Friday, March 8, 2013

సమస్యల వలయంలో వనితలు ---మాసపత్రి ఉషాకిరణ్



womens
మహిళా సాధికారత.. ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన పదమిది. మారుతున్న కాలంతో పాటుగా మహిళల జీవితాల్లో కూడా అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ ఈ మార్పులు ఆమెను అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నట్లు కనబడుతూనే మరోవైపు సమస్యల సుడిగుండంలోకి నెడుతున్నాయి. 

ఆధునిక కాలంలో స్త్రీకి అడుగడుగునా సమస్యలే. కొన్ని సందర్భాల్లో స్త్రీ తన సమస్యల్ని తానే గుర్తించలేని, చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నది. నాటికీ నేటికీ స్త్రీల సమస్యలు తమ స్వరూపాన్ని మార్చుకున్నాయేగాని పూర్తిగా సమసిపోలేదు. ఉద్యోగాలు చేసే స్త్రీల సంఖ్య రానురాను పెరుగుతున్న నేపథ్యంలో వారు ఎదుర్కొనే సమస్యల స్వరూపం కూడా మారుతూ వస్తున్నది. 
పురుషుడు చేసే ప్రతి పనికీ విలువ పెరుగుతూ, స్త్రీ చేసే ప్రతి పని కీ విలువ తరుగుతున్నది. దీంతో ఆర్థిక వ్యవస్థలో మహిళకు ప్రత్యక్ష సంబంధం ఉండకపోవడం వల్ల ఇంటి పని అనుత్పాదక శ్రమగానే ఉండిపోయింది. దీంతో ఇంట్లో ఆధిపత్యం పురుషులదే అయ్యింది. కానీ నిజంగా ఇంట్లో శ్రమపడే మహిళలకు గుర్తింపు లేకుండాపో తున్నది. మాతృత్వం పేరుతో పిల్లల్ని కని పెంచాల్సిన బాధ్యతను స్త్రీ స్వీకరించింది. కానీ ప్రయోజకులైన పిల్లలు మాత్రం పురుషుడి వారసులే అయ్యారు. వీటన్నింటికీ మించి లైంగిక వివక్షకు గురైంది. కుటుంబ హింస ఎక్కువవుతున్నది. ఆత్మాభిమా నం కోల్పోతున్నది. సమాజంలో స్త్రీ పరి స్థితి రెండవ శ్రేణిగా దిగజారింది. ఈ పరిస్థితి మారనంత వరకు వివక్ష మాత్రమే కాదు. దోపిడీ కూడా నిరాటంకంగా సాగిపోతున్నది.

నాగరికత పెరిగిన కొలదీ పనులు, ధ్యాసలూ, ఆశలూ ఎక్కువై కుటుంబంలో మహిళలను మనుషులుగా గుర్తించడం తగ్గిపోతున్నది. ఈ క్రమంలో కుటుంబంలో స్త్రీల పనులకు, త్యాగాలకు విలువులేకుండా పోతున్నది. ఆమె ఆ ఇంట్లో వెట్టిచాకిరి చేసే శ్రమజీవి, బానిసగా మిగిలిపోతున్నది. ఆమె తినే తిండి కూడా లెక్కలు కట్టే దుస్థితి కొన్ని కుటుంబాల్లో కనిపిస్తున్నది. దీంతో పోషకాహారం కరువై ఎనీమియా బారిన పడుతున్న మహిళపూందరో..ఇలా కనిపించని హింస వల్ల మగువలు మానసికంగా కుంగిపోయి రోగాల బారిన పడుతున్నారు. అనారోగ్యం బారిన పడిన భార్య కి చేయూతనివ్వాల్సిన భర్త రెండవ పెళ్లికి సిద్ధపడుతుండడం ఈ మధ్య పరిపాట య్యింది. స్త్రీలు ప్రేమరాహిత్యాన్ని అనుభవిస్తూ జీవితాల్ని వెళ్లదీస్తున్నారో తెలపడానికి ఇదో ఉదాహరణ. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా మహిళల జీవితాల్లో మాత్రం మార్పులు రావడం లేదు. పిల్లలు కలగకపోవడం అనేది ఇప్పటికీ స్త్రీలలో ఉన్న లోపంగానే చాలామంది పరిగణిస్తున్నారు. ఆడపిల్లల్ని కనడం కూడా మహిళలకు శాపమైంది. లింగ నిర్ధారణ పరీక్షల వల్ల ఎందరో తల్లులు తమ జాతి శిశువుల్ని ఏడుస్తూ చంపుకుంటున్నారు.

పిత్రుస్వామిక భావజాలంతో మహిళలు కూడా పీడకులుగా మారిన ఓ వికృత పరిస్థితి నేడు నెలకొన్నది. దీంతో స్త్రీ తన స్వేచ్ఛను కోల్పోతున్నది. చాలామంది స్త్రీలు అస్వతంవూతతోలోనే ఆనందం ఉందని విశ్వసించారు. పంజరంలో పక్షి తలుపులు తీసినా ఎగరడానికి ఇష్టపడని స్థితి అన్నమాట. స్త్రీల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే క్రమంలో ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థలు, ప్రజాస్వామిక వాదులు వారికి అండగా నిలిచి పురుషులతో పాటుగా స్వేచ్ఛ, స్వాతంత్య్ర సమానత్వాల కోసం పోరాడారు. ఆస్తిహక్కును, ఉద్యోగావకాశాలను, ప్రత్యేకమైన చట్టాలను సాధించుకున్నారు.

పోరాటాల ద్వారా హక్కులు సాధించవచ్చు. కానీ ఆ హక్కులు పొందడం వల్ల మాత్రమే సమస్యలు సమసిపోవు. నేటి స్త్రీ పరిస్థితీ దీనికి తీసిపోదు. స్వేచ్ఛా స్వాతంవూత్యాలు స్త్రీలకు ఎండమావులే అవుతున్నాయి. వారి జీవితాలను పిండి చేస్తున్నాయి. ‘పబ్లిక్‌లైఫ్’ పురుషుడి హక్కు అన్నట్టు. కానీ స్త్రీ స్వభావానికి అది విరుద్ధం అన్నట్టు సమాజం కట్టుబాట్లు విధిస్తున్నది. అందుకే స్వేచ్ఛా,స్వాతంవూత్యాలున్న నేటి ఆధునిక మహిళ ఇంటాబయటా పలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సమాజం స్త్రీల సమస్యలను కేవలం స్త్రీ జాతికే సంబంధించిన సమస్యలుగా కాక సామాజిక సమస్యలుగా పరిగణించి వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా పోరాడాలి. స్త్రీలు రాజకీయంగా పురోగమించడం వల్ల ఈ పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంతావశ్యకం.
అత్యాచారం, హత్య, గృహహింస లాంటి అనేక కేసుల్లో ముద్దాయికి సరైన సమయంలో సరైన శిక్షలు అమలు కావడం లేదు. ఢిల్లీలో జరిగిన అమానత్ అత్యాచార కేసులో బాధితులకు న్యాయం జరగలేదు. ప్రభుత్వాల అలసత్వం వల్ల నేరస్థుల వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం స్త్రీల పట్ల అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే స్త్రీలకు భద్రత, ఉపాధి అవకాశాలు కల్పించాలి.

మన చుట్టూ ఎన్ని అమానుషాలు జరిగినా చూసి చూడనట్లు ఉదాసీనతతో మెలగడం కూడా ఇలాంటి సమస్యలు పునరావృతం కావడానికి ఒక కారణ మే. దేశ పౌరులుగా సమాజంలో ఒక బాధ్యతగల వ్యక్తులుగా అన్యాయాన్ని ప్రశ్నించడానికి, దౌర్జన్యాన్ని ఎదిరించడానికి ముందుకు రావాలి. ప్రతివ్యక్తీ ముందుగా తనను తాను సంస్కరించుకున్నపుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. సమాజంలో మార్పుని ఆశించినప్పుడు దానికనుగుణంగా మహిళలల్లో చైతన్యం రావాలి. ఆ చైతన్యాన్నే ఆయుధాలుగా మల్చుకొని అంతరాలు చేధించుకొని అంతరంగాలను ఆవిష్కరించుకోవాలి. విముక్తి బాటలో పయనించాలి. తమలో ఉన్న భయాలను, అభవూదతా భావాలను విడనాడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినపుడే స్త్రీలు తమ జీవితాల్లో సమూలమైన మార్పులని చూడగల్గుతారు.

-మాసపత్రి ఉషాకిరణ్, ఆదిలాబా

Namasete Telangana News Paper Dated : 8/3/2013

No comments:

Post a Comment