Saturday, July 28, 2012

దళితుల అభివృద్ధిని ఓర్వలేని పెత్తదారులు--జి లకëణరావు


  • భూమిపై హక్కు అడిగితే హతమార్చారు
  • అధికారులు సకాలంలో స్పందిస్తే ఐదు ప్రాణాలు నిలిచేవి
  • లక్షింపేట దళితులకు అండగా నిలిచిన కెవిపిఎస్‌
బూరాడ సుందరరావు(40) బ్యాండు పార్టీ గాయకుడు. వీరఘట్టం మండలం కొట్టుగుమ్మడలో ఒక కార్యక్రమంలో పాల్గొని జూన్‌ 12న ఉదయం ఇంటికొచ్చాడు. చద్దన్నం తింటున్న సమయంలో కొంతమంది పెత్తందార్లు ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. తనను చంపొద్దని కాళ్లావేళ్లా పడినా.... వారు కనికరించలేదు. ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి పెద్ద బండరాయితో గుండెలపై మోది హతమార్చారు.
వృద్ధుడు నివర్తి వెంకట్‌(50) కూడా ఇంట్లో భోజనం చేస్తుండగా పెత్తందార్లుల మూకుమ్మడిగా వచ్చి దాడి చేశారు. ఇంటి నుంచి ప్రభుత్వ పాఠశాల సమీపం వరకూ లాక్కెళ్లి బళ్లాలతో పొడిచి చంపారు.
ప్రాణాలు కాపాడుకునేందుకు పక్క వీధిలోకి పరుగెడుతున్న నివర్తి సంగమేశు(45)ను తోడేళ్లలా వెంటాడి మరీ బరిసెలతో పొడిచి, గొడ్డళ్లతో నరికారు. తీవ్రంగా గాయపడిన ఆయనను రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
చిత్రి అప్పడు(45)ను భార్య, పిల్లల కళ్లెదుటే బండరాళ్లతో తలపై మోది అతి కిరాతకంగా హత్య చేశారు.
ఇంట్లో పడుకున్న బొద్దూరు పాపయ్యను బయటకు లాక్కెళ్లి కత్తులు, బరిసెలతో కసితీరా ఒంటి నిండా 30 పోట్లు పొడిచారు. రక్తపుమడుగులో పడి ఉన్న పాపయ్యను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆయన కెజిహెచ్‌లో మృతి చెందాడు.
మంత్రి కొండ్రు మురళీమోహన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం లక్షింపేట గ్రామంలో దళితులపై సాగిన ఊచకోత ఇది. వీరే కాదు మరో 31 మందికి కాళ్లు, చేతులు విరగ్గొట్టి, తలలు పగులగొట్టి చావబాదారు. పెత్తందార్లల హింసాకాండపై ఈ వారం ప్రజాశక్తి ప్రత్యేక కథనం....
ఆ రోజు ఏం జరిగింది..?
జూన్‌ 12న ఉదయం 7.30 గంటలు. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న లక్షిం పేట గ్రామం పెత్తందారుల భూ దాహానికి భగ్గుమంది. పెత్తందారులు సృష్టించిన నరమేధంతో ఆ గ్రామం ఒక్కసారి ఉలిక్కి పడింది. దళితుల రుధిర ధారలతో లక్షింపేట తడిచి ముద్దయింది. బాంబులు... గొడ్డళ్లు... బళ్లేలు... రాళ్లు... కారంపొడులతో సుమారు 200 మంది పెత్తందారులు ఏకపక్షంగా దళితులపై మెరుపుదాడి చేశారు. దళితవాడకొచ్చే ముందు నాలుగు నాటు బాంబులు విసిరి భయానక వాతా వరణాన్ని సృష్టించారు. సుమారు మూడు గంటల పాటు మారణహోమం సృష్టించారు. పాశవికంగా మృత్యుకేళీ సాగించి ఐదుగురిని పొట్టన పెట్టుకున్నారు. 31 మందిని క్షతగాత్రులను చేశారు. వాళ్లు.. వీళ్లన్న బేధం లేదు. దళితవాడలోని ప్రతి ఇంటిపైనా దాడి చేశారు. వృద్ధులు, మహిళలు, పిల్లలనే మానవత్వం, కనికరం లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చావబాదారు. ఏ ఇంటి గోడకు చూసినా దళితుల రక్తపు చారలే. దళితుల ఇళ్లల్లో ఉన్న కొద్దిపాటి తిండిగింజలు, ఆస్తులను ధ్వంసం చేశారు. పెత్తందారులు కొట్టికొట్టీ అలసిపోతే వారి కుటుంబాలకు చెందిన మహిళలు విసనకర్రలతో విసిరి, నీరందించి దాడికి ప్రోత్సహించారు. కొంత మంది మహిళలూ దాడిలో పాల్గొని కర్రలతో దళితులను చావబాదారు. దళితులు తేరుకునే లోపే రక్తం ఏరులై పారింది. దళితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తెలియజేసి, రక్షణ కల్పించాలని ఫోన్లు చేస్తే, ఒక కానిస్టేబుల్‌ను పంపారు. మారణకాండను కళ్లారా చూసిన కానిస్టేబుల్‌ భయంతో పరుగులు తీశాడు. పాతకాలం సినిమాల్లోలా నరమేధం పూర్తయ్యాక పోలీసులు మెల్లగా చేరుకున్నారు.
వివాదానికి మూలం ఇదీ...
మడ్డువలస జలాశయం కోసం వంగర మండలంలోని 12 గ్రామాల్లోని 7,799 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది. అందులో భాగంగానే లక్షింపేట గ్రామమంతా నిర్వాసిత గ్రామమైంది. లక్షిం పేటలో 77 దళిత, 77 తూర్పు కాపు, 11 ఇతర బిసి కుటుంబాలున్నాయి. ప్రభుత్వం నష్ట పరిహారాన్ని చెల్లించి గ్రామాన్ని ఖాళీ చేయించింది. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. దళితులు భూముల్లేని కూలీలైనందున వీరికి ఎలాంటి పరిహారమూ అందలేదు. వీరందరికీ పక్కపక్కనే ముత్యాలమ్మ చెరువు వద్ద ప్రభుత్వం పునరావాసం కల్పించింది. లక్షింపేట పరిసరాల్లోనే ముంపునకు గురికాని 250 ఎకరాల భూమి ప్రభుత్వ పరిధిలో ఉంది. ఆ మొత్తం భూమిని గత హక్కు దారులైన రైతుల నుంచి లక్షింపేటకు చెందిన పెత్తందారులు కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. అవి ప్రభుత్వ భూములై నందున కొన్నేళ్ల తర్వాత కౌలు ఇవ్వకుండానే సాగుచేసుకుంటున్నారు. అందులో 60 ఎకరాల భూమిని గతంలో హక్కుదారులైన రైతులు సాగుచేసుకోమని దళితులకిచ్చారు. ఇది పెత్తందారులకు సహించలేదు. ఆ భూమినీ తమ వశం చేసు కునేందుకు పధకం వేశారు. చివరికి దళితులు సాగు చేయనీయకుండా అడ్డు పడ్డారు. కెవిపిఎస్‌ అండతో లక్షింపేట దళితులందరూ సంఘటితమై, ఆ 60 ఎకరాల భూమిని మళ్లీ సాగుచేయడం మొదలు పెట్టారు. సమాన బలం ఉండడంతో అడ్డుపడిన పెత్తం దారులనూ ప్రతిఘటిం చారు. ఇది బైండోవర్‌ కేసుల వరకూ వెళ్లింది. ఆరు నెలల పాటు గ్రామంలో పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటు చేశారు. దళితులు ఆ భూమిని సాగు చేయడాన్ని సహించ లేదని పెత్తందారులు మాజీ ఎంపిపి, కాంగ్రెస్‌ నాయకుడు బొత్స వాసుదేవరావు నాయుడును సంప్రదించారు. తనకున్న పలుకుబడితో వాసుదేవరావు నాయుడు పికెట్‌ను ఎత్తివేయించాడు. ఆ మరుసటిరోజే దళితులపై పెత్తందారులు దాడి చేసి చిత్రి అప్పడు కాళ్లు విరగ్గొట్టారు. కామేష్‌ తల పగులగొట్టారు. భూమి కావాలో... ప్రాణాలు కావాలో తేల్చుకోవాలని పెత్తందారులు దళితులను హెచ్చరించారు. ఇది ఆరు నెలల కిందటి సంఘటన. ఈ దాడిపై కెవిపిఎస్‌ పోరాట ఫలితంగా నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనా, 'పెద్దల' అండతో బెయిల్‌పై మూడు రోజుల్లోనే బయట కొచ్చారు. దాడి తర్వాత గ్రామంలో మళ్లీ పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. వివాదానికి కారణమైన ఆ భూమిని ఎవరూ సాగు చేయరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దళితులు మంత్రి కొండ్రు మురళీమోహన్‌ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నా ప్రయోజనం లేక పోయింది. మంత్రిని కలిసొచ్చిన దళితులను వాసు దేవరావు నాయుడు పిలిపించి భూముల గురించి ఆలోచిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దళితులను భయపెట్టారు. భూమిని తిరిగి సాగుచేసుకోవ డానికి అను మతిం చాలని దళితులు అధికారులను ఎప్పటి కప్పుడు కోరుతున్నా వాయిదా వేస్తూ వచ్చారు. భూ సమస్య రెండేళ్లుగా నలుగు తున్నా మంత్రి మురళీమోహన్‌, అధికారులు పరిష్కారానికి ప్రయత్నించిన దాఖలాల్లేవు. దీంతో సమస్య రోజురోజుకూ జఠిలమై, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పధకం ప్రకారం దాడి
ఇంతలో నరసన్నపేట నియోజక వర్గ ఉప ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల బందోబస్తు పేరిట గ్రామంలో పికెట్‌ను ఎత్తేయించారు. ఇదే అదునుగా భావించి దళితులపై దాడికి ప్రణాళికను రూ పొందించారు. దళితులు, గ్రామంలోని పెత్తం దారులు సమాన బలమైనందున ఆ భూములకు గతంలో హక్కుదారులైన కొంతమంది పెత్తందారులను పోగేశారు. మార ణాయుధాలతో దాడికి బయలుదేరారు. ఇందుకు అధికార పార్టీ 'పెద్దల' ప్రోత్సాహముందన్న విమర్శలున్నాయి.
భూమి విషయంలో కానరాని స్పష్టత
ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి రాఘవులు సహా పలువురు రాష్ట్రస్థాయి నేతలు లక్షింపేట బాధితులను పరామర్శించారు. ఈ ఘటన సంచలనం సృష్టించినా, అప్పటి జిల్లా కలెక్టర్‌ జి వెంకట్రామిరెడ్డి మాత్రం మూడు రోజుల వరకూ ఘటనాస్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించలేదు. 'ఓపిక లేని ఘటన'గా దీన్ని ముఖ్యమంత్రి అభివర్ణించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షలు, పింఛను, పిల్లల చదువులు, ఒకరికి ఉద్యోగం వంటి హామీలనిచ్చారు. అయితే ఘటనకు కారణమైన భూమిని మాత్రం ఇస్తామని చెప్పలేదు. భూకొనుగోలు పథకం కింద భూములు కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. లక్షింపేట దళితులందరికీ ఒకేచోట ఇచ్చేంత భూమి లక్షింపేటలో లేదు. రెవెన్యూ, పో లీసుల వైఫల్యం వల్లే ఘటన చోటు చేసు కుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులను చేస్తూ కిందిస్థాయి అధికారులను బదిలీ చేశారు. ఘటనకు ప్రధాన సూత్రధారి అయిన బొత్స వాసు దేవరావునాయుడుతో పాటు 76 మందిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
ఉపాధి కరువు
లక్షింపేట దళితులకు భూమి లేదు. అందరూ కూలీలే. పని ఉంటేనే నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్తాయి. లేదంటే ఆ పూట పస్తులే. దళితులు పెత్తందారుల పొలాల్లో పని చేస్తుండేవారు. ఈ ఘటన చోటుచేసుకున్నాక దళితులకు పనిలేకుండా పోయింది. మడ్డువలస జలాశయ మిగులు భూములిస్తే సాగు చేసుకుని తాము బతకగలమని దళితులు చెప్తున్నారు. ఏ భూమి కోసమైతే దళితులు రక్తతర్పణం చేశారో ఆ భూములను వారికి పంచడం, ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తేనే దళితులకు సరైన న్యాయం చేకూరినట్లు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలి
ఆరు మాసాల్లో కేసు విచారణను పూర్తి చేసి దోషులను శిక్షించాలి. దాడి చేసిన వారిని నిర్ణీత సమయంలోగా శిక్షించాలి. లక్షింపేట దాడిని గ్రామం మీద జరిగిన దాడిగా పరిగణించాలి. వివాదానికి కారణమైన భూములను దళితులకు పంచాలి. చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలి.
డి గణేష్‌, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి
కాళ్లు పట్టుకున్నా వదల్లేదు
గునపాలతో ఇంటి తలుపును పగులగొట్టి, రాతిబండతో నా భర్తను చంపారు. కాళ్లు పట్టుకుని బతిమాలినా వదల్లేదు. తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పోయినోళ్లను తిరిగి తీసుకొస్తుందా..? నా భర్తను చంపినోళ్లకు శిక్ష పడాలి.
బూరాడ కాశాలు (మృతుడు సుందరరావు భార్య)
గ్రామంలో 'ఉపాధి' కల్పించాలి
ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా గ్రామంలో ఉపాధి పనులు కల్పిస్తున్నా, మాకు మాత్రం కల్పించలేదు. ఇప్పుడు గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని తలగాం గ్రామంలో ఉపాధి పనులు కల్పిస్తామంటున్నారు. అంతదూరం వెళ్లే పరిస్థితుల్లో ప్రస్తుతం మేం లేము. గ్రామంలోనే 'ఉపాధి' కల్పించాలి. నివర్తి రాములమ్మ (మృతుడు సంగమేశు భార్య)
ఇప్పటికీ భయంగానే ఉంది
కొట్టారని గతంలో కేసు పెట్టాం. ఎవరూ పట్టించుకోలేదు. దాన్ని మనసులో ఉంచుకుని నా భర్తను బళ్లాలతో నరికి చంపారు. మమ్మల్ని ఏం చేస్తారోనన్న భయం ఇప్పటికీ ఉంది.
చిత్రి శ్రీదేవి (మృతుడు అప్పడు భార్య)
జి లకëణరావు, శ్రీకాకుళం,/font>
Prajashakti News Paper Dated : 22/07/2012 

వికలాంగులపై పెరిగిన వివక్ష ---- Former EFL-University Participent పవన్ ముంతా


"వైకల్యం ఒక శాపం కాదు. జన్మతః వచ్చిన ఒక లోపం. దీనిని అర్థం చేసుకొని సహకరించకపోవటం వల్ల ఈ రోజు సమాజంలో వికలాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగం కూడా వీరి పట్ల వివక్ష చూపుతోంది..'' అంటారు పవన్ ముంతా. వికలాంగుల సమస్యల పరిష్కారానికి సామాజిక పోరాటమే పరిష్కారమనే పవన్ గత రెండు దశాబ్దాలుగా వికలాంగుల పక్షాన నిలిచి వారి గళాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మన సమాజంలోని వికలాంగుల స్థితిగతులపై పవన్‌తో ఈ వారం ముఖాముఖి..

ఒకప్పుడు మన సమాజంలో వికలాంగుల పట్ల వివక్ష ఎక్కువ ఉండేది కాదు. వారిని సమాజంలో ఒక భాగంగానే పరిగణించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది కదా..
మీరు చెప్పింది వాస్తవమే. ఒకప్పుడు అంధులు, ఇతర వికలాంగులకు సమాజంలో ఏదో ఒక వృత్తి దొరికేది. ఆ సమయంలో వివక్ష ఉండేది కాని సానుభూతి కూడా ఉండేది. అనేక గ్రామాల్లో అంధులను గుళ్లలో గాయకులుగా నియమించేవారు. వారికి ఎంతో కొంత ముట్టచెప్పేవారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతి కొనసాగుతూనే ఉంది. అదే విధంగా పాఠశాలలో వికలాంగులు కూడా చదువుకోవటానికి వీలుండేది. నన్నే ఉదాహరణగా తీసుకుందాం. నాకు కంటి చూపు లేదు. కాని నేను ప్రభుత్వ పాఠశాలలోను, కాలేజీలోను చదివాను. నాకు ఎవరూ సీటు ఇవ్వనని అనలేదు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో వికలాంగులకు సీట్లు ఇవ్వటం లేదు. ఎవరైనా గట్టిగా డిమాండ్ చేస్తే - "మా దగ్గర వారికి తగిన మౌలిక సౌకర్యాలు లేవు. వారికి చదువు చెప్పటానికి తగిన సిబ్బంది లేరు'' అని సాకులు చెబుతారు.

గతంలో కూడా వివక్ష ఉండేదన్నారు కదా.. దీని వెనకున్న అసలు కారణాలేమిటి?
ఒకప్పుడు బ్రిటన్‌లో పూర్‌లాస్ అని ఉండేవి. పేద ప్రజల కోసం ఉద్దేశించిన చట్టాలవి. వీటి ప్రకారం వికలాంగులను ముష్టివాళ్లుగా పరిగణించేవారు. మన దేశంలోని అన్ని వ్యవస్థలపై బ్రిటిష్ వారి పరిపాలనా ప్రభావం గాఢంగా పడింది. వాళ్లు వదిలివెళ్లిన పరిపాలనా విధానాన్ని, చట్టాలను మనం పాటిస్తూ వస్తున్నాం. మన రాజ్యాంగంపై కూడా వీటి ప్రభావం ఉంది. మన దేశంలో ప్రస్తుతం 26 రకాల చట్టాలు వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నాయి. ఉదాహరణకు మన చట్టాల ప్రకారం- అన్‌సౌండ్ మైండ్ (మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవటం) అనే స్థితి ఉంటే ఒక వ్యక్తికి చాలా హక్కులు ఉండవు.

అతనికి ఆస్తి రాదు. ఓటు హక్కు ఉండదు. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వరు. కాని అన్‌సౌండ్ మైండ్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. అందరిని ఒకే గాటన కట్టడం సరికాదు. వికలాంగులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం వల్ల వచ్చే వివక్ష మరో రకం. మీకు ప్రతి రోజు చూసే ఒక ఉదాహరణ చెబుతాను. చాలా అపార్ట్‌మెంట్‌లలో మెట్లు కడతారు. నడవలేని వారి కోసం ర్యాంపులు కట్టరు. అంటే మౌలిక సదుపాయాల రూపకల్పనలో కూడా ఈ వివక్ష స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా కాలంగా మన సమాజంలో పాతుకుపోయింది. దీని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

అప్పటికి ఇప్పటికి పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉంది? ప్రభుత్వం ప్రారంభిస్తున్న పథకాల ప్రభావమేమీ కనిపించటం లేదా?
మార్పు పెద్దగా లేదు. వికలాంగుల పట్ల వివక్ష ఇంకా చాలా బలంగా ఉంది. ఇలాంటి కేసులు గురించి నేను రోజూ వింటూనే ఉంటా. కాని ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని విధానాలు ప్రవేశపెట్టింది. ఉదాహరణకు ఇందిరా క్రాంతి పథం వంటి పథకాలలో వికలాంగుల కోసం ప్రత్యేకమైన కోటాలను ప్రవేశపెట్టింది.

అయితే ఇది ఎన్ని మండలాలలో అమలు అవుతోంది? అనే విషయం సందేహాస్పదమే. అదే విధంగా వికలాంగుల పథకాల కోసం ఆర్థిక వనరుల కేటాయింపు, వారికి అదనపు అవకాశాలు కల్పించటం అనే విషయాలలో కూడా ప్రభుత్వం చురుకుగా వ్యవహరించాలి. అన్ని రాష్ట్రాలలోను వికలాంగుల కోసం రూపొందించిన చట్టాలు అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.

ఈ పరిస్థితిని మార్చటంలో సామాజిక ఉద్యమాల పాత్ర ఏమిటి? ఉద్యమకారులు ఎలాంటి పాత్ర పోషించాలి?
వైకల్యం ఉన్న వారికి కూడా సమాన హక్కులు ఉండాలనే భావన అందరిలోను వచ్చినప్పుడు వికలాంగులకు అస్సలు సమస్యలే ఉండవు. అయితే వికలాంగుల పట్ల వివక్ష పాతుకుపోయింది కాబట్టి దానిని మార్చాలంటే సామాజిక ఉద్యమాల అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉద్యమాలలో వికలాంగ సంఘాలు ఒక కీలకమైన పాత్ర పోషించాలి. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముందు పోరాటం చేయాలి. మీకో ఉదాహరణ చెబుతాను.

వైకల్యం ఉన్న వారిని గుర్తించి వారికి సర్టిఫికేట్లు ఇచ్చే అధికారం ప్రభుత్వ డాక్టర్లకు ఉంటుంది. కాని చాలా జిల్లాల్లో ఈ ప్రభుత్వ డాక్టర్లు ఉండరు. ఇక గ్రామ స్థాయిలో పరిస్థితిని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వికలాంగుల సమస్యలపై పోరాడేవారు ముందు ఇలాంటి సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారమార్గాలను వెతకాలి. దీనితో పాటుగా వైకల్యంపై మన సమాజంలో పాతుకుపోయిన భావనలను మార్చటానికి కృషి చేయాలి.

- ఇంటర్వ్యూ: సి.వి.ఎల్. ఎన్. ప్రసాద్ 
Andhra Pradesh News Paper Dated : 29/07/2012

Friday, July 27, 2012

విప్లవ దార్శనికుడు ( చారుమజుందార్)----వరవరరావు


man
‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం ‘గమ్యం’ అంకితమిస్తూ చారుమజుందార్‌పై ఈ చరణాలు రాశాడు. చారుమజుందార్ అమరుడై నిండా నలభైఏళ్లు. ఆయన నక్సల్‌బరీ నిర్మాతగా పీడిత ప్రజల ప్రియతమ నాయకుడయ్యారు. నక్సల్‌బరీలో 1967 మే 23-25 తేదీలలోవూపజావూపతిఘటన వెల్లువ తర్వాత 22 ఏప్రిల్ 1969న సీపీఐ మార్క్సిస్ట్-పూనినిస్ట్ ఏర్పడి ఆయన దానికి కార్యదర్శిగా ఎన్నికైనట్లుగా కలకత్తాలో షహీద్ మినార్ మైదానంలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్న బహిరంగసభలో ఎర్రజెండాల మధ్యన కానుసన్యాల్ ప్రకటించాడు. నక్సల్‌బరీ నాటి నుంచి అజ్ఞాతంలో గడుపుతూ పార్టీ ఏర్పాటు తర్వాత పూర్తి అజ్ఞాత నిర్మాణంలోని రాజకీయ విశ్వాసంతో 1972 జూలై 20న అరెస్టు అయ్యేదాక కూడా చారుమజుందార్ అజ్ఞాత జీవితంలోనే ఉన్నాడు. ఆయనది చాలా బలహీనమైన ఆరోగ్యం. మధుమేహం, రక్తపో టు, ఆస్తమా వ్యాధులతో బాధపడుతూ.. తన బక్క పలుచటి శరీరాన్ని విప్లవ సంకల్పం కోసమే అజ్ఞాత జీవితమంతా మందులతో కాపాడుకున్నాడు. ఆయనకు ఆశ్రయం ఇచ్చినవాళ్లు, శ్రేణులు, ప్రజలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. చారుమజుందార్ స్వభావ రీత్యా ఎంత భావావేశపరుడో అంత విప్లవ స్వాప్నికుడు కూడా అని, ఆయన రచనలు చదివిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. 1972 జూలై 20న ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని కలకత్తా నగరంలోనే అరెస్టు చేసి చిత్రహింసలకు ప్రఖ్యాతి గాంచిన లాల్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో గోప్యంగా నిర్బంధించారు. భౌతిక చిత్రహింసల కన్నా ఆయన పలురకాల వ్యాధులకు తీసుకుంటున్న మందులన్నీ స్వాధీనం చేసుకుని, వాటిని వాడకుండా చేసి ఆ వారం రోజులు ఆయనను చికిత్స లేకుండా మరణించేలా చేశారు. చిలీ అధ్యక్షుడు అలెండి హత్య తరువాత అమెరికన్ సామ్రాజ్యవాదం మిలాకత్‌తో పినోచెట్ నియంతృత్వం క్యాన్సర్‌తో బాధపడుతున్న పాబ్లో నెరుడాను ఎట్లా చనిపోయేలా చేసిందో, సరిగ్గా అట్లాగే చారుమజుందార్ విషయంలోనూ మన పాలకులు చేశారు. మనుషులు, డాక్టర్లు కలవకుండా చికిత్స అందకుండా చేసి చారుమజుందార్‌ను చంపారు.
కానీ.. నలభై ఏళ్లుగా చారుమజుందార్ విప్లవ, పీడిత ప్రజల హృదయాల్లో ఒక నిప్పు రవ్వ. ‘జానకి తాడు’కు అంటిన మంటలా దేశమంతటా విస్తరిస్తూనే ఉన్నాడు. ఇవ్వాళ.. దండకారణ్యంలో ప్రజాయుద్ధమై ప్రజలపై ప్రభుత్వయుద్ధాన్ని ప్రతిఘటిస్తున్నాడు. అయన తెరాయి దస్తావేజుల్లో(1965నుంచి 67 వరకు రాసిన 8 వ్యాసాలను తెరాయి దస్తావేజులు, ‘ఎనిమిది డాక్యుమెంట్లు’ అనే పేరు తో పిలుస్తారు.) ప్రతిపాదించిన అన్ని అధికారాలు ప్రజల కే (ALL POWER TO PEOPLE) ఇవ్వాళ దండకారణ్యంలో ముఖ్యంగా బస్తర్‌లో క్రాంతికారీ జనతన సర్కార్‌లో ప్రయోగంగా ఆచరణకు వచ్చింది. ఆయన ప్రతిపాదించిన గెరిల్లా యుద్ధం ఇవాళ దండకారణ్యంలో చలనయుద్ధం స్థాయికి చేరుకున్నది. చారుమజుందార్ ప్రతిపాదించిన దున్నేవానికి భూమి దండకారణ్యంలో ప్రతి ఆదివాసీ అనుభవంలోకి వచ్చింది. తమ శ్రమతో, సహకారంతో భూమిని స్వాధీనంచేసుకొని, చదును చేసుకుని, గ్రీన్‌హంట్ పేరిట భారత ప్రభుత్వం ప్రకటించిన యుద్ధ సమయంలోనూ వాళ్లు ఉత్పత్తిలో పాల్గొంటున్నారు. భూస్వామ్య పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దళారీ నిరంకుశ పాలకులకు నక్సల్‌బరీలో చారుమజుందార్ వేసిన దారి అత్యంత ప్రమాదరకరమైన అంతర్గత శత్రువుగా భయపెడుతున్నది. ఒకప్పుడు యూరప్‌ను వెంటాడి భయపెడుతుందని మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టోలో చెప్పిన కమ్యూనిస్టు భూతం, ఇవ్వాళ బుంకాల్ మిలిషియా రూపంలో అదేవిధంగా భారత పాలకులను భయపెడుతున్నది. ఎందుకంటే.. ఇది భూత, వర్తమానాల్లో స్పష్టంగా ఆవిష్కరించపడుతున్న భవిష్యత్తు. అందుకే చారుమజుందార్ 40 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు ఆజానుబావుడై అజరామరంగా మన మధ్య నిత్య సమరశీలిగా మసలుకుంటున్నాడు.

1967 నక్సల్‌బరీ నాటికి చారుమజుందార్ సీపీఎం డార్జిలింగ్ జిల్లా సిలిగురి డివిజన్ కార్యదర్శి. 1967లో సీపీఐ చీలి సీపీఎం ఏర్పడ్డప్పుడు పార్టీలోనూ, ప్రజల్లోనూ చాలామంది ఆశించినట్లుగానే ఆయన కూడా సీపీఎం వర్గపోరాట పంథా తీసుకుంటుందని భావించాడు. అందుకే 65నుంచి ‘తెరాయి దస్తావేజు లు’ రాయడం ప్రారంభించాడు. తెరాయి ఇండియా-టిబెట్ చైనాకు మధ్యన ఉన్న ఒక కీలకమైన భూభాగం. సంతాల్ తెగలు ఉండే ఆదివాసీ ప్రాంతం. ‘దస్తావేజులు’ రచిస్తున్న కాలంలోనే.. 1956-65 దాకా కృశ్చెవ్ సిద్ధాంతంపై (శాంతియుత పరివర్తన, శాంతియుత పోటీ, శాంతియుత సహజీవనం) మావో నాయకత్వంలో గ్రేట్ డిబేట్ ముగిసి చైనాలో శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. బోల్షివిక్ విప్లవం, చైనా విప్లవం తరువాత చారుమజుందార్ ఇది మూడో విప్లవం అన్నాడు. తెరాయి దస్తావేజుల్లో ఆయన ప్రజల ముందు కార్మిక వర్గపార్టీ నాయకత్వంలో ఆచరించాల్సిన మూడు కర్తవ్యాలను ఉంచాడు. అవి-భూమిలేని నిరుపేదలు భూమిని స్వాధీనం చేసుకోవడమనే ఆర్థిక పోరాటం. భూస్వాముల చేతుల్లో ఉన్న మిగులు భూములు, భూస్వాముల ఆక్రమణలో ఉన్నవి కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు. అది సాఫిగా సాగే పనికాదు కాబ ట్టి అవి స్వాధీనం చేసుకోవడానికి, నిలుపుకోవడానికి గెరిల్లా పోరాటమనే సైనిక పోరాట ప్రతిపాదన చేశాడు. ఇది మొదట భూ ఆక్రమణదారుల గూండాల నుంచి, మాఫియాల నుంచి, ఆ తరువాత వాళ్లకు అండగా ఉండే పోలీసు, ప్రభుత్వాల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రజలకు అండగా ఉంటుంది. ఈ క్రమమంతా గెరిల్లా పోరాటం ద్వారా శత్రువు బలహీనంగా ఉండే గ్రామాలను విము క్తం చేయడంగా ఉండాలి. ఒకసారి విముక్తం అయిన గ్రామం ఎల్లకాలం విముక్తం అయి ఉంటుందని గ్యారంటీ లేదు. ఒకసారి గెలుచుకున్న కోట ఎప్పుడూ మన వశంలోనే ఉంటుందనీ లేదు. ఇది సరళ రేఖగా సాగే పోరాటం కాదు. అందుకే ప్రజలకు రాజ్యాధికారం ఇచ్చే రాజకీయ పోరాటంగా రాజకీయ లక్ష్యంగా కొనసాగాలి. అన్ని అధికారాలు ప్రజలకు అన్నప్పుడు అందులో ఇమిడి ఉన్నది రాజకీయ లక్ష్యమే. అదే ఇప్పటి దండకారణ్యంలోని క్రాంతికారీ జనతన సర్కార్. ‘తెరాయి దస్తావేజు’ల రచన చేసే నాటికే దేశంలో (1967) సాధారణ ఎన్నిక లు వచ్చాయి. నెహ్రూ, ఇందిర కుటుంబ పాలనతో ప్రజలు విసిగి పోవడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రేసేతర ప్రభుత్వాలుగా బూర్జువాపార్టీలు అధికారంలోకి వచ్చాయి. బెంగాల్‌లో కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చిన అజయ్‌ముఖర్జీ బంగ్లా కాంగ్రెస్ పెట్టాడు. సీపీఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ఆయనకు ఎన్ని స్థానాలు వచ్చినా ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామనే ఒప్పందంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. రాష్ట్రంలో ఉన్న మిగులు భూములను ప్రజలకు పంచుతామని లెఫ్ట్ ఫ్రంట్ వాగ్దానం చేసింది. బెంగాల్‌లో ఆరు లక్షల హెక్టార్ల భూమి జోతేదారుల (భూస్వాముల) ఆక్రమణలో ఉందని, తాము అధికారంలోకి రాగానే ఆ భూమిని భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు.

ఎన్నికల్లో ఈ పొత్తు విజయం సాధించి బంగ్లా కాంగ్రె స్‌కు 5 సీట్లు, లెఫ్ట్ ఫ్రంట్‌కు 80 సీట్లు వచ్చాయి. జ్యోతిబసు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా అయ్యారు. కనుక సీపీఎం సిలిగురి డివిజన్ కార్యదర్శిగా చారుమజుందార్ చేసిందల్లా ఈ వాగ్దానాన్ని ఆచరణలో పెట్టడమే. కాకపోతే బూర్జువాపార్టీలు వాగ్దానాలు చేస్తాయి. కార్మికవర్గ పార్టీలు ప్రాణాలకు తెగించి వాటిని ఆచరణలోకి తెస్తాయి. వాగ్దాన భంగాలను ప్రజలకు బట్టబయలు చేస్తాయి. అయితే దున్నేవానికే భూమి భూస్వామ్య వ్యతిరేక ఆర్థిక పోరాటమే. చారుమజుందార్ దృష్టిలో చాలా స్పష్టంగా నూతన ప్రజాస్వామిక విప్లవం ఉన్నది. వ్యవసాయ విప్ల వం ఇరుసుగా సాగేది దీర్ఘకాలిక సాయుధ పోరాటం. నక్సల్‌బరీ గ్రామస్తుడే అయిన కానుసన్యాల్, బంగత్ సంతాల్ నాయకత్వంలో మే 23వ తేదీ నుంచి 25 వరకు 10వేల మందికి పైగా సంతాల్ ఆదివాసీలు నక్సల్‌బరీ, కేలిబరీ గ్రామాల్లో విశాలంగా పరుచుకొని ఉన్న నేల మీద నిలబడి ఇది మా భూమి అని ప్రకటించారు. వాళ్లం తా విల్లంబులు, గొడ్డళ్లవంటి సంప్రదాయక ఆయుధాలతో ప్రతిఘటనకు సిద్ధమై వచ్చారు. వారిపై మే 25న భూమి వాగ్దానం చేసిన లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం నక్సల్‌బరీ రైల్వేస్టేషన్ నుంచి బుల్లెట్ల వర్షం కురిపించింది. కేవలం లెఫ్ట్ ఫ్రంట్ పోలీసులే కాదు, ఇందిరాగాంధీ సీఆర్‌పీఎఫ్ బలగాలు కూడా తోడయ్యాయి. ఆ కాల్పుల్లో ఏడుగురు స్త్రీలు, నలుగురు పిల్లలు అక్కడికక్కడే అమరులయ్యారు. రేపటి చరిత్ర ఆధునిక స్త్రీ రచిస్తుందని గురజాడ అప్పారావు చెప్పినట్లుగా ఈ నక్సల్‌బరీ మహిళలు నలభై ఏళ్లుగా చరివూతను తిరగరాస్తున్నారు. ఈ చరిత్ర నిర్మాణా న్ని, రచనను శ్రీకాకుళం, వైనాడు మొదలు ఇవ్వాళ.. జంగల్‌మహల్, దండకారణ్యం, నారాయణపట్నం దాకా ప్రజలకు అందించారు. ఈ చరిత్ర నిర్మాణాన్ని, ప్రజలు రచించే ఈ చరివూతను కలగన్న విప్లవ దార్శనికుడు చార్‌మజుందార్. అందుకే ‘ఆయనకు మరణం లేదు. అప్పుడే అతడు ఒళ్లు విరుచుకొని సమాధి నుంచి లేచి, ఆయుధం చేతబట్టి తిరిగి రణరంగంలో చేరినాడు.’ అని శివసాగర్ ‘అమ్మా’ అనే కవితలో జూలై 1972లో రాశాడు. రణరంగానికి కేంద్ర బిందువు, ఇవ్వాళ దండకారణ్యపు పోరాటంగా చారుమజుందారే కాదు (ఆయన పోరాటంలో ఒరిగిన మొదటివాడు, చివరివాడూ కాదు.) ఈ జూలైలో దక్షిణ బస్తర్‌లో అమరుడైన విప్లవోద్యమ నాయకుడు విజయ్ మడ్కం కూడా లేచి ఆయుధం చేతబట్టి తిరిగి రణరంగంలో చేరినాడు. మనం కళ్లు తుడుచుకొని ఆ పోరాటానికి బాసటగా నిలుద్దాం. అడుగుల్లో అడుగులేద్దాం. ప్రజలు తమ స్వప్నంగా ఆవిష్కరించుకుంటున్న జనతన సర్కార్‌కు అండగా నిలుద్దాం. ప్రజల ఆశలను చిదిమేస్తున్న భూస్వామ్య, దళారీ భారత ప్రభుత్వ దాడిని వ్యతిరేకిద్దాం. భారత విప్లవోద్యమ నిర్మాత చారుమజుందార్ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుద్దాం.
-వరవరరావు
(నేడు నక్సల్‌బరీ ఉద్యమ నిర్మాత చారుమజుందార్ 40 వ వర్ధంతి
Namasete Telangana News Paper Dated : 28/07/2012 

దళితుల్లో ఆత్మగౌరవం పెరగాలి - పరిపూర్ణానంద స్వామి

'దళితులు ఏం చెయ్యాలి?' అనే కంచె ఐలయ్య వ్యాసం (జూలై 13, ఆంధ్రజ్యోతి)లో ప్రస్తావించిన ముఖ్యాంశాలు : అగ్రకులాలు, అణగారిన కులాలు. గ్రామస్థాయిలో మిలీషియాల ఏర్పాటు. ఒక్క వర్గానికే చెందిన హిందుత్వం హిందూ దేవతలు అగ్రకులాల వారికే పరిమితం. కొత్త దేవుడు కావాలి అనే అంశాలకు దీటైన సమాధానమే ఈ శీర్షిక. ఇది కేవలం సమాధానమే కాదు. కనువిప్పు కలిగించే నిప్పులాంటి నిజం కూడా. కారంచేడు, లక్షింపేటలలో జరిగిన ఉదంతాన్ని తీసుకుని దళితులు, అగ్రశూద్రకులాలు అని ఉటంకించిన విధానం వ్యాస రచయిత మనోగతాన్ని ఆవిష్కరించింది.

వారు సమ్యక్ దష్టితో కాకుండా, గంతలు కట్టుకుని ధార్తరాష్ట్రీకమైన దృక్పథంతో సమస్యను సత్యదూరంగా పరిశీలిస్తున్నారనేది తేటతెల్లంగా అర్థమౌతుంది. ఈ ప్రబోధాల వలన అణగారిన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి వాటిని సమూలంగా భ్రష్టుపట్టించాలనే కుట్ర స్పష్టంగా బయటపడుతోంది. ఉక్రోషంతో, ఆక్రోశంతో నేడు సలసల మరుగుతున్న ఈ కులాల చిచ్చును ఇంకా రెచ్చగొట్టే వీరి రచనలు ప్రత్యక్షంగా మానవ సమాజాన్ని మారణహోమానికి సిద్ధం కావాలనే సంకేతాలిస్తున్నాయి. ఒక విద్యావేత్తగా, సామాజిక స్పృహ కలిగిన శాస్త్రవేత్తగా, సమాజంలో సమత్వాన్ని రచించాలనుకునే రచయితలో పొంగుకొచ్చిన ఈ కాలకూట భావజాలాన్ని ఏ సభ్యసమాజమూ హర్షించదు, స్వాగతించదు.

కుల వివక్ష దారుణాల వెనుక దాగున్న వాస్తవాలను తప్పక వెలికి తీసుకురావాలి. దానిని పరిష్కరించే మార్గంలో కొత్త కొత్త సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇటువంటి సంఘటనల వెనుక వ్యక్తుల స్వార్థము, రాజకీయ ప్రయోజనము, ఆర్థిక దురహంకారాలే కీలకమైన కారణాలుగా పనిచేస్తుంటాయి. ఒక నేరానికి సంబంధించిన దోషాన్ని, ఆ నేరస్థుడికే ఆపాదించాలి. దానిని కులానికి అంటగట్టకూడదు. శరీరానికి జబ్బుచేస్తే, ఆ జబ్బుని కులానికి ఆపాదిస్తామా? లేదే, అలాగే ఇదీ ఓ భయంకరమైన మానసికవ్యాధి, ఈ వ్యాధి ఏ వ్యక్తిలో పొడచూపుతుందో ఆ వ్యక్తినే నిలదీయాలి. అతనినే శిక్షించాలి. అంతేకాని, సమస్యను పక్కదారి మళ్ళించి, దానిని కులాలకు ఆపాదించి మొత్తం సమాజాన్ని రావణకాష్ఠం చేయాలనే ఈ రచనల వెనుక కూడా భయంకరమైన మానసిక జబ్బు దాగుందనే అంశం స్పష్టమౌతుంది.

ఏ నేరస్తుడిని తీసుకున్నా, అతడు ఏదో ఒక కులానికి చెందే ఉంటాడు. అలాంటప్పుడు ఒక బ్రాహ్మణుడు ఏదైనా తప్పు చేస్తే, దానికి బ్రాహ్మణ కులాన్ని తప్పుపట్టడం ఎంత ఉన్మాదమో, ఒక దళితుడు లేదా శూద్రుడు చేసిన తప్పుకి మొత్తం దళితులనూ లేదా మొత్తం శూద్రులనూ తప్పుపట్టడం కూడా అంతే ఉన్మాదం. లక్షింపేటలోని హంతకులను క్రూరులుగా, ఉన్మాదులుగా, అజ్ఞానులుగా, అనాగరికులుగా దూషించండి. కానీ, కులం పేరుతో అందరినీ ఒకే గాటన కట్టడం సమంజసమే కాదు, శోచనీయాంశం కూడా!

కులమనేది ఓ సాంఘిక వ్యవస్థ. నేరస్థుల్లో ఏర్పడ్డ కాలుష్యాలను కులానికి అంటగట్టి కుల వ్యవస్థను సమూలంగా దెబ్బతీసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే దళితులు ఏం చెయ్యాలనే శీర్షిక. ఈ శీర్షిక చదివితే, వ్యాస రచయిత అంతరంగం బట్టబయలౌతుంది. సమస్యను దారిమళ్ళించి, పరిష్కారం చూపకుండా సమాజంలో వైషమ్యాలను సృష్టించాలనే వారి మనోభావం స్పష్టమౌతుంది. అసలు కులం అంటే ఏమిటి? కులం ప్రాధాన్యతలు, వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యావేత్తలకు, సామాజిక శాస్త్రవేత్తలకూ సమగ్రమైన అవగాహన ఉండాలి. వ్యక్తులలో దాగున్న లోపాలను, వ్యక్తులు చేసే నేరాలను కులానికి అంటగడితే! సమస్య పక్కదారి పట్టడమే కాక, సమాజంలో సమతుల్యత లోపిస్తుంది. కులపోరాటాలు తెర మీదకు వస్తాయి. సమస్యలు విలయతాండవం చేస్తాయి. ఈ సందర్భం కొరకు వేచి ఉన్న రాబందులకు ఇవి చాలా... చాలా... లబ్ధిని చేకూరుస్తాయి.

సంక్లిష్ట సమస్యలను చట్టం ఒక్కటే స్వతంత్రంగా పరిష్కరించలేదని సనాతన హిందూ నాగరికత శతాబ్దాల క్రితమే గుర్తించింది. సమస్య మూలం ఏ కోణంలో దాగి ఉందో, దానిని గుర్తించడం సంక్లిష్టమైనపుడు వివేకయుక్తమైన నివారణలను కూడా హైందవ వ్యవస్థ సిఫార్సు చేసింది. దీనికి ఉదాహరణ... ఆదిశంకరాచార్యులు అనుగ్రహించిన చక్కని తరుణోపాం సత్సంగమే. 'సత్సంగత్వే నిస్సంగత్వం! నిస్సంగత్వే నిర్మోహత్వం! నిర్మోహత్వే నిశ్చలతత్త్వం! నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః!' సత్సంగం ద్వారా వ్యక్తి దుస్సంగాల నుంచి వైదొలుగుతాడు. అట్టి వ్యక్తిలో క్రమేపీ మోహం తగ్గుతుంది. తద్వారా ఆ వ్యక్తి సత్యాన్ని, వాస్తవికతను దర్శించే మహనీయుడౌతాడు. అట్టి మహనీయులే ఒకప్పుడు ఈ భారతావనికి ఆదర్శమూర్తులయ్యారు.

ఈ సంస్కృతిలో వైద్యులు, విద్యావేత్తలు, న్యాయాధీశులు, మానసిక నిపుణులు సాధించలేని పరిష్కారాన్ని, ఆధ్యాత్మిక భావజాలంతో మహాత్ములు సాధించిపెట్టారు. ఇంతటి భాగ్యం మరే పౌరుడికి, ఏ జాతికి దక్కని విషయం నిర్వివాదాంశమే! కాబట్టి విజ్ఞులు పారదర్శకతతో లోకహితమైన శాంతిని ప్రబోధించాలే కానీ, వక్రభాష్యాలను కల్మషాలను కార్పణ్యాలను ప్రబోధించి రెచ్చగొట్టకూడదు. సద్గురువుల ప్రబోధాలను పెడచెవినపెట్టే సమాజం తప్పక అధోగతి పాలౌతుందనేందుకు శ్రీకాకుళం జిల్లా లక్షింపేట ఉదంతమొక్కటే చాలు. ఇక్కడో విచిత్రం!

కడుపునొప్పితో బాధపడుతున్న మగవాడిని గైనకాలజిస్ట్‌కు చూపించమనడం ఎంత హాస్యాస్పదమో, వ్యక్తులు చేసే నేరాలకు కులాలను రొంపిలోకి లాగడం అంతకన్నా అవివేకం వేరే ఉండదు. ఇదీ చాలదన్నట్లు ఈ నేరాలకు, సమస్యలకు హిందూ శాస్త్రాలు, హిందూ దేవతలే కారణమని విమర్శిస్తూ రాసిన రచనలో ఎంత కుటిలత దాగుందో సమాజం గుర్తిస్తూనే ఉంది. పటిష్ఠమైన భారతీయ వ్యవస్థపై, పవిత్రమైన హిందూ ధర్మంపై దుమ్మెత్తిపోస్తూ రాసిన శీర్షికను బహిరంగంగా ఖండిస్తున్నాము.

రోగాన్ని పరిశీలించిన వైద్యుడు క్యాన్సర్‌గా గుర్తించి కొన్ని పరీక్షలు చేసిన తరువాత కూడా కెమో, రేడియేషన్‌లు ఇచ్చే ముందు అప్రమత్తతను ప్రదర్శిస్తాడు. అలాగే, సామాజిక శాస్త్రవేత్తలుగా రచయితలుగా చలామణీ అయ్యేవారు ఇంకా, చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాకాక, బాధ్యతా రాహిత్యంతో గ్రామస్థాయిలో మిలీషియాలు తయారుకావాలని రాసిన రాతలు సమాజాన్ని ఎంత దిగజారుస్తుందో గమనించగలరు. ఇటువంటి ప్రబోధాలను తీసుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారో చెప్పమనండి? భయం ద్వారానే మానవత్వాన్ని మలచాలనుకునే రచయిత ఎలాంటి కొత్త మతాన్ని ప్రజలపై రుద్దాలనుకుంటున్నారు?

మానవత్వం ప్రతి ఒక్కరిలోనూ అవసరమే కదా! మరి ప్రతి ఒక్కరినీ భయపెట్టడానికీ, దేశసౌభాగ్యానికీ ఆయన అనుసరించదలచిన మార్గం ఏమిటి? ఇదే అర్థంకాని మిలియన్ డాలర్ ప్రశ్న. దళిత సోదరులు ఏం చేయాలనే సంగతికి వస్తే, నేను సూటిగా ఒక్కటే చెబుతాను. వారిలో ఆత్మగౌరవం పెరగాలి. ఇందుకు సరైన నామకరణం కావాలి. దురుద్దేశపూర్వకంగా దళితులనే శబ్దాన్ని పదే పదే ప్రయోగిస్తూ అణగారినవారు, అంటరానివాళ్ళు, పామరులుగా దానికి అర్థాన్ని ఆపాదించి దళితులను ఎప్పటికీ అణగద్రొక్కి ఉంచాలనే కుట్రను సోదరులు గమనించి తిప్పికొట్టాలి.

గుజరాత్ భూకంపం సమయంలో కట్టుబట్టలతో నడివీధిలో మిగిలినవారికి దుస్తులు లారీలకొద్దీ సహాయంగా వస్తే, వద్దని వారు తిప్పి పంపారు. మాకు మీ సాయాలు వద్దు. అప్పు ఇవ్వండి చాలు. తిరిగి సంపాదించి తీరుస్తాం అన్నారు. ప్రకృతి శక్తుల మీద పోరాటంలో అపారమైన ధైర్యాన్ని చూపించే దళితులు తమకు స్ఫూర్తిదాయకమైన పేరుని ఎందుకు కనుగొనలేకపోతున్నారు? దాని ద్వారా ఐక్యతను సైతం బాటలు వేసుకునే అవకాశాన్ని ఎందుకు అన్వేషించడం లేదు?

హిందూ దేవుళ్ళు నరసింహులైతే, వారిని అనుసరించేవారందరూ నరరూప రాక్షసులని విమర్శించే రచయితలో ఎంత క్రూరమైన మృగం దాగుందో గమనించవచ్చు. దీనినిబట్టి చూస్తే రచయితకు పాపం! మన పురాణాల గురించి ఓనమాలు కూడా తెలియదనే అంశం తేటతెల్లమౌతుంది. పురాణాల్లో దాగున్న మరో కోణాన్ని కూడా వివరిస్తాను! నరసింహుడు అగ్రవర్ణాల దేవుడని ఆయన భావిస్తున్నారేమో? నరసింహుడు వధించిన హిరణ్యకశిపుడు శక్తిమంతుడు, అగ్రవర్ణానికి చెందినరాజు. దళితుడు కానేకాడు. పైగా నరసింహుడు పెళ్లాడినది గిరిజన యువతి చెంచులక్ష్మిని. అన్నింటినీ మించి ఈనాటికీ అంతరం, అభ్యంతరం లేకుండా బడుగు బలహీన తెగలు మాత్రమే కాదు శూద్ర, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణాది సమస్త హైందవ వర్ణాలు నరసింహుడుని దేవుడుగా కొలుస్తున్నాయి.

మన పురాణాల్లో భక్తులు జాబాలి, సత్యకాముడు, అరుంధతి, అంబరీషులు ప్రాతఃస్మరణీయులు. మన చరిత్రలో శబరి, కన్నప్ప, కనకదాసు, సంత్ రవిదాస్, సూరదాస్, తుకారాములు చిరస్మరణీయులు. సమకాలీన సమాజంలో నారాయణగురు, మళయాళస్వామి, మాతా అమృతానందలు వందనీయులు. వీరందరూ బడుగు బలహీన సామాజిక వర్గంలోనే అవతరించి తరించారు. లక్షలాదిమందిని తరింపజేశారు. ఇంతటి పారదర్శకత కలిగిన జాతి, ధర్మము, దేశము ఒక్క మన భారతమాతేనని సగర్వంగా చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతీ హిందువు తలెత్తుకు తిరగాలి. కులపోరాటాలు, మిలీషియావాదాలు మన జాతివి కావు. ఇది వలస వచ్చినవారి దురాలోచనలని స్పష్టంగా బయటపడుతోంది.

దీనికి అమ్ముడుపోయినవారే ఈ భావాలను ఇంకా... ఇం...కా! సమాజంలో వ్యాపింపజేసి మనదేశాన్ని, మన సంస్కృతిని నాశనం చేయాలనే దురుద్దేశంతో కొత్త దేవుడి వాదనను తెరపైకి తెచ్చారు. ప్రస్తుత హిందూ దేవుళ్ళను మించిన కొత్తదేవుణ్ణి దళితుల మధ్య ప్రవేశపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దేవుడంటే సర్వాంతర్యామి, ఆదిమధ్యాంతరహితుడు, సర్వశక్తిమంతుడు, ఒకే ఒక్కడని సకల మతాలూ కట్టకట్టుకుని ఘోషిస్తుంటే, ఈయన ప్రబోధం మాత్రం మానవుడు కదపగలిగే పావుగా దేవుడిని చిత్రీకరిస్తున్నాడు. ఆయన కొత్త దేవుడిని ప్రవేశపెట్టే వింత ఏమిటో చూడాలని నాకూ ఆసక్తిగానే ఉంది. ఈ కొత్త దేవుడి పిచ్చివాదనను ఎవ్వరూ అంగీకరించరు. ఆహ్వానించరు కూడా. అందుకే, మనకు కొత్త దేవుడు వద్దు. మన భావాలలలో కొత్తదనం రావాలి. అప్పుడే మనదేశం పూర్వపు వైభవం సంతరించుకుంటుంది.

- పరిపూర్ణానంద స్వామి 
Andhra Jothi News Paper Dated : 28/07/2012 

Monday, July 23, 2012

జీవచ్ఛవాలపై ఎందుకీ వివక్ష?----శిరందాస్ ప్రవీణ్‌కుమార్


కొడుకు పుట్టిండని ఓ తండ్రి సంబురపడ్డడు. ఐదేండ్లు నిండంగనే బడి కి తోలిండు. కొద్ది రోజుల్లోనే తెలివికల్లోడ్ని కన్నవ్ అంటే ఎగిరి గంతేసిండు. కానీ ఆ సంబురం రెండేండ్లు కూడా నిల్వలేదు. కొడుకు జీవచ్ఛవంగా మారిండు. మంచంలో ఉన్నా లేనట్లుగనే కనిపిస్తడు. నాయినా నీకెందుకు కష్టం.. నాకింత విషమిచ్చి చంపరాదే అంటే ఆ తండ్రి కండ్లల్ల నీళ్లు సుడులు తిరిగినయి. బతికినంత కాలం నిన్ను బతికిస్తనంటూ ఆ తండ్రి సేవ చేస్తనే ఉన్నడు. అమ్మా.. అన్నం తిన్నవా అనడిగితే.. ఓ యువతి (అమ్మాయిలానే ఉండడం దౌర్భాగ్యం) కండ్లనిండ నీళ్లు తీసుకొని బువ్వ తినక వారం రోజులైంది సారూ.. అని చెప్పింది. ఎందుకమ్మా? తింటే దొడ్డికి వస్తది. కడిగేటోళ్లు లేరు. అమ్మనాయిన కూలీకి పోతరు. వాళ్లు లేనప్పుడు దొడ్డికొస్తే పక్కల్నే పోవాలి. ఈగలన్నీ చుట్టుముడుతయి. గబ్బు వాసనొస్తది. ఏం చేయాలి సారూ.. నాకీ బతుకొద్దని తింటలేనని చెప్పింది. ఇదీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇటీవల అఖిల పక్షాన్ని తోలుకొని ఫ్లోరైడ్ ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించినప్పుడు వెల్లడైన అంశాలే. కన్నీటి పర్యంతం చేసే ఈ సజీవ వెతలు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో లెక్కకు మించినన్ని కనిపిస్తయి. నల్లగొండ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఏ గుడిసెనో, ఏ పసుల పాకనో కదిలించినా ఇట్లాంటి తెలుస్తయి. ఇలాంటి జీవచ్ఛవాల గురించి తెలియని పాలకులు లేరు. స్పీకర్ పర్యటనతో ఏదో ఒరిగిపోతుందని బాధితుపూవరూ ఊహించడం లేదు. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలన్నింటికి నీళ్లిందించేందుకు, పూర్తిస్థాయిలో సంక్షేమం దిశలో అడుగులు వేసేందుకు ఓ ప్రణాళికను రూపొందించాలని నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. అట్లనే ఇండ్లల్ల, స్కూళ్లల్ల అల్యూమినియం(రాతెండి) గిన్నెల్ల వండుకొని తింటే ఫ్లోరైడ్ ప్రభావం అధికమవుతుంది.

అందుకే వాటి బదులు స్టీలు గిన్నెలు సప్లయి చేయాలని కలెక్టర్‌కు చెప్పారు. బడులు, పేదోళ్లందరికీ స్టీలు గిన్నెలు ఇయ్యాలని చెప్పారు. ఆయనిట్ల పోయిండో లేదో.. లయన్స్ క్లబ్బోళ్లను పిలిచి స్టీలు గిన్నెలు మీరు సప్లయి చేస్తరా? అని కలెక్టర్ అడిగారు. 40 ఏండ్ల నుంచి అదే ప్రాంతం నుంచి ఎన్నికైతున్న రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌డ్డి మాత్రం అక్కడే ఉన్నడు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నోర్లు వెళ్లబెట్టి చూశారు. ఇప్పుడే గదా! స్పీకర్ గారు చెప్పింది.. స్టీలు గిన్నెల సప్లయి బాధ్యతను కూడా స్వచ్ఛంద సంస్థలపై రుద్దుతున్నరని ప్రశ్నించారు.

శాశ్వత పరిష్కారమో, తాత్కాలిక పరిష్కారమో గానీ నల్లగొండ జిల్లా అధికారులు పెద్ద ప్రణాళికనే తయారు చేసి స్పీకర్‌కు పంపించారు. దాని విలువ మూడు వేల కోట్ల పైమా స్టీలు గిన్నెలకే దిక్కు లేదు. సమైక్య పాలకులు ఇంత పెద్ద మొత్తంలో ఇస్తరా అని తెలంగాణ ఉద్యమకారులు చర్చించుకుంటున్నరు. ఆంధ్రాలో తుఫా నొస్తే చాలు.. సర్కారు మొత్తం అక్కడనే ఉంటది. బియ్యం మొదలుకొని గిన్నెలు, చెద్దర్లు, బట్టలు, వారి కుల వృత్తుల సామక్షిగినంత సప్లయి చేస్తరు. గిక్కడెందుకనో సర్కారోళ్లకు ఏది సప్లయి చేయాలన్న సంస్థలో, దాతలో గుర్తుకొస్తరు. 2001 ప్రాంతంలోనూ సబ్సిడీ మీద ఫిల్టర్లు ఇయ్యడానికి కూడా స్వచ్ఛంద సంస్థలపై, ఔదార్యం చూపించే వారిపైన దృష్టి పెట్టారు. బడికి పోయే పిల్లలు రోజూ నువ్వుండలు, పల్లీ పట్టీలు తింటే మంచిదని వైద్యులు సూచిస్తే వాటినీ సంస్థలకే అప్పగిస్తోంది. ఉపశమనం కోసం వైద్య పరీక్షలు చేసేందుకు దశాబ్ద కాలం కిందట చాలా ఊర్లల్ల క్యాంపులు పెట్టారు. డాక్టర్లు పరీక్షలు చేసి చాలా మందికి ఫ్లోరోసిస్ ఉన్నదని చెప్పా రు. నొప్పుల మందులేసుకుంటే ఉపశమనం కలుగుతుందన్నరు. వారానికి సరిపడ ఇచ్చిపోయారు. ఆ తర్వా త మందులు ఇచ్చినోళ్లు లేరు.. తెచ్చినోళ్లు లేరు. ప్రభు త్వం ఫ్లోరోసిస్ బాధితులను కార్పొరేట్ ఆసుపవూతికి తీసుకుపోయి శస్త్ర చికిత్సలు చేయించిన దాఖలాలు లేవు. కనీ సం ఆరోగ్యశ్రీ పథకంలో దీన్ని ఇప్పటికీ చేర్చలేదంటే ప్రజాస్వామ్యంపై అపనమ్మకం ఏర్పడుతుంది.డెంటల్ ఫ్లోరోసిస్‌కు చికిత్స చేయాలంటే లక్షల్లోనే ఖర్చయితది. దానికితోడు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన వైద్యులు, యంత్రాలు కావాలి. పైగా వేలాది మందికి శస్త్ర చికిత్సలు అవసరవుతయి. వందల కోట్లల్లో బడ్జె ట్ కేటాయించాల్సి వస్తదని పాలకులు ఫ్లోరోసిస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని చాలాకాలంగా ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి అభివూపాయపడుతున్నది. అట్లనే వైకల్యం ఉన్నోళ్లందరికీ పింఛన్ ఇస్తున్నరు. పాలకుల అంధత్వం వల్ల మంచం మీదనే జీవచ్ఛవాలుగా ఉన్న వారిని సాధారణ వికలాంగుల లెక్కనే జమ కడుతున్నరు. వీళ్లకూ అంతనే పింఛన్ ఇస్తున్నరు. ఇంట్ల అందరూ వికలాంగులే ఉంటే సర్కారిచ్చే రూ.500లతో ఎట్ల బతుకాలో పాలకులు ఆలోచించాలి. మందులకు కూడా సరిపోవడం లేదన్నది వాస్తవం. బాధ్యతలో సర్కారు వాటా ఎంతన్నదే ప్రశ్న?

పట్నమోళ్లకు, ఊర్లల్ల ఉండేటోళ్లకు ఏమైన తేడా ఉంటదా? కచ్చితంగా ఏ తేడా ఉండదు. నగరాల్లో ఎట్ల బతుకుతున్నరో, ఇక్కడా అట్లనే తింటున్న రు.. కాలకృత్యాలు తీర్చుకుంటున్నరు. కానీ సర్కారు దృష్టిలో మాత్రం ఒక్క టి కాదు. అవును.. సాగర్ నీళ్లు భాగ్యనగరానికి సప్లయి చేస్తున్నరు. మనిషికి రోజుకు 120 లీటర్లు లెక్క కట్టి ఇస్తున్నరు. అదే ఊర్లల్ల మనిషికి 40 లీటర్లని లెక్క కడుతున్న రు. అది కూడా వారానికి ఒక్కసారి రాకపాయే. ఎందుకీ వివక్ష? మనుషుల మధ్య ఎందుకీ వ్యత్యాసం? ఫ్లోరైడ్ ప్రభావిత 975 గ్రామాల్లో ఇప్పటికీ 450 గ్రామాలకే నీళ్లిస్తున్నరు. వాటికి కూడా ఈ లెక్కన ఇస్తుంటే పాలకులు ఫ్లోరోసిస్ బాధితుల పట్ల చూపిస్తున్న కరుణాకటాక్షాలు ఎట్లున్నయో మేధావులు ఆలోచించాలి. కచ్చితంగా నగరవాసులకు ఏ వంతున కృష్ణా జలాలు ఇస్తున్నరో మాకూ ఆ లెక్కనే ఇవ్వాలన్న డిమాండ్ ఈ మధ్య కాలం లో బాగా వినిపిస్తోంది. కనీసం 80 లీటర్ల వంతున లెక్క కట్టి పొద్దున్నే సప్లయి చేయాలి. మనిషికి మనిషికి మధ్య తేడా చూపించే హక్కు ఎవరిచ్చారని హైదరాబాద్‌లోని తెలంగాణ రీసెర్చ్ సెంటర్‌లో ఇటీవల జరిగిన ఓ సెమినార్‌లో మేధావులు, శాస్త్రజ్ఞులు పాలకుల ను ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ బాధితులకు నెలకు కనీసం రెండు వేలు పింఛన్, అంత్యోదయ కార్డు ద్వారా నెలకు 35 కిలోల బియ్యం పంపి ణీ చేయాలన్నరు. ఆర్టికల్14, 21లతో పాటు ఆర్టికల్ 39(బి),(ఇ),(ఎఫ్), 41, 43 47 ప్రకారం ప్రజలకు రక్షిత మంచినీళ్లందించాల్సిన బాధ్యత సర్కారుదే. హైకోర్టు 2001 ఆగస్టు ఒకటో తేదీన ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా.. అందుకే తక్షణం ఫ్లోరైడ్ ప్రభావిత అన్ని గ్రామాలకూ కృష్ణా జలాలను అందించే పనులను చేపట్టాలని డిమాండ్ చేశా రు. ఆయా గ్రామాల్లోని బడులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేయాలి. వాటికి కృష్ణా జలాలను సప్లయి చేయాలి. కనీసం భావితరాలను దీన్ని నుంచి కాపాడుకునేందుకు అవసరమైన చర్యలను ప్రభు త్వం చేపట్టాలి.
-శిరందాస్ ప్రవీణ్‌కుమా

Namasete Telangana News Paper Dated : 24/07/2012

మానుకోటను మరిచిపోయారా? ---సుజాత సూరేపల్లి


textile-123 talangana patrika telangana culture telangana politics telangana cinema
ఎన్నికల వ్యూహాలు చిత్ర విచిత్ర రూపాలలో ఊపందుకుంటున్నాయి. తెలంగాణకు నేతల తాకిడి మొదలైంది. దశాబ్దాలుగా తెలంగాణ ఇస్తామంటూ పబ్బం గడుపుతూ వస్తున్నవారు మొన్ననే నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్య చూసి వస్తామని ఒక పరేడ్ చేసినరు. అంతకు ముందు జగన్ నిజామాబాద్‌లో ఓదార్పుయాత్ర కూడ చేసిండు. గిట్లబోయి గట్లోస్తే, ఒక్కసా రి పలకరిస్తే తమ సమస్యలన్నీ మాయమై పోవునని భ్రమపడెంతగా హడావిడి చేస్తారు రాజకీయ నాయకులు. మభ్యపెడదామని అనుకుంటారు కాని ప్రజలు ఈ అవుట్ డేటెడ్, అరిగిపోయిన ట్రిక్కులకి విసిగి వేసారి పోయారని అర్థం చేసుకోవ నిజమే ఎన్నికలప్పుడు తప్పితే ప్రజలవైపు చూసే సంస్కృతి మన రాజకీయాలలోకి పాకలేదు. నిజానికి తెలంగాణల తవ్వి తీస్తే అంతా గాయాల పొక్కిలి. జిల్లాకొక కథ. దోపి డీ, జీవన విధ్వంసం. దోపిడీ చేసేవాడే నాయకుడి వేషంలో వస్తాడు. మనవాళ్ళు దగ్గరుం డి కథ నడిపిస్తారు. ఇదే ఇక్కడి దౌర్భాగ్యం. తెలంగాణకు శా పం. రాజకీయ పార్టీలన్నీ ఇక్క డి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అన్ని ప్రాంతాలను పీల్చి పిప్పి చేసినరు. ఇంకా చేస్తనే ఉన్నరు.

స్పీకర్ నాదెండ్ల మనోహర్, మెగాస్టార్ చిరంజీవి ఇతరులు కలిసి విశాఖ జిల్లా అరకు ప్రాంతానికి పోయి అక్క డి అదివాసీలతో స్టెప్పులు వేసిన దృశ్యం కళ్ళకు కనపడతనే ఉన్నది. గ్రీన్‌హంట్‌లోనో, బాక్సైట్ తవ్వకాలలోనో మీ బతుకులు కూలిపోక ముందు చివరిసారిగా చూసి వస్తామని పోయినట్టు వారికి చెప్పకనే చెప్పినట్టయింది. మొన్నటి ఫ్లోరోసిస్ యాత్ర కూడా అట్లాంటిదే. ఈ రాజకీయ పార్టీలన్నీ చేయలేని పని అక్కడి ప్రజలు, సంఘాలు చేసినయి. చేస్తూనే ఉన్నయి. నిజానికి ఫ్లోరోసిస్ సమస్యపై చేయని పోరాటం లేదు.వందలకొద్ది ఫ్లోరోసిస్ బాధితులు నిరసనగా ఎన్నికలలో నిలబడి ప్రపంచ చరిత్ర సృష్టించినరు. వేల కిలోమీటర్లు ఢిల్లీకి పాదయాత్ర చేసి ప్రపంచం కళ్ళు తెరిపించినరు.కాని పాలకుల హృదయాన్ని కదిలించలేకపోయినరు.

జలసాధన సమితి తరపున ఎన్నో వినూత్న కార్యక్షికమాలు చేపట్టినరు. ప్రజలు తరతరాలుగా చేయని పాపానికి శిక్షని అనుభవిస్తూ కొన్ని వేలమంది జీవచ్చవాలుగా బతుకుతున్నారు. ఒక్కసారి నల్లగొండకు వస్తే తెలంగాణ ప్రజల బాధలు అర్థం అవుతాయి.కృష్ణానది నీళ్ళు రెండో పంటకు కావా లనేవాళ్ళు, తాగునీరు కోసం, కనీసం గుక్కెడు మంచినీళ్ళ కోసం తపించి పోతున్న ప్రజల ని చూస్తే అర్థం అవుతుంది. వలసపాలకుల నిర్లక్ష్యానికి నిలు సాక్ష్యాలు ఇక్కడి బాధితులు. మా పాలన మాకు వస్తే, మా బతుకులు మారతాయి అనే ఆశ, కోరిక. కాంగ్రెస్‌వారికి గడ్డురోజులు వచ్చినయి కాబట్టి నల్లగొండ పరేడ్ అనివార్యం అయింది. కాంగ్రెస్ లీడర్లు కానీ, రెడ్డి వెలమరాజులు కానీ ఏమి చేయలేకపోయారన్నది చరిత్ర చెప్పిన సాక్ష్యం. నల్లగొండ నుంచి ఎన్నికలలో నిలబడి, ప్రజల కష్టాలను పాలుపంచుకోకుండా, కేంద్రం చేతిలో కీలుబొమ్మలైన వారు ఎవరో, ఏమిటో ప్రజలందరికి తెలుసు. ఎవరు వచ్చిపోయినా తరువాత షరా మామూలే. ఎక్కడి గొంగడి అక్కడే. ఎవడి చావు వాడే.

ఇపుడు విజయమ్మ సిరిసిల్ల చేనేత కార్మికులను పరామర్శిస్తనంటున్నది. దాని పేరు దీక్ష. ఈ పరామర్శలు, ఓదార్పు యాత్రలు ఎందుకో, ఏమి ఉద్ధరిస్తాయో? దీనితో ప్రజలకు వొరిగేది శూన్యం. అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసి పెట్టిన ఘనత ఇక్కడి చేనేత కార్మికులది. తెలంగాణ కళలకు పెట్టింది పేరు. ఆటు పోచంపల్లి, గద్వాల్, ఇటు సిరిసిల్ల లాంటి ప్రాంతాలు చేనేతలో ఎంతో పేరు గాంచినవి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ నేతన్నలకు 1985 నుంచి గడ్డు రోజులు మొదలైనయ్. దీనికి తోడూ ఎల్‌పీజీ (ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ)లు కార్మికులను, కర్షకులను బిచ్చగాళ్ళుగా మార్చాయి. నూతన ఆర్థిక విధానాలు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశాయి. చేతి వృత్తులు కూలబడ్డాయి. మగ్గాలు అటకెక్కినై. దీంతో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినా ఇక్కడికి విజయమ్మ ఒక్కసారి వచ్చి ఒక్క కన్నీటి బొట్టు రాలిస్తే సమస్య పోతుంది అనుకుంటున్నారు కొద్దిమంది. విజయమ్మ దోచుకున్న లక్షల కోట్లలోంచి కొన్ని వేలు రాలిస్తే సమస్యలు పోతాయా?

తెలంగాణపై తమ వైఖరి ఏంటో తేల్చకుండా ఏ ఒక్క పార్టీ అడుగు పెట్టొద్దు అని ముక్తకంఠంతో ఇక్కడి ప్రజలు నినదిస్తున్నారు. స్వ ప్రయోజనాల కోసం తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన పార్టీలు, పబ్బం గడుపుకొని అవతల ఎట్ల పడ్డాయో మనం మరిచిపోవద్దు. రాష్ట్రపతి ఎన్నిక, క్విడ్ ప్రో కో, నీకింత నాకింత అని అక్కడ ఒప్పందాలు అయిపోయాయి. శత్రువులు కాస్త మిత్రులు అవుతున్నారు.

తెలంగాణ బిడ్డలుగా మాదొక సవాలు. ముందుగా మీకు తెలంగాణ గురించి ఏమి తెలుసో మాకు తెలియాలి. ఎవరు మమ్మల్ని మోసం చేశారో, ఎందుకు చేశారో మీరు చెప్పాలి. మీరు నిజంగా ఇక్కడి సమస్యలు తీర్చాలంటే ఇక్కడ ఉన్న దోపిడీని అడ్డుకోవాలి. కరీంనగర్‌లో ఓపెన్‌కాస్ట్ వల్ల జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడానికి దీక్ష చేయా లి. ఊర్లను మింగుతున్న ఓపెన్‌కాస్టు లను ఆపా లి. అలాగే 720 గ్రానైట్, కంకర క్వారీలతో అల్లాడుతున్న కరీంనగర్‌ను, పర్యావరణాన్ని ఈ మైనింగ్ నుంచి కాపాడగలరా? బలి అవుతున్న గ్రామాలను, చారివూతక ప్రదేశాల ను, జంతుజాలాన్ని రక్షించగలరా? మిడ్ మానేర్, ఎల్లంపల్లి, అబ్దుల్ కలాం, సుజల స్రవంతి, రాజీవ్ రహదారి పేరుతో భూములు లాక్కొని, కనీసం నష్టపరిహారం చెల్లించకుండ పనులు నిర్వహిస్తున్న వారిని నిలదీసి ప్రజలకు న్యాయం చేకూర్చగలరా?
రాజకీయ ఎత్తుగడలకు సన్నాయి వాయిద్యాలకు మోసపోయే స్థితిలో మేం లేము.

మసిపూసి మారేడు కాయ చేసే మాటలతో ఇంకా మమ్ములలను మాయ చేలేరు. మోచేతికి బెల్లం అంటించి నాకమనే నాటకాలు ఆపండి. మీ మోసపు మాటలు,చేష్టలతో ఇప్పటికే తెలంగాణ అలిసిపోయి ఉన్నది. ఆత్మహత్యలతో విసిగి పోయి ఉన్నది.ఆవేదనతో ఆతలాకుతలమైతున్నది. కరువు రాకా సి కోరలకు తెలంగాణ కన్నబిడ్డలను అమ్ముకుంటున్నది. మాకు మీ దీక్షలు వద్దు. మమ్మల్ని మళ్లీ రగిలించొద్దు. రెచ్చగొట్టొద్దు. మీ చర్యలు చరివూతను పునరావృతం చేస్తే, మరో తిరుగుబాటుకు మీరే కారణం అవుతారు. ఇక వెనుదిరిగేది లేదు. మేము పోరాటానికి సిద్ధం.మాకు కేసులు, చావులు, యుద్ధాలు కొత్త కాదు. ఇక్కడి గడ్డ మీద కాలుపెట్టే ముందు మొన్నటి మానుకోట సంఘటనను గుర్తుతెచ్చుకోండి. ఆ పవివూతమైన రాయి ఇంకా మా చేతిలో పదిలంగానే ఉన్నది.
-సుజాత సూరేప
Andhra Jyothi News Paper Date : 23/07/2012 

Friday, July 20, 2012

This Godly Delusion Is the controversy over the Ambedkar cartoon warranted? Can’t we laugh at our revered? Anuradha Raman

“There’s nothing wrong in being grateful to great men...but there are limits to gratefulness...in politics, bhakti, or hero-worship, is a sure road to degradation and eventual dictatorship.”
—B.R. Ambedkar
Constituent Assembly, Nov 25, 1949
His words have often proved prophetic. The compact of allegiance to democratic, secular ideals that he forged into the Constitution of India has guided India well for 60 years. But is Dr Babasaheb Ambedkar a figure above questioning? Above critique? (Leave alone being lampooned?) Should he be made out as the prophet he never wanted to be? Last week, Parliament, whose enduringly stable framework and accommodative ambits he helped define, answered those questions in the affirmative. Taking offence to the reproduction of a cartoon of Ambedkar in an NCERT political science textbook for Std XI, our MPs overwhelmingly decided to scrap the textbook. Wait, Ambedkar may have disapproved.
Genuine debate has been kept at bay; what passes for debate is the building of ramparts around an icon. Historical (and current) oppression is a fact; he had fought it with the tools of cold reason. With that, he set the template for modern India. Deification, for all its allure, risks going the other way. It’s by nature restrictive; it reduces Ambedkar to a demigod in need of protection, a Dalit icon only, not the modern colossus all of India must take pride in—and assess too. “In a way, it’s a corollary of deification that you wouldn’t like to see your ‘god’—or have him seen—in negative light,” says Anand Teltumbde, a professor at IIT-Kharagpur.

The controversial cartoon by Shankar
But first, is Ambedkar a prophet? For those who think he is, as Kancha Ilaiah argues in a column, it’s a given: in authoring the Constitution, he authored a revolution, and, being a Dalit himself, through that act created new terms of existence for the oppressed. In fact, that’s what makes that act an inalienable part of modern India reinventing itself. That is perhaps the very reason why deification will be reductive, and not exhaust the full radical potential of Ambedkar’s lifework. That is why he must be restored to political philosophy.
“Ambedkar is more than a god for us. It’s through the Constitution that he gave opportunities to people who had none.” Milind Kamble, Chairman, Dalit India Chambers of Commerce “It’s a corollary of deification that you would not like to see your god in a negative light.” Anand Teltumbde, Professor, IIT-Kharagpur

“Ambedkar is not easily accepted as a leader of the country. Cartoons like this can be interpreted as insulting.” Gail Omvedt, Sociologist, rights activist “One can’t be blind to the politics being played out in the name of Ambedkar. But there is a section of activists who think he’s a god.” Gopal Guru, Professor, Jawaharlal Nehru University

“The real problem in our society today are so-called champions of SCs and Dalits who can’t tolerate any criticism.” Paramjit Singh Kainth, President, Chamar Mahajan Sabha “I don’t see any merit in the controversy. It’s an attempt on the part of political parties to gain mileage.” S.L. Virdi, Advocate, writer

“The depressed worship him as a revolutionary who gave them respect and identity. How can we mock him?” Thol Thirumavavalan, MP and leader, Viduthalai Chiruthaigal Katchi “The cartoon diminishes the stature of Ambedkar. For me, he’s not a god, but he gave an identity to those who didn’t have one.” D. Raja, Senior leader, CPI

“It’s not criticism of Ambedkar but the reinforcement of caste prejudices that surfaces from time to time that is a problem.” Meena Kandasamy, Poet, writer
Ambedkar’s words in the Constituent Assembly may, in fact, belie the very people deifying him or calling him a prophet—and because of the very prescience with which he seems to have pre-scripted the necessary conflict in society today. It was owing to his ethically grounded legalistic approach—not a blind politics by any means—that Dalits are now in a position to successfully protest what they see as an injustice to their icon. Does that latter act then constitute a regression?
Thol Thirumavavalan, the MP from the Viduthalai Chiruthaigal Katchi (VCK), a close ally of the DMK, who first flagged the issue in Parliament and was joined by parties across the spectrum, clarifies that his comments were made only in the context of school textbooks. “For the depressed, Dr Ambedkar is worshipped as a revolutionary who gave respect and identity to them. How can we mock him for slowing the pace of work on the Constitution as shown in the cartoon when despite ill-health he worked on it for a record eight months?” he asks. He belongs to a party that shuns any form of worship. Thirumavavalan says his concerns are confined to treating all leaders with respect and not belittling Ambedkar. He isn’t for deification; he’s only addressing his people (and shoring up a votebank). But many Dalits see god in him. Says Milind Kamble, a successful businessman, “He’s more than a god. Gandhi became a mahatma after his death; we have seen Ambedkar as a living prophet.” He could be a photograph or a plaster figurine, a subject of veneration and inspiration in millions of Dalit homes. In his coat and spectacles with the Constitution in his hand, he has been an inspirational figure for those on the margins, those at the bottom of the caste ladder, and all those who wished to see an egalitarian India. Besides framing the Constitution, he also challenged the Hindu order. In 1956, over six lakh people belonging to the backward castes embraced Buddhism at Ambedkar’s call. He is seen as the one who emancipated them from the shackles of a faith that refused to acknowledge them. Today, with the awareness and power afforded by education, their natural gratefulness and debt is being exhibited, ironically, through a certain touchiness. This is what D. Raja of the CPI says, “The cartoon diminishes the stature of Ambedkar. We forget that Indian democracy is because of the Constitution he gave us. For me, he is not god, but he gave an identity to those who didn’t have one. That’s important.”

Not funny? HRD minister Sibal during the cartoon debate

In Maharashtra households, as Y.S. Alone, an assistant professor at JNU, tells us, “it’s not uncommon to hear ditties woven around Ambedkar being sung even now—Andherya vastita Bhimanna lavalay diva (In darkness, Bhimanna has lit a lamp) or Uddharli koti kule, bhima thujya janmamoole (Because of your birth, many families blossomed, O Bhim’).” There are also those who accept nuance. Gopal Guru, a professor at JNU, says, “Common Dalits, involved in everyday acts of resistance and assertion, don’t treat Babasaheb as a god. They treat him as an exemplar, whose teachings have to be critically followed. But there is a section of activists who make him out to be a god.”
Nothing exemplifies this better than UP, where Ambedkar’s radical intervention in modern Indian history was reduced to statues, replicated ad infinitum by the BSP. That the price—Rs 5,000 crore for the upkeep of parks and monuments—might have had more really ameliorative use for lakhs of people—Dalits or other disenfranchised groups—became a dead argument. Ex-CM Mayawati, whose initiative the memorials were, never tired of saying that while prime land worth thousands of crores was grabbed by Congress regimes in Delhi to raise memorials like Rajghat, Shanti Van et al, not one memorial was erected to Babasaheb. She has changed all that—scores of Ambedkar statues dot the UP landscape.

Picture story A Shankar cartoon from Hindustan Times, 1933, lampoons Gandhi, M.K. Acharya and Ambedkar

It was sometime in the early ’70s, when electoral politics became increasingly competitive, that the importance of the Dalit vote was realised. (The general blossoming of identity politics through the ’80s and ’90s shaped Dalit politics too.) Says Teltumbde, “The political class began iconising Ambedkar (statues, roads named after him) This was seen as embodying Dalit esteem, honour, prestige. It was devotion to an icon,” he says. Devotion, the very thing that leads to intolerance to jokes or cartoons. Here, sociologist Gail Omvedt asks us to be aware of the fact that for some groups, he is a more powerful leader than Gandhi or Nehru.
Ambedkar’s grandson Prakash Ambedkar of the RPI agrees. “In a country that swears by prophesies, Babasaheb’s words on mixing religion, caste and society are almost prophetic and it is easy to make him a prophet. It is also easy to build a mythology around him.” He cautions against deification and says it’s much tougher to follow the philosophy of a man based on rigorous intellectual introspection. “When she was CM, Mayawati found nothing wrong in the textbooks. But when the Parliament debate took place, she was the first to demand that the book’s authors be jailed. How ironical. She spent her time building parks and statues.”
This, then, is the question: Once granted iconic status, can Ambedkar be the subject of a critique—a cartoon even? Poet-writer Meena Kandasamy says, “There have been critical essays on Ambedkar no one takes offence to. It’s not criticism but the reinforcement of caste prejudices that surface from time to time that are problematic.” Wary of making Ambedkar a god, she argues he has the same importance Martin Luther King has for black Americans.

Image making An Ambedkar statue being worked on in Mumbai. (Photograph by Amit Haralkar)
Strangely, the uproar over the cartoon has found no connect in the state of Punjab, where the 38 per cent Dalit population is largely unmoved by the happenings in Parliament. Here, Dalit politics follows its own trajectory. The last two or three years have been marked by a movement called ‘Mission Chamar’, more cultural than political, and aimed at inculcating pride in the Chamar caste with slogans like ‘Garv se kaho hum Chamar hain’. Its proponents do not see anything derogatory in the usage of words like Chamar and assert that it is time they shed the baggage of the past.
Says Paramjit Singh Kainth, president of the Chamar Mahan Sabha, which initiated the movement in the Doaba region of Punjab, comprising Jalandhar, Kapurthala and Hoshiarpur districts, “Most often these SCs and champions of Dalits who claim to be Ambedkar followers but are intolerant of any criticism—they are the real problem in our society today.” Dismissing the current wave of intolerance as complete humbug, Kainth says they don’t subscribe to it. Says S.L. Virdi, advocate and well-known Dalit writer, “I don’t see any merit in the present controversy, which seems an attempt to gain political mileage. They are clearly exploiting the name of Ambedkar but don’t have any intentions of following his teachings.”
The real fruits of Ambedkarism should mean anyone—and that means, inclusively, anyone—can engage in the democratic space without a sense of anxiety. Assertion can be quietly powerful. For, that’s exactly the way in which Ambedkar was more powerful than the Nehrus and the Gandhis.
***
Ambedkar Contemporaries Who Got A Rap
M K Gandhi Was often made fun of in cartoons, some of which called him a fakir-politician. Sarojini Naidu called him ‘Mickey Mouse’. He never objected. Motilal Nehru Had no problems with being ridiculed. Was himself a great wit. Once said that water is pure, but even purer is liquor, being distilled.

Jawaharlal Nehru Laughed at cartoons of him facing the problems of a new nation and of his equations with other political leaders. M.A. Jinnah Sarcasm, dark upper class wit—these were his forte. Was pilloried, lampooned. The deification happened only in Pakistan.

Sardar Patel Not a particularly humorous figure. His policies were often attacked in cartoons, but he never objected. Sarojini Naidu Had a great sense of humour and mercilessly teased all the leaders about private and public matters.

By Anuradha Raman with Chander Suta Dogra, Sharat Pradhan

Source : http://www.outlookindia.com/article.aspx?280965

The Ethereal Realist Ambedkar is prophet to a people he created soul and politics for---- Kancha Ilaiah



The recent controversy over the cartoon of Babasaheb Ambedkar sitting on a snail and Pandit Nehru whipping it from behind, indicating that Ambedkar had made the process of making the Constitution slow, whereas Nehru was for hastening it, created a massive ruckus in Parliament, cutting across all political parties. The cartoon, drawn by P. Shankar Pillai in 1949, was brought into an NCERT political science school textbook in 2006. The reaction of Dalits to the inclusion of the cartoon in the textbook has been amazingly uniform: they have seen it as a deliberate undermining of Ambedkar’s stature; they have seen it as trivialising their prophet. For them, he is not just a Constitution-maker, as he is to Hindu intellectuals.
A bit of context here is useful. In the recent past, any attempt, howsoever small, to desecrate Ambedkar’s statues in any part of the country—there are thousands across India—has led to a riot-like situation. This has not been witnessed even in the case of statues of leaders like Mahatma Gandhi and Jawaharlal Nehru because they are seen just as great leaders—and nothing more—by their ardent followers. Being mostly Hindus, their gods are elsewhere. However, for a large number of Dalits, Gautam Buddha is God and Ambedkar is a prophet who established a spiritual relationship between the Buddha and them (Two other comparable, but more established, prophets are Jesus and Mohammed). For many insensitive, upper-caste intellectuals, he is just a leader or an intellectual, a lesser mortal than Gandhi. For consultants to the National Council for Educational Research & Training (NCERT) like Yogendra Yadav and Suhas Palshikar, he is a lesser mortal than even Lohia (they are Lohiaites).
How and why did Ambedkar cross the stage of a mere leader and intellectual in the mind of Dalits? How did he acquire the status and stature of a prophet? As in the case of the old Arab tribes, the Dalits of India were godless untouchables—exploited, worshipping local idols, living in oppression and superstition—at the time Ambedkar arrived on the socio-political scene of India. If Prophet Mohammed introduced the abstract Allah to self-destructive tribes, Ambedkar introduced Buddha to soulless Dalits.
Rama and Krishna, who were seen and referred to as gods by Hindu nationalist leaders, were never seen as the liberators and saviours of Dalits. Though Jesus and Mohammed used the politics of liberation and salvation, their organisation remained spiritual. On the other hand, Ambedkar worked as a leader and as an intellectual, wrote volumes, among which is the Constitution of India, but finally realised that religion is the source of liberation here and salvation hereafter. He created a new religion—Navayana Buddhism. Through this process, he even liberated Buddha from imprisonment in the Dashavatar. Unlike the other prophets, Ambedkar never performed miracles, but his birth, growth, education, and finally his pitting of Buddhism against Hinduism itself appear miraculous.
If Jesus giving spiritual water to a Samaritan woman in exchange for well water is a miracle, if Mohammed civilising the Arab tribes is a miracle, Ambedkar reviving Buddhism as the answer to iniquitous Hinduism is a miracle. Nehru—like some other intellectuals—thought Ambedkar’s Buddha and Dhamma would be an innocuous book. But that book is attaining the stature of Buddhism’s holy book. Gandhi and Nehru now remain upper-caste heroes and agents of the state, whereas Ambedkar is a prophet of the poorest of the poor—the Dalits. The difference between a prophet and a leader is that a prophet becomes a living hope of liberation and salvation of the poorest of the poor. That is what Buddha, Jesus and Mohammed are. They always stood by the poorest of the poor. They too never peeped into the houses of the rich and the exploiters. Ambedkar did the same.
Ambedkar infused soul into a soulless people. As Buddhists, they now walk with their head high. In drawing his cartoon, Shankar could not even imagine this. He was just an upper-caste man living off fun pictures. That is okay with Gandhi and Nehru. That funny game cannot be played with prophets who changed the lives of poor people, who were hitherto never allowed to be human beings. Yes, prophets too play politics. But their politics is meant to liberate the oppressed. Ambedkar did that without any compromise at any stage of his life.

(The writer is former head of political science at Osmania University, Hyderabad. He is also the author of Why I am Not a Hindu.)

Source : http://www.outlookindia.com/article.aspx?280966

Thursday, July 19, 2012

మొద్దుబారిన సమాజం--Namasete Telangana Sampadakiyam



అస్సాంలోని గువాహటిలో ఇటీవల టీనేజీ బాలికను ఓ మూక వెంటాడి వేధించిన విషాద ఘటనను సభ్య ప్రపంచం తీవ్రంగా నిరసించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా బలంగానే వ్యక్తమైంది. అయితే ఈ ఘటన సందర్భంగా, ఆ తరువాత భిన్నపక్షాలు వ్యవహరించిన తీరు అనేక నైతిక ప్రశ్నలకు తావిస్తున్నది. ఈ వార్తను సేకరించిన విలేకరి మొదలుకొని పోలీసులు, ముఖ్యమంత్రి, జాతీయ మహిళా కమిషన్ దర్యాప్తు బృందం మొదలైన వారంతా వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉన్నది. దుండగులు బాలికను వేధించడం మొదలుపెట్టినప్పుడు విలేకరి తమ సిబ్బందిని పిలిపించి చిత్రీకరింపచేసిండు. టీవీ చానెల్ ప్రసారం చేయడం వల్లనే ఈ ఘోరం ప్రపంచానికి తెలిసింది. తాము చిత్రీకరించడం వల్లనే దోషులను గుర్తించడం సాధ్యమైతున్నదని విలేకరి అంటున్నాడు. ఇంత వరకు పాత్రికేయ విధినిర్వహణలో తప్పు పట్టవలసిందేమీ లేదు. కానీ ఆ పాత్రికేయుడు ఒక మనిషిగా వ్యవహరించాడా అనేదే ఇక్కడ ప్రశ్న. అరగంట సేపు బాలికపై అనేక విధాలుగా రౌడీలు ఎగబడుతుంటే ఆపడానికి తన వంతు ప్రయత్నం చెయ్సాల్సింది. పోలీసులకు సమాచారం అందించాలె. అట్లా అని ఏదైనా ఘోరాన్ని చిత్రీకరించినందుకు తమకు ఎందుకు సమాచారం అందించ లేదని పోలీసులు విలేకరిని వేధించడం కూడా సమర్థనీయం కాదు. పాత్రికేయులే స్వయంగా కొన్ని నైతిక, మానవీయ విలువలు పాటించాలె. ఇట్లా మానవీయంగా వ్యవహరించిన ఉదంతాలు ఉన్నాయి. వియత్నాంపై అమెరికా అతి క్రూరంగా నాపామ్ బాంబులు కురిపిస్తున్నప్పుడు విలపిస్తూ పరుగెత్తుతున్న బాలికను హుయాన్ కాంగ్ ఉత్ ఫోటో తీశాడు. ఈయన ఫోటో వల్ల వియెత్నాంలో తమదేశం సాగిస్తున్న దారుణానికి అమెరికా ప్రజలే చలించి పోయి, యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అయితే ఈ పాత్రికేయుడు ఫోటో తీయడంతో తన పని అయిపోయిందనుకోలేదు.

బాలికకు వైద్య సహాయం అందించాడు. సంక్షుభిత సూడాన్‌లో- తిండి, నీళ్ళు లేక బలహీనంగా పడి ఉన్న శిశువును తినడానికి ఒక పీతిరి గద్ద రావడాన్ని ఫోటోక్షిగాఫర్ కెవిన్ కార్టర్ గమనించాడు. ఆ గద్ద శిశువు దగ్గరికి రావడానికి ఇర వై నిమిషాలు పట్టిందట. కెమెరా సిద్ధంగా పెట్టుకున్న కార్టర్ ఫోటో తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఫోటో తీసినందుకు అతడికి 1994లో పులిట్జర్ బహుమతి వచ్చింది. అయితే ఆ బాలిక గతేమయిందని అడిగినప్పుడు ఏమో తెలువదు అన్నాడు. అంటే ఫోటో తీసిన తరువాత ఆమెను పట్టించుకోనే లేదు. కార్టర్ ప్రవర్తన తీవ్ర విమర్శలకు గురైంది. కార్టర్ కూడాఎంతో మనోవేదనను అనుభవించి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యమాలపై పోలీసులు విరుచుకుపడుతున్న సందర్భాలలో, యుద్ధారంగంలో వార్తలు సేకరిస్తున్న పాత్రికేయుల పరిస్థితి అడకత్తెరలో పోకముక్క తీరుగ ఉంటుంది. వృత్తి ధర్మం నిర్వర్తించడమంటే సాహసమే. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసుల దాడి సందర్భంగా విలేకరులు నిర్వహించిన పాత్ర ప్రశంసనీయమైనది, ఆదర్శనీయమైనది. అయితే అన్ని సందర్భాలలోనూ వృత్తి ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించి, మానవత్వాన్ని మరిచి పోవడం క్షమార్హం కాదు. ఇటువంటి సందర్భాలలో పోలీసులు పాత్రికేయులను ఇరికించాలని చూడడం కూడా తప్పే. గువాహటి సంఘటన తరువాత బాలికపై దాడికి రెచ్చగొట్టింది విలేకరే అని ఒక సామాజిక కార్యకర్త ఆరోపించడం గమనార్హం. ఇందులో నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి. అయితే దర్యాప్తు పూర్తి కాకముందే అస్సాం ముఖ్యమంత్రి బహిరంగంగా టీవీ చానెల్‌పై, విలేకరిపై విమర్శలు చేయడం పద్ధతి కాదు. టీవీ చానెల్ ఎడిటర్ రాజీనామా చేయవలసి వచ్చిందంటే తెర ముఖ్యమంత్రి ఒత్తిడి పనిచేసిందనే అర్థం చేసుకోవాలె. ఈ టీవీ చానెల్ ఒక మంత్రిది కావడం గమనార్హం.


మహిళలపై అత్యాచారం జరిగిందనగానే ఆ ఘటనపై స్పందించి ప్రాచుర్యం పొందాలనుకోవడం మరో వికృత పరిణామం. రాజకీయ నాయకులు ఇదే అదను అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఘటనను వాడుకుంటున్నారు. జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ సభ్యురాలు అలకా లాంబ బాధిత బాలికను (ముఖంపై ముసుగు కప్పినప్పటికీ) విలేకరుల సమావేశంలోకి తీసుకురావలసిన అవసరం ఏమొచ్చింది? ఆ సందర్భంలో బాలిక ఎంత మనోవేదనకు గురయి ఉంటుంది! పైగా అలకా లాంబ బాధితురాలి పేరు కూడా వెల్లడించింది. ముఖ్యమంత్రి కార్యాలయం బాలిక ఫోటోను బయటకు విడుదల చేసింది. దాడి దృశ్యాలను ప్రసారం చేసిన టీవీ చానెల్ కూడా ఆమె పేరును బయట పెట్టింది. సభ్యతగల ఈ మనుషులు రౌడీ మూకకు తీసిపోకుండా బాలికను వేధించారు. పోలీసులు దాడి సమాచారం అందగానే రాలేదు. వెంటనే వెళ్ళడానికి మేమేమైనా ఏటీఎం అనుకుంటున్నారా అని ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించాడు. ఇటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయని, టీవీలు హడావుడి చేశాయని పోలీసుల స్పందన! నడివీధిలో ఇరవై మందికి పైగా టీనేజ్ బాలికను దాదాపు అరగంట సేపు నిర్భయంగా వెంటాడి వేధించడం ఎట్లా సాధ్యమైంది. పోలీసులు వచ్చి ఆమెను తరలిస్తున్న సమయంలో కూడా ఈ కీచకులు ఎగబడుతూనే ఉన్నారంటే వారెం త నిర్భయంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పాలకవర్గంలో భాగమైన వ్యాపార- రాజకీయ లాబీల అండ లేకుండా రౌడీ మూకలు మనుగడ సాగించలేవనేది తెలిసిందే. అంటే మొత్తం సమాజానికి సమాజమే మహిళలను గౌరవించే సభ్యతను, సంస్కారాన్ని కలిగి లేదు. అందుకే రౌడీలు నడి బజారులో బాలికపై వేటకుక్కల్లా ఎగబడగలిగారు. సమాజం కొన్ని సందర్భాలలో స్పందిస్తున్న తీరు మొత్తంగా నిరాశ కలిగిస్తున్న అంశం. స్పందన లు కోల్పోయిన సమాజాలు మరణ శయ్యపై ఉన్నట్టు లెక్క. ఆధునికానంతర యుగంలో మనుషులు మాయమైపోవడం, మానవీయతలు కరువవడం ఇప్పటి అసలు రుగ్మత. 
Namasete Telangana News Paper Dated : 19/07/2012 

Tuesday, July 17, 2012

Dalits in Tamil Nadu


Dalits in Tamil Nadu:
The dalit question in Tamil Nadu cries out for a new political imagination in the left and the dalit parties
The oppression, social humiliation and exploitation of the dalit and tribal communities in Tamil Nadu contradict the accepted image of the state as having made impressive social and economic advances over the years. The abominable practice of untouchability, social, economic and  ligious segregation of dalits, violent upper caste reaction to any assertion, state complicity in such attacks, all this in addition to exploitation in the economic realm, these are the predicaments faced by dalits across the state, in rural and in urban areas. This is a state that has taken pride in its record of strong anti-caste and rationalist movements that catapulted lower-caste political outfit ts to state power more than four decades ago. The anti-upper-caste movements led by the Dravidian parties before and after Independence resulted in the state embarking upon various measures to subvert upper-caste domination in all spheres of public life, but sadly, the liberation of dalits is yet to make any signifi cant advance. Dalits, particularly in the villages, are subjected to severe social repression by the landowning middle and upper castes. They are prevented from accessing places of religious worship, forced to stay in segregated areas, made to endure untouchability and various other forms of social humiliation. Besides, the unlawful practice of manual scavenging continues to persist in many places. Reports from Rajapalayam in southern Tamil Nadu in early July talked about how a school was boycotted by members of a middle caste community because it employed two dalit women, one as a cook and, the other, as her help in the mid-day meal centre. Instead of rejecting their objections, the block development offi cer in the village transferred the dalit workers from the school. Not long ago, elected dalit panchayats in reserved areas were not allowed to function as caste Hindus boycotted them. It took the intervention of political movements to redress the situation. While in some places – such as in Uthapuram in Madurai district – temple entry movements led by dalits have been successful
following prolonged political interventions and community meetings. Elsewhere, in places like Cuddalore in mid-June, caste Hindus have not taken kindly to dalit demands to take part in religious processions and festivities. The plight of tribal communities is also as bad or even worse. A probe by the state’s revenue department recently found that Irula workers were made to work as bonded labourers in a village in Thanjavur district. Despite political mobilisation by various groups, for instance, the Viduthalai Chiruthaigal Katchi (VCK), which has its bases in
north-central parts of Tamil Nadu, and the Puthiya Tamizhagam in the southern parts, and active work by communist organisations, the process of progressive social change has been very slow.
Sadly, the dalit parties seem to confi ne themselves to “identity politics”, something that also fi nds a prominent place in the dalit fronts of the dominant Dravidian political parties. While
such activism may have given a sense of empowerment to dalits, the lack of substantive content has been a serious shortcoming. News of the VCK leader Thol Thirumavalavan demanding donations of gold on his birthday reminds one of the political practice of the Bahujan Samaj Party chief Mayawati who also used symbolism to project dalit assertion but could not do enough to address dalit issues when in power. Left parties such as the Communist Party of India (Marxist), especially their mass organisation, the Tamil Nadu Untouchability Eradication Front, which has done a lot of work in highlighting issues of untouchability and the problems of sub-dalit communities such as the Arunthathiyars, have also participated in temple entry movements. Their sustained work in highlighting these issues, mobilising dalits to protest, and forcing the state government to take remedial actions has paid some dividends. Yet, dalit emancipation and empowerment will get a boost only if these initiatives result in dalits assuming leadership positions in the left parties at various levels, not just remaining foot soldiers. Caste prejudice and oppression against dalits cannot be overcome unless there is a fresh political imagination within the left and the dalit parties. In the left, “caste” must no longer be viewed as a matter of the superstructure alone. Moreover, the left must accept that there is a lot to learn from Phule and Ambedkar. Likewise, the dalit parties too need a fresh political imagination wherein the ideas of Marx and Lenin are not irrelevant to the understanding of Indian society

Source : 
Economic & Political Weekly EPW July 21, 2012 Vol XLVII No 29