Monday, June 30, 2014

నెరవేరని దళిత ఆకాంక్షలు ....మునిగిపోతున్న ఆదివాసీలు


పార్లమెంట్‌ సమావేశాలు తొలిరోజున ఉభయ సభలనుద్దేశించి రాష్టప్రతి ప్రసంగించి సభ వాయిదాపడిన తరువాత తెలంగాణ రాష్ట్ర పార్టీ సభా పక్షనాయకుడు లోక్‌సభలో పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతునƒ్ని తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాం ధ్రలో కలుపడానికి ఒప్పుకోమని, ఇప్పటికే వచ్చిన ఆర్డినెన్‌‌సను చట్టంగా తీసుకువచ్చే ప్రయ త్నాలను అడ్డుకుం టామని ప్రకటించడం చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది. ఆ పార్టీకే చెందిన మరొక యం.పి. ప్రాజెక్టును మేము వ్యతిరేకిం చడంలేదు డిజైను మార్చాలని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పడం కూడా విడ్డూరంగా ఉంది. ఇలాంటి ప్రకటనలు ఆది వాసీలు నిరాశ్రయులు కావడాన్ని ఏవిధంగా ఆపలేవు.

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష కమిటి సరిహద్దుల దిగ్భంధనంతో పిలుపునిచ్చి విజయవంతం చేశారు. సాధారణంగా స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆ ప్రాంతాలన్నీ యాధాతధంగా ఉంచడం లేదా వేరే ప్రాంతంలో కలుపడమో చేయాలి. కానీ వీరి అభిప్రాయాలను పట్టించుకోకుండా రాష్టప్రతి ఆర్డినెన్‌‌సతో ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపడం ఇక్కడి ప్రజల్ని అవమానించడమే అవుతుంది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఎవరికి అభ్యంతరంలేదు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలో బ్రిటిష్‌ కాలం నుండి ఉన్నవి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కొంతభాగం సీమాంధ్రలోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొంతభాగం ఈప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతుంది. తెలంగాణ సీమాంధ్ర రాష్ట్రాల్లోని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నప్పటికి ఎక్కువ శాతం సీమాంధ్ర సాగు, తాగునీరు కోసం ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందనేది వాస్తవం. దీనికి తెలంగాణ ప్రజలు, ్ర„పభుత్వం అభ్యంతరం చెప్పాల్సిన అవసరంలేదు. ఎందు కంటే గోదావరి నదీజలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ, సీమాంధ్రలు వెనుకబడిపోయాయి. గోదావరి జలాలు సముద్రంలోకి కలిసిపోతున్నాయి. సహజ వనరులను ఉపయోగించుకోవడానికి మనుషుల మధ్య తారతమ్యం చూపించడం మానవత్వం అనిపించుకోదు. ఈ కోణంలో ప్రాజెక్టు నిర్మాణంతో సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను ప్రజావసరాలకు వాడుకోవడాన్ని ఎవరైనా హర్షించాలి. అయితే ఈ ప్రాజెక్టు ్టవల్ల ముంపునకు గురయే్య ప్రాంతాల నిష్పత్తిలో ఆ జలాలనుకూడా అదే నిష్పత్తిలో వినియోగించు కోవ డానికి ఎందుకు రూపకల్పనలు చేయలేదో ఆలోచించాలి. ఈ ప్రాజెక్టు ఇపు డున్న సీమాంధ్ర తెలంగాణలో వేర్వేరుగా అంటే సీమాంధ్ర మద్రాసు ప్రావి న్‌‌సలో, తెలంగాణ నైజాం సర్కారులో ఉన్నపుడు ప్రతిపాదనలు రూపొందిస్తే ఈ రెండు ప్రాంతాలు 1956లో ఆంధ్ర ప్రదేశ్‌గా ఏర్పడి చివరికి ఈ రెండు ప్రాంతాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయానికి ఈ డిమాండ్‌ను చేయడం సమర్థనీయం కాదు.

మన ఇల్లు కూల గొట్టి పక్కవాడికి పందిరి వేయడాన్ని ఎవరైనా సమర్థిస్తారా? కానీ తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం సమర్థించాయని చెప్పుకోవచ్చు. ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపితే ఆర్డినెన్‌‌స వచ్చినందుకు నిరసనగా బంద్‌లు చేయడం సబబే కానీ ప్రాజెక్టు రూపకల్పన నుండి నిస్తేజంగా ఉండి తెలంగాణ రాష్ట్రం రాబోతున్న సమ యంలో పార్లమెంటులో ప్రాజెక్టుకు సంబంధించి ముంపుప్రాంతాలు, నిర్వాసితులగురించి చర్చించడానికి చాలా సమయం వెచ్చించబడింది. తెలంగాణలోని ఏ పార్టీ కూడా ఇంతవరకు పై విషయంపై చర్చించాయా పరిశీలించుకోవాలి. తెలంగాణ రాష్టస్రాధన కోసమే ప్రధానంగా దృష్టి పెట్టడంవల్ల ఈ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే ఆదివాసీల పట్ల శ్రద్ధచూపిం చలేదు. ఏడు మండలాలలోని ప్రజలు సీమాంధ్రలో కలుపడానికి సుముఖంగా ఉంటే దీనిపై చర్చ అవసరం లేదు. కానీ వారు సంపూర్ణంగా తెలంగాణలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంటే వారి మనోభావాలకు వ్యతిరేకంగా అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని చెప్పాలి. ప్రాజెక్టు పూర్తిచేసే క్రమంలో ఎదురయ్యే ప్రతిబంధకాలు ఈ ఏడు మండలాల ప్రజల నుండి వస్తాయని ఆ అవరోధాలను అధిగమించేందుకు సులువుగా ఉంటుందనే ముందుచూపుతోనే సీమాంధ్ర ప్రభుత్వం ఈ మండలాల విలీ నానికి ఆర్డినెన్‌‌సపై ఒత్తిడి తెచ్చిందని అందరూ భావిస్తున్నారు. ఆ ప్రభుత్వం జాగ్రత్తను నిందించాల్సిన పనిలేదు. తెలంగాణలోనే ఉండాలని కోరుకునే ఆదివాసీల ఆకాంక్షలను పట్టించు కోకుండా నిర్లక్ష్యం వహించిన తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా ఆదివాసీల జీవితాలను గురించి శ్రద్ధ చూపించిందనేది ఆలోచించాలి. ముంపునకు గురయ్యేవారు ఎక్కడ ఉంటే ఏమిటనే ఉదాసీన వైఖరితోనే తెలంగాణ ప్రభు త్వం వ్యవహరించిందని అర్థమవుతుంది. 

ఆది వాసీల జీవన మనుగడతో మమేకమైన అడవి, కొండలు, సెలయేరులు కƒను మరుగైన తర్వాత వారి జీవనశైలి పూర్తిగా కోల్పోవడం విచారకరమైంది. ఒక తెగ లేదా వర్గం సంస్కృతి సాంప్రదాయాల స్థానంలో కొత్తది రావడం వారి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా జరిగితే అది అభివృద్ధి అవుతుంది. వారి అభీ ష్టానికి వ్యతిరేకంగా జరిగితే అది విధƒ్వంసం అవుతుంది. ఈ ఏడు మండలాల లోని ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాలు జరిపే విధƒ్వంసక క్రీడలో బలౌతున్నారు. 
రామాయణ, మహాభారత కాలం నుండి దళిత, ఆదివాసీలపై వివక్ష కొనసాగుతుంది. వాలి సుగ్రీవులిద్దరు అన్మదమ్ములు రాజ సింహాసనం కోసం వారిమధ్య జరుగుతున్న అంతర్గత పోరులో రాముడు ప్రవేశించి తనను ప్రశ్నించిన వాలిని సుగ్రీవునికి అండగా నిలిచి వధించిన చరిత్ర ఉంది. స్వాభిమానంపై, ఆత్మగౌరవంపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరిగినపుడు ఆ దాడులను ఎదిరించిన ప్రతి దళిత, ఆదివాసి యోధులు రాజధర్మం పేరిట హత్యచేయబడ్డారు. ఇది లోక రక్షణకోసం చరిత్ర వ్రాయ బడినందున దళిత ఆదివాసి ప్రజలు కూడా ఈ చరిత్రను నమ్ముతున్నారు. 

వ్యక్తిస్వామ్యం అనేది ఏ రూపంలో ఉన్నా అది ప్రజా స్వామ్యా నికి తీవ్రమైన చెడుచేస్తుందని బొంబై లెజిస్లేచర్‌ సభల్లో డా బి.ఆర్‌. అంబేద్కర్‌ స్పష్టం చేశారు. ఆ సమయంలో బ్రిటిష్‌ ఇండియా ఆర్మీలో దళితులకు ప్రవేశంపై నిషేధం ఉం డడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ బొంబై ప్రావిన్‌‌సలో ఆ నిషే దం తొలగి పోయేలాగా తీవ్రప్రయత్నం చేశారు. దాని ఫలితమే భారత సైన్యంలో మహర్‌ దళం ఎన్నో వీరోచిత ఘట్టాలను నమోదుచేసింది. వేలాది కులాలున్న ఈ భారత సమాజంలో కేవలం కొన్ని కులాలు ఆనాటికి సైన్యంలో ఉండడాన్ని దళితఆదివాసీలకు ప్రవేశం లేకపోవడం ఈ దేశప్రజలకు ఇక్కడి ఆచారాలు, విలువలే కారణమౌతున్నాయని వీటిని రూపుమాపాలంటే స్వాతం త్య్రానంతరం కొత్త రాజ్యాంగం తయారు చేసుకోవాలని చెప్పిన అంబేద్కర్‌ తాను రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఈ దేశంలోని వివక్షతలపై అసమాన తలపై దృష్టిపెట్టారు. దళితులను, ఆదివాసీలను రాజ్యాంగపరమైన విద్య, ఉద్యోగƒ, రాజకీయ హక్కులు కల్పించబడ్డాయి. 

ఇవి ఆ వర్గాల వ్యక్తిగత అభి వృద్ధికోసం ఎక్కువగా ఉపయోగపడితే అంబేద్కర్‌ ఆశించిన సమగ్రాభివృద్ధికి మార్గమైన రాజకీయ నిర్మాణానికి ఉపయోగపడడంలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న క్రమంలో దళితుడిని ముఖ్య మంత్రిని చేస్తానన్న ప్రకటన ఎవరూ అడుగకుండానే ప్రకటించడం జరిగింది. తీరా రాష్ట్రం ఏర్ప డ్డాక ప్రకటించిన నాయకుడే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. అయితే దీనిపై అభ్యంతరం ఏమీలేదు. కానీ ఇందులో జరిగే విమర్శ ప్రతివిమర్శలపై చర్చ జరగడంలేదు. 20 సంవత్సరాలుగా మాదిగ హక్కులే మానవ హక్కు లంటూ ఉద్యమం చేస్తూ వారి నాయకుడు ఆ వర్గాన్ని రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో భాగస్వామ్యం పెరిగేందుకు ఉపయోగపడ్డాడు. ఆ ఉద్యమ నాయ కుడు తెలంగాణ ప్రభుత్వంపై దళిత ముఖ్యమంత్రి విషయంపై నిరసన ప్రకటిం చడం సహజం. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కాకుండా ఆ ప్రభుత్వంలో భాగమైన దళిత మంత్రులే ప్రతి స్పందించడమనేది చర్చించాలి. దళితుడిని ఏ పరిస్థితుల్లో ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేక పోయామో తెలంగాణ ముఖ్య మంత్రి చెబితే ఏగొడవలేదు. కానీ తన ప్రభుత్వంలో పనిచేసే మంత్రులతో ప్రతివిమర్శలు చేయించడం వాలీసుగ్రీవుల అంతర్గత పోరు పెట్టించినట్లుగా ఉంది. ఈ మంత్రులు తమ నాయకుడు గొప్పవాడని సమర్థిస్తే ఫరవాలేదు. కానీ దళితులకంటే మా నాయకుడు సమర్థనీయుడంటూ వారి ఆత్మగౌరవాన్ని వారే దిగజార్చుకొంటున్నారు. 

దళిత మంత్రులు, విద్యార్థి నాయకులు మాదిగ ఉద్యమ నాయకుడు మంద కృష్ణపై ప్రతివిమర్షలు చేస్తున్నారు వారు చెప్పేది ఏమిటంటే మందక్రిష్ణ వరంగల్‌ జిల్లాలోని వర్ధన్నపేట రిజర్‌‌వడ్‌ నియోజక వర్గం నుండి పోటీచేసి ప్రజల తిరస్కరణతో ఓడిపోయాడు. అతను మా గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు. ఆ నియోజకవర్గంలో డెబ్బది వేల ఓట్లు మాదిగలవి అయితే మందక్రిష్ణకు 25వేల ఓట్లు ఎలా వస్తాయనేది ప్రతివిమర్శ. తెలంగాణ ప్రభుత్వంలోని దళిత మంత్రులు టి.ఆర్‌.ఎస్‌. పార్టీతో కాకుండా వారివారి నియోజకవర్గాల్లో పోటీచేస్తే డిపాజిట్‌లు గల్లంతవుతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మల్కాజ్‌గిరి నుండి పోటీచేసిన లోక్‌సత్తా నాయకుడు జయ ప్రకాష్‌ నారాయణ్‌ కూడా ఓడిపోయారు. అయితే ఆయన ఏ రాజకీయ నాయకుని గురించి కానీ మిగతా రాజకీయాల గురించి కానీ మాట్లాడ కూడదా? అదే మల్కాజ్‌గిరి యం.పి. స్థానంలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా పోటీచేసి ఓడిపోయారు. అయితే ఆయన ఏమీ మాటాడకుండా, ఎవరినీ విమర్శించకుండా ఉండాలా? ఇలాంటి ఎంతోమంది మేధావులు, ఉద్యమ కారులు ఎన్నికల్లో ఓడిపోతారు. ఓటమిని గుర్తుచేస్తూ వారిని అవమానిం చేలాగా ప్రతి విమర్శలు చేయడం ఎవరికి సబబుకాదు. దళిత ఆదివాసి ప్రజలకు వ్యతిరేకంగా జరిగే సామాజిక వివక్షతను ప్రశ్నించడానికి ఉద్యమ సంఘాల నాయకులతోపాటు ఆయా ప్రభుత్వాల్లో ఉంటున్న దళితఆదివాసి ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా ఉద్యమిస్తేనే ఈ వర్గాలకు విముక్తి లభిస్తుంది. 

న్యాయవాది, హుజురాబాద్‌, 
కరీంనగర్‌ జిల్లా, సెల్‌: 9966677149.

Surya Telugu News Paper Dated: 12.06.2014 

No comments:

Post a Comment