Saturday, September 8, 2012

సెప్టెంబర్ 17: దురాక్రమణే---నలమాస కృష్ణ




తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం అనే పేరుతో చీకటి బాటలు వేసిన 194pandu సెప్టెంబర్ 17కు చరివూతలో ప్రాముఖ్యం ఉన్నది. ఈ రోజును పాలకవర్గాలు, ప్రజలు భిన్న కోణాల నుంచి చూస్తున్నారు. కనుకనే విలీనమా? విద్రోహ మా? విమోచనా? అనే దానిపై ఇంకా చర్చ జరుగుతున్నది. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత సైన్యాలకు లొంగిపోయిన రోజు గా, బ్రిటిష్ పాలన అనంతరం సంస్థానాల మహా సమ్మేళనంగా రూపుదిద్దుకుంటున్న భారత్ యూనియన్ కోసం తన మొదటి సైనిక చర్య హైదరాబాద్‌పైనే జరి పింది. దీన్ని భారత పార్లమెంటరీ వ్యవస్థ కుట్రలో భాగం చేసిన రోజుగా చెప్పు కో వచ్చు. వెట్టిచాకిరికి, భూస్వామ్యానికి, ఎదురు నిలిచి పోరాడుతున్న ప్రజలను అణచివేయడానికి, రాజకీయ వ్యవస్థీకృత నియంతృత్వానికి చట్టబద్ధమైన హక్కు పాలకవర్గం పొందిన రోజుగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా..ఎన్ని భిన్న పార్శాలున్నప్పటికీ సారాంశంలో ప్రజలపై ‘ఆపరేషన్ పోలో’ పేరిట క్రూరదాడికి నాంది పలికిందనేది కాదనలేని సత్యం. నేడు తెలంగాణ ప్రజలు చేస్తున్న ప్రజాస్వామిక పోరాట దృక్పథం నుంచి చూస్తే మాత్రమే నాటి దురాక్షికమణను, దానికి గల ఉద్దేశ్యాలను సరిగ్గా అర్థం చేసుకోగలం.ఒకపార్టీ ముస్లిం రాజుపై హిందూ ప్రజల విజయంగానూ, మరొక పార్టీ స్వతంత్ర దినంగానూ, విలీన దినంగానూ చెబుతుంటే, పీడి త ప్రజలకు మాత్రం పీడకలను మిగిల్చిన రోజుగానే కనబడుతున్నది. విమోచన జరిగిందనే వాదన పాలకవర్గాలది మాత్రమే. అప్పుడు విమోచన జరిగితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు పోరాటం ఎందుకు చేస్తున్నట్టు? నిజానికి విమోచన దినం గా స్థానం కల్పించడానికి పాలకవర్గం చూస్తున్న రోజు తెలంగాణ ప్రజలు సాధించుకున్న విజయాలు కోల్పోవడానికి దారితీసిన రోజు కాదా? ఇక్కడ ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవలసిందేమిటంటే తెలంగాణ పేరు వినడం కూడా జీర్ణించుకోలేని చంద్రబాబు లాంటి నియంతలు వేలమంది తెలంగాణ బిడ్డలను పొట్టన బెట్టుకున్న వాడు కూడా తెలంగాణ సాయుధ పోరాట వీరులకు నివాళులు అర్పించడం ఇప్పటి ఓ చారిత్రక విషాదం.


ఇప్పుడు సాగుతున్న తెలంగాణ పోరాటాన్ని అణచివేయడం లో ప్రముఖపాత్ర వహించే వారు కూడా సెప్టెంబర్17న త్రివర్ణ పతాకాలు ఎగురవేసి తెలంగాణ స్వతంత్ర సంబరాలు జరుపుతున్నారు. అంతే కాదు, నాటి సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి సన్మానం చేయడం క్రూర పరిహాసమే. త్యాగాలను కూడా పెట్టుబడిగా మార్చుకోవాలనుకుంటున్న సీమాంధ్ర సంపన్నవర్గం విమోచన సంబరాల్లో భాగం ఎందుకవుతున్నది? ఈ సందర్భంగా మూడు రంగుల జెండాలు ఎగురవేసి సంబరాలు చేయాలనే పాలకవర్గానికి తెలంగాణ ప్రజలకు మధ్య వైరుధ్యం ఉన్నది. తెలంగాణ ప్రజలు తమ మౌలికమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటంలో తమ విముక్తిని చూసుకోకుండా, నాటి సైనిక దురాక్షికమణలో (సైనిక చర్య) విముక్తి చూసుకొమ్మని చెబుతున్నాయి. తెలంగాణ స్వాతంత్య్ర వేడుకలను కూడా ఘనంగాను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని వివిధ పార్టీలు కోరడం ఇందులో భాగమే. తెలంగాణ సాధన పోరాటాన్ని, భావోద్వేగాలను వక్రమార్గం పట్టించాలనే పాలకుల కుట్రలను ప్రజలు గ్రహించాలి. తెలంగాణ ప్రజలు వీరోచిత త్యాగాలతో నిజాంను కూల్చితే, వంద లాది మంది నైజాంను తలదన్నే నియంతలు ఎలా పుట్టుకొచ్చారనేది నేడు మన ముందున్న ప్రశ్న. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలనలో ఉన్న ఆరు వందల సంస్థానాల్లో హైదరాబాద్ అతి పెద్దది. 1946 భారత స్వతంత్ర చట్టం ప్రకారం ఇండియాలోగానీ పాకిస్థాన్‌లోగాని, స్వతంత్ర సంస్థానాలుగా ఉండవచ్చు. లేదా స్వతంత్ర దేశంగా ఉండవచ్చు. దీన్ని అనుసరించి నైజాం ఆజాదీ హైదరాబాద్‌గా ఉంటానని ప్రకటించాడు. కొన్ని సంస్థానాలు స్వతంవూతంగా ఉండడానికి నిర్ణయించుకున్నప్పటికీ 1947 ఆగస్టు నాటికి హైదరాబాద్‌తోపాటు జునాగఢ్- కాశ్మీర్ తప్ప మొత్తం చిన్నా చితక సంస్థానాలు విలీనం అయ్యాయి. జునాగఢ్ సంస్థానం ప్రజల తిరుగుబాటు ద్వారా , కాశ్మీర్ కొన్ని నిర్దిష్ట షరతులతో కూడిన ఒప్పందం ద్వారా భారత భూభాగంలో భాగమయ్యాయి. హైదరాబాద్ పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. నిజాం రాజు అటు పాకిస్థాన్‌లోనూ ఇండియాలోను కలవకుండా 1947 నవంబర్ 29 భారత్‌తో యథాతథ ఒడంబడిక చేసుకున్నాడు. దీన్ని ఉల్లంఘించి ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ పై దాడికి దిగాయి. ప్రజలపై దాడులను ఆపుతామనే హామీ ని భారత ప్రభుత్వం నుంచి తీసుకున్న అనంతరం నిజాం తన లొంగుబాటును రేడియో ద్వారా ప్రకటించాడు. దీనిని కూడా కనీసం నిలబెట్టుకోలేని భారత పాలకవర్గం కొనసాగించిన ఆకృత్యాలకు సెప్టెంబర్ 17 తర్వాత జరిగిన దాష్టీకాలకు అంతులేదు. వేలాది మంది ప్రజలు రజాకార్ల ఊచకోత, అత్యాచారాలకు బలయ్యారు. కాశ్మీర్ వలె హైదరాబాద్ ప్రజలకు కనీసం రాజ్యాంగ పరంగానైనా కొన్ని ప్రత్యేక హక్కులు రాలేదు. భారతదేశం నిర్మాణంలో హైదరాబాద్ ప్రజలు ఏనాడు భాగం కాలేదు. అటువంటిప్పుడు నిరంకుశ నిజాం కూడా ప్రజలపై దాడి చేయవద్దన్న విజ్ఞాపనను కూడా గౌరవించని దురాక్షికమణ మనస్తత్వం కలిగిన భారత పాలకవర్గం మనకు కల్పించింది విముక్తేనా?



తమ భూమి, భుక్తి,విముక్తి కోసం పిడికిపూత్తిన ప్రజల చేత గ్రామాల నుంచి తరి మివేయబడ్డ అగ్రకుల దొరలు, భూస్వాములు, జమీందార్లు, జాగీర్‌దార్లకు అండ గా పోలీసు క్యాంపులు పెట్టి చట్టబద్ధ భూస్వామ్యానికి పాదుకొల్పడమేనా తెలంగాణకు జరిగిన విముక్తి? సైన్యాల ప్రవేశంతో ప్రజల్లో చిగురించిన ఆశలను అంధకారం చేసి,గాంధీ టీపీలు, ఖద్దర్ బట్టలతో శాంతి జపం చేస్తూ ప్రజల నెత్తురు తాగారు.1949 ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో జరిగిన బహిరంగసభలో నాటి ఉప ప్రధాని సర్ధార్ పటేల్ తెలంగాణను ఉద్దేశించి మాట్లాడుతూ ‘కమ్యూనిస్టుల మూలంగా చైనా, బర్మా ఇప్పటికీ తగలబడిపోతున్నాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి దాపురించే అవకాశం ఉన్నది. కమ్యూనిస్టులు సమస్యలు జఠిలం చేయాలని చూస్తున్నారు. నేనొక్కటి చెప్పదలచుకున్నాను. వారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇక్కడే ఉంటే ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలేదిలేదు. ఎందుకంటే కమ్యూనిజం అది ఒక్క హైదరాబాద్ రాజ్యాన్నే కాదు మొత్తం దేశాన్ని విషపూరితం చేస్తుంద’ని విషం గక్కాడు. దోపిడీ పీడనలేని వ్యవస్థ కోసం జరుగుతున్న ప్రజాపోరాటాన్ని దేశాన్ని విషతు ల్యం చేసే చర్యగా భావించిన పటేల్ ప్రకట న వెట్టిచాకిరిని, భూస్వామ్య విధానాన్ని పాలకవర్గ స్వభావాన్ని తెలియచేస్తున్నది. భూమి కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం తెలంగాణ ప్రజ లు చేస్తున్న పోరాటాన్ని నేటి పాలకవర్గం శాంతి భద్రతల సమస్యగా చూడడంలో నాటి పటేల్ చూసిన దృష్టి కోణమే కనిపి స్తున్నది.తెలంగాణ సాయుధపోరాట విజయాలు, ఫలితాలు కోల్పోవలసి రావడానికి దారితీసిన రోజును, ఘోర మారణహోమానికి దారితీసిన రోజును, మిలటరీ, సివిల్ పాలన పేరుతో సీమాంధ్ర ఉద్యోగస్వామ్యం చొరబాటుకు దారితీసిన రోజును సంబరాలు జరపవలసిన బాధ్యత ప్రజలపై ఎందుకున్నదో విమోచనను సమర్థించేవారు ప్రజలకు చెప్పాలి. తెలంగాణ చరివూతను, సంస్కృతిని, భాష యాసలను ఎక్కిరించే సీమాంధ్ర దురంహంకారానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారు వాస్తవాలు గుర్తించాలి. తెలంగాణ ప్రజల భవిష్యత్తును సంక్లిష్టంగా మార్చిన ఆధునిక నియంతృత్వ దురాక్షికమణ దాడిని ఎదిరించాలి. సెప్టెంబర్ 17ను దురాక్షికమణ దినంగా జరపడమే అమరవీరుల త్యాగాలకు మనమిచ్చే గౌరవం. నివాళి. ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం, సమానత్వంతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఈ ప్రాంత ప్రజలకు విమోచన, అంతవరకు దాని కోసం పోరాటం తప్పదు.

-నలమాస కృష్ణ
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధానకార్యద

Namasete Telangana News Paper Dated : 09/09/2012

No comments:

Post a Comment