం ఉన్నదని చెప్పడమే..' అని చినువా అన్నారు. 

చినువా అచెబే మరణంతో సాహిత్య ప్రియులు ఒక స్నేహితుడిని కోల్పోయారు; నైజీరియన్లు ఒక తాత్వికుడిని కోల్పోయారు; ఆఫ్రికన్లు ఒక మార్గదర్శకుడిని కోల్పోయారు; సామాజిక ఆందోళనకారులు క్రియాశీలి అయిన ఒక రచయితను కోల్పోయారు. ఆఫ్రికాలో నయా వలసవాద పరిస్థితులు పలువురు క్రియాశీల రచయితలు, రచయిత్రులను ప్రభవింపచేశాయి. వీరిలో ప్రముఖులు వోల్ సోయింకా (నైజీరియన్ రచయిత, నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత), గూగీ వా థియోంగో (కెన్యా సాహిత్యకుడు, ఇప్పుడు అమెరికాలో ప్రవాసి), నవాల్ ఎల్ సదావీ (ఈజిప్టియన్ సాహితీవేత్త), ఫ్రాంట్జ్ ఫానన్ (మార్టినిక్), అబేబ టెస్ ఫాగియోర్గిస్ (ఎరిట్రియా). సామాన్యుని పక్షాన నిలిచిన ఈ సాహితీ సృజకులందరూ తమ తమ దేశాల్లోని ఆర్థిక-సామాజిక దోపిడీ వ్యవస్థలను తీవ్రంగా దుయ్యబట్టడమే గాకుండా, కొత్త వలస వాదానికి వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన ప్రజల విమోచనోద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు. నైజీరియా నుంచి వేరుపడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి సహచర బయాఫ్రాన్ (బయాఫ్రా దక్షిణ నైజీరియాలోని ఒక ప్రాంతం) ప్రజలతో కలిసి చినువా పోరాడారు. బయాఫ్రా ప్రాంతంలో 1967-70 సంవత్సరాల మధ్య చోటుచేసుకున్న అంతర్యుద్ధం నైజీరియా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఆ అంతర్యుద్ధ రక్తసిక్త స్మృతులే చినువా తాజా నవల 'దేర్ వజ్ ఎ కంట్రీ' (2012) ఇతివృత్తం.

'థింగ్స్ ఫాల్ ఎపార్ట్' (1958) చినువా తొలి నవల. ఈ నవల ప్రచురితమై యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా 2008లో ఆఫ్రికా, ఐరోపా, భారత్‌లలో పలు విశ్వవిద్యాలయాలు ఆ సాహిత్య కృతిపై సదస్సులు నిర్వహించాయి. నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో చినువా సాహిత్య సదస్సు నిర్వహణలో భాగస్వామినయినందుకు నేను గర్విస్తున్నాను (అప్పుడు నేను ఆ వర్సిటీ ఆంగ్ల విభాగానికి ప్రధానాచార్యుడుగా నున్నాను). 'థింగ్స్ ఫాల్ ఎపార్ట్' ప్రపంచవ్యాప్తంగా యాభైకి పైగా భాషలలోకి అనువదింపబడింది. కోటికి పైగా ప్రతులు వ్యాప్తిలో ఉన్నాయి. మతం (క్రైస్తవం), దాని మిత్రుడు వలసదారు సంయుక్త అధికార ప్రాబల్యానికి వ్యతిరేకంగా మరెవరి సహాయం లేకపోయినా ఒంటరిగా సాహసోపేత పోరాటం చేసిన ఒక ఆఫ్రికన్ కథా నాయకుని విషాదగాథను ఆ నవల చెప్పింది. ఆఫ్రికన్ ప్రజల సంప్రదాయాలు, విలువలు, విశ్వాసాలలో అంతర్భాగంగాఉన్న ఆఫ్రికన్ కల్పనా గాథలు, ఆచారాలు, జానపద సాహిత్యాన్ని చినువా నవలలు 'థింగ్స్ ఫాల్ ఎపార్ట్', 'ఆంథిల్స్ ఆఫ్ సవన్నా' (1987) రెండూ పునః సృజించాయి. చినువా తన రచనలలో ఆఫ్రికన్ స్ఫూర్తిని నింపుతారు. ఆంగ్ల భాషను ఆఫ్రికీకరణ చేయడానికి ఆయన తన శాయశక్తులా ప్రయత్నించారు. వలస పాలకుల వారసత్వ అవశేషంగా మిగిలిన ఆంగ్ల భాషను ఉపయోగించుకోవడం అనివార్యమయినందుకు ఆయన చాలా విచారపడతారు. అయితే 'తన ఆఫ్రికన్ అనుభవంలోని బరువును వ్యక్తీకరించేందుకు ఆంగ్ల భాష ఉపకరిస్తుందని' చినువా అన్నారు.

చినువా నవలలు 'థింగ్స్ ఫాల్ ఎపార్ట్' (1958), 'నో లాంగర్ ఎట్ ఈజ్' (1960), 'యారో ఆఫ్ గాడ్' (1964), 'ఎ మ్యాన్ ఆఫ్ ది పీపుల్ ' (1966), 'ఆంథిల్స్ ఆఫ్ ది సవన్నా' (1987) మొదలైనవి వలసపాలనాయుగంలోను, వలస పాలన నుంచి విముక్తి పొందిన అనంతరమూ నైజీరియాలో నెలకొనివున్న పరిస్థితులను అభివర్ణిస్తాయి. నిజానికి అవి ఒక్క నైజీరియాలోనే కాక ఆఫ్రికా దేశాలన్నిటా ఉన్న అటువంటి పరిస్థితులకు దర్పణం పట్టాయని చెప్పవచ్చు. ప్రస్తావిత ఐదు నవలలనూ 1890ల నుంచి 1980ల దాకా నైజీరియా చరిత్రగా కూడా చదవవచ్చు. నవలా రచయిత, కవి, విమర్శకుడు, వ్యాసకర్తే కాకుండా చినువా ఒక చరిత్రకారుడు కూడా. వీటన్నిటికీ మించి ఆయన ఒక క్రియాశీలి అయిన రచయిత కూడా. జాత్యహంకారాన్ని, జాత్యదురహంకారులను చినువా ఎటువంటి మినహాయింపులు లేకుండా తీవ్రంగా విమర్శించారు. జాత్యోన్మాదం పాశ్చాత్య ప్రపంచ సృష్టి అని, ఆ దురాచారాన్ని ఆఫ్రికా, ఇతర ప్రాంతాలపై రుద్దారని ఆయన దుయ్యబడతారు. జర్మన్ దార్శనికుడు హేగెల్ 'చరిత్ర తత్వాలు' (ఫిలాసఫీస్ ఆఫ్ హిస్టరీ)లో ఆఫ్రికా కనీసం ఒక అంధకార ప్రాంతంగా కూడా కానరాదని ఆయన అంటారు. 

నోబెల్ పురస్కార గ్రహీత జోసెఫ్ కాన్రాడ్‌కు ఆఫ్రికా అంటే 'చీకటి హృదయం'కు ప్రతిబింబమే! ఆఫ్రికా గురించి ఆయన ఉత్కృష్ట నవల 'హార్ట్ ఆఫ్ డార్క్‌నెస్' మనకు కల్గించే భావన అదే కదా. మరి కాన్రాడ్‌ను 'సంకుచిత యూరోపియన్ మనస్తత్వం గల జాత్య దురహంకారి' అని విమర్శించగల ధైర్యం చినువాకు కాక మరెవరికి ఉంటుంది? ఆఫ్రికాను 'చీకటి ఖండం'గా వక్రీకరించిన కథనాలను సరిదిద్దడానికి, ఆ ఖండంపై ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని రూపుమాపడానికి చినువా ఒక నిబద్ధతతో రచనా వ్యాసంగాన్ని చేశారు. ఆయన ఇలా అం టారు: 'ఒక నిబద్ధత లేకుండా, నిరసన వ్యక్తం చేయకుండా ఆఫ్రికా గురించి రాయడం అసాధ్యమని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆఫ్రికాకు గతం అనేది లేదని భావించే వారు ఉన్నారు. మేము చేస్తున్నదల్లా ఆఫ్రికాకు గతం ఉన్నదని చెప్పడమే..'

వలస పాలనలో మగ్గిపోతున్న ఆఫ్రికా ప్రజల జీవన స్థితిగతులను చినువా మొదటి మూడు నవలలు అభివర్ణిస్తాయి. శ్వేతజాతీయులు తొలుత తమ మతం, బైబిల్‌తో ఆఫ్రికాలో అడుగుపెట్టారు; వారిని అనుసరించి వలసవాదులు తుపాకులతో వచ్చారు. బైబిల్, తుపాకీ అనే రెండు మాటలు ఆఫ్రికాలో వలసవాదం చరిత్రను సంక్షేపిస్తాయి. స్వాతంత్య్రానంతరం కొత్త వలసవాదంలో అధికార స్థానాలలో సుప్రతిష్ఠులైన నల్ల జాతి నాయకుల పాలనలో మారిన పరిస్థితులను 'ఏ మ్యాన్ ఆఫ్ ది పీపుల్', 'అంథిల్స్ ఆఫ్ ది సవన్నా' అభివర్ణిస్తాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్రికన్ల శత్రువు లోపలి మనిషే. అంటే వారి నుంచి వచ్చిన వ్యక్తే. అయితే అమెరికా, యూరోప్‌లలోని తన నయా వలసవాద యజమానుల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటాడు. ఇదే ఆఫ్రికా విషాదం. భారత్, ఇతర వర్ధమానదేశాల చరిత్ర గతి కూడా ఇదే రీతిలో ఉంది. ఈ చారిత్రక సామ్యమే చినువాను మనకు అంటే భారతీయులకు సన్నిహితుడిని చేసింది. ఆయన సాహిత్యం మన సమాజానికీ ఉపయుక్తత కలిగి ఉంది. ఇది చినువా సాహిత్యంలోని విశ్వ జనీన గుణం.

చినువా ఇక లేరు. అయితే ఆయన అర్థవంతంగా జీవించారు. భవిష్యత్తుకు సమున్నత వారసత్వాన్ని వదిలివెళ్ళారు. బలహీనులలో కెల్లా బలహీనులు అత్యంత శక్తిమంతులను ఎలా ఎదుర్కోగలరో ప్రపంచానికి ఆయన చూపారు. ఈ నివాళి వ్యాసాన్ని ఒక నీతికథతో ముగిస్తాను. చినువా నవలలో ఒక నిరక్షరాస్య గ్రామీణుడు ఈ దృష్టాంత కథను చెబుతాడు. అమాయక ప్రజలకు ప్రతీకగా తాబేలును, రాజ్య వ్యవస్థ దుర్మార్గ అధికారాలకు ప్రతీకగా చిరుతపులిని సూచించడానికి చినువా ఆ కథను ఉపయోగించుకుంటారు. ఒక ఆఫ్రికన్ కల్పనాకథ ప్రకారం తాబేలు, చిరుతపులి రెండూ బద్ధ శత్రువులు. తాబేలు కంటపడినప్పుడల్లా చిరుత తక్షణమే దానిని చంపివేసి తింటుంది. ఒకసారి తాబేలును చిరుత చూస్తుంది. 'నేను నిన్ను చంపబోతున్నానని' చిరుత అంటుంది. తను మృతికి సిద్ధం కావడానికి ఒకటి రెండు నిమిషాలు వ్యవధినివ్వమని తాబేలు వేడుకొంటుంది. సరేనంటుంది చిరుత. వెన్వెంటనే తాబేలు మట్టిని కాళ్ళతో తన్నుతూ దుమ్మును రేపుతుంది. చిరుత అయోమయంలో పడుతుంది. 'ఏం చేస్తున్నావని' అడుగుతుంది. తాబేలు వెంటనే ఇలా సమాధానమిస్తుంది: 'నేను ఎలాగూ చనిపోబోతున్నాను కదా. అయితే చనిపోయే ముందు ఇక్కడకు వచ్చిన వారు నీకు నాకు మధ్య మహాయుద్ధం జరిగిందన్న విషయాన్ని గ్రహించాలని నేను కోరుకొంటున్నాను'. ఎంత అద్భుతమైన దృష్టాంత గాథ!

- డాక్టర్ కె. ఇంద్రసేనా రెడ్డి
ఆంగ్ల ఆచార్యులు


Andhra Jyothi Telugu News Paper Dated: 28/3/2013

Monday, March 25, 2013

Chinua Achebe is no more


AP
Share  ·   Comment   ·   print   ·   T+  
In this January 22, 2008 photo, Nigerian-born novelist and poet Chinua Achebe speaks about his works and his life at his home on the campus of Bard College in Annandale-on-Hudson, New York. Achebe, who wrote the classic
AP In this January 22, 2008 photo, Nigerian-born novelist and poet Chinua Achebe speaks about his works and his life at his home on the campus of Bard College in Annandale-on-Hudson, New York. Achebe, who wrote the classic "Things Fall Apart," has died. He was 82.
Chinua Achebe, the internationally celebrated Nigerian author, statesman and dissident who gave literary birth to modern Africa with Things Fall Apart and continued for decades to rewrite and reclaim the history of his native country, has died. He was 82.
Mr. Achebe died following a brief illness, said his agent, Andrew Wylie.
“He was also a beloved husband, father, uncle and grandfather, whose wisdom and courage are an inspiration to all who knew him,” Mr. Wylie said.
As a Nigerian, Mr. Achebe lived through and helped define revolutionary change in his country, from independence to dictatorship to the disastrous war between Nigeria and the breakaway country of Biafra in the late 1960s. He knew both the prestige of serving on government commissions and the fear of being declared an enemy of the state. He spent much of his adult life in the United States, but never stopped calling for democracy in Nigeria or resisting literary honors from a government he refused to accept.
Turned down by several publishers, Things Fall Apart was finally accepted by Heinemann and released in 1958 with a first printing of 2,000. Its initial review in The New York Times ran less than 500 words, but the novel soon became among the most important books of the 20th century, a universally acknowledged starting point for postcolonial, indigenous African fiction, the prophetic union of British letters and African oral culture.
“It would be impossible to say how Things Fall Apart influenced African writing,” the African scholar Kwame Anthony Appiah once observed. “It would be like asking how Shakespeare influenced English writers or Pushkin influenced Russians. Achebe didn’t only play the game, he invented it.”
Things Fall Apart has sold more than 8 million copies worldwide and has been translated into more than 50 languages. Mr. Achebe also was a forceful critic of Western literature about Africa, especially Joseph Conrad’s Heart of Darkness, standard reading for millions, but in Mr. Achebe’s opinion, a defining example of how even a great Western mind could reduce a foreign civilization to barbarism and menace.
“Now, I grew up among very eloquent elders. In the village, or even in the church, which my father made sure we attended, there were eloquent speakers. So if you reduce that eloquence which I encountered to eight words ... it’s going to be very different,” Mr. Achebe told The Associated Press in 2008. “You know that it’s going to be a battle to turn it around, to say to people, ‘That’s not the way my people respond in this situation, by unintelligible grunts, and so on; they would speak.’ And it is that speech that I knew I wanted to be written down.”
Mr. Achebe never won the Nobel Prize, which many believed he deserved, but in 2007 he did receive the Man Booker International Prize, a $120,000 honour for lifetime achievement. Mr. Achebe, paralysed from the waist down since a 1990 auto accident, lived for years in a cottage built for him on the campus of Bard College, a leading liberal arts school north of New York City where he was a faculty member. He joined Brown University in 2009 as a professor of languages and literature.
‘Two types of music’
Mr. Achebe, a native of Ogidi, Nigeria, regarded his life as a bartering between conflicting cultures. He spoke of the “two types of music” running through his mindIbo legends and the prose of Dickens. He was also exposed to different faiths. His father worked in a local missionary and was among the first in their village to convert to Christianity. In Mr. Achebe’s memoir There Was a Country, he wrote that his “whole artistic career was probably sparked by this tension between the Christian religion” of his parents and the “retreating, older religion” of his ancestors. He would observe the conflicts between his father and great uncle and ponder “the essence, the meaning, the worldview of both religions.”
For much of his life, he had a sense that he was a person of special gifts who was part of an historic generation. Mr. Achebe was so avid a reader as a young man that his nickname was “Dictionary.” At Government College, Umuahia, he read Shakespeare, Dickens, Robert Louis Stevenson and Jonathan Swift among others. He placed his name alongside an extraordinary range of alumni government and artistic leaders from Jaja Wachukwa, a future ambassador to the United Nations; to future Nobel laureate Wole Soyinka; Achebe’s future wife (and mother of their four children) Christine Okoli; and the poet Christopher Okigbo, a close friend of Achebe’s who was killed during the Biafra war.
After graduating from the University College of Ibadan, in 1953, Achebe was a radio producer at the Nigerian Broadcasting Corp., then moved to London and worked at the British Broadcasting Corp. He was writing stories in college and called Things Fall Apart an act of “atonement” for what he says was the abandonment of traditional culture. The book’s title was taken from poet William Butler Yeats’ The Second Coming, which includes the widely quoted line, “Things fall apart; the centre cannot hold.”
The opening sentence was as simple, declarative and revolutionary as a line out of Hemingway: “Okonkwo was well known throughout the nine villages and even beyond.” Africans, Mr. Achebe had announced, had their own history, their own celebrities and reputations. In mockery of all the Western books about Africa, Achebe ended with a colonial official observing Okonkwo’s fate and imagining the book he will write- “The Pacification of the Primitive Tribes of the Lower Niger.” Mr. Achebe’s novel was the opening of a long argument on his country’s behalf.
“Literature is always badly served when an author’s artistic insight yields to stereotype and malice,” Mr. Achebe said during a 1998 lecture at Harvard University that cited Joyce Cary’s “Mister Johnson” as a special offender. “And it becomes doubly offensive when such a work is arrogantly proffered to you as your story. Some people may wonder if, perhaps, we were not too touchy, if we were not oversensitive. We really were not.”
Mr. Achebe could be just as critical of his own country. The novels A Man of the People and No Longer at Ease were stories of corruption and collapse that anticipated the Nigerian civil war of 1967-70 and the years of mismanagement that followed. He not only supported Biafra’s independence, but was a government envoy and a member of a committee that was to write up the new and short-lived country’s constitution. He would flee from Nigeria and return many times and in 2004 refused the country’s second-highest award, the Commander of the Order of the Federal Republic, in protest over conditions under President Olusegun Obasanjo.
“For some time now, I have watched events in Nigeria with alarm and dismay,” he said in an open letter to the President, referring to allegations of corruption and lawlessness in Mr. Achebe’s southeastern home state of Anambra.
“A small clique of renegades, openly boasting its connections in high places, seems determined to turn my homeland into a bankrupt and lawless fiefdom. ... I had a strong belief that we would outgrow our shortcomings under leaders committed to uniting our diverse peoples.”
Besides his own writing, Achebe served for years as editor of Heinemann’s “African Writer Series”, which published works by Nadine Gordimer, Stephen Biko and others. He also edited numerous anthologies of African stories, poems and essays. In There Was a Country, he considered the role of the modern African writer.
“What I can say is that it was clear to many of us that an indigenous African literary renaissance was overdue,” he wrote. “A major objective was to challenge stereotypes, myths, and the image of ourselves and our continent, and to recast them through stories prose, poetry, essays, and books for our children. That was my overall goal.”

Sunday, March 24, 2013

AVITI KATHALU,..HCU @ e Magazine



A book titled AVITI KATHALU, comprising of stories about the lives, struggles and accomplishments of the physically challenged persons was released at the University of Hyderabad. The book was released by Prof. Ramakrishna Ramaswamy on occasion of the Birthday celebrations of Louise Braille.
aviti-kathalu
The book has been edited by Sri Vemula Yellaiah, a famous Dalit writer and Sri Shankar Sapangi who is pursuing Ph.D. at the English and Foreign Languages University (EFLU).
The book contains 25 stories of persons who have faced problems in their personal front as well as in the society and how they have been able to overcome the same by participating in the various developmental activities and contributing to literature. The authors expressed gratitude to Prof. T Ramakrishna, Dr. Darla Venkateshwara Rao and Dr. Pammi Pavan Kumar of the Department of Telugu, University of Hyderabad for their support and encouragement in bringing out this book. 
Sri Rajender Sankavarapu and Sri Nagaraju Asileti, students of UoH pursuing their M.Phil and Ph.D. are among the 25 authors who have contributed to the book.

HCU Herald online News letter Dated : link : http://uohherald.commuoh.in/page/8/

లంబాడీ సంస్కృతి-విశిష్టత ---పొఫెసర్ సీతారాం నాయక్,కాకతీయ యూనివర్సి



రాష్ట్రంలోని గిరిజన తెగల్లో ముఖ్యమైన లంబాడీలపై దుష్ప్రచారం జరుగుతున్నది. కొన్ని పత్రికలు అభూత కల్పనలతో విష ప్రచారం చేస్తున్నాయి. లంబాడీ తెగ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. సమాజానికి చేరువ కావాలని ఆశిస్తున్న గిరిజనులను ఈ ఆధునిక యుగం అందనంత దూరానికి నెట్టివేస్తున్నది. రాష్ట్రంలో గిరిజన తెగల్లో అధికశాతంగా ఉన్న వీరికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయం, కుల ఆచారాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి, పండుగలు(తీజ్,హోలీ) భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కానీ వీరి ఆచారానికి ఉండే పవివూతతను మరిచిపోయి, వారి సంస్కృతిలో భాగమైన వేషధారణ, నృతాలు, పాటలను విభిన్న రీతులలో చిత్రీకరిస్తున్నారు. లంబాడీల సంస్కృతినీ కించపరుస్తూ, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా రకరకాలుగా పాటలు, నృత్యాలు చేస్తున్నారు. 

‘గుడుంబ కుండ పెట్టకే లంబడోలక్క..., పోలీసులొచ్చి వీపు పలుగకొడతరే అంబడోల్ల అక్క’, ‘లస్కు పాపా... లస్కు పాపా...లంబాడీ’ అంటూ అనేక రకాలుగా పచ్చి వ్యాపార సంస్కృతితో, అశ్లీలంగా పాటలు రాస్తూ, పాడుతున్నారు. ఇలాంటి వాటికి వ్యతి రేకంగా లంబాడీలు పోరాడి, తమ సంస్కృతి ఔన్నత్యాన్ని నిలుపుకోవాలి. లంబాడీల పెళ్లి సంప్రదాయం కింది విధంగా ఉంటుంది.
లంబాడీల ఆచారం ప్రకారంగా పెళ్ళి సంబంధం కుదిరిన వెంటనే(గోళ్ ఖాయే రో) సగాయి (వివాహ నిశ్చయం) అనుకున్న ప్రకారంగా అమ్మాయి లేకా అబ్బాయి ఇంటి వద్ద సాయంత్రం జరుగుతుంది. ఈ కార్యవూకమంలో ఒక రూపాయి నాణాన్ని పంచులకు (పెద్దమనుషులు) చూపించి ఇరు ప్రాంతాల కులపెద్ద నాయక్‌కు ఇస్తారు. దీనిని సాక్యా అంటారు. అంటే సూర్యుని సాక్షిగా సగాయి కుదిరిందని, ఈ రూపాయి సాక్ష్యంగా నిలుస్తుందని అంటారు.

అనంతరం బెల్లం, కుడకలతో నోటిని తీపి చేసుకోవడంతో సగాయి కార్యవూకమం ముగుస్తుంది. పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు ఇంటి వద్ద భండారో, భవానీ పూజ, సాడి కార్యవూకమాలు చేసుకుని పెళ్ళికూతురు ఇంటికి పెళ్ళికొడుకు వెళతాడు. వీరికి తోడుగా లార్యా (తోడు పెళ్ళికొడుకు) సహాయకుడిగా వెళ్తాడు. పెళ్ళికొడుకును వ్యాత్డు అని పిలుస్తారు. పెళ్ళికొడుకు నెత్తికి పాక్డి(వూపత్యేకించి తయారు చేసిన ఎర్ర రుమాలు), రాత్రో పంచేడ(ఎర్ర దుప్పటి), బర్చీ(బల్లెం) ధరించి సైనికుడిగా కనిపిస్తాడు. 

పెళ్ళికూతు రు తల్లిదంవూడుల స్థోమతనుబట్టి పెళ్లి కొడుకు ఒక నెల మొదలుకుని మూడు నెలలు అంతకంటే ఎక్కువ కాలం పెళ్ళికూతురు ఇంటివద్దనే ఉండి ఘోఠా, వాయ, గోట్ అనే(లగ్నం, నాగ వలె)మూడు పవివూతమైన కార్యవూకమాలు వేరు వేరు రోజులలో నిర్వహిస్తా రు. పెళ్ళి తంతు ఇంతకాలం జరగడానికి కారణం కష్టజీవులైన ఈ సంచార యువకులకు విశ్రాంతి, కుల ఆచారాలతో పాటు సత్‌వూపవర్తన, గౌరవ మర్యాదలు ఇవ్వడంతో పాటు నేర్చుకోవ డం జరుగుతుంది.అతనికి అమ్మాయిని పోషించే శక్తి సామర్థ్యం తెలుస్తుంది. గోట్ అనంతరం పెళ్ళి కుమార్తె ధరించే వస్త్రాలు, ఆభరణాలను పేట్‌వా, టుక్రి, కాంచ్లి, మెడ కు హాస్లో, పేటి, చేతికి భాజోబంద్, ముక్కుకు భూరియా, కాళ్ళకు వాంక్డి, కస్ ధరించి కులదేవతలను పోలినట్టుగా ఉంటారు. అత్తవారింటికి పంపించే రోజు ఎద్దుపైన నిలబెట్టి ఇంటివైపు చూస్తూ పుట్టింటి వారికి, ఆ తండాకు శుభం కలగాలని(వడావ్ ) గేయాలతో కులదేవతలను మొక్కుకుంటా రు. 

పెళ్ళి జరిగే రోజుల్లో లంబాడీ కళాకారులు, కవులు ఢప్డియా(డప్పువాయించేవారు) భాట్/ఢాఢి(రబాబ్ అనే సంగీత వాయిద్యాన్ని) ఉపయోగించి చరిత్ర చెప్తారు. దీనికి ముందు గౌరవ సూచకంగా నాయక్ ఇంటిముందు ఢప్డియా, సలా మి డప్డా వాయిస్తారు. ఈ కార్యక్రమాన్ని భాట్ భక్తి గేయంతో ప్రారంభిస్తారు. వీరి తో పాటు తండాలోని స్త్రీ, పురుషులు ప్రతిరోజు నృత్యం(నాచ్), కోలాటం(ధండామారో) కార్యవూకమాలను దేవతల పాటలతో (రామణ్, లక్షణ్ చాలేరే గడేన్) అని మగవారు, (పోరియా గడేతీ అయియే మేరా మా హాతే మోతిరో ఫుల్ )అని ఆడవారు దేవతలను కొనియాడుతూ సాంస్కృతిక కార్యవూకమాలు నిర్వహిస్తారు. 

లంబాడీలు ఇప్పటికే అన్ని రంగాల్లో వెనకబడిపోయారు. కన్న పిల్లలను అమ్ముకుంటున్న కడు దయనీయ పరిస్థితులున్నాయి. గిరిజనులు జీవనోపాధి లేక చేసే పనులనే వారికి అంట గట్టి నీచంగా చూడటం దుర్మార్గం. అమానవీయం. మరోవైపు తండాల్లో విచ్చల విడిగా దొరుకు తున్న సారాయి, గంజాయి లాంటి మత్తు పదార్థాల కారణం గా గిరిజన జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. ఒక సర్వే ప్రకా రం ఒక్క వరంగల్ జిల్లాలోనే దాదాపు పన్నెండువేల మంది మహిళలు వితంతువులుగా మారారు. కొంతమంది లంబాడీలు అద్దె తల్లులుగా మారుతున్నారు.ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలామంది గృహనిర్మాణ కూలీలుగా బతుకులు వెళ్లదీస్తున్నారు. మరికొందరు మత మార్పిడికి కూడా గురవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘మా తండాల్లో మా రాజ్యం’అని లం బాడీలు ఎంతో కాలంగా ఉద్యమిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలని డి మాండ్ చేస్తున్నారు.

నాబార్డు కూడా దాదాపు 2500 తండాలను గ్రామ పంచాయతీలుగా చేయవచ్చని నివేదిక ఇచ్చింది. అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో తండాలను గ్రామపం చాయతీలుగా చేస్తామని ఓట్లు దండుకుంటున్నాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడంలేదు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించాలి. ఈ క్రమంలో లంబాడీల సంస్కృతి ఔన్నత్యాన్ని పరి రక్షించుకుంటూనే.. హక్కుల రక్షణకోసం ఉద్యమించాల్సి ఉన్నది. లంబాడీల వివాహాలు, నృత్యాలు, వేషధారణ, సం స్కృతి సంప్రదాయాలను ఎవరు అభాసుపాలు చేసినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. లంబాడీల కళా, సంస్కృతులను కించపరుస్తూ వస్తున్న ఆడియో, వీడియోలను నిషేధించాలి. వాటిని రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసు కోవాలి. సామాజిక అభివృద్ధి ఫలాలన్నింటినీ లంబాడీలకు అందే విధంగా ప్రభుత్వాలు చూడాలి. 

పొఫెసర్ సీతారాం నాయక్,కాకతీయ యూనివర్సి

Namasete Telangana Telugu News Paper Dated : 24/3/2013

Saturday, March 23, 2013

Death of a Student: Personal Tragedy or National Shame? By: Asma Rasheed, K. Satyanarayana & Uma Bhruguband


Asma Rasheed, K. Satyanarayana and Uma Bhrugubanda
m 1
The suicide of Mudasir Kamran, a Kashmiri research scholar at the EFL University, Hyderabad has been described as "a personal issue" both by the university administration as well as other sections of society. Far from being so, we argue, his death is a symptom of a failure to acknowledge and respond to major shifts in higher education today. In fact, the act of naming it "personal" absolves the University as well as all of us of any responsibility for this tragic turn of events and precludes a critical reflection on the education system in India. Since 2009, sixteen new central universities have been added to the existing twenty-four. These have increased the number of students from dalit, adivasi and minority communities who are struggling to enter and persevere in the face of unwelcoming, stultified academic and administrative structures.
On the one hand, the Government has recognized the importance of supporting and nurturing groups that were hitherto excluded from educational opportunities through scholarship schemes like the Rajiv Gandhi National Fellowship for SC/ST students and the Maulana Azad National Fellowship for Minorities. On the other hand, this is not matched by a corresponding over-hauling of existing institutional cultures. Our universities have remain mired in older regimes of elitist, casteist and sexist thought and practice that refuse to engage with and adapt to new student needs, let alone challenges to established knowledge structures. This fact is underscored by the recent reports of a disturbingly large number of suicides by dalit students in premier institutions.
In EFLU itself, Mudasir's death is the fourth one in the last five years. The "facts" of this case have been widely reported and continue to be debated. Without repeating these, we wish to make three points—one, if Mudasir was recognized as "mentally disordered" or depressed for over two months, why was there no professional counseling offered? Though individual efforts by his supervisor and a senior faculty member were made, the situation demanded trained counselors and a support network from within the campus community. Two, if there was some form of "harassment," why was it not referred to a sexual harassment committee which would have brought in different perspectives and possible resolutions? The narrow framework of violence or deviant behavior which the Proctor and others seem to have worked with (and indeed continue to work with) reveals a chronic institutional insensitivity to "difference" in sexual orientation or even cultural expressions. Indeed, a more open atmosphere on campus where issues of friendships, relationships, sexuality, romance, rejection and harassment are discussed would surely facilitate a broader culture of tolerance and emotional support.
Three, the act of taking a Kashmiri Muslim student to a police station late at night cannot be dismissed merely as an "error of judgment." A law-and-order approach is willfully blind to the political nuances and the dynamics of some identities, such as dalits or minorities. It is reported that on coming out of the police station, Mudasir broke down inconsolably saying that this was the first time anyone from his family had ever stepped inside a police station. Given today's fraught political situation in the aftermath of the execution of Afzal Guru and the Hyderabad bomb blasts, the ramifications of involving the police and making this dispute public were very grave!
What are the consequences of simply setting up new universities or converting institutes into universities? EFL University is a case in point. It was originally set up as a language institute in 1958. Subsequently, it grew into a deemed university with teacher training and research as its primary focus. In 2007, it became a Central University when the B. A. and several other new academic programmes were introduced. In a single stroke, student population tripled and is now younger as well as more socio-economically diverse. To complicate matters, programmes specifically introduced for foreign students have also altered the dynamics of campus life. There is a serious lack of basic facilities such as water, adequate number of rooms and bathrooms as also proper food in the hostels. In addition, the lack of space for social interaction and facilities for sports or cultural activities compounds the stress and overwhelming sense of suffocation. To make matters worse, there have been no Student Council elections since 2009 and there are no elected student representatives. All of this is worsened by a stubborn refusal to reexamine hierarchies that work with easy binaries like merit/reservation, discipline/violence, intelligent/dull, hardworking/lazy.
A thorough investigation is urgently required. Firstly, to look into the incident of Mudasir Kamran and examine questions of institutional and social responsibility. Secondly, to prescribe measures to make our universities socially and culturally inclusive. More importantly, it will be our willingness to learn from such an investigation that will go a long way in making new as well as existing Central Universities truly national, democratic and egalitarian spaces. Else, we will continue to be on the brink of yet-another-tragedy not only at EFL University, but in institutions all over the country.
Please also read related articles published recently:
The Killing Fields of Academia: by N. Sukumar & Shailaja
Statement in support of the struggle for justice for Mudasir Kamran: by Struggle Committee for Justice for Mudasir
~~~

Asma RasheedK. Satyanarayana and Uma Bhrugubanda are faculty members at the English and Foreign Languages University, Hyderabad.

Source : Round Table India website : http://roundtableindia.co.in/index.php?option=com_content&view=article&id=6348:death-of-a-student-personal-tragedy-or-national-shame-&catid=119:feature&Itemid=132