Friday, August 29, 2014

ఉపకులాలకు రాజ్యాంగ న్యాయం By -గోపని చంద్రయ్య, -కొంగర మహేష్

              

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68ఏళ్ళవుతున్నా.. అది కేవలం భౌగోళిక స్వతంత్రత పరమితిని దాటలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఈదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్క్రుతిక అసమానతలు ప్రస్ఫుటంగా విస్త్రుతం కావడమే. దీనివల్ల ‘స్వాతంత్ర్యం’ అన్నివర్గాలకు ముఖ్యంగా అంటరానితనం, అణిచివేతలకు గురైన అణగారిన వర్గాలకు ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఫలితంగా భారతరాజ్యాంగంలో రాసుకున్న స్వేచ్చా, సమానత్వం, సోదరభావం కాగితాలపై రాతలుగానే ఉండిపోయాయి తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. పాలకుల సంకుంచిత స్వభావం, కులాధిపత్య పరిపాలన వల్లే అసమానతలు పెరిగి ధనవంతులు ఆకాశాన్నంటే రీతిలో శ్రీమంతులు అవుతుంటే...పేదలు మరింత పేదలుగా మారి పూరిగుడెసెల్లో బతుకులీడుస్తూ దుర్భరజీవితాలను వెళ్లదీస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు, సంక్షేమరంగాల్లో కొంతమేరకు అవకాశాలు దక్కుతున్నప్పటికీ అవి అత్యంత అణిచివేతకు గురైన, అసలైన అర్హులకు అందకుండాపోతున్నాయి. రాజ్యాంగ ఫలాలు కేవలం కొన్ని కులాలకు వారివాటాకు మించి లభిస్తే... అదేజాబితాలో ఉండే మరికొన్ని కులాలకు అవి అందకుండా పోతున్నాయి. రాజ్యాంగం అమలైన ఇన్నేళ్లలో దళిత, ఆదివాసీజాతుల్లో కొన్నికులాలు ఇప్పటికీ ఓటరు లిస్టులకెక్కేందుకు నానాతంటాలు పడుతున్నాయి. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, ప్రాథమిక ఆరోగ్యం, విద్య వంటివి ఇంకా వారిని వెక్కరిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కూడా ఎప్పటిలాగే పాలకప్రభుత్వాలు పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దళితుల అభివ్రుద్ధి ఎజెండాను ముందుకు తెస్తున్నాయి. ఈరెండు రాష్ట్రాల్లో దళితులు లేదా ఎస్సీలంటే కేవలం మాలలు, మాదిగలు అనే అవగాహనతో చర్చ జరగడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కల్గిస్తోంది.  షెడ్యూల్డుకులాల్లోని అల్పసంఖ్యాక కులాలు ఉనికి, అస్థిత్వంకోసం ఇంకా ఆరాటపడుతూనే ఉన్నాయి. అటు పాలకులు సైతం ఎస్సీలంటే కేవలం మాలలు, మాదిగలు అనే అపోహలో పడి ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ మిగతా ఉపకులాలను కాలగర్భంలో కలిసేలా చేస్తున్నారు.

ఆగస్టు 7, 2014న ఉస్మానియా యూనివర్సిటీ, ఐ.సీ.ఎస్.ఎస్.ఆర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మాదిగ, మాల ఉపకులాలు: అస్థిత్వపోరాటాలు అనే అంశంపై గోపని చంద్రయ్య ఆధ్వర్యంలో ఒకరోజు జాతీయ సదస్సులో అస్థిత్వం కోల్పోతున్న ఎస్సీకులాలవారు పాల్గొని తమగోడును వినిపించారు. ఈ సదస్సుకు హాజరైన అత్యంత వెనుకబడిన డక్కలి, చిందు, గోసంగి, మాస్టిన్, మేహతర్, సమగర, మోచి, నులకచందయ, దొంబర, బుడగజంగాలు వంటి ఎస్సీకులాల ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, లెక్కలు విస్మయానికి, ఆందోళనకు గురిచేశాయి. అసలు తాము మాల,మాదిగలకు అనుబంధకులాలు, ఆశ్రిత కులాలు, ఉపకులాలుగా లేమని, తమకో అస్థిత్వం, చరిత్ర, సాంస్క్రుతి, వారసత్వాలున్నాయని చాటారు. ఎస్సీలంటే కేవలం మాల,మాదిగలే కాదు మోర్రో తాము కూడా షెడ్యూల్డుకులాలకు చెందినవారమేనని చెబుతున్నా గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటుదాకా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరుకావడం సభికులను కూడా కంటతడిపెట్టించింది. కులద్రువీకరణ పత్రం పొందాలంటే తమజాతులకు అదో ‘డిగ్రీ’సాధించనట్లే! అంతలా కష్టపడాల్సిందే. మాల,మాదిగేతర సామాజిక, సాంస్ర్కుతి పరిస్థితుల ద్రుష్ట్యా ఎస్సీకులాలది ఒక్కోదానికి ఒక్కోనేపథ్యం, జీవన విధానాలున్నాయి. మాల,మాదిగ కులాలకు ఆశ్రిత కులాలుగా పిలువబడే ఉపకులాలు సంచారజీవనం చేస్తూ పొట్టపోసుకుంటున్నాయి. ఉపకులాలుగా ఉన్న బైండ్ల, నులకచందయ కులాలవారు పౌరోహిత్యం చేస్తే... చిందు, డక్కలి, మాస్టీన్ సంచార కులాలుగా ఉంటూ తమకళలతో ఊరురూ తిరుగుతూ అణగారిన కులాల తత్వాన్ని ప్రచారం చేస్తాయి. తమ కన్నీళ్లను రంగుల మాటున దాచుకొని కళలకు జీవం పోస్తున్నారు.  కొన్ని కులాలు ఇప్పటికీ యాచకవ్రుత్తిలోనే మమేకమై బతుకులీడుస్తున్నాయి. మరికొన్నికులాల ఆడవారిని మాతంగులు, బసివినిల పేరిట హిందూఅగ్రకుల సమాజం ఇప్పటికీ ‘ఆటవస్తువులు’గానే పరిగణిస్తోంది. దేవుని పేరిట ‘అనాగరిక’ ఆటవిక కార్యక్రమాలు ఇంకా పల్లెల్లో కొనసాగుతూనే ఉన్నాయి.

మాల,మాదిగలుకాక ఈఉపకులాల జనాభా దాదాపు లక్షల్లో ఉంటే ప్రభుత్వ లెక్కలు వందలు, వేలల్లో చూపించి వారి ఉనికి, అస్థిత్వాన్ని మాయం చేస్తున్నాయి.  ఇప్పటివరకు జరిగిన జనాభా లెక్కల్లో వీరిలో కొన్ని కుటుంబాలు మాల,మాదిగలజాబితాల్లో పరిగణించడంతో తమ అస్థిత్వం కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు కులద్రువీకరణ పత్రాలు మిగతా కులాలు పొందినట్లు తహాసిల్దార్ నుంచి కాకుండా ఆర్డీవో నుంచి అందుకోవడం వీరిని నానాఇబ్బందులకు గురిచేస్తోంది. అదికూడా పలుదఫాలుగా ‘విచారణ’లు జరిగాకే ‘ద్రువీకరణ’ పత్రాలు అందుకోవడం ఈకులాల ప్రజలను ఆత్మన్యూనతకు, అవమానాలకు గురిచేస్తున్నాయి..  ‘ఫలానా కులం ఉన్నదని మాకు తెలియదు, అయినా మీరు అదే కులానికి చెందినవారని గ్యారంటీ ఏంటనీ’ అధికారులు వేధింపులకు గురిచేస్తుండటంతో  కొంతమంది అసలు కులం సర్టిఫికేట్లు పొందకుండాపోతుంటే...మరికొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో మాలగానో ,మాదిగగానో ‘గుర్తింపు’ తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం నేటి ‘సామాజిక అభద్రత’ను బహిర్గతం చేస్తోంది.

 ఇప్పటికీ తమ కులాల్లో ప్రాథమికవిద్యా స్థాయినిదాటి  డిగ్రీస్థాయికి వచ్చినవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చని చెప్పడం రిజర్వేషన్ల అమలు తీరును ప్రశ్నించడమేకాదు నేటి  ప్రభుత్వాలు చేపట్టే ‘అందరికి విద్య’ కార్యక్రమాలను సైతం నిలదీస్తోంది. తమ వర్గాలనుంచి ఇప్పటి వరకు కనీసం గ్రామపంచాయతీల్లో వార్డు మెంబరు కూడా కాకపోవడానికి కారకులెవరని ఎస్సీ కోటాలో అందుతున్న ఫలాలు అనుభవిస్తున్న మాల, మాదిగలను సూటిగానే ప్రశ్నించారు. ఎస్సీలంటే కేవలం మాల,మాదిగలు మాత్రమే కాదు ‘మేమూ ఉన్నాం. కాస్తా పట్టించుకోండి’ అంటూ విన్నవించుకోవడం అందరినీ ఆలోచింపజేసింది. జనాభా పరంగా మాదిగలు, మాలలు అధికంగా ఉండటం... వారు స్థిరనివాసం కలిగి గ్రామపరిపాలన వ్యవహారాల్లో భాగస్వాములవడంతో సహజంగానే విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో రాజ్యాంగ పరంగా అందుతున్న వాటాలో వీరిదే సింహభాగమైంది. అదే జాబితాలో ఉండి సంచార జీవనం, యాచకవ్రుత్తితో దినదినగండంగా బతుకులు వెళ్లదీస్తున్న ఉప కులాలు, అధికారుల నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా అన్నిరంగాల్లో తీవ్రఅన్యాయానికి గురవుతున్నాయి. ఇక పక్కా ఇళ్లు, రేషన్ కార్డుల జారీ వంటివైతే వీరికి నామమాత్రంగానే అందుతున్నాయి.  ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో తలదాచుకోడానికి ఇళ్లు లేక ఉపకులాల ప్రజలు నానాఅగచాట్లు పడుతున్నారు. కొన్నిచోట్లా ఊరిచివర ప్లాస్టిక్ కవర్లు, ప్రచారాలకు వినియోగించే ప్లెక్లీలతో గుడిసెలు వేసుకొని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆడవారికి మరీముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ ‘తాత్కాలిక’ఏర్పాట్లు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, ప్లెక్లీల వేడికి అప్పుడే పుట్టిన బిడ్డలు మ్రుత్యువాతపడతున్నారు. దీనికితోడు పౌష్టికాహారలోపంతో అనేక రోగాలకు గురవుతున్నారు.

        ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డు కులాలకు రాజ్యాంగం ద్వారా విద్యా, ఉద్యోగ రంగాల్లో సంక్రమించిన రిజర్వేషన్లను కేవలం ఒక కులం అనుభవిస్తోందని మాదిగలు ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)పేరిట బలమైన ఉద్యమం నడిపేంతవరకు వాటి అమలు తీరుతెన్నులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ‘దండోరా ఉద్యమం’ తర్వాతే ఎస్సీజాబితాలో దాదాపు 60కులాలు ఉన్నాయని బాగాప్రచారంలోకి వచ్చింది. వెలుగులోకి అయితే వచ్చాయి కానీ వారి జీవితాల్లో మాత్రం ఏలాంటి వెలుగు రాకపోవడం కచ్చితంగా  పాలకుల చిన్నచూపు...సంఖ్యపరంగా మెజార్టీగాఉన్న మాల, మాదిగల ఆధిపత్యాలే కారణమని చెప్పాలి. ఇన్నాళ్లు మాదిగలు దళితుల్లోనే దళితులుగా మిగిలిపోయామని చెబుతుంటే..తాము అంటరాని వారికే అంటరానివారిగా మిగిలిపోయామని మిగిలిన ఉపకులాలు ఘోషిస్తుండటం... రాజ్యం అమలుచేసే ప్రతి సంక్షేమ పథకాన్ని పున:సమీక్షించుకోవాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రిజర్వేషన్ల ‘ఏబీసీడీ’వర్గీకరణ అమలైన నాలుగేళ్ల (2000 నుంచి 2004 )కాలంలోఎస్సీ ఉపకులాలకు కొంతమేరకు న్యాయం జరిగినప్పటికీ వాటిలో జనాభాపరంగా చెప్పుకోదగ్గస్థాయిలో ఉన్న కొన్నింటినీ మాల (సీ), మాదిగ (బీ) గ్రూపుల్లో చేర్చారు. దీంతో జనాభాపరంగా, విద్యా,ఉద్యోగపరంగా అప్పటికే ముందున్న మాలలతో పోటీపడలేక వచ్చిన అరకొర అవకాశాలు కూడా తమకు దక్కకుండాపోతున్నాయని మాల ‘సీ’గ్రూపులో ఉన్న గోసంగి వంటి కులాలవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 144జీవోజారీ చేసి బుడగజంగాలను ఎస్సీ జాబితాలో నుంచి తొలగించారని ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల తాము ఎస్సీ హోదాలేక ఏఅవకాశం తమ దరికి చేరడం లేదని, తమ బతుకులకు ఇక బిక్షాటనేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

        ఉమ్మడి తెలుగు రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయినా జనాభా దామాషా ప్రకారం,  సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా షెడ్యూల్డుకులాల రిజర్వేషన్ల హేతుబద్దీకరణ (వర్గీకరణ) జరగాలి. ఇది శాస్త్రీయబద్ధంగా ఉండాలి. బైండ్ల, చిందు, మాస్టీన్,డక్కలి వంటి కులాలు తెలంగాణలో ఉంటే ఆదిఆంధ్ర, రెల్లి,పైడి,పాకి వంటివారు ఆంధ్రాలో ఉంటారు. అందువల్ల ఈరెండురాష్ట్రాల్లో షెడ్యూల్డు కులాల జాబితాను పున:నిర్వచించాల్సిన అవసం ఎంతైనా ఉంది. ఇప్పటికీ ఈరెండు రాష్ట్రాల్లో 2001 జనాభా లెక్కలే ప్రామాణికం. మొన్న తెలంగాణలో జరిగిన సమగ్రసర్వే షెడ్యూల్డు కులాల జనాభాలో ఏకులం జనాభా ఎంత ఉందో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చేపట్టాలి. ఎస్సీ కులాల సమగ్ర అభివ్రుద్ధికి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతోపాటు ఆర్థిక సహాకార సంస్థ నుంచి అత్యంత వెనకబడిన కులాలకు ప్రత్యేక కోటా ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టంతోపాటు అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలు వీరికి చేరేలా పకడ్బందీ ప్రణాళిక రూపకల్పన చేసి రాజకీయరంగంలో వీరి జనాభాకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలని సదస్సుకు వచ్చిన వక్తలు అభిప్రాయపడ్డారు. ఎస్సీల పేరుతో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్ని తొలుత ఈకులాల పంపిణీతోనే మొదలుకావాలి. ఉపకులాన్నింటికీ అల్పసంఖ్యాక కులాల పేరుతో విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. ప్రపంచీకరణ, ప్రభుత్వాల చిన్నచూపుతో క్షీణించిపోతున్న చిందు యక్షగాన కళారూపాలు, బహురూపుల కళావారసత్వాలను కొనసాగిస్తున్న  కళాకారులను అన్ని విధాలుగా ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు.  దీనికితోడుగా ఇన్నాళ్లు హక్కులు, అవకాశాల పేరుతో ఉద్యమించిన మాల, మాదిగలు సాటి దళితుల (అత్పల్పకులాల ప్రజల) దరిద్ర్యాన్ని పొగొట్టకపోయినా వాటి నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నంమాత్రం చేయవద్దు. తమకంటే కూడా అత్యంత వెనుకబడిన, అణగారిపోయిన కులాలు తమ‘జాబితా’లోనే ఉన్నాయనే వాస్తవాన్ని ‘పైరెండు కులాలూ’ గ్రహించాలి. దాంతోపాటు ఉపకులాల ప్రధాన సమస్యలకు ‘వర్గీకరణ’రెండు రాష్ట్రాల్లో జరగాల్సిన అవసరాన్ని ఉపకులాల ప్రతినిధులు తాము ఏర్పాటు చేసుకున్న ‘ఎస్సీ అల్పసంఖ్యాక ఉపకులాల ఐక్యవేదిక’ద్వారా డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగపరమైన అవకాశాలు, నిధులు, హక్కులు, వనరులు సమాజంలో అత్యంత అణిచివేతకు గురైన ఎస్సీ ఉపకులాల నేపథ్యంగా కేటాయింపులు జరగాలి. అందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దళితుల అభివ్రుద్ధి, సంక్షేమం పేరిట రాజకీయంగా ప్రాబాల్యం ఉన్న కులాలే లబ్ధిపొందే ప్రమాదముంది.  రాజ్యాంగం అందించే ఏ అవకాశన్నైనా ఒకటి, రెండు కులాలు మాత్రమే అనుభవిస్తూ ఉంటే అది చివరికి సామాజిక అశాంతికి, అంత్యర్యుద్ధానికి దారితీసిన ఆశ్యర్చపడాల్సిన పనిలేదు.

        చివరగా ఎస్సీ రిజర్వేషన్ల ‘వర్గీకరణ’కు మద్ధతు తెలపడం, బహుజన రాజకీయాలను నిర్మించడం రెండూ వైరుద్యమైన అంశాలు కావని అవి పరస్పర ప్రోత్సాహకర అంశాలుగా అర్థం చేసుకోవడం ద్వారానే ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ తాత్వికతను పెంచి విశాల రాజకీయాలను అణగారిన కులాలకు అందించగలమని రెండూ రాష్ట్రాల ఉద్యమకారులు, నాయకులు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా  ఉంది.
       
                                                        -గోపని చంద్రయ్య
                                                        (09956377352)
అసిస్టెంట్ ప్రొఫెసర్, జి.బి.పంత్ సోషల్ సైన్స్ ఇన్సిట్యూట్, అలహాబాద్
-కొంగర మహేష్
                                                        (9866464567)
రిసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్


Article Published in Andhra Jyothi Telugu News Paper Dated: 28/08/2014 


Sunday, August 24, 2014

సెంట్రల్‌యూనివర్సిటీలో అడుగడుగునా వివక్ష! By -ఓడపల్లి అనిత


Updated : 8/23/2014 12:26:20 AM
Views : 85
తెలంగాణ రాష్ట్రం కోసం ౧౯౬౯లో పోలీసు తూటాలకు నేలకొరిగిన ౩౬౯మంది నెత్తుటి సాక్షిగా ఏర్పడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో ఆది నుంచీ తెలంగాణ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ౧౯౭౪లో ఆరు సూత్రాల పథకంలో భాగంగా పార్లమెంటు యాక్ట్ ద్వారా ఏర్పడిన యూనివర్సిటీలో ముఖ్యంగా దగాపడ్డ తెలంగాణ ప్రాంతం విద్యా, ఉద్యోగ రంగంలో వెనకబడిపోయిందని నాటి కేంద్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, నిరుద్యోగులకు ౬౦ శాతం విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. కానీ ఆరు సూత్రా ల పథకాన్ని తుంగలో తొక్కిన ఆంధ్ర పాలకులు ఆ రిజర్వేషన్లు ఎక్కడా కానరాకుండా చేశారు. దాని కారణంగా తెలంగాణ ప్రాంత విద్యార్థుల సంఖ్య ౨౦ శాతమే. యూనివర్సిటీలో ౪౫౦మంది అధ్యాపకులు ఉంటే తెలంగాణ ప్రాం తం వారు ౩౦ మందే. అంటే ౬.౬ శాతం. ఇక బోధనేతర సిబ్బంది సంఖ్య ౫౦ శాతం మాత్రమే ఉన్నారు.

యూనివర్సిటీ ఏర్పడిన నాటి నుంచి ౨౦ఏళ్లకు పైగా వైస్‌చాన్స్‌లర్లు ఆంధ్రప్రాంతం వారే నియమించబడ్డారు. యూనివర్సిటీలో అర్హులైన తెలంగాణ అధ్యాపకులు ఉన్నా ఏనాడు వారికి ఆ అవకాశం దక్కలేదు. యూనివర్సిటీలో సుమారు ౨౫ కీలక పదవుల్లో ఆంధ్రవారినే నియమించారు. అంటే తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై యూనివర్సిటీ అధికారులు ఏ మేరకు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారో అర్థంచేసుకోవచ్చు. 
యూనివర్సిటీలో ఆంధ్ర ప్రాంతం వారిది గుత్తాధిపత్యంగా పరిపాలన కొనసాగుతుంది. వివిధ ఉద్యోగాలకోసం ఎంపిక చేసే ప్రక్రియలో ఆంధ్ర ప్రాంతంవారికి అవకాశాలు కల్పిస్తున్నారే తప్ప అర్హత ఉన్న తెలంగాణ వారిని మాత్రం అప్లికేషన్ల స్క్రూటినీలోనే పక్కకు పెడుతున్నారు. రిటైర్ అయిన ఆంధ్ర ప్రాంతం ఉద్యోగులకు మళ్ళీ ఉద్యోగ అవకా శం కల్పిస్తూ రిటైర్ అయిననాటి పే స్కేలును అమలు చేసి జీతాలు ఇస్తున్నా రు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు రిటైర్ అయిన వారికి మరోసారి అవకాశాలు కల్పించకుండా చేయడమే కాకుండా, ఆయా ఉద్యోగాలకు అనర్హులుగా చేస్తున్నారు. యూనివర్సిటీలో ఒప్పంద ఉద్యోగుల నియామకాల్లో తెలంగాణ వారికి తీవ్ర అన్యాయమే జరుగుతున్నది.

తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి ఈ విధంగా ఉంటే యూనివర్సిటీలో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది.౧౯౭౪ నాటి నుంచి ఈ నాటి వరకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం ద్వారా అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్య నోచుకోకుండా పోయారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో దేశంలో ౩౫ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో మాత్రం విద్యార్థులు అనేక దఫాలుగా పోరాటాలు చేస్తే కానీ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు కాలేదు. కానీ ఆంధ్రలో మాత్రం ఆ విద్యార్థుల సౌకర్యార్థం కోసం ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

అంటే తెలంగాణ ప్రాం త విద్యార్థుల పట్ల యూనివర్సిటీ అధికారులకు ఎంత వివక్ష ఉందో అర్థం అవుతుంది. ఎంతో ప్రతిభతో యూనివర్సిటీలో చేరిన విద్యార్థుల పట్ల ఆంధ్ర ప్రాం త అధ్యాపకుల కక్షసాధింపు అంతా ఇంతా కాదు. అనేక మంది విద్యార్థులను మానసిక వేదనకు గురిచేయడం, కులం పేరుతో దూషించడం, పరీక్షలో తక్కు వ మార్కులు వేయడం సర్వసాధారణం. ఈ వివక్షతో ఇప్పటికే తెలంగాణ ప్రాంత విద్యార్థులు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసిన వివిధ కమిటీలు అధ్యాపకులే దోషు లని తేల్చిచెప్పాయి. అయినా ఆయా అధ్యాపకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే యూనివర్సిటీ అధికారులు ఆంధ్ర ప్రాంత అధ్యాపకులకు ఎట్లా వత్తాసు పలుకుతున్నారో అర్థమవుతున్నది.
యూనివర్సిటీలో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచి తెలంగాణ విద్యార్థుల పట్ల కక్షసాధింపు చర్యలు బాహాటంగానే ఉన్నా యి. యూనివర్సిటీ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు మొదట హాస్టల్ సౌకర్యం కల్పించాలి. 

కానీ తెలంగాణ విద్యార్థులు మెరిట్‌లో సీటు సంపాదించినా హాస్టల్ సౌకర్యం ఇవ్వడం లేదు. ఆరు నెలలు దాటితే తప్ప లోకల్ విద్యార్థులకు హాస్టల్ సీటురాదు. విద్యార్థులు ఈ అన్యాయాన్ని ఎదిరిస్తే నిబంధనల ప్రకార మే వ్యవహరిస్తున్నామని అంటుంటారు. ఎక్కడో ఉన్న నాన్‌లోకల్ విద్యార్థులకు, వెయిట్‌లిస్టులో చేరిన విద్యార్థులకు మాత్రం తక్షణమే హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే తెలంగాణ ప్రాంత విద్యార్థుల పట్ల ఉన్నత విద్యారంగంలో ఎంత వివక్షత చూపిస్తున్నారో అధికారుల తీరు తేటతెల్లం చేస్తుంది. ఇక యూనివర్సిటీలో అవినీతికి అంతులేదు.
ఉమ్మడి రాష్ర్టంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనేక మంది తెలంగాణ విద్యార్థులు అన్ని రకాల అన్యాయాలకు గురైనారు.

ప్రస్తుతం యూనివర్సిటీ తెలంగాణ ప్రాంత పరిధిలో ఉన్నది. ఈ యూనివర్సిటీలో నాటి ఆరు సూత్రాల పథకం ప్రకారం ఇక్కడి విద్యార్థులకు ౬౦శాతం సీట్లు రిజర్వు చేయాలి. ఉద్యోగ నియామాకాల్లో తెలంగాణ ప్రాంత ప్రజలకు అవకాశం కల్పించాలి. అనేక సంవత్సరాలుగా ఉన్నత విద్యకు దూరమైన తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి నిబంధనలు లేకుండా హాస్టల్ సౌకర్యం కల్పించాలి. ఉన్నతమైన కీలక పదవులల్లో తెలంగాణ ఉద్యోగులనే నియమించాలి. ముఖ్యం గా యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్‌చాన్స్‌లర్, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్, ఫైనాన్స్ అధికారి, యూనివర్సిటీ ఇంజనీర్, లైబ్రేరియన్ లాంటి పదవుల్లో తెలంగాణ వారిని నియమించాలి. అర్హులైన తెలంగాణ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి. తెలంగాణ విద్యార్థులకు ఆయా సూపర్‌వైజర్ల నుంచి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా వారి పరిశోధనలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. ఆయా డిపార్ట్‌మెంట్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో సీట్లు పెంచి వారికి అవకాశాలు కల్పించాలి.

యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు చరమగీతం పాడాలి. ఇప్పటి నుంచి బోధన, బోధనేతర, ఉద్యోగాలు తెలంగాణ వారినే నియమించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆయా సెంట్రల్ యూనివర్సిటీలు ఎక్కడ కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. కాబట్టి ఈ యూనివర్సిటీ ౩౦ పరీక్ష కేంద్రాలు రద్దుచేసి తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయాలి. ఒప్పంద ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ వారినే నియమించాలి. ఇప్పటి వరకు జరిగిన అక్రమ నియామకాలు రద్దు చేయాలి. ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న నాల్గవ తరగతి సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. తెలంగాణ గిరిజనులకు అడ్మిషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతున్నది. కాబట్టి వారికి ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. అప్పుడే తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరిగినట్లుగా భావించాలి. 

Namasete Telangana Telugu News Paper Dated: 23/08/2014

Thursday, August 14, 2014

రక్తమోడుతున్న గాజా By -డేవిడ్


‌ 
యూదు జాత్యహంకార దాడులకు 'గాజామరోమారు రక్తమోడుతుందిగత కొంత కాలంగా ఇజ్రాయెల్‌ విసురుతున్న ఆధునిక క్షిపణి దెబ్బలకు అతి పెద్ద బహిరంగ జైలుగా ప్రసిద్ది గాంచిన గాజా నేడు నిలువెల్లా గాయాలతోతడిసిపోతుందిజాత్యహంకారంతో దురాక్రమణపూరితంగా ఒక జాతి మొత్తాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్‌ మరణహోమాన్ని సృష్టిస్తుంటేమౌనంగా వున్న ప్రపంచ అత్యున్నత వ్యవస్థల చేతగాని తనాన్ని గాజా ప్రశ్నిస్తోందిపౌరులఆవాలసాలనే యుద్ధ క్షేత్రాలుగా మిగిల్చిన దశాబ్దాల ఇజ్రాయెల్‌ దురాక్రమణ ముందు తానే దురాక్రమణదారుగా చిత్రీకరించబడుతున్న వైనాన్ని నివ్వెరపోయి చూస్తోందిముగ్గురు ఇజ్రాయెలీ యువకులను కిడ్నాప్‌ చేసిహత్య గావించారనేసాకుతో  సారి అమానవీయ దాడులకుపాల్పడుతున్నఇజ్రాయెల్‌,మహిళలనుపిల్లలనే టార్గెట్గా చేసుకొని దాడలకు పాల్పడుతోందిగత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ పాలస్తీనీయుల్ని అడపాదడపా కవ్విస్తున్నప్పటికీఈమధ్యకాలంలో తన జాత్యాంహంకారాన్ని నగ్నంగా ప్రదర్శిస్తూ ప్రత్యక్ష యుద్ధానికి కాలుదువ్వుతున్నదిగత 20 రోజులుగా సాగుతున్న  దాడుల్లో వందలాది మంది అమాయకులు మృత్యువాత పడుతున్నారుముగ్గురు ఇజ్రాయెలీ యువకులహత్యలకు తామే బాధ్యలమని ఇస్లామిక్‌ జిహాది సంస్థ ప్రకటించుకున్నప్పటికీ ఇజ్రాయెల్‌ ప్రధాని మాత్రం కళ్ళూచెవుతూ మూసుకుని హమాస్‌ సంస్థదే బాధ్యత అని ప్రకటిస్తూ గాజా పౌరులపై ప్రతీకారం అమలు చేస్తున్నాడుదీనిని బట్టేఅర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్‌ తోడేలు న్యాయం ఎలా ఉందో!
అగ్రదేశాలకుట్రలకుబలైనపాలస్తీనా:        వేల సంవత్సరాల క్రితం కలిసిమెలిసి సహజీవనం సాగిస్తున్న యూదుపాలస్తీనీయుల మధ్య యూరోపియన్‌ దేశాలు చేసిన దండయాత్రలు ఇరువర్గాలవారిని శత్రువులుగా తయారుచేశాయిపాలస్తీనాపై గ్రీకులురోమన్లు చేసినదండయాత్రల మూలంగా యూదులు ప్రపంచంలోని అన్నివైపులకు వలస వెళితే,  పాలస్తీనీయులు మాత్రం యూరోపియన్‌ దేశాలతో పోరాడుతూమరణిస్తూ అక్కడే జీవించారువలస వెళ్ళిన యూదులు వివిధ దేశాల్లో స్థిరపడిధనవంతులుగా మారారుఅయితే రెండో ప్రపంచ యుద్ధంలో జాత్యాంహంకారంతో రెచ్చిపోయిన హిట్లర్‌ యూదుల్ని ఉచకోత కోయడంతో వారి జీవితం ప్రశ్నార్థంగా మారిందియుద్దానంతరం యూదుల ఆస్తులపై కన్నువేసిని అమెరికా,ఇంగ్లాండ్‌ దేశాలు హిట్లర్‌ యూదులపై జరిపిన జాతి హత్యకాండకు పరిహారం చెల్లించే పేరుతో పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా అక్రమించి 1948 మే 15 తేదీన అమెరికాబ్రిటన్లు ఇజ్రాయెల్‌ దేశాన్ని స్థాపించాయిలక్షల మందిపాలస్తీనీయులను వారి ఇళ్ళ నుండి భూముల నుండి బలవంతంగా తరిమేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీయులను పాలస్తీనాకు రప్పించారుపాలస్తీనీయుల ఆస్తులుభూములను కట్టబెట్టారువాస్తవానికి యూదు హత్యకాండనురచించింది హిట్లర్‌ నేతృత్వంలోని జర్మనీబాధితులు యూదులుయూదులకు పరిహారం ఇవ్వవలసింది జర్మనీ లేదా సాటి యూరోపియన్‌ దేశాలు కాని న్యాయం (పరిహారంపేరుతో జరిగిన కుట్రకు యూదు హత్యకాండకు ఏమాత్రంసంబంధం లేని పాలస్తీనీయులు బలయ్యారుబలవుతూనే వున్నారుయూరోపియన్‌ దేశాల కుట్ర మూలంగా గత డెబ్బై ఎండ్లుగా పాలస్తీనా యుద్ధక్షేత్రంగా మారిపోయింది.  అగ్రదేశాల అండదండలతో లక్షల పాలస్తీనియులను ఇజ్రాయెల్సైన్యం వెంటాడి వేటాడిందితమ ఇళ్ళను వదిలి పక్క దేశాలకు పారిపోయేదాక వెంటబడి తరిమిందిఆరు దశాబ్దాల నుండి పాలస్తీనా అరబ్బులు తమ సొంత ఇళ్లకూపొలాలకూ తిరిగి రావడానికి ప్రయత్నించడంతో ఘర్షణలుతలెత్తుతున్నాయి. .
స్వంత గడ్డపైనే నిర్వాసితులుగా మారిన పాలస్తీనియన్లు :
ఇజ్రాయెల్ని సృష్టించడానికి పాలస్తీనా ప్రజల భూములనుగ్రామాలనుఇళ్లను నీళ్లనుపచ్చని పంట పొలాలను లాక్కున్నారుసహస్రాబ్దాలుగా వారు నడిచిన నేలను వారికి కాకుండా చేశారుఐరాస తీర్మానం ద్వారా ఇజ్రాయెల్కికేటాయించిన భూమికంటే ఎక్కువ లాక్కుని పాలస్తీనీయులను తరిమితరిమి కొట్టారు.బ్రిటన్‌- ఫ్రాన్స్‌- అమెరికాల సహాయంతో యూదు సైన్యాలు సాగించిన ఆరాచకాల ధాటికి పాలస్తీనీయులు పొట్టచేతపట్టుకొని పొరుగు రాజ్యాకు వలసపోయారు.పాలస్తీనా భూభాగంలో నివసించిన పాలస్తీనా అరబ్బులలో దాదాపు 85శాతం మంది  విధంగా బలవంతంగా వెళ్లగొటట్టబడినవారే.
2012 ఐరాస అంచనా వేసిన లెక్కల ప్రకారం వెస్ట్బ్యాంక్‌, గాజాలతో పాటు పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనా శరణార్థుల సంఖ్య 5.1 మిలియన్లువీరికి ఇంతవరకు ఒక దేశం అంటూ లేదు. 1967నాటిఅరబ్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం తర్వాత ఐరాస తీర్మానం ప్రకారం పాలస్తీనా అరబ్బులకు కేటాయించిన భూములను కూడా ఇజ్రాయెల్‌ దురాక్రమించిందిఅప్పటి నుండి సదరు దురాక్రమణ కొనసాగుతునే ఉందిపాలస్తీనా భూములనే కాక సిరియా,లెబనాన్‌, ఈజిప్టుజోర్దాన్‌ దేశాలకు చెందిన భూభాగాలను కూడా కొన్నింటిని ఇజ్రాయెల్‌ ఆక్రమించిందిఇలా అక్రమించిన భూముల్లో ఇజ్రాయెల్‌ యూదుల కోసం ఆక్రమంగా సెటిల్మెంట్లు నిర్మిస్తూవస్తోందిప్రపచం నలుమూలల్లోనివశిస్తున్న యూదులను పిలిచి వారికి  సెటిల్మెంట్లు కేటాయిస్తోందితద్వారా సరికొత్త వాస్తవాలను భౌతికంగా ఏర్పాటుచేసుకొని పాలస్తీనా మొత్తం ఇజ్రాయెల్గా ప్రకటించుకోవాలని అమెరికా అండతో కుట్రలు చేస్తోంది నేరాలను,దుర్మార్గాలను ప్రశ్నించే వారిని అరెస్టు చేసి విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో కుక్కుతున్నారు.
మౌనం వహిస్తున్న అంతర్జాతీయ సమాజం:
ఇజ్రాయెల్‌ సాగిస్తున్న  దురన్యాయాలను అంతర్జాతీయ సమాజం గత యాభై సంవత్సరాలుగా చూస్తూ కూడా మౌనం పాటిస్తూ వచ్చిందినిజానికి ఐరాస ప్రధానంగా అమెరికా పనిముట్టుగానే పనిచేస్తోందిఇదే తరహా దురహంకారయుద్ధాన్ని 2007 డిసెంబర్లో ఇజ్రాయెల్‌ కొనసాగించినప్పుడు 1400 మందికి పైగా పౌరులు చనిపోతే రిచర్డ్‌ గోల్డ్‌ స్టోన్‌ చేత ఐరాస విచారణ జరిపించిందిఆయన చేసిన సిఫారస్సులను ఇంతవరకు ఐరాస పట్టించుకోలేదుగాజాసహాయార్థం వచ్చిన అంతర్జాతీయ నౌకలపై ఇజ్రాయెల్‌ సైన్యం ముష్కర దాడిచేసి 11మందిని చంపేసిన ఘటన విషయంలోనూ నిర్ణయాలు గానీ చర్యలు గానీ లేవుఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమెన్‌ నేతన్యాహూ ఒక అడుగు ముందుకు వేసియుధావిధిగా మానవ హక్కుల సంస్థ తీర్మానంపైకూడా విషం కక్కాడు. ''మానవ హక్కుల సంస్థ తన తీర్మానానికి తానే సిగ్గు పడాలి'' అని హుంకరించాడుఅగ్రరాజ్య అమెరికా అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే ఇజ్రాయెల్ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తోందిఐరాస అమెరికా మాట జవదాటకుండా కేవలం తన పరిధిల్లో ఐరాస ప్రకటనలు కేవలం నామమాత్రమే ప్రకటనల వల్ల వాస్తవంగా ఎటువంటి ఫలితమూ ఉండదుధైర్యం కలగడం అన్నది ఒట్టిమాట.అయితే గతంలో అలీనోద్యమంలో కీలక పాత్రను పోషించిన భారత్‌ నేడు మౌనంగా వహిస్తుందిఅంతర్జాతీయ చట్టాలనున్యాయాన్ని యధేచ్ఛంగా ఉళ్లంగిస్తూ ఇజ్రాయెల్‌ మరణహోమానికి పాల్పడుతుంటే ఇరుదేశాలు సంశమనం పాటించాలనిభారత్‌ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఉపదేశం చేస్తుంది!. భద్రాత సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కాంక్షిస్తున్న భారత్‌ పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న దాష్టికాం పట్ట మౌనంగా వుండడం ఆక్షర్యకరంపాలస్తీనా సమస్యకు త్వరిత గతినపరిష్కారారం కనుగోనాలని గతంలో పిలుపు నిచ్చిన భారత్‌ ఇవ్వాళ మౌనంగా ఉండడం జాత్యహంకారులకు వత్తాసు పలకడమే అవుతుందివాస్తవానికి ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా సమస్యపై ప్రపంచ దేశాలు చేసిందేమి లేదు. 2012లోరెండు లక్షల మంది నివసించే అతి చిన్న పాలస్తీనా భుభాగంపై దురహంకార ఇజ్రాయెల్‌ అత్యాధునికి ఆయుధ సంపత్తితో ఏకపక్షంగా విరుచుకుపడి 1400 మంది ఆమాయక పౌరులను బలితీసుకుంటే ఇరాన్‌ తప్ప నోరు మెదిపిన అలీనదేశమే లేదు.
      జెనీవా సదస్సు ఆమోదించిన అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా విచక్షణా రహితంగా బలప్రయోగం చేయడం చట్టవిరుద్ధంఒకవేళ హామాస్‌ మిలిటెంట్లే నిజంగా ముగ్గురు ఇజ్రాయెలీ యువకుల్ని చంపారని వాదనకు అంగీకరించినప్పటికీదానికి ప్రతికారంగా అమాయకులైన పాలస్తీనియన్లను శిక్షించడం చట్టవిరుద్దంపౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంవారిని చంపడం జెనీవా సదస్సు తీర్మానాలకుమానవ హక్కుల చట్టాలకు కూడా విరుద్ధమేఅంతర్జాతీయచట్టాలను యధేచ్ఛగా ఉళ్లంగిస్తూ యుద్దనేరాలకు పాల్పడుతున్నప్పటికీ అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండటం ప్రమాధకరంవాస్తవానికి యుద్ధనేరాలు పాల్పడడం ఇజ్రాయెల్కు  కొత్తకాదుతన పెద్దన్న అమెరికా అడుగుజాడల్లోనడుస్తున్న ఇజ్రాయెల్‌ చరిత్ర కూడా రక్తం మరలతో నిండిపోయిందే
దాడుల వెనక అమెరికా ఉద్ద్యేశం:
 కుట్రకు అమెరికాఐరోపాల మద్దతు ఉందిముఖ్యంగా అమెరికా అండతో ఇజ్రాయెల్‌ రాజ్యం చెయ్యని నేరం లేదుఅమెరికాఐరోపాలకు చమురు సంపదలకు నిలయమైన అరబ్బు దేశాల మధ్య ఒక త్రోజాన్‌ హార్స్‌ కావాలిదానిసాయంతో అరబ్బు దేశాలను నియంత్రిచాలితద్వారా అక్కడి చమురు సంపదలను తమ చేతుల్లో పెట్టుకోవాలిఅమెరికాఐరోపా సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేరాలంటే ఇది తప్పనిసరి దేశానికైనా ఇంధన వనరు అత్యవసరమే.కాకపోతే  అవసరం ఎలా తీర్చుకోవాలి?. మన ఉత్పత్తులను వారికి ఇచ్చి వారి చమురు మనం తీసుకోవాలికానీ వలసవాద దోపిడీకిబల ప్రయోగంతో స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు అలవాటు పడ్డ సామ్రాజ్యవాద దేశాలకుస్నేహపూరిత వాణిజ్యం ద్వారాసరుకులు ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా అవసరాలు తీర్చుకోవడం అంటే తెలియదువారికి తెలిసిందల్లా కుట్రలు చేయడందండెత్తడందురాక్రమించడంలొంగదీసుకోవడంభారత దేశంలోపాటు ఇతరఅసియా దేశాలనుఆఫ్రికాదక్షిణ అమెరికా దేశాలనుకొన్ని తూర్పు ఐరోపా దేశాలను వారు ఇలాగే దురాక్రమించివందలయేళ్లు వలసలుగా పాలించారువాణిజ్యం పేరుతో వచ్చి సంపదలను దోచుకెళ్ళి కుప్పలు పోసుకున్నారు.జాతీయెద్యమాలతో  దేశాలు నామమాత్ర స్వతంత్ర దేశాలుగా అవతరించాక దోచుకెళ్ళిన డబ్బునే అప్పులుగా ఇచ్చిఫెనాన్స్‌ ద్వారా ఆయా దేశాల ప్రభుత్వాలను తద్వారా అక్కడి సహజ సంపదలను నియంత్రిస్తున్నారుఇదే తరహాలోపాలస్తీనాను ఇజ్రాయెల్‌ దురాక్రమించిందిఅక్రమించిందిఇజ్రాయెలే అయినా దాని వెనుక ఉన్న అసలు శక్తులు అమెరికాఐరోపాలువాటి మద్దతు లేకుండా ఇజ్రాయెల్‌ ఉనికి ఒక్క రోజన్నా ఉంటుందా అన్నది అనుమానమే.
గాజాపై దాడుల అసలు లక్ష్యం:
      1947లో ఐరాస ఇజ్రాయెల్ను ఏర్పాటు చేసినప్పుడు దానికి కేటాయిచింది దాదాపు 50 శాతం పాలస్తీనా భుభాగం కాగా పాలస్తీనాకు నేడు వెస్ట్బ్యాంక్‌, గాజాలు మాత్రమే మిగిలాయిహమాస్కు ఉగ్రవాద నేపథ్యం ఉన్నప్పటికీప్రజాస్వామ్యబంద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే గాజాలో అధికారంలోకి వచ్చింది కానీ హమాస్పై ఉగ్రవాద సంస్థగా ముద్రవేసి ఇజ్రాయెల్‌, అమెరికా గాజాపై దిగ్బంధాన్ని సాగిస్తున్నాయిగత కొన్ని సంవత్సరాలుగా గాజాలో విద్యుత్తునీటిసరఫరా నిలిపివేస్తూఆహారం,మందులు అందకుండా చేస్తున్నారు. ప్రాంతంలోకి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను అనుమతించాలని తమ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం వారు పాటించలేదు.  కేవలం 40కి.మీ పొడవు, 10 కి.మీవెడల్పు ఉన్న అతి చిన్న భూభాగం గాజా భూభాగంలో 17 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారుప్రత్యేకంగా యుద్ధ క్షేత్రాలను నిర్మించుకునే వసతి గాజాలో లేదుగాజా ప్రజలు ఏమి చేసినా  పరిమిత భూభాగంలోనేజరుపుకోవాలిప్రభుత్వ భవనాలుజనవాసాలుమిలట్రీ బ్యారక్‌ అంటూ  వేరుగా నిర్మించుకునే వసతి అక్కడ లేదునిజానికి గాజాపై ఇజ్రాయెల్‌ తరచుగా చేసే విశృంఖల దాడులకు అదే అసలు కారణంగాజా ప్రజలను ఎంత గట్టిగా,ఎంత సూటిగాఎంత భారీ నొప్పి కలిగేంతగా బాధిస్తే వారు అంత కుక్కిన పేనుల్లా పడి ఉండారని ఇజ్రాయెల్‌ భావిస్తుందిఅందుకోసం ఒక జాతిమొత్తాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకొని తరచుగా మరణహోమాన్ని సృష్టిస్తుంది.                      2012 నాటి గాజా యుద్ధంలోకూడా పాలస్తీనాను మధ్యయుగాల్లోకి నెట్టివేయడమే లక్ష్యంగా దాడులు చేయాలని వివిధ ఇజ్రాయెల్‌ నాయకులు ప్రకటనలు విడుదల చేశారుఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఏరియల్షరాన్‌ కుమారుడు గిలాద్‌ షరాన్‌ అయితే ఒకడుగు ముందుకు వేసీ గాజాను నేలమట్టం చేయాలని జెరూసలేం పోస్టు పత్రికలో ఏకంగా ఆర్టికల్‌ రాశాడు. ''గాజా మొత్తాన్ని నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందిఅమెరికన్లు హీరోషిమాపైదాడితోనే ఊరుకున్నారాలేదు జపనీయులు అనుకున్నంత త్వరగా లొంగిరావడం లేదుఅందువల్ల నాగసాకి పైన కూడా వాళ్లు (అణుబాంబుదాడిచేశారుగాజాలో విద్యుత్‌ అనేదే
ఉండకూడదుగ్యాస్‌ ఉండకూడదుఅసలు ఎటువంటి వాహనమూ అక్కడ రోడ్లపై తిరగకూడదు'' అని గిలాబ్‌ రాశాడుదీనిని బట్టి ఇజ్రాయెల్‌ పాలకులు ఎంత కరుడుగట్టిన జాత్యంహకారులో తేటతెల్లం అవుతుంది.          
      అయితే పాలస్తీనియన్లకు యుద్ధం అన్నది కొత్తకాదుఏడున్నర దశాబ్దాల నిరంతర పోరాటంలో యుద్ధం వారి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది సుదీర్ఘ యుద్ధంలో ఇజ్రాయెల్‌ సైనికులు నిత్యం సాగిస్తున్న మారణహోమాలనుండిస్వజాతిని రక్షించుకోవడానికి ప్రతి ఇంటినీ యుద్ధ శిబిరంగా మలుచుకోనే దుస్థితి అగ్రరాజ్యాలు కల్పించాయిఇవ్వాళ స్వస్థలంలోనే పాలస్తీనియన్లు దురాక్రమణదారులు , టెర్రరిస్ట్గా చిత్రీకరించబడుతుడున్నాడుజాత్యంహకార ఆధిపత్యంతో,ఆధునిక ఆయుధ సంపత్తితోఅగ్రరాజ్య అండదండలతో మారణహోమానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్ను అంతర్జాతీయ సమాజం నిలువరించకపోతే ఒక జాతిమొత్తం హరించుకుపోయి చివరకు మిగిలేది ఇజ్రాయెల్‌ మాత్రమేసామ్రాజ్యవాదదేశాల ఆధిపత్యానికిజాత్యహంకారానికి వ్యతిరేకంగా పాలస్తీనియన్లు నిర్వహిస్తున్న పోరాటానికి ప్రజాస్వామికవాదులు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.

Surya Telugu News Paper Dated: 15/08/2014