Wednesday, March 5, 2014

కాంగ్రెస్‌తోనే అణగారిన వర్గాల అభ్యున్నతి By కొప్పుల రాజు IAS


ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల హక్కును నిలబెట్టడానికి రాజ్యాంగం 117వ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చిన ఘనత యూపీఏ ప్రభుత్వానిదే. 75శాతం గ్రామీణ 50 శాతం పట్టణ ప్రజలకు ఆహారహక్కు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన
ఆహారభద్రత చట్టం ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు.

కసరి బుసకొట్టునాతని గాలి సోక అనే దారుణ దుస్థితి నుంచి, ఎంతోకొంత బయటపడి, కొంతమేరకైనా వెన్నెముక వికాసాలతో బతికే స్థితికి ఎస్సీలు నేడు చేరుకున్నారంటే అందు కు దోహదం చేసిన కారణాలు అనేకం వున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసి న బహుముఖమైన కషి. ఉన్నత విద్యావంతులైన ఎస్సీలు ఎంతోమంది ఉన్నారు. విశిష్ట పదవులందుకున్నవారు పెద్ద పెద్ద వ్యాపారాలు విజయవంతంగా నడుపుతున్న వారున్నారు. వీరందరి అభివద్ధి వెనుక కాంగ్రెస్‌పార్టీ, దాని ప్రభుత్వాల కషి గణనీయంగా వున్నది. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. కులవ్యవస్థ చెప్పనలవికాని దూరదష్టితో సమాజంలోని మెజారిటీ ప్రజల ను అంటుకోదగినవారుగా వుంచి, అల్పసంఖ్యాక ఎస్సీలను అంటరానివారుగా ముద్రవేసి, సామాజి క వ్యవస్థ బయటకు నెట్టివేసింది. ఊడిగపు చేసే మనుషులుగా ఉపయోగించుకున్నది. అందుచేత, ఈరెండు సమాజాలను కలపడం, ఊరికి దీటుగా వాడను అభివద్ధిచేసి, ఆ రెండింటి మధ్య అభేదాన్ని సాధించడం ఎంతో చాకచక్యంతో, అందుకు తగిన చట్టాల సహాయంతో, పురోగామి, మానవీయ భావజాల వ్యాప్తితో చేయవలసిన పని. దీన్ని కాంగ్రెస్ మాత్రమే చేయగలుగుతుంది. సమ సమాజాన్ని ఆవిష్కరించుకోవడానికి ముందు విధిగా, సమాజంలోని మిట్టపల్లాలను సరిచేయవలసిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ ఇతరులెవ్వరికంటె ఎక్కువగా గుర్తించింది.

ఇప్పటికీ అత్యాచారాలకు, హత్యలకు, దురంహంకార దాడులకు ఎస్సీలు గురవుతున్న సందర్భాలలో వారికి గట్టి దన్నుగా నిలబడుతున్న చరిత్ర కాంగ్రెస్‌కే ఉన్నది. దేశంలో ప్రతి 18నిమిషాలకు ఒకటి వంతున దళితులపై దాడులు జరుగుతున్నాయన్న సమాచారమే అంధకార భారతావనికి ప్రబల నిదర్శనం. 48.4 శాతం గ్రామాలలో దళితులకు ఇప్పటికీ ఊరుమ్మడి మంచినీటి వనరులవద్ద అనుమతి లేదు. 37.8 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో దళితుల పిల్లలు ఇతరుల పిల్లలకు దూరంగావుండి చదువు నేర్చుకుంటున్నారు. వెలిపంక్తి భోజనం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు కావడమే కనాకష్టంగా ఉన్న పరిస్థితి. నమోదవుతున్న కేసులలో 15.71 శాతం కేసుల మాత్రమే శిక్షలవరకు వెళ్తున్నాయి. మిగతావి ఎడతెగని తాత్సారానికి గురి అవుతున్నాయి. జాతీ య మానవహక్కుల సంఘం దళితుల దయనీయస్థితిపై సేకరించిన కఠోర గణాంకాలలో ఇవి కొన్ని మాత్రమే. ఆధ్యాత్మి క రంగమూ ఎస్సీలను అలుసు గా చూసింది. అంత్యజులుగా పరిగణించి, అవమానించింది. శతాబ్దాలుగా బడికి, గుడికి దూరంగా వుంచబడినవారికి బానిస బతుకులే శరణ్యమయ్యాయి.

2009,జనవరి 14న ఒడిస్సా రాష్ట్ర దళిత మహిళామంత్రి ఒకరు ఒక గ్రామంలోని శివాలయంలో ప్రవేశించబోతే, అక్కడి పూజారులు అడ్డుకున్నారు. చివరకి ఆమె ఆగుడిలో దేవుడిని దర్శించుకుని వెళ్లిన తర్వాత శుద్ధి కార్యక్రమం జరిపారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనైతే దళితుల పెళ్ళి ఊరేగింపుల మీద రాళ్ళువేసే అమానుషం ఇప్పటికీ ఉన్నదని సమాచారం. ఫ్యూడల్ గ్రామీణ భారతానికి, ప్రజాస్వామ్య రాజ్యాంగ మానవీయ నిర్దేశాలకు పూడ్చనలవికాని అఖాతం ఇప్పటికీ ఉన్నది. ఇటువంటి గ్రామీణ భారతాన్ని సోషలిస్ట్ సెక్యులర్ రాజ్యాంగబద్ధం చేయడమనే కషిని కాంగ్రెస్ పట్టుదలతో నిర్వహిస్తున్నది.

మార్పును వ్యతిరేకించే కొన్ని పాలకశక్తుల దన్ను తో దళితులకు వెన్నెముక మొలవకుండా చేసే దుస్సాహసానికి ఫ్యూడల్ ప్రాబల్యవర్గాలు పాల్పడుతున్నా యి. అందుకోసం దేశాధికార పీఠాన్నే చెరబట్టాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ చేపట్టి, దీక్షతో పూరి ్తచేస్తున్న సామాజిక న్యాయసాధన కషికి గండికొట్టాలనే పన్నాగం ఈశక్తుల అండతో జాతీయస్థాయిలో జోరు గా సాగుతున్నది. అందుకే కాంగ్రెస్‌పార్టీలో ఎస్సీల వాణిని గట్టిగా వినిపించేలా చేసి, అందుకు తగ్గ రీతి లో పార్టీ స్పందించేలా చేయవలసిన ఆవశ్యకతను ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ గుర్తించింది.

ఎస్సీల అడుగడుగునా వెన్నుదన్నుగా ఉండేలా, వారి చేతి దుడ్డుకర్రలా ఉపయోగపడేలా కాంగ్రెస్ తనను తాను పునర్నవీకరించుకుంటున్నది. పూర్వం మాదిరిగా ఎస్సీలసభలు ఏర్పాటు చేసి ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టి చేతులు దులుపుకోవడానికి బదులు బాధిత ఎస్సీలకు అండ దండ గా ఉండే పటిష్ఠమైన సైన్యంలా కాంగ్రెస్ కార్యకర్తలు తయారయై వారికి చేదోడువాదోడుగా ఉండాలని రాహుల్‌గాంధీ సరికొత్త పిలుపునిచ్చారు. పారదర్శకతకు, జవాబుదారీతనానికి వీలు కల్పించే చట్టాలను తీసుకువచ్చి, వెనుకబడిన ప్రజానీకంతో ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్తగా వ్యవహరించేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు కషి చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం ఇందు కు ఒక బలమైన నిదర్శనం. పదేళ్ళల్లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మరెన్నో చట్టాలు నిరుపేదలకు అన్ని రంగాలలోనూ పైవర్గాలతో సమానమైన వాటా లభించేలా చేయడానికి ఉద్దేశించినవే.

ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల హక్కును నిలబెట్టడానికి రాజ్యాంగం 117వ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చిన ఘనత యూపీఏ ప్రభుత్వానిదే. 75శాతం గ్రామీణ 50 శాతం పట్టణ ప్రజలకు ఆహారహక్కు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆహారభద్రత చట్టం ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు. ఇలాంటి చట్టం ఇంతవరకు ప్రపంచం లో మూడుదేశాలలోనే ఉండేది. భారత్ నాలుగవది కావడం గమనార్హం. సోనియాగాంధీ నాయకత్వంలోని జాతీయ సలహా మండలి సిఫార్సు మేరకు ఈ చట్టం అవతరించింది. ఆహార సబ్సిడీని ప్రభుత్వాలు ఉదారంగా భరించడానికి పౌరులకు ఆహారాన్ని ఒక హక్కుగా చేసి, అందించడానికి తేడా వున్నది. గ్రామీ ణ నిరుపేదలలో అధికశాతం ఎస్సీలు, ఎస్టీలే కాబట్టి ఈ చట్టం వారికి జీవన భద్రతను కలిగిస్తుంది.

గ్రామీణ ఉపాధిహామీ పథకం గ్రామసీమల్లో నిరుపేదల ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అణగారిన ప్రజల జీవితాల్లో తీసుకువచ్చిన మార్పు కళ్ళముందున్నదే. దేశంలో ఇంతకుముందెన్నడూ ఈ స్థాయిలో పేదలకు భరోసాను, ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన పథకం మరొకటి లేదు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 632 జిల్లాలలో ప్రతి ఐదు మంది కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉపాధి లభిస్తున్నది. 97 వేల పోస్టాఫీసులలో ఇందుకోసం ఐదుకోట్ల కు పైగా ఖాతాలు తెరుచుకుని వారిసేవలో తరిస్తున్నాయి. 2006-07లో ఈ పథకం క్రింద చెల్లించిన కనీస దినవేతనం 65 రూపాయలుండగా, 2012-13లో దాన్ని 128.6 రూపాయలకు పెంచారు. 2006 నుంచి ఈ పథకం క్రింద 1,10,700 కోట్ల రూపాయల మేరకు ఉపాధి వేతన చెల్లింపు జరిగింది. దాదాపు ఐదు కోట్ల కుటుంబాలకు 213 కోట్ల పనిదినాలు కల్పించాము. ఒక్క 2013లోనే 1.06 కోట్ల పనులు ఈ పథకం ద్వారా పూర్తిచేయడం జరిగింది.

చిన్న చిన్న దుకాణాల్లో వీధి వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న అసంఖ్యాక కుటుంబాలకు వత్తిభద్ర త కల్పించడం కోసం 2012లో తీసుకువచ్చిన వీధి వ్యాపారుల ఉపాధిపరిరక్షణ, క్రమబద్ధీకరణ చట్టంవారిపై ట్రాఫిక్ పోలీసుల, మున్సిపల్ అధికారుల వేధింపులు లేకుండా చేసి, వారి జీవనోపాధిని కాపాడుతున్నది. ఇది ఎంతో విప్లవాత్మకమైన చట్టం. అలా గే, ప్రాజెక్టులకు, పరిశ్రమలకు సేకరించే భూమికి పరిహారం చెల్లింపు విషయంలో బ్రిటీష్ కాలం నాటి కాలదోషం పట్టిన చట్టంవల్ల దేశంలో ఎంతోమంది భూములు కోల్పోయి, తగిన పరిహారంలేక బతుకులు దుర్భరమైపోయి విలపిస్తున్న నేపథ్యంలో పాతచట్టంస్థానే భూసేకరణలో పారదర్శక త, పునరావాస, పునరాశ్రయ చట్టాన్ని 2012లో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనివల్ల ప్రాజెక్టుల, పరిశ్రమలు, సెజ్‌ల క్రింద భూములు, ఉపాధు లు కోల్పోయినవారికి మెరుగైన పరిహారం, పునరావాసం లభించే అవకాశం కలిగింది.

ఇంకా మరుగుదొడ్లను చేత్తో ఊడ్చి శుభ్రం చేసే పారిశుధ్య వత్తి నిషేధ, పునరావాస చట్టం, నిర్భయచట్టం,కార్యాలయాలలో, కార్యక్షేత్రాలో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం, ఇందిర ఆవాస్ యోజన సహాయం రెట్టింపు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, సర్వశిక్ష అభియా న్, లోక్‌పాల్ లోకాయుక్త చట్టం వంటి అనేక అభ్యుదయకరమైన శాసనాలను రూపొందించి, దేశంలో నిజమైన ప్రజాస్వామిక పరిపాలన వ్యవస్థ పటిష్ఠం కావడానికి, అణగారిన వర్గాల పరిపూర్ణ అభ్యున్నతి ని సాకారం చేయడానికి యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు పాటుపడ్డాయి.

2013 అక్టోబరు 8న నూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో దళితుల సాధికారతపై జరిగిన ఒకకార్యక్రమంలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. అప్పుడు ఆయన గట్టి గా ఒక విషయం చెప్పారు. మూడవదశ దళితుల సాధికారత, హక్కుల సాధన విప్లవాన్ని కాంగ్రెస్ తీసుకురాదలచిందని ఆయన ప్రకటించారు. మొద టి దశ విప్లవం అంబేడ్కర్ తీసుకువచ్చారు. దళితుల కు రాజకీయ సమానత్వం సాధించి పెట్టడానికి రాజ్యాంగపరమైన పునాదిని ఆయన పటిష్టంగా నిర్మించారు. రెండవదశలో కాన్షీరావ్‌ు దానిని కొనసాగించారు. రిజర్వేషన్ల ద్వారా దళితులకు సంక్రమించిన శక్తి సామర్ధ్యాలను ఆయన ఒక పద్ధతిలో సంఘటితపరిచారు. సామాజిక సమానత్వాన్ని సాధించుకోవడం కోసం దళితులను రాజకీయంగా సమీకరించారు. ఇప్పుడు మూడవదశ దళిత సాధికారత, సమానత్వ సాధన విప్లవానికి కాంగ్రెస్ సార ధ్యం వహిస్తున్నదిఅని రాహుల్‌గాంధీ ఆ కార్యక్రమంలో వివరించారు. ఈ విప్లవ సాధనకోసం పంచాయితీల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ.

స్థానాల వరకు వివి ధ విధాన నిర్ణయ దశలలోను అన్ని స్థాయిలలోను పటిష్టమైన దళిత నాయకత్వాన్ని నిర్మించాలని ఆయ న అన్నారు. ఈబాధ్యతను ఈ వ్యాసకర్తకు, జాతీ య ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ పి.ఎల్ పునియాకు అప్పగించినట్టు ఆ సందర్భంలో ఆయన ప్రకటించా రు. తన బాల్యంలో నాయనమ్మ ఇందిరాగాంధీ తన తో చెప్పిన ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని గురించికూడా రాహుల్‌గాంధీ ఈ వేదికమీద వివరించారు. ఇందిరాగాంధీ చిన్నప్పుడు ఒకసారి జర్మనీ వెళ్ళారు. అప్పుడు అక్కడ హిట్లర్ పాలన సాగుతున్నది. అక్క డ జరిగిన ఒక హాకీ మ్యాచ్ చూడడానికి ఆమె వెళ్ళా రు. అది జర్మనీ జట్టుకు మరో దేశపు జట్టుకు మధ్య జరుగుతున్నది. జర్మనీ ఆటగాళ్లు స్కోర్ సాధించినప్పుడల్లా జర్మన్‌ల విజయధ్వానాలతో ఆటస్థలం హోరెత్తి పోయిందట. చివరికి గెలుపును అవతలి దేశం కైవసం చేసుకోగా జర్మన్‌ల నోళ్ళు మూగబోయాయట అవతలి దేశం గెలుపుకి హర్షసూచకంగా ఇందిరాగాంధీ ఒక్కరే లేచి చప్పట్లు కొట్టారట. దానికి జర్మన్‌లు ఆమెను హేళన చేస్తూ పిచ్చికూతలు కూశారట.

అందుకు ఆమె ఎంతమాత్రం బాధపడలేదు. ధర్మపక్షాన నిలబడేటప్పుడు ఒంటరి అయినా వెనుకాడకూడదు, దళితుల పక్షం నిలబడటానికి అటువంటి సాహసానికి ఎదురీతకు సిద్ధంగా ఉండాలని రాహుల్‌గాంధీ చేసిన ఉద్బోధను ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ శిరోధార్యంగా స్వీకరించింది. కాంగ్రెస్‌కు ఎస్సీలే వెన్నెముక అని రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ప్రాధాన్యం స్థానాలను ఎస్సీలకు కేటాయించి నాయకత్వంలో వారి భాగస్వామ్యాన్ని ఇతోధికంగా పెంచడానికి అన్యాయాలు, అత్యాచారాలు ఎదురైనప్పుడు వారికి గట్టిదన్నుగా నిలబడటానికి ఏఐసీసీ ఎస్సీ విభాగం ఒక వినూత్న వికేంద్రీకత వ్యూహాన్ని చేపట్టి ఎస్సీలకు రక్షాకవచం కావడం ద్వారా దేశంలో పెను సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఈమహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఎస్సీ సోదర లను ఇతర సామాజిక దీక్షాపరులను కోరుతున్నాను.
(రచయిత ఐఏఎస్ (విశ్రాంత),
ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ 
Namasete Telangana Telugu News Paper Dated : 6/3/2014 

No comments:

Post a Comment