Monday, April 28, 2014

తెలంగాణలోనూ అగ్రకుల పాలనేనా!----జనగామ నర్సింగ్ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు


Updated : 4/27/2014 1:35:31 AM
Views : 53
తెలంగాణ రాష్ట్రంలో చాకలి ఐలమ్మ,దొడ్డి కొమురయ్య, కొమురం భీంల స్ఫూర్తితో బహుజన వర్గాలు రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి. తల్లి తెలంగాణ చల్లగా ఉండాలంటే అగ్రకులాలు ఏలే తెలంగాణ కాదు, బహుజనులు ఏలే తెలంగాణ కావాలి.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఊపిరైంది బహుజనులే. దేశంలో చిన్న రాష్ర్టాల గురించి మొదటిసారి మాట్లాడింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్. చిన్న రాష్ర్టాల ఏర్పాటు వల్ల పాలనా సౌలభ్యం ఏర్పడి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయ ని పేర్కొన్నారు. అలాగే చిన్న రాష్ర్టా ల ఏర్పాటు వల్ల చిన్న కులాలు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. 120 కోట్ల పైగా జనాభా ఉన్న భారత దేశంలో 28 రాష్ర్టాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాం తాలు ఉంటే, 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో యాభై రాష్ర్టాలున్నాయి. దీనివల్ల అక్కడ పాలనా సౌలభ్యం వల్ల అభివద్ధి జరిగింది. 

రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చెప్పిన చిన్న రాష్ర్టాలు అభివద్ధికి సోపానాలు అన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, పదవులలో ఉన్న (సీమాంధ్ర) ప్రజా ప్రతినిధులు ఈ మాటలు విస్మరించి అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. అంతేకాదు రాష్ట్ర విభజన ప్రక్రియ గురించి ఇష్టం వచ్చిన మాట్లాడడం చూస్తే వారికి ప్రజల పట్ల, రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నదో అర్థమవుతుంది. 

1969లో జరిగిన తెలంగాణ పోరాటంలో 369 మందిని నాటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం బలిగొన్నది. ఆనాటి ఉద్యమంలో ఉద్యమంలో అమరులైన వారిలో ఎక్కువ మంది బహుజనులే. దేశంలో తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో యావత్ ప్రజానీకం ఎవరికి తోచిన విధంగా రాష్ట్ర ఆకాంక్షను వినిపించారు. వివిధ కులాల వారు వారి కులవత్తుల ద్వారా రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పారు.అయితే ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే. ఆంధ్రప్రదేశ్‌లో బహుజనుల జనాభా-ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 7 శాతం, బీసీలు సుమారు 52 శాతం, ముస్లింలు 12 శాతం.

అగ్రకులాల వారు సుమారు 6 శాతం ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా లభించలేదు. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో అగ్రకులాలదే పెత్తనం. బహుజనులు పాలితులుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణిచివేయబడినారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరు ప్రాంతాల అభివద్ధిలో వైఫల్యం, నీళ్లు, నిధుల పంపిణీలో వ్యత్యాసం, అలాగే విద్యా రంగంలోనూ అభివద్ధి , అసమానతలకు సమాధానం చెప్పాల్సింది ఇంత కాలం ఈ రాష్ర్టాన్ని ఏలిన పాలకులే.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో బహుజన వర్గాలకు చెందిన విద్యార్థులు ముందున్నారు. విద్యకు దూరమై, వందలాది కేసులతో అనేక రోజులు జైలుపాలయ్యారు. తెలంగాణ కోసం అమరులైన వారి లో కూడా దాదాపు 90 శాతం బహుజనవర్గాల వారే. పోరాటంలో ముందున్నది బహుజనులు కాగా రాజకీయంగా లబ్ధి పొందడంలో ముందున్నది అగ్రకులాల వారే అన్నది నిజం.తెలంగాణ ప్రజలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో బహుజన తెలంగాణ కోరుకుంటున్నారు. మాన్యశ్రీ కాన్షీరాం ఓట్లు మావి-సీట్లు మీవా ఇకపై చెల్ల దు అన్నారు. జనాభా ప్రాతిపదికన బహుజనులు తమ హక్కుల కోసం పోరాడాలన్నారు. తెలంగాణ పోరాటంలో ముందున్నది బహుజనులు కాబట్టి ఈ వర్గాల ప్రయోజనాలు నెరవేరేదాకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అగ్రకుల పాలనను వ్యతిరేకిస్తూ బహుజనులు రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకుల పాలన వల్ల ఈ వర్గాలు అనేక అవమానాలకు గురయ్యాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ అగ్రకులాల పాలనేనా?
తెలంగాణ రాష్ట్రంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమురం భీంల స్ఫూర్తితో బహుజన వర్గాలు రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి. తల్లి తెలంగాణ చల్లగా ఉండాలంటే అగ్రకులాలు ఏలే తెలంగాణ కాదు, బహుజనులు ఏలే తెలంగాణ కావాలి. అన్ని వర్గాలకు అభివద్ధి ఫలాలు దక్కాలంటే సామాజిక తెలంగాణ కావాలి. బహుజన రాజ్యాన్ని నిర్మించడమే బాబా సాహెబ్ అంబేద్కర్‌కు మనం అందించే నివాళి.

No comments:

Post a Comment