Wednesday, December 4, 2013

Why oppose Rayala Telangana? By Kancha Ilaiah


Kancha Ilaiah | 18 hours 15 min ago
The Congress at the national level, after examining the problems involved in the creation of Telangana with 10 districts, seems to have come to the conclusion that unless Kurnool and Anantapur are added, none of the major problems that had cropped up before the Group of Ministers can be resolved.
Obviously it was after a series of meetings that the GoM seemed to have arrived at the opinion that if Andhra Pradesh needs to be bifurcated, this is the only way it can be done. Once this proposal was mooted, the reaction of the so-called pro-Telangana upper caste intellectuals, even of some reputation, has been shocking.
They are now arguing that this proposal, if executed, will harm the interests of the weaker sections of Telangana, who were expecting to empower themselves only in a 10-district state. They say that the Reddys of the two districts of Rayalaseema will jeopardise the empowerment of weaker sections of Telangana state.
No less an intellectual than C.H. Hanumatha Rao, the Chancellor of Hyderabad Central University, writes in an English daily on December 3: “In the process of the movement for separate statehood for Telangana over the last decade, a powerful alliance of hitherto neglected social groups has emerged.
This consists largely of backward, Scheduled Castes, Scheduled Tribes and minorities. They are represented by the Joint Action Committees of innumerable professions. In the separate state of Telangana their political clout is going be decisive, relegating the privileged social groups to the secondary position."
He further argues that with the creation of a 12-district state, this possibility would alter. Not only him, other upper caste writers have put forth the same argument in Telugu newspapers. This is a very hypocritical argument, to say the least.
More than anybody, Dr Rao knows pretty well the caste that formed the party with the onepoint Telangana agenda (the Telangana Rashtra Samiti) is a pocket borough of one privileged social order of Uttara Telangana and it mobilised the political clout in the region because to fulfil demand. He also knows that the so-called political joint action committee is virtually controlled by the Telangana Reddys.
Even other intellectuals who are opposing the proposal of Rayala Telangana, by pretending to support the weaker sections’ cause, know that it was the Velamas and Reddys of Telangana who benefited from the forcefully extracted money during the so-called movement.
The task force that was sent by the Union home ministry collected data about such forceful collection and the report is before the GoM. The report said that these forces invested in several businesses — particularly in the agri business — from that hugely extracted money. Will such immoral forces allow the lower castes and the poor to benefit from a separate state?
Can these intellectuals show a single leader of the stature of Dr S. Shailajanath (SC) and Raghuveera Reddy (OBC) — both from Anantapur — from the weaker sections of Karimnagar, where Velamas rule the roost and from Nalgonda where the Reddys virtually control everything?
The civil service representation from weaker sections — from Anantapur and Kurnool — is far better than the VelamaReddy dominated districts of Telangana.
In fact, the first Dalit chief minister of India, Damodaram Sanjeevaiah, emerged from Kurnool. The Telangana Reddy-Velamas never allowed such a Dalit leader to emerge. From among OBCs, the K.E. Krishnamurthy family emerged from Kurnool itself.

Not only for the last 10 years, but since 1969, the Reddy-Velama forces of Telangana have used the youth from the weaker sections as cannon fodder for this distractive cause, presenting it as a sentimental issue. They were pushing them into agitations leaving aside their studies. They now want one more round of agitations so that the semi-Shiva Sena kind of TRS can benefit from this issue politically and financially.
The demand for Rayala Telangana, in the eventuality of the state’s division, was strongly advocated by Asaduddin Owaisi. This, he and his party, the Majlis Itehadul Muslimeen, thought, would protect the Muslims from the emerging danger of the Bharatiya Janata Party growing in this region once it becomes a state.
Do these upper caste intellectuals know better about Muslim interests than the representatives of the community? Is it not a fear-stricken situation that all the feudal forces and the intellectuals that emerged in Telangana are fully convinced that Telangana would be ruled by SC/ST/OBCs and they want it to be so now? But these same forces were saying all these years: “Do not raise the caste issue during the course of the Telanana movement”.
There is a diabolical talk about cultural differences between Telangana and the Rayalaseema districts. What is common between the Karimnagar Dalits who eat beef and Velama landlords who hate them? What is uncommon between the Anantapur Dalits or Muslims and the Telangana Dalits or Muslims? There is no holistic Telangana culture which is different from that of Rayalaseema or Andhra.
This is a country of caste cultures but not of region-specific cultures. No Indian state should be carved out based on false claims of cultural identity. States can be formed only for administrative convenience or on the basis of language. We have witnessed how Telangana identity-based politics served the interests of upper caste feudal forces and how it destroyed the educational agenda of upcoming castes and communities.
Let this vexed issue of Telangana be solved by adding two more districts, if it allows that. Or let the bifurcation issue be buried forever. No sane intellectual should obstruct this issue.
Enough is enough.

The writer is director, Centre for the Study of Social Exclusion and Inclusive Policy, Maulana Azad National Urdu University, Hyderabad

Deccan Chronicle English News Paper Dated : 04/12/2013  

Tuesday, December 3, 2013

హక్కుల అమలే ముఖ్యం ? By చిక్క హరీష్ కుమార్

వికలాంగత్వం అంటే ఏంటి? మానవుని సహజ దేహ నిర్మాణంలో శారీరక లోపం ఉన్నట్లయితే అది వికలాంగత్వంగా చెప్పవచ్చు. నేటి సమాజంలో మానసిక లోపం ఉన్నవారినీ వికలాంగులుగా గుర్తిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన వికలాంగుల కంటే సకలాంగులే ఎక్కువగా ఉన్నారు కనుక వికలాంగులను, వారి సమస్యలను సకలాంగుడికి అవసరం అని అనుకుంటే అది సానుభూతితోనే మొదలవుతుంది (మనిషిగా కాదు). కానీ ఆ సానుభూతి రూపం - సహకార రూపం పరిశీలిస్తే నిజంగా అది వికలాంగులకు వారి జీవన స్థాయి మెరుగుపడటానికి ఉపయోగపడుతుందా? లేక ఆ సహకారం భిక్షంగానో దానంగానో మారుతుందా? ఈ సమాజంలో బానిసత్వానికి దాసోహానికి లోబడిన ప్రతి వ్యక్తిపై ఆధిపత్యాన్ని కానీ అధికారాన్ని కానీ చలాయిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇతర కులస్తులు తక్కిన కులాలపై చూస్తున్న చూపు, స్త్రీలపై పురుషుడి చూపు ఆయా స్థాయిని బట్టి సందర్భాన్ని బట్టి అజమాయిషిగానో లేక సానుభూతిగానో వ్యక్తపరుస్తున్న మాట నిజం. అయితే సమాజంలో అందరికంటే చిన్న చూపుగా చూడబడుతున్న వికలాంగులపై మాత్రమే సానుభూతి చూపించడానికి సమాజం సిద్ధపడుతుంది. మనిషిని మనిషిగా కాకుండా కులంగా, మతంగా, వర్గంగా చూడటం మనం చూస్తున్నాం. కానీ ఒక మనిషి కులం, మతం, వర్గం తెలి యక ముందు అతన్ని మనిషిగానే గుర్తిస్తుంది సమాజం. కానీ ఒక్క వికలాంగుడిని మాత్రమే మనిషిగా గుర్తించదు. అవయవాల లోపాల్ని ఎత్తిచూపుతూ పేర్లు పెడుతుంది. ఇది సదరు వికలాంగుడిని ఇంకా కృంగదీస్తుంది తప్పితే సహజమైన స్థితిలో ఉండనివ్వదు. వికలాంగులకు మౌలిక అవసరాలు - హక్కులు - సౌకర్యాలు ఉంటాయా; అసలు ఉన్నా యా... ఒక సాధారణ మనిషి అవసరాల్ని ప్రభుత్వం, సమా జం కానీ తీర్చే ప్రయత్నం చేస్తుంది. కానీ వికలాంగుల మౌలిక అవసరాల్ని కనీసం గుర్తించడం లేదు.
ప్రాథమిక హక్కుల్ని ప్రజాస్వామిక హక్కుగా వాడుకునే హక్కు వికలాంగులకు ఉందా? స్వాతంత్రపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, సమానత్వపు హక్కు, భావప్రకటనా స్వేచ్ఛా హక్కు వంటివి ఏ పౌరునికి అయితే అందుతాయో ఆ పౌరుడు స్వతంత్రంగా మెలగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం వికలాంగులకు ప్రభుత్వంతోపాటు, సామాజిక సంఘాలు, ప్రైవేటు వ్యవస్థలు గుర్తిస్తున్నాయా? అన్నీ సామాజిక ఉద్యమాలకు సాహిత్యమే ఊపిరైతే నడుస్తున్న వికలాంగ ఉద్యమానికి ప్రజాకవులు, కళాకారులు ఏ మేరకు ఉద్యమానికి ఊపిరిని అందిస్తున్నారు?... ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగ కల్పనలో 3శాతం రిజర్వేషన్ కలిగిన వికలాంగులు ఏమేరకు ఉద్యోగ అవకాశాలను దక్కించుకుంటున్నారు? వికలాంగుల హక్కులను సంరక్షించడానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను నియమించలేని ప్రభుత్వాలను చూస్తే వారి పట్ల ఎంతటి సానుకూల దక్పథం ఉందో చెప్పవచ్చు.వ్యవస్థలో తప్పు ఎక్కడ ఉందో అక్కడే సరిదిద్దే ప్రయత్నం ప్రభుత్వాలు ఎప్పుడూ చేయవు... దేనికైనా సమాజం నుంచి తిరుగుబాటు వస్తేనే హడావిడి చేస్తారు. వికలాంగుల హక్కుల్ని, అవసరాల్ని తీర్చడం రాజ్యాంగబద్దం చేస్తేనే దానికి విలువ. వికలాంగులు ఓటు వేసేందుకు తప్పితే ఓట్లు వేయించుకోడానికి అర్హతలేనివారిగా రాజ్యాంగం పరిగణిస్తోంది. విద్య, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ ఉన్నట్లే ఎన్నికల్లోనూ ఈ రిజర్వేషన్ పెట్టగలదా? ఏ పార్టీ అయినా వికలాంగులకు సీటు కేటాయించగలదా? వికలాంగులనూ వర్గీకరించాలి.
ధనిక, పేద వికలాంగులను విడివిడిగా గుర్తించాలి? పేద వికలాంగులకే రిజర్వేషన్ వర్తింపజేయాలి. వికలాంగుల కోసం ప్రభుత్వం ఎలాంటి చట్టాల్ని చేసింది? ఎంతవరకు అవి అమలుకు నోచుకుంటున్నాయి? సానుభూతి సహకారం కంటే కూడా వికలాంగుల హక్కుల అమలు మాత్రమే పరిష్కారం అని గుర్తుపెట్టుకోవాలి. పరిష్కారం లభించకుండా ప్రజా పోరాటాలు ముగిసినట్లు చరిత్రలో దృష్టాంతాలు లేవు. ఫూలే నుంచి మొదలుకొని కృష్ణ మాదిగ వరకు సమన్యాయ పోరాటానికే వారి జీవితాలను ఇచ్చినమాట, ఇస్తున్న మాట వాస్తవం. రానున్న తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలలో వికలాంగుల రాజకీయ వాటాను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది.
- చిక్క హరీష్‌కుమార్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం

-
Andhra Jyothi Telugu News Paper Dated: 03/12/2013

Friday, November 29, 2013

ఫూలే స్ఫూర్తి, వర్తమాన పోరాటాలు -By అమర్ (జనశక్తి)


Published at: 28-11-2013 00:17 AM
 
1 
 
1 
 
0 
 
 

19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో ముందుకు వచ్చిన సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో రైతాంగం పునాదిగా సాగిన ఫూలే ఉద్యమం మహత్తరమైనది. శూద్ర-అతిశూద్ర ప్రజలకు బహుజన ఐక్యతా స్ఫూర్తినిచ్చిన ఫూలే కృషి ఆయన్ని ప్రజల్లో మహాత్మునిగా నిలిపింది. వర్గ-కుల సమాజ నిర్మూలన, సామాజిక న్యాయసాధన అనే తక్షణ ఉద్యమాన్ని, జమిలిపోరాటాన్ని దృఢంగా కొనసాగించడానికి ఫూలే స్ఫూర్తితో మరొకసారి ప్రతిన బూనుదాం.
'దేశం అనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల వంటివారు' అని ఎలుగెత్తి చాటిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే. పూణేలోని జంబూర్దాలో 1827లో ఆయన జన్మించారు. 13వ ఏటనే సావిత్రిబాయితో ఆయనకు వివాహం జరిగింది. 1841-47 మధ్య ఉన్నత విద్యనభ్యసించిన ఫూలే తన శ్రీమతికి ముందుగా విద్య నేర్పినారు. ఆ వెన్వెంటనే 1848లో తరతరాలుగా చదువులు నిరాకరించబడ్డ శూద్ర, అతిశూద్ర మహిళలకు సావిత్రిబాయి ద్వారా పాఠశాలలు స్థాపించారు. శ్రమ జీవుల కోసం 1855లోనే రాత్రి బడులు స్థాపించి నిరక్షరాస్యతను పారద్రోలే దార్శనికుడయినారు. అంటరాని వాళ్ళకు తన ఇంట్లోనే నీళ్ళతొట్టి నిర్మించి ఔదార్యం చూపాడు. వెలివేయబడ్డ బ్రాహ్మణ స్త్రీలకు, పిల్లలకు ఆశ్రయమిచ్చాడు. అక్రమ సంతానంగా ముద్రవేయబడ్డ బాబును దత్తత తీసుకున్నాడు. అందుకే, పురోహితుల దోపిడీని వ్యతిరేకించినా అనేక మంది బ్రాహ్మణులు ఫూలేకు సానుభూతిపరులుగా ఉన్నారు. 1873 సెప్టెంబర్ 24న 'సత్యశోధక్ సమాజ్' స్థాపించి మహాత్మునిగా ఘనతకెక్కిన ఫూలే 1890 నవంబర్ 28న పరమపదించారు. ఈసామాజిక విప్లవకారుడిని స్మరించుకుందాం.
ప్రతికులానికి జనాభా ప్రాతిపదిక మీద ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఫూలే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సూచించారు. సామాజిక అసమానతలకు, విద్యా -ఉద్యోగావకాశాలు లోపించిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడే పోరాడి ముందు చూపు ప్రదర్శించారు. పురోహిత వర్గం దోపిడీకి, రైతుల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి సరళమైన భాషలో రచనలు చేశారు. నాటకాలు రాసి ప్రదర్శింపజేశారు. బాట్‌జీ (బ్రాహ్మణులు), సేట్ జీ (వ్యాపారస్తులు) వ్యవస్థల దోపిడీని నిష్కర్షగా చీల్చిచెండాడారు. తాను బ్రాహ్మణుడు కానందుకు ఒక పెళ్లి ఊరేగింపు నుంచి బలవంతంగా నెట్టివేయబడ్డ సంఘటన ఫూలేను బాధించింది. కులదోపిడీ వ్యవస్థపై పోరాటానికి అది ఆయనపై బలమైన ప్రభావం నెరపింది. పీష్వాల నిరంకుశ పాలన, పురోహిత వర్గాల దోపిడీపై జరిపిన నిరంతర పోరాటం ఆయనను డాక్టర్ అంబేద్కర్‌కు సైతం గురుతుల్యుడిని చేసింది. సామాజిక విప్లవకారునిగా మలిచింది. 'ఏ రోజునైతే మనిషి బానిసగా మారతాడో, ఆ రోజునే అతని సద్గుణాల్లో సగభాగం నశిస్తాయన్న' గ్రీకు మహాకవి హోమరు మాటల స్ఫూర్తితో శూద్ర, అతిశూద్ర, జాతుల విముక్తి కోసం ఫూలే జీవితాంతం దృఢంగా పోరాడారు. అయితే 'శూద్రులు' (అల్పులు), 'మహరి' (గొప్ప శత్రువు), 'అంత్యజ', 'చండాల' లాంటి అవమానకరమైన పేర్లతో ఈ దేశపు కష్టజీవులకు ఆర్యులు తగిలించిన పేర్లను ఆయన తీవ్రంగా ఖండించారు. 'భూసురులు'గా 'ఆర్యులు'గా తమకు తాము స్తుతించుకున్న బ్రాహ్మణీయుల దోపిడీని అడుగడుగునా చెండాడు. దేవ దానవుల యుద్ధాల గురించి అనేకమైన కట్టుకథలతో బ్రాహ్మణ్యాలు, పురాణాలు నిండి ఉన్నాయని ఫూలే విమర్శించారు. బ్రాహ్మణులు అనగా భూసురులు తమతో యుద్ధాలు చేసి ఆదిమ వాసుల్ని మూల వాసుల్ని రాక్షసులని పిలిచారు. వారు తమ భూమిని రక్షించుకునే వాళ్లు. కాబట్టి రాక్షసులనడం సరైందేనని, రాక్షసుల ఆకారాన్ని కట్టుకథలను పుక్కిటి పురాణాలను ఆయన బట్టబయలు చేశారు. రాక్షసులు ఒడ్డు పొడుగుల్లో ఆర్యుల్ని మించిన దృఢ కాయులని ఫూలే అభివర్ణించారు. యూరోపియనులు అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకుంటూ స్థానిక రెడ్ ఇండియన్లపై జరిపిన దాష్టీకల్లాంటివే ఆర్యుల దండయాత్రలని ఫూలే భావన. నీరో, అవారిక్, మెకయవిల్లీ లాంటి వారు కూడా క్రూర పరశురాముని ముందు దిగదుడుపేనని ఆయన పేర్కొన్నారు. శూద్రులు, చండాలుర పట్ల అమానుషమైన శిక్షలు ప్రతిపాదించిన కుల వ్యవస్థను డ్రూయిడ్ల కాలంలో సైతం చూడలేమని ఫూలే వెల్లడించారు.
'దళితులను ఐక్యం చేయండి -దళితులతో ఐక్యంకండి' అనే జనశక్తి సూత్రీకరణ మూలాలు దాదాపు రెండు శతాబ్దాల క్రితమే మహాత్మా పూలేలో కనబడతాయి. శూద్రులు-అతిశూద్రులు, రక్త సంబంధీకులని తన 'గులాంగిరి' పుస్తకంలో చాటారాయన. ఆయన ఇలా అన్నారు: 'శూద్రజాతిలో కొంతమంది తాము మాలీలమని, కుంబీలమని, కంసాలులమని, దర్జీలమని, మహర్లు-మాంగులమని', వడ్రంగులమని తమ తమ ఉత్పత్తుల ప్రాతిపదికగా గొప్పగా చెప్పుకుంటారు. మన పూర్వీకులున్నూ, మహర్లు -మాంగులు (మాల మాదిగలు)అని పిలవబడే అంటరానివాళ్ల పూర్వీకులున్నూ, స్వయాన తోడబుట్టిన వాళ్లనీ, రక్త బంధువులనీ, మన మన వంశపరంపరల మూలాన్ని జాడతీస్తే మనది ఒకటే మూల కుటుంబమని పాపం వాల్లకు తెలియదు. పైకి దండెత్తి వచ్చిన బ్రాహ్మణులతో, మాతృభూమి రక్షణ కోసం వాళ్ల పూర్వీకులు వీరోచితంగా పోరాడారు. తంత్రగొట్టు బ్రాహ్మల చేతిలో వాళ్లు ఓడిపోవడం వల్ల వాళ్లని దౌర్భాగ్యులుగా, నిరుపేదలుగా చేశారు. ఈ సంగతి తెలుసుకోలేక, శూద్రులు తమ సొంత చుట్ట పక్కాల్నే (అతి శూద్రుల్ని)ద్వేషించడం మొదలు పెట్టారు. దీనికి ఎంత జాలిపడాలో గదా!'
కుల వ్యవస్థ అనేది శ్రమ జీవుల విభజన, హెచ్చు తగ్గుల నిచ్చెన మెట్ల వ్యవస్థ 1873లోనే ఫూలే విశ్లేషించారు. ఆ శాస్త్రీయ విశ్లేషణను డాక్టర్ అంబేద్కర్ మరింత స్పష్టంగా విశదీకరించారు. 'ఈ మొత్తం యంత్రాంగంలో ఒక క్రమ పద్ధతిలో శ్రమ విభజన కనిపిస్తుంది. అయితే కార్ఖానాల్లో ఉన్నట్టి శ్రమ విభజన ఇక్కడ అసాధ్యం. ఎందుకంటే కమ్మరి, వడ్రంగి వారికి మార్కెట్ మారేది కాదు' అంటూ మార్క్స్ సైతం ఉత్పత్తి సామర్థ్యమూ, ఉత్పత్తి శక్తుల ఎదుగుదలా కుంటుపడిపోయాయని తన పరిమిత పరిశీలనలోనూ గమనించారు. మన సమకాలికులైన మార్క్స్, ఫూలేల మధ్య కుల వ్యవస్థ లక్షణాల పట్ల ఏక భావన ఉండటం గమనార్హం.
బ్రాహ్మణీయ కుల వ్యవస్థ నుంచి శూద్రులు, అంటరాని కులాలను విముక్తం చేయడానికి 1873 సెప్టెంబర్ 24న ఫూలే ప్రారంభించిన సత్యశోధక ఉద్యమం ఇంకా పరిపూర్తి కాలేదు. అది ప్రవచించిన మానవీయ సుఖశాంతులు, ఐక్యత, సమానత సాధించే లక్ష్యాల కోసం పోరాడవల్సే వుంది. సాహు మహరాజ్, క్రాంతి సిన్హా, నామా పాటిల్ తదితరులు సత్యశోధక్ సమాజాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఎ.హెచ్. సాలుంకే ఒకొనొక ముఖ్య సహచరుడిగా సత్యశోధక్ లక్ష్యాల సాధనకు కృషి జరుగుతోంది.
దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘమైన బొంబాయి మిల్లు కార్మికుల సంఘం స్థాపించేలా ఆనాడే మహాత్మా ఫూలే, నారాయణ లోఖండేకి మార్గదర్శనం చేశారు. ఈ విధంగా ఫూలే తన కాలంలో ఒక సామాజిక విప్లవకారుడిగా ముందుకు వచ్చారు. అయితే ఆ కాలంలోనే కార్మికులను, రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు ఫూలే ప్రయత్నించినా, ఆయన బ్రాహ్మణీయ వ్యతిరేక ఉద్యమంలో స్పష్టమైన వర్గ దృక్పథం, సామ్రాజ్యవాద వ్యతిరేక సమగ్ర దృక్పథం లోపించాయి. ఫలితంగా ఫూలే మరణాంతరం సత్యశోధక్ సమాజ్ రెండుగా చీలిపోయింది. ఆనందస్వామి నాయకత్వంలో ఒక వర్గం 1919-22 సంవత్సరాలలో సతారాలోనూ, 1930వ దశకంలో బుల్దానాలోనూ రైతాంగ తిరుగుబాట్లను నడిపించింది. అంతిమంగా ఈ వర్గం భారత కమ్యూనిస్టు పార్టీలో చేరింది. కొల్హాపూర్ మహారాజా నాయకత్వంలోని మరొక వర్గం అంతిమంగా మరాఠాలలో కొందరిని క్షత్రియులుగా గుర్తింపజేసే ఉద్యమంగా మారిపోయింది. ఇది సత్యశోధక్ భావాలకు పూర్తిగా విరుద్ధమైనది.

అయినప్పటికీ బ్రిటిష్ వలసపాలనాకాలపు 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో ముందుకు వచ్చిన సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో రైతాంగం పునాదిగా సాగిన ఫూలే ఉద్యమం మహత్తరమైనది. శూద్ర-అతిశూద్ర ప్రజలకు బహుజన ఐక్యతా స్ఫూర్తినిచ్చిన ఫూలే కృషి ఆయన్ని ప్రజల్లో మహాత్మునిగా నిలిపింది. చార్వాకుల నుంచి మొదలైన సామాజిక తిరుగుబాటు నుంచి ఆధునిక కాలంలో అర్ధ వలస -అర్ధ భూస్వామ్య వర్గ- కుల సమాజ దోపిడీ నిర్మూలనా పోరాటం దాకా సామాజిక విప్లవకారుడిగా మహాత్మా ఫూలే స్ఫూర్తిని విప్లవోద్యమం స్వీకరించవలసే వుంది. వర్గ-కుల సమాజ నిర్మూలన, సామాజిక న్యాయసాధన అనే తక్షణ ఉద్యమాన్ని, జమిలిపోరాటాన్ని దృఢంగా కొనసాగించడానికి మరొకసారి ప్రతిన బూనుదాం.
- అమర్ (జనశక్తి)
(నేడు మహాత్మా ఫూలే 123వ వర్ధంతి)
Andhra Jyothi Telugu News Paper Dated : 28/11/2013 

పోరాటాలతోనే విముక్తి By -జగన్ సీపీఐ (మావోయిస్టు) ఎన్.టి.ఎస్.జెడ్.సి

ప్రియమైన తెలంగాణ ప్రజాలా రా! ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యం గా, పీఎల్‌జీఏ 13వ వార్షికోత్సవాన్ని తెలంగాణ వ్యాప్తంగా విజయవంతం చేద్దాం! అంతర్జాతీయ ఎర్రసైన్యంలో ఒక డిటాచ్‌మెంట్‌గా, ప్రపంచ సోషలి స్టు విప్లవంలో భాగంగా భారత నూత న ప్రజాస్వామిక విప్లవ విజయం కోసం, భారత విప్లవ మహోపాధ్యా యులు చారుమజుందార్, కాన్హాయ్ చటర్జీల పథ నిర్దేశంలో మన పీఎల్ జీఏ ఆవిర్భవించింది. 2013 డిసెం బర్ 2 నాటికి అది 13ఏళ్లు పూర్తిచేసుకోబోతున్నది. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణవ్యాప్తంగా పీఎల్ జీఏ13వ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు జరుపుకోవాలని ఎన్‌టీ ఎస్‌జెడ్‌సీ పిలుపు నిస్తున్నది. విప్లవోద్యమాన్ని నిర్మూలించే లక్ష్యంతో పాలకవర్గాలు ప్రజలపై సాగిస్తున్న గ్రీన్‌హంట్‌ను ఓడించడానికి, ప్రజస్వామిక తెలం గాణను సాధించే లక్ష్యంతో యువతి, యువకులు పీఎల్‌జీఏలో పెద్ద యెత్తున భర్త్తీ అవుతూ.. గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తున్నది. 2012 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ ప్రజాయుద్ధంలో 10మంది విప్లవ కారు లు అమరులయ్యారు. దేశవ్యాప్తంగా 150 మందికి పైగా నేలతల్లి ఉత్తమ పుత్రికలు, పుత్రులు, సాధారణ ప్రజలు తమ నులివెచ్చని నెత్తురుధారబోసి అమూ ల్యమైన తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పిం చారు. కామ్రేడ్స్ సుధాకర్,పుష్ప,సబిత,గౌతం, ఊర్మి ల, రాజు, వసంత, బీమా.. ఇంకా ప్రజాసంఘాల నాయకుడు గంటి ప్రసాదం, వెంకట సుబ్బయ్య, విప్లవరచయిత ఆలూరి భుజంగరావు తదితరులు రాజ్యం చేస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్లలో, రాజ్య ప్రేరేపిత హంత కముఠాల చేతుల్లో అమరులైనారు. మరికొంత మంది అనారోగ్యంతో అమరులైనారు. వీళ్లంతా నూతన ప్రజస్వామిక విప్లవంకోసం, దోపిడీ పాలన అంతంకోసం, నవసమాజంకోసం తుదికం టా పోరాడి తమ రక్తాన్ని చిందించి ఎర్రజెండాకు మరింత వన్నె తెచ్చారు. వారి ఆశయాలను సమున్న తంగా ఎత్తిపడదాం. వారు వదిలివెళ్లిన కర్తవ్యాలను పూర్తి చేసేవరకు పోరాడుతామని శపథం చేద్దాం.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల వికృత మైన అభివృద్ధి పర్యవసానంగా అంతర్జాతీయంగా సుడులు తిరుగుతున్న ఆర్థిక మాంద్యం ప్రభావం మనదేశంపై కూడా తీవ్రంగానే పడింది. అవినీతి పెరిగిపోవడం,నిరుద్యోగం,అధిక ధరలు, దారిద్య్రం, విస్థాపిత సమస్యవల్ల,భూములు, అడవులు, నీరు కోల్పోవడం వల్ల కార్మిక, కర్షక, మధ్యతరగతి పీడిత ప్రజానీకం బతుకులు దుర్భరంగా మారాయి. వారికి విప్లవం తప్ప మరో మార్గం ఏదీ లేకుండా పోయిం ది. విప్లవానికి భౌతిక పరిస్థితులు పరిపక్వ మవుతు న్నాయి. అన్ని సెక్షన్ల ప్రజల సమ్మెలు, ఆందోళనలు పెరుగుతున్నాయి.ఆర్థిక పోరాటాలు రాజకీయ పోరా టాలుగా మారుతున్నాయి. దేశంలోని వనరులను దోచిపెట్టడానికి దేశంలో, మన రాష్ట్రంలో 1991 నుంచి నూతన ఆర్థిక విదానాల ద్వారా దోపిడీని తీవ్రతరం చేస్తున్నాయి. ఫలితంగా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నది. లక్షలాదిమంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు రాజ్యం ప్రజల మధ్య వైరుధ్యాలను పెంచి వారిపై బహుముఖ దాడిని కొనసాగిస్తున్నది. పీడిత ప్రజలైన రైతాంగం, దళితులపై, ఆదివాసీల పై, మైనార్టీలపై, మహిళలపై, కార్మికులపై అణచివేతే ప్రధానాయుధంగా నిర్బంధాలకు గురిచేస్తున్నది. ప్రజాస్వామ్యం ముసుగులో బూర్జువా, భూస్వామ్య వర్గాలు, దళారీ పాలకులు, సామ్రాజ్య వాదులతో మిలాఖతై ప్రంపచీకరణ విధానాలను అమలు చేస్తూ బహుళజాతి సంస్థలకు గనులు, టైగర్ ప్రాజెక్టులు, భారీ నీటి ప్రాజెక్టులు, కోస్టల్ కారిడార్ పేరిట, సెజ్ లు, ఓపెన్‌కాస్టుల పేరిట పీడితప్రజలను, ముఖ్యం గా ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారు. మరో వైపు ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహారభద్రత చట్టం, నూతన భూసంస్కరణ చట్టా న్ని రూపొందించింది. రాష్ట్రంలో కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం రచ్చబండ, బంగారు తల్లి, రాజీవ్ యువ కిరణాలు పథకాలను ప్రవేశపెట్టింది. ఇవన్నీ ప్రజల్లో భ్రమలు కల్పించేందుకే తప్ప మరోటి కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దాడికి గురైన తెలంగాణ ప్రజలు,ఆదివాసీలు, దళిత కులాలు, మైనార్టీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల పోరా టంతో కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్టాన్ని ప్రకటిం చా ల్సివచ్చింది. ఇది తెలంగాణ ప్రజల పోరాట విజ యం. 

1969-71 తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన తర్వాత-1996లో విప్లవోద్యమమే తెలంగాణ ఉద్య మానికి ఊపిరిపోసిన విషయం జగద్వితం. అప్పటి నుంచి దిశ, దశలను నిర్దేశిస్తూ ప్రజాస్వామిక తెలం గాణ రాష్ట్రసాధన నినాదాన్ని, స్పష్టమైన లక్ష్యాన్ని ముందుంచింది. ఇప్పటి భౌగోళిక తెలంగాణలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాబోవు. పాక్షికంగానే కొన్ని సమస్యలు తీరుతాయి. దళారీ బూర్జువా, భూస్వామ్యవర్గాలకే అధికారం, ప్రయో జనం దక్కుతుంది. ప్రతి ఒక్క అణగారిన ప్రజల మౌలిక సమస్య ప్రజాస్వామిక తెలంగాణను సాధిం చుకోవడం ద్వారానే పరిష్కారం అవుతుంది. దాని కోసం తెలంగాణ ప్రజలు ఐక్యతతో మిలిటెంట్‌గా పోరాడాల్సిందిగా పిలుపునిస్తున్నాం. తెలంగాణ ప్రజలు, ఆదివాసీలు, మైనార్టీ, దళితులు, కార్మిక, మహిళ, రైతాంగం, విద్యార్థి,యువజనుల సమస్య లు అంతిమంగా వర్గపోరాటంలో పాల్గొనడం ద్వా రానే పరిష్కారం అవుతాయి. ఆదివాసీలపై టెర్రరిస్టులనే ముద్రవేసి లేగదూ డలపై ఎగబడ్డ తోడేళ్ల గుంపులాగా, ఆదివాసీలను ఊచకోత కోయడాన్ని, వారి మాన, ప్రాణాలనూ, సర్వాన్నీ హరించి వేస్తున్న కిరాయి పోలీసుల పాశ విక దాడుల్ని అడ్డుకునేందుకు క్రియాశీలంగా ప్రజలంతా కదలాలి. మావోయిస్టులు హింసావాదు లుకారు.నిజం చెప్పాలంటే శాంతికాముకుల్లో వారు అగ్రశ్రేణిలో నిలుస్తారు. వారిపై విషం కక్కు తున్న బూర్జువా ప్రచార సాధనాల దుష్ప్రచారాన్ని నమ్మ కండి! విప్లవోద్యమం పక్షం వహించండి! ఈ శత్రువు దాడిని ప్రజా రాజ్యాధికార నిర్మాణా ల ను, ప్రజా సంఘాలను తుడిచిపెట్టే శత్రువు కుట్రలను ఓడించక పోతే విప్లవోద్యమం సాధించిన విలువైన ఫలాలన్నీ నాశనమవుతాయి. కాబట్టి శత్రువును ఒంటరి చేసి దెబ్బతీయటంలో మీవంతు పాత్రను నెరవేర్చండి! పెద్దయెత్తున్న పీఎల్‌జీఏలో చేరి ప్రజాసైన్యపు బలగాన్ని అనేక రెట్లు పెంచి దాన్ని బలోపేతం చేయండి! భూమి-అధికారంపజా స్వామ్యం- ప్రజా సైన్య నిర్మాణం- స్వావ లంబన నినాదాలతో నేడు దేశంలో అనేక ప్రాంతా లలో ఉవ్వెత్తున సాగుతున్న ప్రజా ఉద్యమాలతో మమే కం కండి! దోపిడీ వర్గాలను సమూలంగా నాశనం చేయకుండా మౌలిక మార్పు ఏదీ రాదు. ప్రత్యా మ్నాయ నూతన ప్రజా స్వామిక వ్యవస్థ కోసం ముందడుగేద్దాం! రండి! పోరాడ సాహసిస్తే అంతిమ విజయం ప్రజలదే! మావోయి స్టు విప్లవో ద్యమ నిర్మూలనకు భారత దోపి డీ వర్గాలు శిక్షణ పేరుతో సైన్యాన్ని మోహరిం చడాన్ని వ్యతిరేకిద్దాం! 

-జగన్
సీపీఐ (మావోయిస్టు) ఎన్.టి.ఎస్.జెడ్.సి అధికార ప్రతిని

మేధావులు ప్రమాదకరం! ( ‘మావోయిస్టు పార్టీ సైన్యం కంటే.., దాని సిద్ధాంతకర్తలు, మేధావులు ఎక్కువ ప్రమాదకరం’) By హరగోపాల్,


కేంద్ర హోంమంత్రిత్వశాఖ తన నివేదికలో ‘మావోయిస్టు పార్టీ సైన్యం కంటే.., దాని సిద్ధాంతకర్తలు, మేధావులు ఎక్కువ ప్రమాదకరం’ అనే ఒక గొప్ప సూత్రీకరణ చేసింది! ఈ సూత్రీకరణ మూలాలు మన రాష్ట్ర పోలీసుల ఆలోచనాధారలో ఉన్నాయి. ఒక కాలంలో దేశానికి చంద్రబాబు ఒక రోల్ మోడల్‌గా మీడియా ఒక భ్రమను సృష్టిం చింది. అలాంటి భ్రమనొకటి ఆంధ్రా పోలీసు యం త్రాంగం సృష్టించగలిగింది. అందుకే హోంశాఖ మావోయిస్టు ఉద్యమాన్ని అణచడానికి ఆంధ్ర అణచివేత నమూనాను పాటించాలని భావిస్తున్నది. నమూనా రూపంలో అమానుషమైతే సారంలో భార త రాజ్యాంగాన్ని, చట్టబద్ధపాలనను, ప్రజాస్వామ్య విలువలను విధ్వంసం చేసేది. సమస్యాత్మకంగా కనిపించిన ఏ వృత్తినైనా అతనికి మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నా లేకున్నా ఎవరినైనా చంపి వేయవచ్చు అనే లైసెన్స్‌ను పొందడం ఈ సూత్రీకరణలో భాగం. బాలగోపాల్ లాంటి హక్కుల నాయకుడిని కిడ్నాప్ చేశారు. వరంగల్‌లో 60మంది ఉపాధ్యాయులను రోజూ పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేయాల ని, చేయకపోతే పైలోకానికి పంపిస్తామని భయవూబాంతులు సృష్టించారు. పోలీసు అధికారులు నియంతలుగా ప్రవర్తించినా ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలేదు. తెలంగాణ నిజానికి ఒక నియంతృత్వ కోరల్లో బతికింది.

ఇది ఆంధ్ర నమూనా. ఉద్యోగాలు చేసుకుంటూ కొంచెం విలువలతో జీవించేవారు, గ్రామాల్లో ప్రజల పోరాటాలను ఆసక్తితో గమనిస్తున్నవారు, ఈ పోరాటాల్లో న్యాయమున్నదని విశ్వసించే వారందరూ పోలీసుల దృష్టిలో దోషులే. ఆ భయానక పద్ధతులు నక్సలైటు ఉద్యమం బలహీనపడడానికి తోడ్పడ్డాయని విశ్వసించి, ఈ ‘గొప్ప విజయా’న్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు బోధిస్తే,అది వాళ్ల వంటికి బాగానే పట్టింది. చంద్రబాబు పట్ల సృష్టించిన భ్రమ ఎంత నిజమో, ఇది కూడా అంతే నిజం.నక్సలైటు ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి నాలుగు దశాబ్దాలుగా పాలకులు ఈ ఉద్యమ స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దీన్ని ఒకసారి శాంతిభవూదతల సమస్య అని, మరోసారి సామాజిక ఆర్థిక సంక్షోభమని, మరొకసారి దీనికి ఈ రెండు పార్శాలున్నాయని, తమ ప్రయోజనాలను బట్టి సూత్రీకరణ చేస్తూ వస్తున్నారు.

ఎన్టీఆర్ నక్సలైట్లు దేశభక్తులన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో 2004లో ఇది సామాజిక, ఆర్థిక సమస్య అని పేర్కొన్నది. అదే ఎన్నికలలో ఈ ఉద్యమాన్ని అణచివేస్తానన్న చంద్రబాబుకు వ్యతిరేకంగా శాంతిచర్చలు జరుపుతామని రాజశేఖర్‌డ్డి గెలిచాడు. చంద్రబాబు చిత్తుగా ఓడిపోయాడు. అంతకుముందు ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం నక్సల్స్ సమస్య మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసింది. భారత ప్లానింగ్ కమిషన్ ఒక అధ్యయన బృందాన్ని బాలగోపాల్, శంకరన్ లాంటి వాళ్లతో నియమించింది. విశ్వవిద్యాలయాలలో దీని మీద పరిశోధనలు జరిగాయి. నెల క్రితం సోనియాగాంధీ నాయకత్వం వహిస్తున్న జాతీయ సలహా మండలి ఈ సమస్య మీద చర్చించడానికి ఒక పదిమందిని ఢిల్లీకి ఆహ్వానించి ఒకరోజు చర్చ జరిపారు. ఇంకా ఆ రిపోర్టు పూర్తి కాలేదు.

ఈ ప్రక్రియ అంతా ఒకవైపు జరుపుతూనే హోంమంవూతిత్వ శాఖ ఆంధ్ర పోలీసుల సలహానే సమస్యకు పరిష్కారంగా ఆలోచించడం హాస్యాస్పదంగా ఉన్నది.మేధావులు, సిద్ధాంతకర్తలు ఉద్యమాలను నిర్మించలేరు, నడపలేరు. ఉద్యమాలు ప్రజల అసంతృప్తి నుంచి అసమానతల నుంచి, అన్యాయాల నుంచి, అణచివేత నుంచి పుట్టి మహావృక్షాలుగా ఎదుగుతా యి. ఉద్యమాలకు సామాజిక అన్యాయం కారణమైనప్పుడు మేధావులు కారణాలను విశ్లేషిస్తారు. వాటి నే సమాజానికి చెబుతారు. చెప్పాలి కూడా. జాతీయ సలహామండలికి ఏం చెప్తారో బయట కూడా అదే చెబుతారు. జాతీయ సలహా మండలి మేధావులను పిలిచి నేరం చేసిందని హోంమంత్రిత్వ శాఖ అంటే మనం చేయగలిందేమీ లేదు. లోతుగా ఆలోచించవలసిన అంశమేమంటే మనది ప్రజాస్వామ్య దేశమే నా? ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటో ఎన్నోసార్లు రాయడం, మాట్లాడడం చేస్తూనే ఉ న్నాం.

చట్టబద్ధ రాజ్యాంగబద్ధ పాలన ఉదార ప్రజాస్వామ్యానికి ఉండే బలం. ఆ విలువల ఛట్రంలోనే పాలకులు ‘మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేద’ ని అంటుంటారు. ఎవరి హింసకు తావులేదో చెప్ప రు. ప్రజా ఉద్యమాలకు హింసచేసే అధికారం ఉండ దని చాలామంది అంటుంటారు. కానీ రాజ్యానికి ఎవరంటే వాళ్ల మీద హింస చేసే అధికారం ఉంటుం దా? ఈ ప్రశ్న అడగని సమాజం చాలా ప్రమాదపు అంచులకు చేరుకున్నట్లు. అంతకుమంచి ఆలోచనల మీద నియంవూతణ చేసే హక్కు ఉంటుందా? అనేది ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి ఉండే ప్రధాన తేడా. నియంతృత్వం మనిషి మేధ స్సు మీద నిఘా పెడుతుంది. అది ప్రమాదకరమని భావిస్తుంది. అం దుకే అది మేధో వికాసానికి ఎన్ని ప్రతిబంధకాలు కల్పించాలో అన్ని రకాల ప్రతిబంధకాలను కల్పిస్తుం ది. ఉదారప్రజాస్వామ్యం భావవూపకటనాస్వేచ్ఛ పునాదుల మీద నిర్మాణం జరిగినట్లు సిద్ధాంతకర్తలందరూ రాస్తూ వచ్చారు.

ఒక దేశం ప్రజాస్వామ్య దేశమని తనను తాను పిలుచుకొనడానికి మొదటి అర్హత భావప్రకటనా స్వేచ్ఛ. రెండుపజా ఉద్యమాలకు కల్పించే అవకాశాలు. శాంతియుత ఉద్యమాలను, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచినప్పుడు ప్రజలు వేరే మార్గం లేక ఆయుధాలు తీసుకోవచ్చు. ఆయుధాల తో ఉద్యమాలను అణచివేస్తే ఆయుధాలతో ప్రజలు పోరాడుతారు. ఆ పోరాటాలను విశ్లేషించే వారుంటారు, ఉండాలి కూడా. పాలకులకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికై నా చెప్పే వారుండాలి. అది చెప్పేవాడే ప్రమాదకర మని భావిస్తే ప్రజాస్వామ్యం అంతిమ దశలో ఉన్నట్లేపస్తుత ప్రధాని కొత్తలో ‘నక్సలైట్లు మన పిల్లలే అని, వాళ్లు దేశాన్ని విడగొట్టడం కోసం పోరాడడం లేదని, ప్రజల సమస్యల కోసం ఉద్యమిస్తున్నార’ని మంచి మాటలే అన్నాడు. ఈ దశాబ్ద కాలంలో ప్రధానిలో వచ్చిన మార్పు.అది వ్యక్తిగతం కాదు. ఈ మధ్య రాజకీయ సుస్థిరత దెబ్బతినడమే కాక బోలెడ న్ని స్కాంలు బయటకు వచ్చాయి.

వ్యవస్థ విశ్వసనీయతే ప్రమాదంలో ఉన్నది. ఆ ప్రమాద ఘంటికల కలవరమే హోంశాఖ సూత్రీకరణ. ఈ సూత్రీకరణ తెలంగాణ వరకు కొంత నిజం కావచ్చు. కాని మిగ తా మావోయిస్టు రాష్ట్రాల్లో సిద్ధాంతకర్తలు, మేధావు లు పెద్దగాలేరు. లేకున్నా ఉద్యమాలు నడుస్తున్నా యి. ఆఉద్యమాల నుంచి మేధావులు రావచ్చు. కాని మేధావుల వల్ల ఉద్యమాలు రావని ఆంధ్ర పోలీసులకు అర్థం కాలేదు. అసమక్షిగంగా అర్థం చేసుకున్న సూత్రీకరణను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం, దాన్ని కేంద్ర హోంశాఖ నమ్మడం, నమ్మశక్యంగా లేదు. హోంశాఖ ఈ జ్ఞానోదయంతో అణచివేత ప్రారంభిస్తే ఉద్యమాలు ఏమౌతాయో తెలియదు. కానీ నియంత ఎదగడానికి కావలసిన రహదారిని వేసినట్లే. అలాంటి నియంత ఎదిగితే ఈ సూత్రాన్ని వాళ్లు చాలామందికి అన్వయించవచ్చు. అప్పుడు వీళ్లు చేయగలిగిందేమీ ఉండదుపజాస్వామ్యం పునాదులు విలువల సూత్రీకరణ మీద ఉంటుంది. విలువలే ప్రమాదమనడం ఎంత ప్రమాదం!

Namasethe Telangana Telugu News Paper Dated: 28/11/2013 

నవ ‘భారత రత్న’ (మహాత్మా ఫూలే) By ఉ.సా


మహాత్మా ఫూలే ఆధునికారంభ కాలంనాటి భవిష్యత్తు కాల దార్శనికత కాల పరీక్షలో నెగ్గి ఆధునికానంతర కాలంలో సైతం మన దేశ బడుగు వర్గ బహుజనులకు క్రాంతి దర్శిగా, దేశీయ లౌకిక సామాజిక ప్రజాస్వామ్య శక్తులకు స్ఫూరిదాయకంగా నేటికీ మార్గనిర్దేశం చేస్తోంది. నవంబర్‌ 27న ఫూలే 123వ వర్ధంతి సందర్భంగా ఆ మహాత్ముని పాత్రను ఓసారి సంస్మరించుకుందాం. ఆనా డు మహాత్మా ఫూలేే తాను జీవించిన కాలం (1827-90) నాటి సమ కాలీన ఆధునిక ప్రపంచగమ నాన్ని గమనించి, ఆ కాలం తెచ్చిన జ్ఞానోదయ మహోదయాన్ని సమర్ధవంతంగా ఆకళింపు చేసుకొన్నాడు. ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామ్య హేతుబద్ధ ఆధునిక ప్రాపంచక దృక్పథంతో ఆనాటి మన దేశ కాల స్థితిగతులకు ఆధునికతను అన్వయించడంలో సృజనాత్మక, చరిత్రాత్మక పాత్ర నిర్వహించాడు. 

తాను ఆకళింపు చేసుకొన్న ఆధునిక ఆలోచనా లోచనాలతో నవభారత నిర్మాణానికి నాందిపలికాడు. అందుకే ఆ నవభారత పితామహుడు మహాత్మ ఫూలే మనదేశ వినీలాకాశంలో ఆధునిక వైతాళిక ధృవతారగా నేటికీ వెలుగొందు తున్నాడు. 1855లో ఫూలే రాసిన నవయుగ నవభారత రత్న లాంటి ‘తృతీయ రత్న’ నాటికే ఆ చరితార్ధుని ఆధునిక తాత్త్వికతకి చారిత్రక సాక్ష్యాధారంగా నిలుస్తుంది.ఇప్పటికి (2013) 158 ఏళ్లక్రితం 1855లో మహాత్మా ఫూలేే మరాఠీ మాతృభాషలో, వ్యవహారిక పరిభాషలోరాసిన ‘తృతీయ రత్న’ నాటిక నేటికీ ఇంగ్లీషు లింకు భాషలోకి, మిగతా దేశ భాషల్లోకి తర్జుమా కాకపోవడంతో ఈ మహోన్నత ఆధునిక తాత్త్విక రచన సందేశం అందాల్సిన వాళ్లకి, అందాల్సిన సమయంలో అందకుండా పోయింది. ఈ లోటు పూడ్చే విధంగా ఇప్పుడు ఈ గ్రంథాన్ని తెలుగులో తేవడం జరిగింది.ఫూలే రచనల్లో ‘గులాం గిరి’ ముఖ్యమైన రచనే అయినా, అంతకంటే గొప్ప రచనగా పేర్కొనదగిన ‘తృతీయ రత్న’ ఆ ప్రాముఖ్యతను సంతరించుకోలేకపోయింది. 

1855లో ఫూలే తొలిరచనగా ‘తృతీయ రత్న’ ప్రచురితమైన 18 ఏళ్ల తర్వాత, 1873లో ప్రచురితమైన ‘గులాంగిరి’ ఎంత ప్రామాణికమైనదైనా, అంతకంటే ముందే దానికి తాత్త్విక భూమికను సమకూర్చిన ‘తృతీయరత్న’ అంతకంటే తలమానికమైనది. బ్రాహ్మణీయ వైదికార్య వేదవేదాంగ వర్ణాశ్రమ చారిత్రక మూలాలను వెలికి తీసే హేతుబద్ధ చారిత్రక దృక్పథంతో తన సమకాలీన సామాజిక స్థితిగతులను వాస్తవికంగా అంచనా వేసిన ‘గులాంగిరి’ ఇతివృత్తం సిద్ధాంత అవగాహనకు సంబంధించినది. ఆధునిక ప్రాపంచిక దృక్పథాన్ని అలనాటి మనదేశ పరిస్థి తులకు సృజనాత్మకంగా అన్వయించి, అప్పటి దేశకాల స్థితిగతుల దశాదిశ నిర్దేశం చేసిన ‘తృతీయ రత్న’ ఇతివృత్తం ఆధునిక తాత్త్విక దృక్పథానికి సంబంధించి నది. ఏ సిద్ధాంత అవగాహనకైనా, మరే అవగాహనకైనా తాత్త్విక భూమికే తలమానికం. కనుక బ్రాహ్మణేతర సిద్ధాంత గ్రంథమైన ‘గులాం గిరి’ ప్రామాణికమైనదైతే, భారతదేశ ఆధునిక తాత్త్వికతకి అద్దంపట్టే ‘తృతీయ రత్న’ దానికి తలమానిక మైన దవుతుంది.

1855లో మహాత్మా ఫూలే రాసిన ‘తృతీయ రత్న’ లేదా తృతీయ నేత్ర అనే నాటిక ఆయన తొలి రచనగా పరిగణ పొందుతున్నా మూఢాచార గాఢాంధకార చీకట్లను పారద్రోలిన పొద్దు పొడుపు లాంటి ఆ జ్ఞాననేత్ర రచనకంటే ముందే- 1848లోనే తొలికోడి కూతలాంటి మేలుకొలుపుతో ఆయన తన బ్రాహ్మణేతర సామాజిక విప్లకార్యాచరణకు అంకు రార్పణ జరిపాడు. భారత దేశంలోనే, దేశ చరిత్రలోనే తొట్టతొలి సారి ఫూలే సావిత్రి భాయి ఫూలేే దంపతు లిద్దరూ శూద్రాతి శూద్ర బాలబాలికల కోసం ప్రప్రథమ ప్రాథమిక పాఠశాలలు తెరిచారు. ‘తృతీయ రత్న’ నాటికలోని ముఖ్యపాత్రలైన పాటిల్‌- జోగాభాయి భార్యాభర్త లిరువురిని అలాటి వయోజన విద్యాలయాల్లో చేర్చడంతోనే ఆ నాటికకి ముగింపు పలికారు. అందుకే ఫూలే తన ‘తృతీయ రత్న’ నాటికకి ‘తృతీయ నేత్ర’ అని కూడా మరో పేరు పెట్టారు.తృతీయ రత్న లేదా తృతీయ నేత్ర నాటికలో మహాత్మఫూలే నిక్షిప్తంచేసిన రెండు ముఖ్యాంశాల్ని ప్రస్తావించుకోవాలి.

ఇందులో ఫూలే రెండురకాల తృతీయ ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించాడు. బ్రాహ్మణీయ హిందూ పునరుద్ధరణ వాదులకు (రివైవలిస్టులు), సంస్కరణవాదులకు (రిఫామిస్టులు) భిన్నంగా బ్రాహ్మణేతర హిందూయేతర బహుజన సామాజిక విప్లవ (రెవల్యూషనిస్టు) ప్రజా పంథాని తృతీయ ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిం చాడు. తదుపరి బ్రిటిష్‌ రాజ్‌కి, హింద్‌ స్వరాజ్‌కి భిన్నంగా ‘స్వతంత్ర బహుజనరాజ్‌’ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాడు. జీవితాన్ని బట్టే చైతన్యం ఉంటుందని ఫూలే జీవితాచరణ చెప్పకనే చెబుతోంది. ఇది తన జీవితం ఒడిలో నేర్చుకొన్న జీవితానుభావం, జీవితావసరం. అభ్యుదయవాదులైన అగ్రవర్ణ మార్క్సిస్టులకు విప్లవం అవసరం కాదు, ఆదర్శం. ఫూలేకి ఆదర్శమే కాదు, అవసరం. అగ్రవర్ణ నేషనలిస్టులకు అది ఆదర్శం కాదు, అవసరమూ కాదు. కారణం వారి జీవితం కుల పీడనకు గురైన పీడిత కులం కాదు.

బడిలో కలిసి చదువుకోవడం వలన ఓ బ్రాహ్మణ విద్యార్థితో ఏర్పడిన స్నేహ సంబంధంతో- 1848లో అతని వివాహానికి హాజరైనప్పుడు జరిగిన అవమానకరమైన సంఘటన బ్రాహ్మణిజంతో రాజీలేని పోరాటానికి ఫూలేేని పూర్తిగా సంసిద్ధం చేసింది. అట్టడుగు పాదాల నుండి పుట్టిన శూద్రులు అగ్రవర్ణాల వారి పాదాల దగ్గర బానిసల్లా పడి ఉండే గులాం గిరి చేయకుండా, శూద్ర ధర్మాన్ని అతిక్రమించి బ్రాహ్మణుల పెళ్ళి ఊరేగింపులో పాల్గొని- అగ్రకుల దురహం కారులు- ‘బ్రాహ్మలందరి కంటే వెనక నడువ్‌, లేదా వెనక్కి వెళ్ళిపో’ అని శాసించిన అవమానకరమైన సంఘటన ఫూలేేలో స్వాభిమాన చైతన్యా నికి నాంది పలికింది. ఆధునిక వ్యక్తిగత స్వేచ్ఛా, సమాన త్వాలను కులం నియం త్రిస్తుం దనే సత్యం జీవిత ఆచరణలో బైటపడి జ్ఞానోద యమైంది. కులవ్యవస్థని, కుల నియంత్రణని దెబ్బతీయకుండా, కుల అంతస్థుల్ని కూలదోసే కుల విప్లవ పోరాటాన్ని నిర్మించకుండా ఆధునిక ఫలాలు అందరికీ సమానంగా అందవన్న సత్యం అనుభవంలోకి వచ్చింది. జీవితాచరణలో వచ్చిన ఈ అనుభవమే ఫూలే సత్యశోధక విప్లవాత్మక ఆలోచనా విధానానికి ప్రేరణనిచ్చింది. అగ్రవర్గాలకు ఊడిగం చేయటమే శూద్రుల విధఇని, అందువల్ల విద్యా విజ్ఞానం, ఆస్తి, అధికారం వారికి నిషేధం అని, ఈ విధి నిషేధాల ఆంక్షల్ని అతిక్రమిస్తే శిక్షకు గురికాక తప్పదని మనుధర్మం శాసిస్తుంది.

‘విధి నిషేధాల శిక్షాస్మృతి మనుస్మృతి’ శాసించే ఈ అనుశాసనంతో ఈ బ్రాహ్మలు శూద్రాతి శూద్రులను శాసించడం లేదా? అనే మౌలికమైన ప్రశ్నని పాత్రోచిత సంభాషణల ద్వారా ఫూలే లేవనెత్తుతాడు. ఈ మౌలిక ప్రశ్నకు సమాధానంగా ‘మనుధర్మ ధిక్కారం ధర్మధిక్కారం కాదు, అధర్మ ధిక్కారం’, అని ‘బ్రాహ్మణధిక్కారం దైవధి క్కారం కాదు, అదైవ ధిక్కారం’ అనే బ్రాహ్మణేతర సామాజిక విప్లవ చైతాన్యాన్ని రగిలిస్తాడు. ఇది తొలిమెట్టు. ఇలా నాలుగు స్థాయిల్లో బ్రాహ్మణేతర సామాజిక విప్లవ చైతన్యాన్ని పెంపొందించటం కోసం ‘బోధించి, పోరాడి, సమీకరించేందుకు’ ఈ నాటికను ఆచరణాత్మక సాధనంగా చేసుకొన్నాడు. తదుపరి ఈ దృక్పథాన్ని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓ సందేశాత్మక నినాదంగా మార్చాడు. మహాత్మా ఫూలేని తన గురువుగా గౌరవించిన అంబేడ్కర్‌ సార్వజనీన మత లక్షణం లేకపోవటమే కాదు, అసలు మత లక్షణమే లేని ‘సనాతన ధర్మ’ నిజానికి మతమే కాదన్నాడు అని చాటిచెప్పాడు. సార్వజనీన ఆధ్యాత్మిక మత ధర్మానికి విరుద్ధమైన ఈ సంకుచి తత్వానికి బ్రాహ్మణిజమే మూలకారణం అని ఎత్తి చూపుతాడు. 
ఈ మత ధర్మమే మనుధర్మానికి మూలాధారమని ఫూలే స్పష్టంచేస్తాడు. 

బ్రాహ్మణులకు అద్వితీయ అగ్రజాత్యాన్ని కట్టపెట్టటం కోసమే బ్రాహ్మణులను దైవ సమానులను చేశారని చెపుతాడు. బ్రాహ్మణీయ అగ్రవర్ణాలకు ఊడిగం (గులాంగిరి) చేయడం కోసమే శూద్రులను రెండుకాళ్ల పశువులుగా ద్వితీయ స్థానానికి, అతిశూద్రులను పశువులకంటే హీనంచేసి తృతీయస్థాయికి నెట్టారంటారు. అలా ఈ వర్ణాశ్రమ బ్రాహ్మణిజం- ఎవరి వర్ణాన్ని బట్టి వారు, ఎవరికి వారు తమ వర్ణ ధర్మాన్నే స్వధర్మంగా భావించి స్వచ్ఛందంగా అనుసరించే స్వచ్ఛంద బానిసత్వాన్ని నెలకొల్పిందని తేల్చి చెప్పారు. దాన్నే గులాంగిరి అని పేర్కొన్నారు. చాతుర్వర్ణాశ్రమ సనాతన ధర్మాన్ని రక్షించే అనుశాసనమే మను శాసనం అని చెప్పాడు. ఇక మనుధర్మాన్ని ధిక్కరిస్తే శంభూకునిలా శిరచ్ఛేదం చేయడానికి ఇది ప్రాచీన యుగం నాటి రామరాజ్యం కాదన్నాడు. శూద్రాతిశూద్రుల తలకాయల్ని ఏనుగులచేత పుచ్చకాయల్లాగా తొక్కించటానికి ఇది మధ్యయుగాల నాటి బ్రాహ్మణీయ పీష్వా రాజుల రాజ్యంకాదన్నాడు. 

చట్టంముందు, విద్యముందు అందరూ సమానమే అని చెప్పే రూల్‌ ఆఫ్‌ లా పాటించే ఆంగ్లేయుల ప్రభుత్వం మధ్యయుగాల నాటి రాచరిక రాజ్యం కాదని, అది ఆధునిక యుగమని చెప్పి వారికి జ్ఞానోదయాన్ని కలిగించాడు. ఒక్క మాటలో విద్యా విజ్ఞాన ఆధునిక జ్ఞానోదయా లతో పాటు పౌరసమాజానికి సంబంధించిన సాంఘిక, సాంస్కృతిక, భావజాల రంగాల్లో బ్రాహ్మణేతర భావ విప్లవ మహోద్యమమే శూద్రాతిశూద్ర బహుజనులను మేల్కొల్పుతుందని ఈ నాటిక చాటి చెబుతుంది. దురాచారాల్ని రూపుమాపే హేతుబద్ధ ఉద్యమం, సాంస్కృతిక పునర్జీవనోద్యమం, బ్రాహ్మణ మతానికి ప్రొటెస్ట్‌ తెలిపే పొటెస్టాంట్‌ ఉద్యమం- నిర్మించిన ఫూలే బ్రాహ్మణేతర భావజాల విప్లవ పోరాటమే- సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక విప్లవ పోరాటానికి తాత్విక భూమికను సమకూర్చింది. ఫూలే స్థాపించిన సత్యశోధక సమాజ్‌ బడుగు వర్గ బహుజనుల పురోగతి కోసం, ప్రగతి కోసం, సాధికారత కోసం- సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక న్యాయ పోరాటానికి శంఖంపూరించింది. అందుకే ఆయన్ని సామాజికన్యాయ పితామహు డిగా చరిత్ర రికార్డు చేసింది. కనుక తృతీయ రత్న లాంటి తృతీయ నేత్ర నాటికను బ్రాహ్మణిజంపై బ్రాహ్మణేతర బహుజనుల తిరుగుబాటుగా అభివర్ణించవచ్చు.
నేడు మహాత్మా ఫూలే వర్ధంతి

Surya Telugu News Paper Dated : 27/11/2013 

Tuesday, November 26, 2013

తొలి సంఘసంస్కర్త -స్వరూప

తొలి సంఘసంస్కర్త

మనువాద వ్యవస్థలో నలిగిపోతున్న మూలవాసులను చైతన్యవంతుల్ని చేయడానికి జీవితాంతం పోరాడి గెలిచిన సామాజిక విప్లవ చైతన్యమూర్తి జ్యోతిరావు పూలే. 1827 ఏప్రిల్ 11న మహా రాష్ట్రలోని సతారా జిల్లాలో ఖన్‌వాడీ గ్రామంలో గోవిందరావుపూలే, చిమనబాయి దంపతులకు జన్మించాడు. చదువు పై ఆసక్తితో ఏడేళ్ల వయస్సులోనే పాఠశాలకు చేరాడు. ఛాందసులైన మను వాదులు కులం, మతం మంటగలిసి పోతుందని పూలే తండ్రిని హెచ్చరించడంతో పూలేను బడి మాన్పించాడు. కానీ చదువుపై ఆసక్తితో తండ్రిని ఒప్పించి తిరిగి చదువు కోవడానికి పాఠశాలలో చేరాడు. అందరితో స్నేహంగా, చురుకుగా ఉండే పూలేకు చాలా మంది స్నేహితులుండేవారు. అందులో బ్రాహ్మణ మిత్రుల్లో ఒకరు తమ కుటుంబంలో జరిగే పెళ్లికి పిలవడంతో పూలే ఆ పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాడు. ఓ బీసీ పిల్లవాడు అగ్ర వర్ణాలతో సమానంగా కలిసి నడవటం బ్రాహ్మణులకు కోపం తెప్పించింది. ‘శూద్రుడవై ఉండి మాతో కలిసి నడుస్తావా’ అంటూ పూలేను అవమానించారు. రూపు రేకల్లో సమా నంగా ఉన్నా ఈ ఈసడింపులు ఎందుకు? అని బాధపడ్డాడు. సంఘంలో మనుషుల మధ్యనే ఈ అసమానతలు ఎందుకున్నాయి? వీటిని రూపుమాపే మార్గాలే లేవా? అని ఆలోచిస్తూ.. సమాజాన్ని అధ్యయనం అనేక మత,చారిత్రక గ్రంథాలను అధ్యయనం చేశాడు. వీటన్నింటిని చదివి మనిషికి విద్యతోనే జ్ఞానం లభిస్తుందని తెలుసుకున్నాడు. దళిత బహుజనులకు విద్యనందించేందుకు కంకణం కట్టుకున్నాడు. బహుజనుల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాడు. ఆబడిలో బహుజనులకు, శూద్రులకు, అతిశూద్రులకు మాత్రమే ప్రవేశం ఉం టుందని పాఠశాల బోర్డుమీద ధైర్యంగా రాయించాడు.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ప్రవేశం లేదని రాయించాడు. నాడు స్త్రీలు చదువుకోవడం నేరంగా భావించేవారు. అలాంటి పరిస్థితిలో తన భార్య సావిత్రిబాయి పూలేకు, తన సోదరికి చదువు నేర్పేందుకు బడిలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనతో పాటు తన భార్య సావిత్రీబాయి పూలేను కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేశాడు. ఇంటింటికి తిరిగి విద్య ప్రాముఖ్యాన్ని ప్రచారం చేసిన మొదటి సంఘసంస్కర్త పూలే. శూద్ర, అతిశూద్ర కులాల్లో విద్యావ్యాప్తికి పూలే చేస్తున్న కృషిని నాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. ఆ సమయంలో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆన్‌కీన్ పేరి 1852లో పూనా నగరానికి గవర్నర్‌తో కలిసి వచ్చినప్పుడు పూలే దంపతులను ఘనంగా సన్మా నించారు. ఆదర్శవంతమయిన ఆయన జీవితం త్యాగశీలతకు సాహసానికి ప్రతీక. ఆ రోజుల్లో వితంతువులకు కలిగిన సంతానం అమానుషంగా చంపబడుతుండేది. దానికి పూలే ఎంతో చలించిపోయారు. అలాంటి పిల్లల కోసం ఒక అనాథాశ్రయాన్ని స్థాపించి అనాథల రక్షకుడైనాడు. సత్యధర్మ స్థాపనకు ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించాడు. దీనిలో భాగంగా మూఢనమ్మకాలను విడనాటం గురించి అవగాహన కల్పించటమేకాకా బ్రాహ్మ ణుల అవసరం లేకుండా సత్యశోధక్ సమాజ్ సంస్కార పద్ధతిలోనే వివాహాలు జరి పించారు. బ్రాహ్మణులకు ఇచ్చే దాన ధర్మాలకన్నా వెనకబడినకులాలకు చేసే విద్యా దానం మిన్న అని నొక్కి చెప్పేవాడు. ప్రజలను చైతన్యం చేయడానికి ‘దీనబంధు’ అనే బహుజన పత్రికను నడిపారు. బ్రాహ్మణులు, మూఢనమ్మకాలతో ప్రవేశపెట్టిన పూజా విధానానికి ప్రత్యామ్నాయంగా హేతుబద్ధంగా ఆచరించే పూజా విధానంఅనే గ్రంథాన్ని సమాజానికి అందిం చా డు. 1888లో పక్షవాతం వల్ల ఆరోగ్యం పాడైపోయింది. 1890 నవంబరు 29 వ తేదీన ఆయన కన్నుమూశారు.
-స్వరూప 

Namasete Telangana Telugu News Paper Dated: 27/11/2013