Friday, November 29, 2013

ఫూలే స్ఫూర్తి, వర్తమాన పోరాటాలు -By అమర్ (జనశక్తి)


Published at: 28-11-2013 00:17 AM
 
1 
 
1 
 
0 
 
 

19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో ముందుకు వచ్చిన సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో రైతాంగం పునాదిగా సాగిన ఫూలే ఉద్యమం మహత్తరమైనది. శూద్ర-అతిశూద్ర ప్రజలకు బహుజన ఐక్యతా స్ఫూర్తినిచ్చిన ఫూలే కృషి ఆయన్ని ప్రజల్లో మహాత్మునిగా నిలిపింది. వర్గ-కుల సమాజ నిర్మూలన, సామాజిక న్యాయసాధన అనే తక్షణ ఉద్యమాన్ని, జమిలిపోరాటాన్ని దృఢంగా కొనసాగించడానికి ఫూలే స్ఫూర్తితో మరొకసారి ప్రతిన బూనుదాం.
'దేశం అనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల వంటివారు' అని ఎలుగెత్తి చాటిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే. పూణేలోని జంబూర్దాలో 1827లో ఆయన జన్మించారు. 13వ ఏటనే సావిత్రిబాయితో ఆయనకు వివాహం జరిగింది. 1841-47 మధ్య ఉన్నత విద్యనభ్యసించిన ఫూలే తన శ్రీమతికి ముందుగా విద్య నేర్పినారు. ఆ వెన్వెంటనే 1848లో తరతరాలుగా చదువులు నిరాకరించబడ్డ శూద్ర, అతిశూద్ర మహిళలకు సావిత్రిబాయి ద్వారా పాఠశాలలు స్థాపించారు. శ్రమ జీవుల కోసం 1855లోనే రాత్రి బడులు స్థాపించి నిరక్షరాస్యతను పారద్రోలే దార్శనికుడయినారు. అంటరాని వాళ్ళకు తన ఇంట్లోనే నీళ్ళతొట్టి నిర్మించి ఔదార్యం చూపాడు. వెలివేయబడ్డ బ్రాహ్మణ స్త్రీలకు, పిల్లలకు ఆశ్రయమిచ్చాడు. అక్రమ సంతానంగా ముద్రవేయబడ్డ బాబును దత్తత తీసుకున్నాడు. అందుకే, పురోహితుల దోపిడీని వ్యతిరేకించినా అనేక మంది బ్రాహ్మణులు ఫూలేకు సానుభూతిపరులుగా ఉన్నారు. 1873 సెప్టెంబర్ 24న 'సత్యశోధక్ సమాజ్' స్థాపించి మహాత్మునిగా ఘనతకెక్కిన ఫూలే 1890 నవంబర్ 28న పరమపదించారు. ఈసామాజిక విప్లవకారుడిని స్మరించుకుందాం.
ప్రతికులానికి జనాభా ప్రాతిపదిక మీద ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఫూలే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సూచించారు. సామాజిక అసమానతలకు, విద్యా -ఉద్యోగావకాశాలు లోపించిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడే పోరాడి ముందు చూపు ప్రదర్శించారు. పురోహిత వర్గం దోపిడీకి, రైతుల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి సరళమైన భాషలో రచనలు చేశారు. నాటకాలు రాసి ప్రదర్శింపజేశారు. బాట్‌జీ (బ్రాహ్మణులు), సేట్ జీ (వ్యాపారస్తులు) వ్యవస్థల దోపిడీని నిష్కర్షగా చీల్చిచెండాడారు. తాను బ్రాహ్మణుడు కానందుకు ఒక పెళ్లి ఊరేగింపు నుంచి బలవంతంగా నెట్టివేయబడ్డ సంఘటన ఫూలేను బాధించింది. కులదోపిడీ వ్యవస్థపై పోరాటానికి అది ఆయనపై బలమైన ప్రభావం నెరపింది. పీష్వాల నిరంకుశ పాలన, పురోహిత వర్గాల దోపిడీపై జరిపిన నిరంతర పోరాటం ఆయనను డాక్టర్ అంబేద్కర్‌కు సైతం గురుతుల్యుడిని చేసింది. సామాజిక విప్లవకారునిగా మలిచింది. 'ఏ రోజునైతే మనిషి బానిసగా మారతాడో, ఆ రోజునే అతని సద్గుణాల్లో సగభాగం నశిస్తాయన్న' గ్రీకు మహాకవి హోమరు మాటల స్ఫూర్తితో శూద్ర, అతిశూద్ర, జాతుల విముక్తి కోసం ఫూలే జీవితాంతం దృఢంగా పోరాడారు. అయితే 'శూద్రులు' (అల్పులు), 'మహరి' (గొప్ప శత్రువు), 'అంత్యజ', 'చండాల' లాంటి అవమానకరమైన పేర్లతో ఈ దేశపు కష్టజీవులకు ఆర్యులు తగిలించిన పేర్లను ఆయన తీవ్రంగా ఖండించారు. 'భూసురులు'గా 'ఆర్యులు'గా తమకు తాము స్తుతించుకున్న బ్రాహ్మణీయుల దోపిడీని అడుగడుగునా చెండాడు. దేవ దానవుల యుద్ధాల గురించి అనేకమైన కట్టుకథలతో బ్రాహ్మణ్యాలు, పురాణాలు నిండి ఉన్నాయని ఫూలే విమర్శించారు. బ్రాహ్మణులు అనగా భూసురులు తమతో యుద్ధాలు చేసి ఆదిమ వాసుల్ని మూల వాసుల్ని రాక్షసులని పిలిచారు. వారు తమ భూమిని రక్షించుకునే వాళ్లు. కాబట్టి రాక్షసులనడం సరైందేనని, రాక్షసుల ఆకారాన్ని కట్టుకథలను పుక్కిటి పురాణాలను ఆయన బట్టబయలు చేశారు. రాక్షసులు ఒడ్డు పొడుగుల్లో ఆర్యుల్ని మించిన దృఢ కాయులని ఫూలే అభివర్ణించారు. యూరోపియనులు అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకుంటూ స్థానిక రెడ్ ఇండియన్లపై జరిపిన దాష్టీకల్లాంటివే ఆర్యుల దండయాత్రలని ఫూలే భావన. నీరో, అవారిక్, మెకయవిల్లీ లాంటి వారు కూడా క్రూర పరశురాముని ముందు దిగదుడుపేనని ఆయన పేర్కొన్నారు. శూద్రులు, చండాలుర పట్ల అమానుషమైన శిక్షలు ప్రతిపాదించిన కుల వ్యవస్థను డ్రూయిడ్ల కాలంలో సైతం చూడలేమని ఫూలే వెల్లడించారు.
'దళితులను ఐక్యం చేయండి -దళితులతో ఐక్యంకండి' అనే జనశక్తి సూత్రీకరణ మూలాలు దాదాపు రెండు శతాబ్దాల క్రితమే మహాత్మా పూలేలో కనబడతాయి. శూద్రులు-అతిశూద్రులు, రక్త సంబంధీకులని తన 'గులాంగిరి' పుస్తకంలో చాటారాయన. ఆయన ఇలా అన్నారు: 'శూద్రజాతిలో కొంతమంది తాము మాలీలమని, కుంబీలమని, కంసాలులమని, దర్జీలమని, మహర్లు-మాంగులమని', వడ్రంగులమని తమ తమ ఉత్పత్తుల ప్రాతిపదికగా గొప్పగా చెప్పుకుంటారు. మన పూర్వీకులున్నూ, మహర్లు -మాంగులు (మాల మాదిగలు)అని పిలవబడే అంటరానివాళ్ల పూర్వీకులున్నూ, స్వయాన తోడబుట్టిన వాళ్లనీ, రక్త బంధువులనీ, మన మన వంశపరంపరల మూలాన్ని జాడతీస్తే మనది ఒకటే మూల కుటుంబమని పాపం వాల్లకు తెలియదు. పైకి దండెత్తి వచ్చిన బ్రాహ్మణులతో, మాతృభూమి రక్షణ కోసం వాళ్ల పూర్వీకులు వీరోచితంగా పోరాడారు. తంత్రగొట్టు బ్రాహ్మల చేతిలో వాళ్లు ఓడిపోవడం వల్ల వాళ్లని దౌర్భాగ్యులుగా, నిరుపేదలుగా చేశారు. ఈ సంగతి తెలుసుకోలేక, శూద్రులు తమ సొంత చుట్ట పక్కాల్నే (అతి శూద్రుల్ని)ద్వేషించడం మొదలు పెట్టారు. దీనికి ఎంత జాలిపడాలో గదా!'
కుల వ్యవస్థ అనేది శ్రమ జీవుల విభజన, హెచ్చు తగ్గుల నిచ్చెన మెట్ల వ్యవస్థ 1873లోనే ఫూలే విశ్లేషించారు. ఆ శాస్త్రీయ విశ్లేషణను డాక్టర్ అంబేద్కర్ మరింత స్పష్టంగా విశదీకరించారు. 'ఈ మొత్తం యంత్రాంగంలో ఒక క్రమ పద్ధతిలో శ్రమ విభజన కనిపిస్తుంది. అయితే కార్ఖానాల్లో ఉన్నట్టి శ్రమ విభజన ఇక్కడ అసాధ్యం. ఎందుకంటే కమ్మరి, వడ్రంగి వారికి మార్కెట్ మారేది కాదు' అంటూ మార్క్స్ సైతం ఉత్పత్తి సామర్థ్యమూ, ఉత్పత్తి శక్తుల ఎదుగుదలా కుంటుపడిపోయాయని తన పరిమిత పరిశీలనలోనూ గమనించారు. మన సమకాలికులైన మార్క్స్, ఫూలేల మధ్య కుల వ్యవస్థ లక్షణాల పట్ల ఏక భావన ఉండటం గమనార్హం.
బ్రాహ్మణీయ కుల వ్యవస్థ నుంచి శూద్రులు, అంటరాని కులాలను విముక్తం చేయడానికి 1873 సెప్టెంబర్ 24న ఫూలే ప్రారంభించిన సత్యశోధక ఉద్యమం ఇంకా పరిపూర్తి కాలేదు. అది ప్రవచించిన మానవీయ సుఖశాంతులు, ఐక్యత, సమానత సాధించే లక్ష్యాల కోసం పోరాడవల్సే వుంది. సాహు మహరాజ్, క్రాంతి సిన్హా, నామా పాటిల్ తదితరులు సత్యశోధక్ సమాజాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఎ.హెచ్. సాలుంకే ఒకొనొక ముఖ్య సహచరుడిగా సత్యశోధక్ లక్ష్యాల సాధనకు కృషి జరుగుతోంది.
దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘమైన బొంబాయి మిల్లు కార్మికుల సంఘం స్థాపించేలా ఆనాడే మహాత్మా ఫూలే, నారాయణ లోఖండేకి మార్గదర్శనం చేశారు. ఈ విధంగా ఫూలే తన కాలంలో ఒక సామాజిక విప్లవకారుడిగా ముందుకు వచ్చారు. అయితే ఆ కాలంలోనే కార్మికులను, రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు ఫూలే ప్రయత్నించినా, ఆయన బ్రాహ్మణీయ వ్యతిరేక ఉద్యమంలో స్పష్టమైన వర్గ దృక్పథం, సామ్రాజ్యవాద వ్యతిరేక సమగ్ర దృక్పథం లోపించాయి. ఫలితంగా ఫూలే మరణాంతరం సత్యశోధక్ సమాజ్ రెండుగా చీలిపోయింది. ఆనందస్వామి నాయకత్వంలో ఒక వర్గం 1919-22 సంవత్సరాలలో సతారాలోనూ, 1930వ దశకంలో బుల్దానాలోనూ రైతాంగ తిరుగుబాట్లను నడిపించింది. అంతిమంగా ఈ వర్గం భారత కమ్యూనిస్టు పార్టీలో చేరింది. కొల్హాపూర్ మహారాజా నాయకత్వంలోని మరొక వర్గం అంతిమంగా మరాఠాలలో కొందరిని క్షత్రియులుగా గుర్తింపజేసే ఉద్యమంగా మారిపోయింది. ఇది సత్యశోధక్ భావాలకు పూర్తిగా విరుద్ధమైనది.

అయినప్పటికీ బ్రిటిష్ వలసపాలనాకాలపు 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో ముందుకు వచ్చిన సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో రైతాంగం పునాదిగా సాగిన ఫూలే ఉద్యమం మహత్తరమైనది. శూద్ర-అతిశూద్ర ప్రజలకు బహుజన ఐక్యతా స్ఫూర్తినిచ్చిన ఫూలే కృషి ఆయన్ని ప్రజల్లో మహాత్మునిగా నిలిపింది. చార్వాకుల నుంచి మొదలైన సామాజిక తిరుగుబాటు నుంచి ఆధునిక కాలంలో అర్ధ వలస -అర్ధ భూస్వామ్య వర్గ- కుల సమాజ దోపిడీ నిర్మూలనా పోరాటం దాకా సామాజిక విప్లవకారుడిగా మహాత్మా ఫూలే స్ఫూర్తిని విప్లవోద్యమం స్వీకరించవలసే వుంది. వర్గ-కుల సమాజ నిర్మూలన, సామాజిక న్యాయసాధన అనే తక్షణ ఉద్యమాన్ని, జమిలిపోరాటాన్ని దృఢంగా కొనసాగించడానికి మరొకసారి ప్రతిన బూనుదాం.
- అమర్ (జనశక్తి)
(నేడు మహాత్మా ఫూలే 123వ వర్ధంతి)
Andhra Jyothi Telugu News Paper Dated : 28/11/2013 

పోరాటాలతోనే విముక్తి By -జగన్ సీపీఐ (మావోయిస్టు) ఎన్.టి.ఎస్.జెడ్.సి

ప్రియమైన తెలంగాణ ప్రజాలా రా! ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యం గా, పీఎల్‌జీఏ 13వ వార్షికోత్సవాన్ని తెలంగాణ వ్యాప్తంగా విజయవంతం చేద్దాం! అంతర్జాతీయ ఎర్రసైన్యంలో ఒక డిటాచ్‌మెంట్‌గా, ప్రపంచ సోషలి స్టు విప్లవంలో భాగంగా భారత నూత న ప్రజాస్వామిక విప్లవ విజయం కోసం, భారత విప్లవ మహోపాధ్యా యులు చారుమజుందార్, కాన్హాయ్ చటర్జీల పథ నిర్దేశంలో మన పీఎల్ జీఏ ఆవిర్భవించింది. 2013 డిసెం బర్ 2 నాటికి అది 13ఏళ్లు పూర్తిచేసుకోబోతున్నది. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణవ్యాప్తంగా పీఎల్ జీఏ13వ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు జరుపుకోవాలని ఎన్‌టీ ఎస్‌జెడ్‌సీ పిలుపు నిస్తున్నది. విప్లవోద్యమాన్ని నిర్మూలించే లక్ష్యంతో పాలకవర్గాలు ప్రజలపై సాగిస్తున్న గ్రీన్‌హంట్‌ను ఓడించడానికి, ప్రజస్వామిక తెలం గాణను సాధించే లక్ష్యంతో యువతి, యువకులు పీఎల్‌జీఏలో పెద్ద యెత్తున భర్త్తీ అవుతూ.. గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తున్నది. 2012 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ ప్రజాయుద్ధంలో 10మంది విప్లవ కారు లు అమరులయ్యారు. దేశవ్యాప్తంగా 150 మందికి పైగా నేలతల్లి ఉత్తమ పుత్రికలు, పుత్రులు, సాధారణ ప్రజలు తమ నులివెచ్చని నెత్తురుధారబోసి అమూ ల్యమైన తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పిం చారు. కామ్రేడ్స్ సుధాకర్,పుష్ప,సబిత,గౌతం, ఊర్మి ల, రాజు, వసంత, బీమా.. ఇంకా ప్రజాసంఘాల నాయకుడు గంటి ప్రసాదం, వెంకట సుబ్బయ్య, విప్లవరచయిత ఆలూరి భుజంగరావు తదితరులు రాజ్యం చేస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్లలో, రాజ్య ప్రేరేపిత హంత కముఠాల చేతుల్లో అమరులైనారు. మరికొంత మంది అనారోగ్యంతో అమరులైనారు. వీళ్లంతా నూతన ప్రజస్వామిక విప్లవంకోసం, దోపిడీ పాలన అంతంకోసం, నవసమాజంకోసం తుదికం టా పోరాడి తమ రక్తాన్ని చిందించి ఎర్రజెండాకు మరింత వన్నె తెచ్చారు. వారి ఆశయాలను సమున్న తంగా ఎత్తిపడదాం. వారు వదిలివెళ్లిన కర్తవ్యాలను పూర్తి చేసేవరకు పోరాడుతామని శపథం చేద్దాం.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల వికృత మైన అభివృద్ధి పర్యవసానంగా అంతర్జాతీయంగా సుడులు తిరుగుతున్న ఆర్థిక మాంద్యం ప్రభావం మనదేశంపై కూడా తీవ్రంగానే పడింది. అవినీతి పెరిగిపోవడం,నిరుద్యోగం,అధిక ధరలు, దారిద్య్రం, విస్థాపిత సమస్యవల్ల,భూములు, అడవులు, నీరు కోల్పోవడం వల్ల కార్మిక, కర్షక, మధ్యతరగతి పీడిత ప్రజానీకం బతుకులు దుర్భరంగా మారాయి. వారికి విప్లవం తప్ప మరో మార్గం ఏదీ లేకుండా పోయిం ది. విప్లవానికి భౌతిక పరిస్థితులు పరిపక్వ మవుతు న్నాయి. అన్ని సెక్షన్ల ప్రజల సమ్మెలు, ఆందోళనలు పెరుగుతున్నాయి.ఆర్థిక పోరాటాలు రాజకీయ పోరా టాలుగా మారుతున్నాయి. దేశంలోని వనరులను దోచిపెట్టడానికి దేశంలో, మన రాష్ట్రంలో 1991 నుంచి నూతన ఆర్థిక విదానాల ద్వారా దోపిడీని తీవ్రతరం చేస్తున్నాయి. ఫలితంగా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నది. లక్షలాదిమంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు రాజ్యం ప్రజల మధ్య వైరుధ్యాలను పెంచి వారిపై బహుముఖ దాడిని కొనసాగిస్తున్నది. పీడిత ప్రజలైన రైతాంగం, దళితులపై, ఆదివాసీల పై, మైనార్టీలపై, మహిళలపై, కార్మికులపై అణచివేతే ప్రధానాయుధంగా నిర్బంధాలకు గురిచేస్తున్నది. ప్రజాస్వామ్యం ముసుగులో బూర్జువా, భూస్వామ్య వర్గాలు, దళారీ పాలకులు, సామ్రాజ్య వాదులతో మిలాఖతై ప్రంపచీకరణ విధానాలను అమలు చేస్తూ బహుళజాతి సంస్థలకు గనులు, టైగర్ ప్రాజెక్టులు, భారీ నీటి ప్రాజెక్టులు, కోస్టల్ కారిడార్ పేరిట, సెజ్ లు, ఓపెన్‌కాస్టుల పేరిట పీడితప్రజలను, ముఖ్యం గా ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారు. మరో వైపు ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహారభద్రత చట్టం, నూతన భూసంస్కరణ చట్టా న్ని రూపొందించింది. రాష్ట్రంలో కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం రచ్చబండ, బంగారు తల్లి, రాజీవ్ యువ కిరణాలు పథకాలను ప్రవేశపెట్టింది. ఇవన్నీ ప్రజల్లో భ్రమలు కల్పించేందుకే తప్ప మరోటి కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దాడికి గురైన తెలంగాణ ప్రజలు,ఆదివాసీలు, దళిత కులాలు, మైనార్టీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల పోరా టంతో కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్టాన్ని ప్రకటిం చా ల్సివచ్చింది. ఇది తెలంగాణ ప్రజల పోరాట విజ యం. 

1969-71 తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన తర్వాత-1996లో విప్లవోద్యమమే తెలంగాణ ఉద్య మానికి ఊపిరిపోసిన విషయం జగద్వితం. అప్పటి నుంచి దిశ, దశలను నిర్దేశిస్తూ ప్రజాస్వామిక తెలం గాణ రాష్ట్రసాధన నినాదాన్ని, స్పష్టమైన లక్ష్యాన్ని ముందుంచింది. ఇప్పటి భౌగోళిక తెలంగాణలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాబోవు. పాక్షికంగానే కొన్ని సమస్యలు తీరుతాయి. దళారీ బూర్జువా, భూస్వామ్యవర్గాలకే అధికారం, ప్రయో జనం దక్కుతుంది. ప్రతి ఒక్క అణగారిన ప్రజల మౌలిక సమస్య ప్రజాస్వామిక తెలంగాణను సాధిం చుకోవడం ద్వారానే పరిష్కారం అవుతుంది. దాని కోసం తెలంగాణ ప్రజలు ఐక్యతతో మిలిటెంట్‌గా పోరాడాల్సిందిగా పిలుపునిస్తున్నాం. తెలంగాణ ప్రజలు, ఆదివాసీలు, మైనార్టీ, దళితులు, కార్మిక, మహిళ, రైతాంగం, విద్యార్థి,యువజనుల సమస్య లు అంతిమంగా వర్గపోరాటంలో పాల్గొనడం ద్వా రానే పరిష్కారం అవుతాయి. ఆదివాసీలపై టెర్రరిస్టులనే ముద్రవేసి లేగదూ డలపై ఎగబడ్డ తోడేళ్ల గుంపులాగా, ఆదివాసీలను ఊచకోత కోయడాన్ని, వారి మాన, ప్రాణాలనూ, సర్వాన్నీ హరించి వేస్తున్న కిరాయి పోలీసుల పాశ విక దాడుల్ని అడ్డుకునేందుకు క్రియాశీలంగా ప్రజలంతా కదలాలి. మావోయిస్టులు హింసావాదు లుకారు.నిజం చెప్పాలంటే శాంతికాముకుల్లో వారు అగ్రశ్రేణిలో నిలుస్తారు. వారిపై విషం కక్కు తున్న బూర్జువా ప్రచార సాధనాల దుష్ప్రచారాన్ని నమ్మ కండి! విప్లవోద్యమం పక్షం వహించండి! ఈ శత్రువు దాడిని ప్రజా రాజ్యాధికార నిర్మాణా ల ను, ప్రజా సంఘాలను తుడిచిపెట్టే శత్రువు కుట్రలను ఓడించక పోతే విప్లవోద్యమం సాధించిన విలువైన ఫలాలన్నీ నాశనమవుతాయి. కాబట్టి శత్రువును ఒంటరి చేసి దెబ్బతీయటంలో మీవంతు పాత్రను నెరవేర్చండి! పెద్దయెత్తున్న పీఎల్‌జీఏలో చేరి ప్రజాసైన్యపు బలగాన్ని అనేక రెట్లు పెంచి దాన్ని బలోపేతం చేయండి! భూమి-అధికారంపజా స్వామ్యం- ప్రజా సైన్య నిర్మాణం- స్వావ లంబన నినాదాలతో నేడు దేశంలో అనేక ప్రాంతా లలో ఉవ్వెత్తున సాగుతున్న ప్రజా ఉద్యమాలతో మమే కం కండి! దోపిడీ వర్గాలను సమూలంగా నాశనం చేయకుండా మౌలిక మార్పు ఏదీ రాదు. ప్రత్యా మ్నాయ నూతన ప్రజా స్వామిక వ్యవస్థ కోసం ముందడుగేద్దాం! రండి! పోరాడ సాహసిస్తే అంతిమ విజయం ప్రజలదే! మావోయి స్టు విప్లవో ద్యమ నిర్మూలనకు భారత దోపి డీ వర్గాలు శిక్షణ పేరుతో సైన్యాన్ని మోహరిం చడాన్ని వ్యతిరేకిద్దాం! 

-జగన్
సీపీఐ (మావోయిస్టు) ఎన్.టి.ఎస్.జెడ్.సి అధికార ప్రతిని

మేధావులు ప్రమాదకరం! ( ‘మావోయిస్టు పార్టీ సైన్యం కంటే.., దాని సిద్ధాంతకర్తలు, మేధావులు ఎక్కువ ప్రమాదకరం’) By హరగోపాల్,


కేంద్ర హోంమంత్రిత్వశాఖ తన నివేదికలో ‘మావోయిస్టు పార్టీ సైన్యం కంటే.., దాని సిద్ధాంతకర్తలు, మేధావులు ఎక్కువ ప్రమాదకరం’ అనే ఒక గొప్ప సూత్రీకరణ చేసింది! ఈ సూత్రీకరణ మూలాలు మన రాష్ట్ర పోలీసుల ఆలోచనాధారలో ఉన్నాయి. ఒక కాలంలో దేశానికి చంద్రబాబు ఒక రోల్ మోడల్‌గా మీడియా ఒక భ్రమను సృష్టిం చింది. అలాంటి భ్రమనొకటి ఆంధ్రా పోలీసు యం త్రాంగం సృష్టించగలిగింది. అందుకే హోంశాఖ మావోయిస్టు ఉద్యమాన్ని అణచడానికి ఆంధ్ర అణచివేత నమూనాను పాటించాలని భావిస్తున్నది. నమూనా రూపంలో అమానుషమైతే సారంలో భార త రాజ్యాంగాన్ని, చట్టబద్ధపాలనను, ప్రజాస్వామ్య విలువలను విధ్వంసం చేసేది. సమస్యాత్మకంగా కనిపించిన ఏ వృత్తినైనా అతనికి మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నా లేకున్నా ఎవరినైనా చంపి వేయవచ్చు అనే లైసెన్స్‌ను పొందడం ఈ సూత్రీకరణలో భాగం. బాలగోపాల్ లాంటి హక్కుల నాయకుడిని కిడ్నాప్ చేశారు. వరంగల్‌లో 60మంది ఉపాధ్యాయులను రోజూ పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేయాల ని, చేయకపోతే పైలోకానికి పంపిస్తామని భయవూబాంతులు సృష్టించారు. పోలీసు అధికారులు నియంతలుగా ప్రవర్తించినా ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలేదు. తెలంగాణ నిజానికి ఒక నియంతృత్వ కోరల్లో బతికింది.

ఇది ఆంధ్ర నమూనా. ఉద్యోగాలు చేసుకుంటూ కొంచెం విలువలతో జీవించేవారు, గ్రామాల్లో ప్రజల పోరాటాలను ఆసక్తితో గమనిస్తున్నవారు, ఈ పోరాటాల్లో న్యాయమున్నదని విశ్వసించే వారందరూ పోలీసుల దృష్టిలో దోషులే. ఆ భయానక పద్ధతులు నక్సలైటు ఉద్యమం బలహీనపడడానికి తోడ్పడ్డాయని విశ్వసించి, ఈ ‘గొప్ప విజయా’న్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు బోధిస్తే,అది వాళ్ల వంటికి బాగానే పట్టింది. చంద్రబాబు పట్ల సృష్టించిన భ్రమ ఎంత నిజమో, ఇది కూడా అంతే నిజం.నక్సలైటు ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి నాలుగు దశాబ్దాలుగా పాలకులు ఈ ఉద్యమ స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దీన్ని ఒకసారి శాంతిభవూదతల సమస్య అని, మరోసారి సామాజిక ఆర్థిక సంక్షోభమని, మరొకసారి దీనికి ఈ రెండు పార్శాలున్నాయని, తమ ప్రయోజనాలను బట్టి సూత్రీకరణ చేస్తూ వస్తున్నారు.

ఎన్టీఆర్ నక్సలైట్లు దేశభక్తులన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో 2004లో ఇది సామాజిక, ఆర్థిక సమస్య అని పేర్కొన్నది. అదే ఎన్నికలలో ఈ ఉద్యమాన్ని అణచివేస్తానన్న చంద్రబాబుకు వ్యతిరేకంగా శాంతిచర్చలు జరుపుతామని రాజశేఖర్‌డ్డి గెలిచాడు. చంద్రబాబు చిత్తుగా ఓడిపోయాడు. అంతకుముందు ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం నక్సల్స్ సమస్య మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసింది. భారత ప్లానింగ్ కమిషన్ ఒక అధ్యయన బృందాన్ని బాలగోపాల్, శంకరన్ లాంటి వాళ్లతో నియమించింది. విశ్వవిద్యాలయాలలో దీని మీద పరిశోధనలు జరిగాయి. నెల క్రితం సోనియాగాంధీ నాయకత్వం వహిస్తున్న జాతీయ సలహా మండలి ఈ సమస్య మీద చర్చించడానికి ఒక పదిమందిని ఢిల్లీకి ఆహ్వానించి ఒకరోజు చర్చ జరిపారు. ఇంకా ఆ రిపోర్టు పూర్తి కాలేదు.

ఈ ప్రక్రియ అంతా ఒకవైపు జరుపుతూనే హోంమంవూతిత్వ శాఖ ఆంధ్ర పోలీసుల సలహానే సమస్యకు పరిష్కారంగా ఆలోచించడం హాస్యాస్పదంగా ఉన్నది.మేధావులు, సిద్ధాంతకర్తలు ఉద్యమాలను నిర్మించలేరు, నడపలేరు. ఉద్యమాలు ప్రజల అసంతృప్తి నుంచి అసమానతల నుంచి, అన్యాయాల నుంచి, అణచివేత నుంచి పుట్టి మహావృక్షాలుగా ఎదుగుతా యి. ఉద్యమాలకు సామాజిక అన్యాయం కారణమైనప్పుడు మేధావులు కారణాలను విశ్లేషిస్తారు. వాటి నే సమాజానికి చెబుతారు. చెప్పాలి కూడా. జాతీయ సలహామండలికి ఏం చెప్తారో బయట కూడా అదే చెబుతారు. జాతీయ సలహా మండలి మేధావులను పిలిచి నేరం చేసిందని హోంమంత్రిత్వ శాఖ అంటే మనం చేయగలిందేమీ లేదు. లోతుగా ఆలోచించవలసిన అంశమేమంటే మనది ప్రజాస్వామ్య దేశమే నా? ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటో ఎన్నోసార్లు రాయడం, మాట్లాడడం చేస్తూనే ఉ న్నాం.

చట్టబద్ధ రాజ్యాంగబద్ధ పాలన ఉదార ప్రజాస్వామ్యానికి ఉండే బలం. ఆ విలువల ఛట్రంలోనే పాలకులు ‘మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేద’ ని అంటుంటారు. ఎవరి హింసకు తావులేదో చెప్ప రు. ప్రజా ఉద్యమాలకు హింసచేసే అధికారం ఉండ దని చాలామంది అంటుంటారు. కానీ రాజ్యానికి ఎవరంటే వాళ్ల మీద హింస చేసే అధికారం ఉంటుం దా? ఈ ప్రశ్న అడగని సమాజం చాలా ప్రమాదపు అంచులకు చేరుకున్నట్లు. అంతకుమంచి ఆలోచనల మీద నియంవూతణ చేసే హక్కు ఉంటుందా? అనేది ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి ఉండే ప్రధాన తేడా. నియంతృత్వం మనిషి మేధ స్సు మీద నిఘా పెడుతుంది. అది ప్రమాదకరమని భావిస్తుంది. అం దుకే అది మేధో వికాసానికి ఎన్ని ప్రతిబంధకాలు కల్పించాలో అన్ని రకాల ప్రతిబంధకాలను కల్పిస్తుం ది. ఉదారప్రజాస్వామ్యం భావవూపకటనాస్వేచ్ఛ పునాదుల మీద నిర్మాణం జరిగినట్లు సిద్ధాంతకర్తలందరూ రాస్తూ వచ్చారు.

ఒక దేశం ప్రజాస్వామ్య దేశమని తనను తాను పిలుచుకొనడానికి మొదటి అర్హత భావప్రకటనా స్వేచ్ఛ. రెండుపజా ఉద్యమాలకు కల్పించే అవకాశాలు. శాంతియుత ఉద్యమాలను, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచినప్పుడు ప్రజలు వేరే మార్గం లేక ఆయుధాలు తీసుకోవచ్చు. ఆయుధాల తో ఉద్యమాలను అణచివేస్తే ఆయుధాలతో ప్రజలు పోరాడుతారు. ఆ పోరాటాలను విశ్లేషించే వారుంటారు, ఉండాలి కూడా. పాలకులకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికై నా చెప్పే వారుండాలి. అది చెప్పేవాడే ప్రమాదకర మని భావిస్తే ప్రజాస్వామ్యం అంతిమ దశలో ఉన్నట్లేపస్తుత ప్రధాని కొత్తలో ‘నక్సలైట్లు మన పిల్లలే అని, వాళ్లు దేశాన్ని విడగొట్టడం కోసం పోరాడడం లేదని, ప్రజల సమస్యల కోసం ఉద్యమిస్తున్నార’ని మంచి మాటలే అన్నాడు. ఈ దశాబ్ద కాలంలో ప్రధానిలో వచ్చిన మార్పు.అది వ్యక్తిగతం కాదు. ఈ మధ్య రాజకీయ సుస్థిరత దెబ్బతినడమే కాక బోలెడ న్ని స్కాంలు బయటకు వచ్చాయి.

వ్యవస్థ విశ్వసనీయతే ప్రమాదంలో ఉన్నది. ఆ ప్రమాద ఘంటికల కలవరమే హోంశాఖ సూత్రీకరణ. ఈ సూత్రీకరణ తెలంగాణ వరకు కొంత నిజం కావచ్చు. కాని మిగ తా మావోయిస్టు రాష్ట్రాల్లో సిద్ధాంతకర్తలు, మేధావు లు పెద్దగాలేరు. లేకున్నా ఉద్యమాలు నడుస్తున్నా యి. ఆఉద్యమాల నుంచి మేధావులు రావచ్చు. కాని మేధావుల వల్ల ఉద్యమాలు రావని ఆంధ్ర పోలీసులకు అర్థం కాలేదు. అసమక్షిగంగా అర్థం చేసుకున్న సూత్రీకరణను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం, దాన్ని కేంద్ర హోంశాఖ నమ్మడం, నమ్మశక్యంగా లేదు. హోంశాఖ ఈ జ్ఞానోదయంతో అణచివేత ప్రారంభిస్తే ఉద్యమాలు ఏమౌతాయో తెలియదు. కానీ నియంత ఎదగడానికి కావలసిన రహదారిని వేసినట్లే. అలాంటి నియంత ఎదిగితే ఈ సూత్రాన్ని వాళ్లు చాలామందికి అన్వయించవచ్చు. అప్పుడు వీళ్లు చేయగలిగిందేమీ ఉండదుపజాస్వామ్యం పునాదులు విలువల సూత్రీకరణ మీద ఉంటుంది. విలువలే ప్రమాదమనడం ఎంత ప్రమాదం!

Namasethe Telangana Telugu News Paper Dated: 28/11/2013 

నవ ‘భారత రత్న’ (మహాత్మా ఫూలే) By ఉ.సా


మహాత్మా ఫూలే ఆధునికారంభ కాలంనాటి భవిష్యత్తు కాల దార్శనికత కాల పరీక్షలో నెగ్గి ఆధునికానంతర కాలంలో సైతం మన దేశ బడుగు వర్గ బహుజనులకు క్రాంతి దర్శిగా, దేశీయ లౌకిక సామాజిక ప్రజాస్వామ్య శక్తులకు స్ఫూరిదాయకంగా నేటికీ మార్గనిర్దేశం చేస్తోంది. నవంబర్‌ 27న ఫూలే 123వ వర్ధంతి సందర్భంగా ఆ మహాత్ముని పాత్రను ఓసారి సంస్మరించుకుందాం. ఆనా డు మహాత్మా ఫూలేే తాను జీవించిన కాలం (1827-90) నాటి సమ కాలీన ఆధునిక ప్రపంచగమ నాన్ని గమనించి, ఆ కాలం తెచ్చిన జ్ఞానోదయ మహోదయాన్ని సమర్ధవంతంగా ఆకళింపు చేసుకొన్నాడు. ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామ్య హేతుబద్ధ ఆధునిక ప్రాపంచక దృక్పథంతో ఆనాటి మన దేశ కాల స్థితిగతులకు ఆధునికతను అన్వయించడంలో సృజనాత్మక, చరిత్రాత్మక పాత్ర నిర్వహించాడు. 

తాను ఆకళింపు చేసుకొన్న ఆధునిక ఆలోచనా లోచనాలతో నవభారత నిర్మాణానికి నాందిపలికాడు. అందుకే ఆ నవభారత పితామహుడు మహాత్మ ఫూలే మనదేశ వినీలాకాశంలో ఆధునిక వైతాళిక ధృవతారగా నేటికీ వెలుగొందు తున్నాడు. 1855లో ఫూలే రాసిన నవయుగ నవభారత రత్న లాంటి ‘తృతీయ రత్న’ నాటికే ఆ చరితార్ధుని ఆధునిక తాత్త్వికతకి చారిత్రక సాక్ష్యాధారంగా నిలుస్తుంది.ఇప్పటికి (2013) 158 ఏళ్లక్రితం 1855లో మహాత్మా ఫూలేే మరాఠీ మాతృభాషలో, వ్యవహారిక పరిభాషలోరాసిన ‘తృతీయ రత్న’ నాటిక నేటికీ ఇంగ్లీషు లింకు భాషలోకి, మిగతా దేశ భాషల్లోకి తర్జుమా కాకపోవడంతో ఈ మహోన్నత ఆధునిక తాత్త్విక రచన సందేశం అందాల్సిన వాళ్లకి, అందాల్సిన సమయంలో అందకుండా పోయింది. ఈ లోటు పూడ్చే విధంగా ఇప్పుడు ఈ గ్రంథాన్ని తెలుగులో తేవడం జరిగింది.ఫూలే రచనల్లో ‘గులాం గిరి’ ముఖ్యమైన రచనే అయినా, అంతకంటే గొప్ప రచనగా పేర్కొనదగిన ‘తృతీయ రత్న’ ఆ ప్రాముఖ్యతను సంతరించుకోలేకపోయింది. 

1855లో ఫూలే తొలిరచనగా ‘తృతీయ రత్న’ ప్రచురితమైన 18 ఏళ్ల తర్వాత, 1873లో ప్రచురితమైన ‘గులాంగిరి’ ఎంత ప్రామాణికమైనదైనా, అంతకంటే ముందే దానికి తాత్త్విక భూమికను సమకూర్చిన ‘తృతీయరత్న’ అంతకంటే తలమానికమైనది. బ్రాహ్మణీయ వైదికార్య వేదవేదాంగ వర్ణాశ్రమ చారిత్రక మూలాలను వెలికి తీసే హేతుబద్ధ చారిత్రక దృక్పథంతో తన సమకాలీన సామాజిక స్థితిగతులను వాస్తవికంగా అంచనా వేసిన ‘గులాంగిరి’ ఇతివృత్తం సిద్ధాంత అవగాహనకు సంబంధించినది. ఆధునిక ప్రాపంచిక దృక్పథాన్ని అలనాటి మనదేశ పరిస్థి తులకు సృజనాత్మకంగా అన్వయించి, అప్పటి దేశకాల స్థితిగతుల దశాదిశ నిర్దేశం చేసిన ‘తృతీయ రత్న’ ఇతివృత్తం ఆధునిక తాత్త్విక దృక్పథానికి సంబంధించి నది. ఏ సిద్ధాంత అవగాహనకైనా, మరే అవగాహనకైనా తాత్త్విక భూమికే తలమానికం. కనుక బ్రాహ్మణేతర సిద్ధాంత గ్రంథమైన ‘గులాం గిరి’ ప్రామాణికమైనదైతే, భారతదేశ ఆధునిక తాత్త్వికతకి అద్దంపట్టే ‘తృతీయ రత్న’ దానికి తలమానిక మైన దవుతుంది.

1855లో మహాత్మా ఫూలే రాసిన ‘తృతీయ రత్న’ లేదా తృతీయ నేత్ర అనే నాటిక ఆయన తొలి రచనగా పరిగణ పొందుతున్నా మూఢాచార గాఢాంధకార చీకట్లను పారద్రోలిన పొద్దు పొడుపు లాంటి ఆ జ్ఞాననేత్ర రచనకంటే ముందే- 1848లోనే తొలికోడి కూతలాంటి మేలుకొలుపుతో ఆయన తన బ్రాహ్మణేతర సామాజిక విప్లకార్యాచరణకు అంకు రార్పణ జరిపాడు. భారత దేశంలోనే, దేశ చరిత్రలోనే తొట్టతొలి సారి ఫూలే సావిత్రి భాయి ఫూలేే దంపతు లిద్దరూ శూద్రాతి శూద్ర బాలబాలికల కోసం ప్రప్రథమ ప్రాథమిక పాఠశాలలు తెరిచారు. ‘తృతీయ రత్న’ నాటికలోని ముఖ్యపాత్రలైన పాటిల్‌- జోగాభాయి భార్యాభర్త లిరువురిని అలాటి వయోజన విద్యాలయాల్లో చేర్చడంతోనే ఆ నాటికకి ముగింపు పలికారు. అందుకే ఫూలే తన ‘తృతీయ రత్న’ నాటికకి ‘తృతీయ నేత్ర’ అని కూడా మరో పేరు పెట్టారు.తృతీయ రత్న లేదా తృతీయ నేత్ర నాటికలో మహాత్మఫూలే నిక్షిప్తంచేసిన రెండు ముఖ్యాంశాల్ని ప్రస్తావించుకోవాలి.

ఇందులో ఫూలే రెండురకాల తృతీయ ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించాడు. బ్రాహ్మణీయ హిందూ పునరుద్ధరణ వాదులకు (రివైవలిస్టులు), సంస్కరణవాదులకు (రిఫామిస్టులు) భిన్నంగా బ్రాహ్మణేతర హిందూయేతర బహుజన సామాజిక విప్లవ (రెవల్యూషనిస్టు) ప్రజా పంథాని తృతీయ ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిం చాడు. తదుపరి బ్రిటిష్‌ రాజ్‌కి, హింద్‌ స్వరాజ్‌కి భిన్నంగా ‘స్వతంత్ర బహుజనరాజ్‌’ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాడు. జీవితాన్ని బట్టే చైతన్యం ఉంటుందని ఫూలే జీవితాచరణ చెప్పకనే చెబుతోంది. ఇది తన జీవితం ఒడిలో నేర్చుకొన్న జీవితానుభావం, జీవితావసరం. అభ్యుదయవాదులైన అగ్రవర్ణ మార్క్సిస్టులకు విప్లవం అవసరం కాదు, ఆదర్శం. ఫూలేకి ఆదర్శమే కాదు, అవసరం. అగ్రవర్ణ నేషనలిస్టులకు అది ఆదర్శం కాదు, అవసరమూ కాదు. కారణం వారి జీవితం కుల పీడనకు గురైన పీడిత కులం కాదు.

బడిలో కలిసి చదువుకోవడం వలన ఓ బ్రాహ్మణ విద్యార్థితో ఏర్పడిన స్నేహ సంబంధంతో- 1848లో అతని వివాహానికి హాజరైనప్పుడు జరిగిన అవమానకరమైన సంఘటన బ్రాహ్మణిజంతో రాజీలేని పోరాటానికి ఫూలేేని పూర్తిగా సంసిద్ధం చేసింది. అట్టడుగు పాదాల నుండి పుట్టిన శూద్రులు అగ్రవర్ణాల వారి పాదాల దగ్గర బానిసల్లా పడి ఉండే గులాం గిరి చేయకుండా, శూద్ర ధర్మాన్ని అతిక్రమించి బ్రాహ్మణుల పెళ్ళి ఊరేగింపులో పాల్గొని- అగ్రకుల దురహం కారులు- ‘బ్రాహ్మలందరి కంటే వెనక నడువ్‌, లేదా వెనక్కి వెళ్ళిపో’ అని శాసించిన అవమానకరమైన సంఘటన ఫూలేేలో స్వాభిమాన చైతన్యా నికి నాంది పలికింది. ఆధునిక వ్యక్తిగత స్వేచ్ఛా, సమాన త్వాలను కులం నియం త్రిస్తుం దనే సత్యం జీవిత ఆచరణలో బైటపడి జ్ఞానోద యమైంది. కులవ్యవస్థని, కుల నియంత్రణని దెబ్బతీయకుండా, కుల అంతస్థుల్ని కూలదోసే కుల విప్లవ పోరాటాన్ని నిర్మించకుండా ఆధునిక ఫలాలు అందరికీ సమానంగా అందవన్న సత్యం అనుభవంలోకి వచ్చింది. జీవితాచరణలో వచ్చిన ఈ అనుభవమే ఫూలే సత్యశోధక విప్లవాత్మక ఆలోచనా విధానానికి ప్రేరణనిచ్చింది. అగ్రవర్గాలకు ఊడిగం చేయటమే శూద్రుల విధఇని, అందువల్ల విద్యా విజ్ఞానం, ఆస్తి, అధికారం వారికి నిషేధం అని, ఈ విధి నిషేధాల ఆంక్షల్ని అతిక్రమిస్తే శిక్షకు గురికాక తప్పదని మనుధర్మం శాసిస్తుంది.

‘విధి నిషేధాల శిక్షాస్మృతి మనుస్మృతి’ శాసించే ఈ అనుశాసనంతో ఈ బ్రాహ్మలు శూద్రాతి శూద్రులను శాసించడం లేదా? అనే మౌలికమైన ప్రశ్నని పాత్రోచిత సంభాషణల ద్వారా ఫూలే లేవనెత్తుతాడు. ఈ మౌలిక ప్రశ్నకు సమాధానంగా ‘మనుధర్మ ధిక్కారం ధర్మధిక్కారం కాదు, అధర్మ ధిక్కారం’, అని ‘బ్రాహ్మణధిక్కారం దైవధి క్కారం కాదు, అదైవ ధిక్కారం’ అనే బ్రాహ్మణేతర సామాజిక విప్లవ చైతాన్యాన్ని రగిలిస్తాడు. ఇది తొలిమెట్టు. ఇలా నాలుగు స్థాయిల్లో బ్రాహ్మణేతర సామాజిక విప్లవ చైతన్యాన్ని పెంపొందించటం కోసం ‘బోధించి, పోరాడి, సమీకరించేందుకు’ ఈ నాటికను ఆచరణాత్మక సాధనంగా చేసుకొన్నాడు. తదుపరి ఈ దృక్పథాన్ని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓ సందేశాత్మక నినాదంగా మార్చాడు. మహాత్మా ఫూలేని తన గురువుగా గౌరవించిన అంబేడ్కర్‌ సార్వజనీన మత లక్షణం లేకపోవటమే కాదు, అసలు మత లక్షణమే లేని ‘సనాతన ధర్మ’ నిజానికి మతమే కాదన్నాడు అని చాటిచెప్పాడు. సార్వజనీన ఆధ్యాత్మిక మత ధర్మానికి విరుద్ధమైన ఈ సంకుచి తత్వానికి బ్రాహ్మణిజమే మూలకారణం అని ఎత్తి చూపుతాడు. 
ఈ మత ధర్మమే మనుధర్మానికి మూలాధారమని ఫూలే స్పష్టంచేస్తాడు. 

బ్రాహ్మణులకు అద్వితీయ అగ్రజాత్యాన్ని కట్టపెట్టటం కోసమే బ్రాహ్మణులను దైవ సమానులను చేశారని చెపుతాడు. బ్రాహ్మణీయ అగ్రవర్ణాలకు ఊడిగం (గులాంగిరి) చేయడం కోసమే శూద్రులను రెండుకాళ్ల పశువులుగా ద్వితీయ స్థానానికి, అతిశూద్రులను పశువులకంటే హీనంచేసి తృతీయస్థాయికి నెట్టారంటారు. అలా ఈ వర్ణాశ్రమ బ్రాహ్మణిజం- ఎవరి వర్ణాన్ని బట్టి వారు, ఎవరికి వారు తమ వర్ణ ధర్మాన్నే స్వధర్మంగా భావించి స్వచ్ఛందంగా అనుసరించే స్వచ్ఛంద బానిసత్వాన్ని నెలకొల్పిందని తేల్చి చెప్పారు. దాన్నే గులాంగిరి అని పేర్కొన్నారు. చాతుర్వర్ణాశ్రమ సనాతన ధర్మాన్ని రక్షించే అనుశాసనమే మను శాసనం అని చెప్పాడు. ఇక మనుధర్మాన్ని ధిక్కరిస్తే శంభూకునిలా శిరచ్ఛేదం చేయడానికి ఇది ప్రాచీన యుగం నాటి రామరాజ్యం కాదన్నాడు. శూద్రాతిశూద్రుల తలకాయల్ని ఏనుగులచేత పుచ్చకాయల్లాగా తొక్కించటానికి ఇది మధ్యయుగాల నాటి బ్రాహ్మణీయ పీష్వా రాజుల రాజ్యంకాదన్నాడు. 

చట్టంముందు, విద్యముందు అందరూ సమానమే అని చెప్పే రూల్‌ ఆఫ్‌ లా పాటించే ఆంగ్లేయుల ప్రభుత్వం మధ్యయుగాల నాటి రాచరిక రాజ్యం కాదని, అది ఆధునిక యుగమని చెప్పి వారికి జ్ఞానోదయాన్ని కలిగించాడు. ఒక్క మాటలో విద్యా విజ్ఞాన ఆధునిక జ్ఞానోదయా లతో పాటు పౌరసమాజానికి సంబంధించిన సాంఘిక, సాంస్కృతిక, భావజాల రంగాల్లో బ్రాహ్మణేతర భావ విప్లవ మహోద్యమమే శూద్రాతిశూద్ర బహుజనులను మేల్కొల్పుతుందని ఈ నాటిక చాటి చెబుతుంది. దురాచారాల్ని రూపుమాపే హేతుబద్ధ ఉద్యమం, సాంస్కృతిక పునర్జీవనోద్యమం, బ్రాహ్మణ మతానికి ప్రొటెస్ట్‌ తెలిపే పొటెస్టాంట్‌ ఉద్యమం- నిర్మించిన ఫూలే బ్రాహ్మణేతర భావజాల విప్లవ పోరాటమే- సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక విప్లవ పోరాటానికి తాత్విక భూమికను సమకూర్చింది. ఫూలే స్థాపించిన సత్యశోధక సమాజ్‌ బడుగు వర్గ బహుజనుల పురోగతి కోసం, ప్రగతి కోసం, సాధికారత కోసం- సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక న్యాయ పోరాటానికి శంఖంపూరించింది. అందుకే ఆయన్ని సామాజికన్యాయ పితామహు డిగా చరిత్ర రికార్డు చేసింది. కనుక తృతీయ రత్న లాంటి తృతీయ నేత్ర నాటికను బ్రాహ్మణిజంపై బ్రాహ్మణేతర బహుజనుల తిరుగుబాటుగా అభివర్ణించవచ్చు.
నేడు మహాత్మా ఫూలే వర్ధంతి

Surya Telugu News Paper Dated : 27/11/2013 

Tuesday, November 26, 2013

తొలి సంఘసంస్కర్త -స్వరూప

తొలి సంఘసంస్కర్త

మనువాద వ్యవస్థలో నలిగిపోతున్న మూలవాసులను చైతన్యవంతుల్ని చేయడానికి జీవితాంతం పోరాడి గెలిచిన సామాజిక విప్లవ చైతన్యమూర్తి జ్యోతిరావు పూలే. 1827 ఏప్రిల్ 11న మహా రాష్ట్రలోని సతారా జిల్లాలో ఖన్‌వాడీ గ్రామంలో గోవిందరావుపూలే, చిమనబాయి దంపతులకు జన్మించాడు. చదువు పై ఆసక్తితో ఏడేళ్ల వయస్సులోనే పాఠశాలకు చేరాడు. ఛాందసులైన మను వాదులు కులం, మతం మంటగలిసి పోతుందని పూలే తండ్రిని హెచ్చరించడంతో పూలేను బడి మాన్పించాడు. కానీ చదువుపై ఆసక్తితో తండ్రిని ఒప్పించి తిరిగి చదువు కోవడానికి పాఠశాలలో చేరాడు. అందరితో స్నేహంగా, చురుకుగా ఉండే పూలేకు చాలా మంది స్నేహితులుండేవారు. అందులో బ్రాహ్మణ మిత్రుల్లో ఒకరు తమ కుటుంబంలో జరిగే పెళ్లికి పిలవడంతో పూలే ఆ పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాడు. ఓ బీసీ పిల్లవాడు అగ్ర వర్ణాలతో సమానంగా కలిసి నడవటం బ్రాహ్మణులకు కోపం తెప్పించింది. ‘శూద్రుడవై ఉండి మాతో కలిసి నడుస్తావా’ అంటూ పూలేను అవమానించారు. రూపు రేకల్లో సమా నంగా ఉన్నా ఈ ఈసడింపులు ఎందుకు? అని బాధపడ్డాడు. సంఘంలో మనుషుల మధ్యనే ఈ అసమానతలు ఎందుకున్నాయి? వీటిని రూపుమాపే మార్గాలే లేవా? అని ఆలోచిస్తూ.. సమాజాన్ని అధ్యయనం అనేక మత,చారిత్రక గ్రంథాలను అధ్యయనం చేశాడు. వీటన్నింటిని చదివి మనిషికి విద్యతోనే జ్ఞానం లభిస్తుందని తెలుసుకున్నాడు. దళిత బహుజనులకు విద్యనందించేందుకు కంకణం కట్టుకున్నాడు. బహుజనుల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాడు. ఆబడిలో బహుజనులకు, శూద్రులకు, అతిశూద్రులకు మాత్రమే ప్రవేశం ఉం టుందని పాఠశాల బోర్డుమీద ధైర్యంగా రాయించాడు.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ప్రవేశం లేదని రాయించాడు. నాడు స్త్రీలు చదువుకోవడం నేరంగా భావించేవారు. అలాంటి పరిస్థితిలో తన భార్య సావిత్రిబాయి పూలేకు, తన సోదరికి చదువు నేర్పేందుకు బడిలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనతో పాటు తన భార్య సావిత్రీబాయి పూలేను కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేశాడు. ఇంటింటికి తిరిగి విద్య ప్రాముఖ్యాన్ని ప్రచారం చేసిన మొదటి సంఘసంస్కర్త పూలే. శూద్ర, అతిశూద్ర కులాల్లో విద్యావ్యాప్తికి పూలే చేస్తున్న కృషిని నాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. ఆ సమయంలో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆన్‌కీన్ పేరి 1852లో పూనా నగరానికి గవర్నర్‌తో కలిసి వచ్చినప్పుడు పూలే దంపతులను ఘనంగా సన్మా నించారు. ఆదర్శవంతమయిన ఆయన జీవితం త్యాగశీలతకు సాహసానికి ప్రతీక. ఆ రోజుల్లో వితంతువులకు కలిగిన సంతానం అమానుషంగా చంపబడుతుండేది. దానికి పూలే ఎంతో చలించిపోయారు. అలాంటి పిల్లల కోసం ఒక అనాథాశ్రయాన్ని స్థాపించి అనాథల రక్షకుడైనాడు. సత్యధర్మ స్థాపనకు ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించాడు. దీనిలో భాగంగా మూఢనమ్మకాలను విడనాటం గురించి అవగాహన కల్పించటమేకాకా బ్రాహ్మ ణుల అవసరం లేకుండా సత్యశోధక్ సమాజ్ సంస్కార పద్ధతిలోనే వివాహాలు జరి పించారు. బ్రాహ్మణులకు ఇచ్చే దాన ధర్మాలకన్నా వెనకబడినకులాలకు చేసే విద్యా దానం మిన్న అని నొక్కి చెప్పేవాడు. ప్రజలను చైతన్యం చేయడానికి ‘దీనబంధు’ అనే బహుజన పత్రికను నడిపారు. బ్రాహ్మణులు, మూఢనమ్మకాలతో ప్రవేశపెట్టిన పూజా విధానానికి ప్రత్యామ్నాయంగా హేతుబద్ధంగా ఆచరించే పూజా విధానంఅనే గ్రంథాన్ని సమాజానికి అందిం చా డు. 1888లో పక్షవాతం వల్ల ఆరోగ్యం పాడైపోయింది. 1890 నవంబరు 29 వ తేదీన ఆయన కన్నుమూశారు.
-స్వరూప 

Namasete Telangana Telugu News Paper Dated: 27/11/2013 

మార్క్స్- చే గువేరా బాటలో... (ఏఐఎస్‌ఎఫ్) By సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ



అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) 28వ జాతీయ మహాసభలు ఈనెల 28,29,30న భారతదేశంలో వామపక్ష, దళిత, సాంస్కృతిక, ప్రజాస్వామ్య ఉద్యమాలకు నిలయమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోతున్నాయి. దాదా పు ఇరువై ఏళ్ల తరువాత ఈ అవకాశం ఏఐఎస్‌ఎఫ్ ఆంధ్రవూపదేశ్ రాష్ర్ట సమితికి వచ్చింది. ఈ జాతీయ మహాసభలు భారతదేశ విద్యార్థి ఉద్యమాలకు దిశానిర్దేశం చేస్తాయని భావిస్తున్నాము. ప్రస్తుతం భారతదేశంలో విద్యావ్యవస్థ చాలా దిగజారిపోయింది. విద్య అంటే ఉపాధి కోసమే అన్నంత హీనమైన స్థితిలో వున్నది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్‌ల్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు, అలాగే విద్యాహక్కు చట్టం అమలు ను పరిశీలిస్తే మన ప్రభుత్వాలకు విద్యారంగంపై ఉన్న మక్కువ ఎంతో అర్థమవుతూనే వున్నది. మన పాలకులు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నారు భారతదేశంలో శాస్త్రీయ విద్యావిధానం లేనందున సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతికరంగాలలో రోజురోజుకు వెనుకబడిపోతున్నాం. ఈ ప్రపంచంలోని 193దేశాలలోని 112 దేశాలు కారల్‌మార్క్స్, చేగువేరా చెప్పినటువంటి విప్లవ సిద్ధాంతాల, విప్లవాల ద్వారా మాత్రమే స్వాతంవూత్యాన్ని సంపాదించుకున్నాయి. అందులో 85దేశాలు గయానా లాంటి దేశాలు కూడా 15ఏళ్లలో అద్భుతమైనటువంటి శాస్త్ర సాంకేతికాభివృద్ధిని ప్రజాసంక్షేమాభివృద్ధిని సాధించాయి. కాని, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలైనా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నాం దీనికి కారణం ఏ వ్యవస్థ అయి నా విద్యావ్యవస్థ నుంచి ప్రారంభం కావాల్సిందే.

1966 సంవత్సరంలో వచ్చినటువంటి కొఠారీ కమిషన్ కాదని తమ స్వలా భం కోసం కాంగ్రెస్ పాలకులు 1986 జాతీయ విద్యావిధానా న్ని తీసుకువచ్చారు. మానవ వనరుల అభివృద్ధిలో విద్య అనేది కీలకపాత్ర పోషిస్తుందని ప్రతి భారతీయుని ఆశ. కానీ, ఈరోజు దేశంలో విద్య గాట్ లాంటి అంతర్జాతీయ ఒప్పందాలలో వ్యాపారంగా మారిపోయింది. విద్య అనేది ఈ దేశంలో ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం చెబుతుంటే మన పాలకులు దాన్ని విస్మరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైనటువంటి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు పార్లమెంట్‌లో అసెంబ్లీలలో కూర్చునటువంటి మన ప్రజావూపతినిధులు రాజ్యాంగం అంటే రాజకీయం అన్నంత హీనమైన స్థితికి దిగజారిపోయారు. విశ్వవిద్యాలయాలు విశ్వాసానికి మూలాలు అని భారత రాజ్యాంగ నిర్మాతలు భావిస్తే మన పాలకులు విశ్వవిద్యాలయాలపైనా కూడా రాజకీయం చేస్తూ విదేశీ విద్యాలయాలను దేశంలోకి అనుమతిస్తున్నారు.

మొన్నటి వరకు విద్యారంగంపై వ్యాపారం చేస్తావుంటే భాషను అడ్డుపెట్టుకొని వ్యాపారం చేస్తావుంటే చూస్తూ ఊరుకోలేక ఇంగ్లిషు వచ్చినంత మాత్రాన ఇండియాలో వున్నవారంతా మేధావులు కారు అంటూ సుప్రీంకోర్టు రంగవూపవేశం చేసి వెను దేశంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని ఏవిధంగా ఉండాలో చెప్పి మరీ తీర్పునిచ్చి విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెడితే దానిని చర్చించింది, (అందులో ఒకరు సీపీఐ ఎంపీ గురుదాస్‌దాస్ గుప్తా) ఆమోదించింది 84 మంది. దీన్ని బట్టి చూస్తే మన పాలకులకు విద్యపైనా ఎంత ఇష్టం ఉందో అర్థమవుతుంది. మళ్లీ దేశాలు పరిజ్ఞానం చాలదంటూ అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. విద్యార్థులకు రాజకీయం ఎందు కు అని సాకు చూపుతూ విశ్వవిద్యాలయాలలో ఎన్నికలను రద్దు చేశారు.

దానిపై, నియమించినటువంటి లింగ్డో కమిషన్ వాదనలను కూడా గాలికి వదిలేశారు. డబ్బుం రాజకీయం అంటూ వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి జాతీయ మహాసభలలో దేశ విద్యారంగంపై చర్చించి విద్యావ్యవస్థకు ఊపిరిపోసేటువంటి ప్రణాళికను తయారు చేసి రాబోయే భవిష్యత్ విద్యార్థి ఉద్యమానికి ఏఐఎస్‌ఎఫ్ ప్రాతినిధ్యం వహిస్తుంది. వామపక్ష విద్యార్థి సంఘాలు లేవు అన్న మతతత్వ, మనువాదులకు ఇది చెంపదెబ్బతో సమానం. ఈ మహాసభలలో 28 రాష్ట్రాల నుం చి 1000 మంది ప్రతినిధులు అలాగే 15 దేశాల నుంచి అంతర్జాతీయ విద్యార్థి నాయకులు పాల్గొని, ప్రపంచ విద్యార్థి ఉద్యమంలో ఏఐఎస్‌ఎఫ్ పాత్రను వివరిస్తాం. అవినీతి, కుంభకోణాలకు మారుపేరైనటువంటి యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలను గద్దె దింపి లౌకిక, వామపక్ష ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాం. ఈ మహాసభలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని కోరుతున్నాం. 
-సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ
ఏఐఎస్‌ఎఫ్ రాష్ర్ట అధ్యక్షు

Namasete Telangana Telugu News Paper Dated : 27/11/2013 

Tuesday, November 19, 2013

పట్నం పారిశుద్ధ్యం నాడు, నేడు - గాదె వెంకటేష్


Published at: 19-11-2013 00:22 AM
 
New 
 
0 
 
0 
 
 

1920వ దశకంలో వృధా నీటి, మురుగునీటి శుద్ధి టెక్నాలజీ శాస్త్రీయ సూత్రాల ఆధారంగా తుది రూపం దాల్చింది. దాదాపుగా అదే సమయంలో హైదరాబాద్ ఆ సాంకేతికతను అందుకుంది... హైదరాబాద్ సంస్థానంలో విద్య, వైద్య, విద్యుత్, పారిశుద్ధ్యం సదుపాయా ల అభివృద్ధిలో ప్రపంచ స్థాయి సాంకేతికతలన అందిపుచ్చుకొని ఆ సాంకేతికతలకు మానవతా స్పృహను జోడించిన దార్శనికుడు ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్.
'నిజాం ది రూలింగ్ ఐకాన్' అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం వింతేమీకాదు. కానీ తన పాలనలో ఉన్న ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిజాం సేవలను విస్మరించలేము. చెరువులు తవ్వించడం, మంచి నీళ్ళు, విద్యుత్ సదుపాయాలు కల్పించడం గురించి విని వుండవచ్చు. అయితే మురుగునీటి వ్యవస్థకు ప్రజా ఆరోగ్యానికి సంబంధం ఉందనే సత్యాన్ని విపులంగా అర్థం చేసుకున్న అతి కొద్ది మంది పాలకులలో ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఒకరు.
ఒక మనిషికి ఒక రోజుకు 135 లీటర్ల చొప్పున నీళ్లను అందివ్వాలని సెంట్రల్ పబ్లిక్‌హెల్త్, ఎన్విరాన్‌మెంటల్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలు చెబుతున్నాయి. దానిలో దాదాపు 80 శాతం మురుగునీరుగా మారుతుంది. మురుగునీటి నిర్వహణ సరైన పద్ధతిలో లేకపోతే డయేరియా, కలరా, పోలియో లాంటి యాభై పైగా వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధులకు ముఖ్యంగా మురికివాడలలో నివసించే పేదలే బలవుతున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ 1908లో మూసీ వరదల తర్వాత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి వృథా నీటి, మురుగునీటి నిర్వహణ వ్యవస్థకు పునాదులు వేసి, పారిశుద్ధ్య వ్యవస్థకు పురుడు పోశారు. ఒక శతాబ్దం ముందే బయటి ప్రపంచంతో సమాంతరంగా పారిశుద్ధ్య వ్యవస్థకు ఉన్న ఆవశ్యకతను, ఆ సాంకేతికతను నిజాం నవాబు అంది పుచ్చుకున్నారనడానికి నాటి పారిశుద్ధ్య వ్యవస్థే సాక్ష్యం. చక్కని పారిశుద్ధ్యమే మనుషుల నాగరికతను తెలుపుతుందని నమ్మి, 1922లోనే ప్రజలకు ఆరోగ్యకరమైన పరిసరాలను అందించాలన్న తపన ఊహకందని విషయం. టెక్నాలజీని అర్థం చేసుకొని అమలు చేయడానికి కావాల్సిన సాంకేతిక నిపుణులను, తగు సిబ్బందిని సమకూర్చుకోవడం గొప్ప విషయం. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పారిశుద్ధ్య వ్యవస్థను నిర్మించిన యాభై ఏళ్ల తర్వాత అంటే 1970లలో కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటై, నీటి కాలుష్య చట్టానికి చెందిన మార్గదర్శకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత మాత్రమే తెలంగాణేతర ప్రాంతాలలో పారిశుద్ధ్య వ్యవస్థకు చర్యలు చేపట్టారనేది నిర్వివాదాంశం.
1920వ దశకంలో వృధా నీటి, మురుగునీటి శుద్ధి టెక్నాలజీ శాస్త్రీయ సూత్రాల ఆధారంగా తుది రూపం దాల్చింది. దాదాపుగా అదే సమయంలో హైదరాబాద్ ఆ సాంకేతికతను అందుకుంది. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, భూగర్భ మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతుల ద్వారా ఆధునికీకరించడం, దుమ్ము -ధూళి లేకుండా రహదారులను శుభ్రపరచడం వంటి ప్రధాన లక్ష్యాలతో 1926లో హైదరాబాద్ మురుగు నీటి విభాగం ఏర్పాటయ్యింది. 1908లో మూసీ వరదల నష్టం తరువాత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి వరద నీటి నిర్వహణా ప్రణాళికలను తయారుచేయించారు ఆరవ నిజాం. విశ్వేశ్వరయ్య మొదట నగరాన్ని పరిశీలించి ప్రణాళికలు రూపొందించి రూ.52 లక్షలతో నీటి నిర్వహణ చేపట్టాలని సూచించారు. అప్పటి శానిటరీ ఇంజనీరు ఎ.డబ్ల్యు స్టోన్‌బ్రిడ్జ్ ఆ ప్రణాళికలకు మెరుగులు దిద్ది మొత్తం నగరానికి రూ.168 లక్షల అంచనాతో వరద నీరు, మురుగునీటి నిర్వహణకు ప్రణాళికలను రూపొందించాడు. 1921లో విశ్వేశ్వరయ్య ఆ ప్రణాళికలను సమగ్రంగా పరిశీలించి స్టోన్‌బ్రిడ్జ్‌ను అభినందించారు.
మురుగునీటి నిర్వహణను కొద్దిగా ఆలస్యంగా చేపట్టినా పర్వాలేదు కానీ మళ్ళా వరదల వల్ల హైదరాబాద్ నష్టపోకూడదని రూ.100 లక్షలతో వరద నీటి సేకరణ కాలువల నిర్మాణాన్ని తొలుత ప్రారంభించమని విశ్వేశ్వరయ్య ముందు చూపుతో సలహా ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ఎం.ఎ. జమాన్‌కు అప్పగించారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్ల సలహాలు, సూచనలతో జమాన్ ఆ ప్రణాళికలను పటిష్ఠ పరచి కాల్వల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1926లో వరదనీరు, మురుగునీరు నిర్వహణను కలపడం వల్ల మురుగునీటి నిర్వహణ నిర్లక్ష్యానికి గురౌతుందని నిజాం నవాబు భావించారు. వెన్వెంటనే మురుగునీటి నిర్వహణకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి నవాబ్ కుర్మత్ జంగ్ బహదూర్‌ను ఛీఫ్ ఇంజనీర్‌గాను, జమాన్‌ను ఎస్ఇగాను ఏడవ నిజాం నియమించారు.
మురుగునీటికి సంబంధించిన పనులు 1926లో రూ.15 లక్షల గ్రాంటుతో ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా 1930లో డ్రైనేజ్ బోర్డు, పారిశుద్ధ్య వ్యవస్థని మెరుగుపరచడానికి పంపిన ప్రణాళికలను కూడా అప్పటి ప్రభుత్వం ఏ మాత్రం అభ్యంతరాలు చెప్పకుండా ఆమోదించింది. దీన్ని బట్టి నిజాం పారిశుద్ధ్యంపై కనబరిచిన శ్రద్ధ మనకు అర్థమౌతుంది. డ్రైనేజ్ బోర్డు రూ.102.4 లక్షలతో ప్రధాన కాలువలు, ఉప కాలువలు నిర్మించడమే కాకుండా ప్రజల విజ్ఞప్తి మేరకు కనెక్షన్స్ కూడా ఇచ్చింది. 1937లో ఉన్న ఐదు లక్షల జనాభాను దృష్టిలో ఉంచుకొని మురుగునీరు నిలువ ఉండకుండా కావాల్సిన కాలువల కోసం ప్రణాళికలు తయారు చేయించారు ఏడవ నిజాం.
నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానాల గదులు, ప్రజల సౌకర్యార్థం నిజాం ప్రభుత్వం ఆరోజుల్లోనే కట్టించింది. మురుగుకాల్వల ద్వారా సేకరించిన నీటిని పాక్షికంగా అంబర్‌పేట ఎస్టీపీ వద్ద శుభ్రపరచేవారు. ఈ శుద్ధి చేసిన నీటితో 1100 ఎకరాలకు సాగునీరు అందించేవారు. సేకరించిన మురుగునీటి శుద్ధి కోసం 'ఆక్సిడేషన్ పాండ్ టెక్నాలజీ'తో 53 ఎమ్ఎల్‌డీ.. ఎస్‌టీపీని నిర్మించారు. ఇదంతా 1937-40 సంవత్సరాల మధ్య నిజాం తెలంగాణ ప్రజలకు అందించారు. అంటే దేశంలో మొదటి మూడు నాలుగు మురుగునీటి శుద్ధికేంద్రాలలో హైదరాబాద్ ఎస్‌టీపీ ఒకటి. ఇతర దేశాల వాళ్లు సైతం మురుగునీటి కాల్వల నిర్వహణ, శుద్ధి అధ్యయనం కోసం (స్టడీ టూర్) ఇక్కడికే వచ్చేవారు. ఆసిఫ్‌నగర్, నారాయణగూడలలో అప్పటికే ప్రసిద్ధి గాంచిన మంచినీటి శుద్ధి కేంద్రాలు ఉండేవి. ఆసిఫ్‌నగర్‌లోని నీటి శుద్ధికేంద్రం 100 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తుండడం నిజాం ప్రభుత్వం నాణ్యతకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని విశదం చేస్తుంది. 1950లో హైదరాబాద్ మురుగునీటి వ్యవస్థకి, సికింద్రాబాద్, పారిశ్రామిక వాడల నుంచి వచ్చే మురుగునీటి కాల్వలను ఆరు లక్షల రూపాయల వ్యయంతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మురుగునీటి విభాగం ఏర్పాట్లు చేసింది. పారిశుద్ధ్యం విషయంలో ఒక్క హైదరాబాద్ నగరానికే ప్రాధాన్యమిచ్చారనుకుంటే పొరపాటే. తన సంస్థానంలోని అన్ని ప్రధాన పట్టణాలలో మురుగునీటి నిర్వహణకు సమాన ప్రాధాన్యమిచ్చారు. డ్రైనేజీ విభాగంకు కేటాయించిన బడ్జెట్‌తోనే సరిపెట్టక సాధారణ బడ్జెట్ రాబడి నుంచి కూడా అదనంగా మరికొంత బడ్జెట్‌ను డ్రైనేజీ విభాగానికి కేటాయించే వారు. అదీ, పారిశుద్ధ్యం పట్ల ఏడవ నిజాంకు ఉన్న నిబద్ధత.
ఇక వర్తమానానికి వద్దాం. దేశంలోని మొత్తం 5,161 పట్టణాల్లో కేవలం 269 పట్టణాలకు మాత్రమే మురుగునీటి నిర్వహణ ఉంది. అది కూడా పాక్షికంగానే ఉందన్న విషయం బహు బాధాకరమైన వాస్తవం. ప్రస్తుత ప్రభుత్వాలు పారిశుద్ధ్య పనులను చేపడుతున్న విధానంలోనైతే అన్ని పట్టణాలకు మురుగునీటి నిర్వహణ వసతులు కల్పించాలంటే మరో మూడు వేల సంవత్సరాలకు పైగా పడుతుందని ఓ అంచనా! పారిశుద్ధ్యం మీద ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ తొమ్మిది రూపాయలు లాభిస్తాయి. ఎందుకంటే పారిశుధ్ధ్యం మీద ఖర్చు పెట్టడం అంటే ఆరోగ్య వసతుల మీద ఖర్చు పెడుతున్నట్టే. అనారోగ్యాలు, అంగ వైకల్యాలు తగ్గి ఆరోగ్యకరమైన మానవులు రూపొందుతారు. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో 6,780 కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరా వ్యవస్థ ఉంటే దాదాపు 3600 కిలోమీటర్ల మురుగునీటి వ్యవస్థ విస్తరించి ఉంది. అభివృద్ధిలో ప్రపంచంతో పాటు పరుగెత్తుతున్న హైదరాబాద్‌లో ఇప్పటి పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. జనాభా రోజురోజుకు పెరుగుతున్నా మురుగునీటి కాల్వలను మాత్రం మెరుగుపరచడం లేదు.
తాత్కాలికంగా సమస్యను పరిష్కరించే విధానంతో పైపులను మార్చుతున్నారు. అందుకే హైదరాబాద్‌కి ఎన్ఆర్ సీడీపీ వచ్చిన డబ్బుతో మురుగునీటిని శుద్ధిచేసి మూసీలో వదలడానికి హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్‌బీ ఫేస్-1, ఫేస్-2 లుగా ప్రణాళికలు తయారుచేసింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో 1032 ఎంఎల్‌డీల మురుగునీరు ఉత్పన్నమవుతోంది. అందులో 67.8 శాతం అంటే 695 ఎంఎల్‌డీ మాత్రమే శుద్ధి చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ , హెచ్ఎండీఏ కలిసి నిర్వహిస్తున్న ఎస్‌టీపీలు 12 ఉన్నాయి. వీటితో 1028 ఎంఎల్‌డీల మురుగునీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు.
నిజాం పాలనలోనే హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ద్వారా 1913లో మింట్ కాంపౌండ్‌లో డీజిల్ పవర్ స్టేషన్‌ను నిర్మించి వీధి దీపాలు, కింగ్‌కోఠిలోని ప్యాలెస్‌కు విద్యుత్ వెలుగులను ఇచ్చారు. 1921-22లో హైదరాబాద్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను, 1930లో పవర్ హౌజ్‌ను, 1921లో సిటీకాలేజ్‌ను, 1915లో వరద నీటి వ్యవస్థను, 1922లో మురుగునీటి వ్యవస్థను, 1940లో ఎస్‌టీపీ నిర్మించి ఆధునిక సాంకేతిక విప్లవానికి జంట నగరాలలో నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ నాంది పలికారు- అమెరికాలో కొత్త సాఫ్ట్‌వేర్ విడుదలైన మరునాడే అమీర్‌పేటలో కోచింగ్ మొదలైనట్లు. ఇటువంటి ఆధునికీకరణను ఏ హిందూరాజో సాధించివుంటే అది స్వర్ణయుగమని మన (హిందూ) చరిత్రకారులు కొనియాడేవారు కాదా? హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమయినప్పుడు అప్పటి వరకు తన ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన వివిధ పరిశ్రమలలోని కార్మికుల ఉద్యోగభద్రత కోసం చేసుకొన్న ఒప్పందాలు ప్రస్తుతం ప్రపంచ స్థాయి మెర్జింగ్, అక్విజషన్ సూత్రాలకు దీటుగా నిలిచి నిజాం నవాబు నిబద్ధతను చాటుతున్నాయి. ఇలా విద్య, వైద్య, విద్యుత్, పారిశుద్ధ్యం సదుపాయాల అభివృద్ధిలో ప్రపంచ స్థాయి సాంకేతికతలను అందిపుచ్చుకొని ఆ సాంకేతికతలకు మానవతా స్పృహను జోడించిన దార్శనికుడు ఏడవ నిజాం ప్రభువు.
- గాదె వెంకటేష్
అసోసియేట్ ప్రొఫెసర్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
(నేడు ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం)


Andhra Jyothi Telugu News Paper Dated : 19/11/2013 

Friday, November 15, 2013

పెరుగుతున్న వలసలు,మారుతున్న స్వభావాలు By అర్చనా ప్రసాద్‌



    2011లో భారత్‌లో అంతర్గత వలసదారులు 40కోట్ల మంది ఉంటారని అంచనా వేశారు. అయితే, ఇది తప్పు కావడానికి అవకాశముంది. ఎందుకంటే చాలా తక్కువ కాలం ఉండే సీజనల్‌ మైగ్రేషన్‌ (సీజన్లవారీగా వలసలు) గురించి ఈ నివేదికల్లో దేంట్లో కూడా తగిన విధంగా అంచనా వేయలేకపోయారు. లేబర్‌ మార్కెట్‌కు పునాది వంటిదే ఈ సీజన్ల వారీ వలసలు. ఒక అంచనా ప్రకారం, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు జరిగే వలసలు దాదాపు 10కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. వీరిలో చాలా మంది దళితులు, ఆదివాసీలే కావడం గమనార్హం.

   భారత్‌లో అంతర్గత వలసలు, మురికివాడల ప్రజలకు సంబంధించి ఇటీవల రెండు నివేదికలు వచ్చాయి. దేశంలో అతి వేగంగా మారిపోతున్న కార్మిక వర్గ జనాభా మార్పుల గురించే ఈ రెండు నివేదికలు పేర్కొన్నాయి. వ్యవసాయ రంగంలో తలెత్తిన నిరాశా నిస్పృహలతో, సంక్షుభిత పరిస్థితుల కారణంగా కూడా పల్లెల నుండి పట్టణాలకు వలస వెళ్లడం పెరిగిందనే విషయం అందరికీ తెలుసు. ఈ వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో, అలాగే కార్మిక వర్గ సామాజిక స్వభావాలు లేదా లక్షణాల గురించి ''అంతర్గత వలసవాదులు, సామాజిక కూర్పు'' పై యునెస్కో వెలువరించిన నివేదిక వెల్లడించింది. 2011లో భారతదేశ జన గణనలో మురికివాడలపై కొత్తగా ఇచ్చిన డేటాను కూడా విడుదల చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక దుస్థితి స్థాయి ఎంతలా వుందో ఈ నివేదికలు వెల్లడించాయి. అలాగే నయా ఉదారవాద విధానాల వల్ల సుదీర్ఘకాలంలో తలెత్తే ప్రభావాల గురించి కూడా వెల్లడించాయి. గ్రామీణ, పట్టణ కార్మికవర్గాల్లో మారుతూ వచ్చిన స్వభావాలను కూడా ఈ నివేదికలు ప్రముఖంగా ప్రస్తావించాయి. సమకాలీన నయా ఉదారవాద కార్పొరేట్‌ పెట్టుబడివాదాన్ని సవాలు చేసేందుకు వీరిని అంటే ఈ కార్మిక వర్గాన్ని సమీకరించాల్సి ఉంది.
                                 వలసలు, దుస్థితి
2001 జనాభా లెక్కల్లో పేర్కొన్నట్లుగా భారతదేశంలో దాదాపు 30శాతం జనాభా అంతర్గత వలసలకు వెళుతూంటుంది. 2007-08లో నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) అంచనాలను పరిశీలిస్తే ఈ సంఖ్య 28.5 శాతానికి పడిపోయింది. కానీ 2011 జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ సంఖ్య 33.3 శాతానికి పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. యునెస్కో కోసం వీటిపై అధ్యయనం చేయడం జరిగింది. 2011లో భారత్‌లో అంతర్గత వలసదారులు 40కోట్ల మంది ఉంటారని అంచనా వేశారు. అయితే, ఇది తప్పు కావడానికి అవకాశముంది. ఎందుకంటే చాలా తక్కువ కాలం ఉండే సీజనల్‌ మైగ్రేషన్‌ (సీజన్లవారీగా వలసలు) గురించి ఈ నివేదికల్లో దేంట్లో కూడా తగిన విధంగా అంచనా వేయలేకపోయారు. లేబర్‌ మార్కెట్‌కు పునాది వంటిదే ఈ సీజన్ల వారీ వలసలు. ఒక అంచనా ప్రకారం, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు జరిగే వలసలు దాదాపు 10కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. వీరిలో చాలా మంది దళితులు, ఆదివాసీలే కావడం గమనార్హం.
గత రెండు దశాబ్దాల కాలంలో గ్రామీణ జీవితం, జీవన భృతి దారుణంగా విధ్వంసమైన ఫలితంగానే పెద్ద ఎత్తున సీజన్లలో ఈ వలసలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్ళిపోయే రేటులో కూడా పెరుగుదల ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తోంది. 2007-08లో ఈ రేటు 36శాతంగా వుంది. 1999-2000 నుండి రెండు శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే, ఉపాధి కోసం వెతుక్కుంటూ కాకుండా పెళ్ళిళ్ళయి మహిళలు వలస వెళ్ళిపోయిన ఫలితమే ఈ వలసల రేటు పెరగడానికి ఎక్కువ కారణంగా కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేలో ప్రధానంగా వచ్చిన ఈ నిర్ధారణను యునెస్కో సర్వే తిరస్కరించింది. గణనీయంగా మహిళలు వలస వెళ్ళిపోవడానికి పెళ్ళిళ్ళవడం ఒక్కటే కారణం కాదని వాదించింది. వివాహమైన తర్వాత మహిళలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళవచ్చు కానీ వారు వలస వెళ్ళిన తర్వాత అక్కడ ఉపాధి చేపడతారని, తమ కుటుంబ అవసరాలు తీరడానికి వారికి ఇది తప్పదని పేర్కొంది. అందువల్ల మహిళలకు సంబంధించి ఉపాధి, పని అంచనాలు వివాహంతో కూడిన వలసలతో చాలా సన్నిహితంగా ముడిపడి ఉంటాయి. తమ వలసలకు ప్రధాన కారణం ఉపాధి కాకపోయినప్పటికీ వలస వెళ్ళిన మహిళలకు ఉపాధి దొరకడం చాలా అధిక రేటులో ఉండడాన్ని 2007-08లో ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వలస సర్వే గణాంకాలు సూచిస్తున్నాయి. వలస వచ్చిన మహిళల్లో ఐదవ వంతు మంది క్యాజువల్‌ లేబర్‌గా చేస్తుండగా వారిలో 43.7శాతం మంది నిరుద్యోగులే. 36.7శాతం మంది రెగ్యులర్‌ సర్వీస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే నర్సింగ్‌, ఇంటి పనులు వంటి రంగాల్లో ఎక్కువమంది వున్నారు. తమ భర్తలు ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్లిపోయినా గ్రామీణ ప్రాంతాల్లో వుండే మార్గాన్ని వివాహితులు ఎంచుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. వీరు కూడా తమ భర్తలతోపాటుగా ఉపాధి వెతుక్కుంటూ నగరాలకు వెళ్ళిపోతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. సంస్కరణల అనంతర కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు కొనసాగుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
              స్వల్పకాల వలసలు, గుర్తింపు లేని కార్మికుడు
ఆ రకంగా కార్మికుల వలస ధోరణులకు సంబంధించి మరింత సమగ్రమైన, కచ్చితమైన పరిస్థితి మనకు తెలియాల్సిన అవసరం వుంది. ఎందుకంటే స్వల్పకాల వలసలను జనాభా లెక్కల్లో పరిగణించరు, లెక్కించరు. అయితే, అటువంటి వలసలు కూడా తాజా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేల్లో అంచనా వేయబడ్డాయి. 2000 నుండి 2008 మధ్య కాలంలో ఇలా స్వల్ప కాల వలసలకు వెళ్ళిన వారి సంఖ్య 12.4 మిలియన్ల నుండి 15.2 మిలియన్లకు పెరిగింది. అంటే దీనర్ధం స్వల్ప కాలం పాటు (అంటే రెండు నుండి ఆరు మాసాలు) వలసలు వెళ్ళే పరిస్థితులు పెరిగాయన్న మాటే. ప్రతి ఏటా దాదాపు 5 లక్షల మంది కార్మికులు ఈ రీతిన వలసలకు వెళుతుంటారు. వీరిలో, 85.1శాతం మంది పురుషులే, వీరు పట్టణ ప్రాంతాలకు వలస వెళుతుంటారు. విస్తృత ధోరణిలో చూసినట్లైతే, గ్రామీణ ప్రాంతాల నుండి స్వల్ప కాలానికి వలస వెళ్ళే మహిళల సంఖ్య చాలా పరిమితంగా వుంది. ఈ మొత్తం కథనంలో అన్నింటికన్నా ఆసక్తికరమైన అంశమేమంటే, 2007-08లో వలస వెళ్ళిన 28 లక్షల మంది మహిళా వలస కార్మికుల్లో 60శాతానికి పైగా ఎస్‌సి, ఎస్‌టిలకు చెందినవారే. ఎస్‌సి, ఎస్‌టి పురుష వలస కార్మికుల కన్నా కూడా ఈ సంఖ్య చాలా ఎక్కువగా వుంది. మొత్తం పురుష కార్మికుల్లో కేవలం 30శాతంగా మాత్రమే వలస కార్మికులు ఉన్నారు. ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే వ్యవసాయేతర లేబర్‌ మార్కెట్‌లో ఎస్‌సి, ఎస్‌టిల వలసలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ తరహా వలసలకు సంబంధించి పరిగణించాల్సిన మరో అంశం ఏమంటే గ్రామీణ, పట్టణ స్వభావం. స్వల్ప కాలం పాటు వలసలకు వెళ్ళేవారు అక్కడ గల గ్రామీణ యజమానులతో తమ సంబంధాలను అలాగే కొనసాగిస్తారు. ఏడాదిలో కొంత కాలం పాటు వారి సొంత భూముల్లో స్వయం ఉపాధి వ్యవసాయదారులుగా తరచూ పని చేస్తూంటారు. ఈ రకంగా, వారు పూర్తి స్థాయి, పూర్తి కాలం పట్టణ కార్మికులు కారు, లేదా పూర్తి స్థాయి పూర్తి కాలం గ్రామీణ కార్మికులు కాకుండా వుంటారు. గ్రామీణ, పట్టణ పనులు, కార్యకలాపాల పట్ల వారి అనుభవాలే వారి చర్యలను నిర్దేశిస్తాయి. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల వ్యవహారాల్లో వారికి పరిమిత రాజకీయ ప్రాతినిధ్యం ఉంటుంది. సామాజిక రక్షణ కోసం, పథకాల కోసం డిమాండ్‌ చేసేటపుడు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఈ పథకాలకు శాశ్వత నివాసపు రుజువు అవసరమవుతుంది. ఇలా వలస కార్మికుడు అటు విస్తృత స్థాయిలో తీసుకున్న గణాంకాల్లోనూ, అలాగే రాజకీయ దృశ్యంలోనూ కూడా కనిపించకుండా పోవడానికి వారి సంచార జీవితం, గ్రామీణ, పట్టణ వ్యవస్థలతో పలుచనైన సామాజిక సంబంధాలే కారణం. పైన పేర్కొన్న విస్తృత డేటాను విశ్లేషించడం వల్ల తలెత్తిన సమస్యల్లో ఒకటి ఏంటంటే కార్మికుల సంచారత లేదా వలసలపై అంచనాలు 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణీకరణ రేట్లకు అనుగుణంగా లేవు. అలాగే పట్టణ ఉపాధి ధోరణులకు అనుగుణంగా కూడా లేవు.
                   పట్టణ కార్మికుల సామాజిక కూర్పు
జనాభా లెక్కలకు సంబంధించి ఇటీవల విడుదలైన మురికివాడల గణాంకాల ప్రకారం చూసినట్లైతే పట్టణ కార్మిక వర్గం విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణ ఉపాధి విస్తరణ, పట్టణ కేంద్రాల విస్తరణ ఈ రెండూ కూడా పైన పేర్కొన్న స్వల్ప కాల, దీర్ఘకాల వలసల గురించి బాగా తక్కువ చేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. 2001లో నోటిఫై చేయబడిన మురికివాడల ప్రాంతాలు 1743 ఉండగా అవి 2011 నాటికి 2613కి పెరిగాయి. అయితే, చట్టబద్ధంగా నోటిఫై చేయబడిన మురికివాడల ప్రాంతాలు మనకు కొంతమేరకే వివరాలు వెల్లడిస్తాయి. కార్మిక వర్గంలో చాలా వరకు జనాభా గుర్తించబడిన మురికివాడల్లో నివశిస్తారు. అవి ఇంకా నోటిఫై చేయాల్సిన మురికివాడలో లేక గుర్తించిన మురికివాడలో అయి వుంటాయి. అంటే మురికివాడల స్వభావాలు కలిగి ఉండి జనాభా గణికులచే గుర్తించబడినవే తప్ప ఇంకా ప్రభుత్వం గుర్తించని వాడల్లో వీరు నివసిస్తారన్నమాట. మరో మాటలో చెప్పాలంటే, 2011 జనాభా లెక్కలు పట్టణ ప్రాంతాల్లోని అన్ని కార్మిక వాడలను డాక్యుమెంట్‌ చేయడానికి ప్రయత్నించాయి. దీని ప్రకారం చూస్తే 2001 నుండి 2011 మధ్యలో మురికివాడల కుటుంబాల సంఖ్య 44.2 శాతం పెరిగింది. అన్ని మురికివాడల్లోని జనాభాలో దాదాపు 36శాతం మంది గుర్తించబడని కాలనీల్లో నివశిస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది. అందువల్ల వారికి ఎలాంటి గుర్తింపు కానీ, ప్రభుత్వ విధానాల్లో హక్కులు కానీ ఉండవు. కేవలం 34.4 శాతం మంది మురికివాడల ప్రజలు మాత్రమే నోటిఫై చేయబడిన, అధికారిక మురికివాడల్లో నివసిస్తున్నారు. ఈ తరహా మురికివాడలకు కొన్ని మౌలికమైన సౌకర్యాలు ఉంటాయి. దశాబ్ద కాలంలో మహిళా కార్మికుల పురోగతి రేటు పురుషుల కన్నా కూడా దాదాపు 5.7శాతం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న దుస్థితి కారణంగా కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్ళే అంశాన్ని ఇది మరోసారి ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.
ఇక ఈ డేటా నుండి వెల్లడైన మరో అంశం ఏమంటే మురికివాడల ప్రజల్లో కూడా వైవిధ్యమైన సామాజిక కూర్పు వుంది. ఇతరుల కన్నా కూడా ఈ దశాబ్ద కాలంలో ఎస్‌సి, ఎస్‌టిల్లో మురికివాడల జనాభా అధిక రేటున పెరిగింది. ఎస్‌సిల్లో ఇది 38శాతంగా ఉంటే ఎస్‌టిల్లో 51.8శాతంగా ఉంది. ఆ రకంగా 2011లో మురికివాడల జనాభాలో ఎస్‌సి జనాభా 20.4శాతంగా వుంది. 2001లో ఇది 18.5శాతంగా వుంది. ఎస్‌టి జనాభా కేవలం 3.4శాతంగా వుంది. 2001లో ఈ సంఖ్య కేవలం 2.5శాతంగా ఉంది. మొత్తం దశాబ్దంలో పట్టణ ప్రాంతాల్లో మురికివాడల జనాభా మొత్తంగా 17.4శాతానికే పరిమితమైనందున పై పెరుగుదల ప్రాముఖ్యమైనదనే చెప్పుకోవచ్చు. అదీకాక, పురుషుల కన్నా కూడా ఎస్‌సి, ఎస్‌టి మహిళల నిష్పత్తి కూడా అధిక రేటున పెరిగింది. 2001 నుండి 2011 మధ్య కాలంలో ఎస్‌సి మహిళల దామాషా 40.3శాతం పెరిగింది. అదే సమయంలో ఎస్‌టి జనాభా 50.4శాతం పెరిగింది. మొత్తంగా మురికివాడల జనాభా గత దశాబ్ద కాలంలో 34శాతం పెరిగిన దానికన్నా కూడా ఈ నిష్పత్తులు చాలా ఎక్కువ.
లేబర్‌ మార్కెట్‌లో అవకాశాలు సంపాదించుకోవడం కోసం పట్టణ, గ్రామీణ కార్మికులు ఎక్కువగా ఈ సమీకరణలు లేదా వలసలపైనే ఆధారపడుతున్నారని ఈ డేటా తెలుపుతోంది. అయితే, అటువంటి వలసల వల్ల వారు గుర్తించబడిన కార్మికులుగా లేదా కార్మిక హక్కులు పొందినవారిగా ఉంటారనడానికి ఎలాంటి హామీ లేదు. అదీకాక, ఇటువంటి కార్మిక వర్గంలో వస్తున్న మార్పుల్లో కూడా వైవిధ్యమైన సామాజిక లక్షణాలు ఉన్నాయి. పైగా అనేక వర్గ, పితృస్వామ్య సంబంధాలు కూడా మధ్యవర్తిత్వం నెరుపుతాయి. కార్మికుల ఐక్యత సాధించేందుకు గానూ ముందుగా కార్మికులందరూ కూడా నమోదు చేసుకుని వుండడం తప్పనిసరి, ముఖ్యం కూడా. అలాగే వలస కార్మికులకు సంబంధించి నిర్దిష్ట సమస్యలను కార్మిక మహా ఉద్యమాల ద్వారా చేపట్టడం కూడా అత్యంత ముఖ్యమైనదే.

-
Prajashakti Telugu  News Paper Dated: 16/11/2013