Saturday, April 19, 2014

ఆది నుంచి ఆదివాసీలపై అణచివేతలే...By -మైపతి అరుణ్‌కుమార్ఆదివాసీ రచయితల సంఘం


వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కాని ఒక నిర్దోషికి శిక్షపడకూడదు. చట్టం దష్టిలో అందరు సమానులే అనేది రాజ్యాంగనీతి. అందరు ఆమోదించాల్సిన విషయం కూడా! ఈ రాజ్యాంగ నీతిని 33 సంవత్సరాలు వెనుకకు వెళ్ళి ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి గోండు గూడెం సంఘటనతో పోల్చి చూసినపుడు అనేక అనుమానాలు మనకు కలుగుతాయి. అసలు ఇంద్రవెల్లితో పాటు చుట్టు పక్కల గోండుగూడాలలో అమరత్వం పొందిన గోండులు ఈ రాజ్యాంగ పరిధిలోకి రారా? ఒకవేళ వస్తే దీనిపై నేటికి ఎందుకు విచారణ జరగలేదు? న్యాయమనేది ఎందుకు గోండుల దరిచేరలేదు? ఆదివాసులకు అటవీ భూములపై హక్కులను ప్రభుత్వం నేటి కి ఎందుకు కల్పించలేదు?నేటికి ఇంద్రవెల్లిలో 144సెక్షన్ అమలులో ఎందుకున్నది? వర్తమానంలో ఏం జరుగుతున్నది? రాజ్యహింస ప్రజాస్వామ్యంలో కొనసాగింపు ఎందుకుందనేది స్పష్టమవుతుంది. 

ఇంద్రవెల్లిలో ఆనాడు ఏం జరిగింది? అడవిపై హక్కు కోసం పోడు భూములు, పట్టాల కోసం ఆదివాసీ రైతుకూలిసంఘం ఇంద్రవెల్లిలో సంత జరుపుకునే రోజున బహిరంగసభకు పిలుపునిచ్చింది. ఈసభకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.సభకు వచ్చే గోండులకు మాత్రం రెండు రకాల ధక్పథాలున్నాయి. ఒకటి సంతలో వారానికి సరిపడు సరుకులు కోనుక్కోవటం (పిల్లాపాపలతో సంతలకు వెళ్ళటం ఆదివాసీ సంప్రదాయం)ఒకటైతే, రెండవది- సభకు హాజరవటం. సాయంత్రం మూడు గంటలు అయేటప్పటికి గూడాల నుంచి గోండులు చీమల దండుల్లా ఇంద్రవెల్లికి చేరుకుంటున్నారు. అప్పటికి ఆర్.డి.ఓ. సభకు అనుమతులు రద్దుచేశామని ప్రకటించటం 144 సెక్షన్ విధించటం జరిగిపోయాయి. సభకు అనుమతి లేదని పోలీసులు తెలుగులో ప్రచారం చేస్తున్నారు. గోండు భాష తప్ప, తెలుగు అర్థం చేసుకోలేని చాలామంది గోండులకు ఆ హడావిడి, పోలీసుల కవాతులు ఏమిటో అర్థం కాలేదు.ఒక్కసారిగా బెదిరింపులు, లాఠీచార్జి, తోపులాట అదికాస్త 420 రౌండ్లు కాల్పుల వరకు వచ్చింది. చెట్లు ఎక్కి మరీ కసితో గోండులపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలతో పిల్లాపాపలతో చెట్టుకొకరు, పుట్టకొకరుగా గోండులు పరుగులు తీశారు. 

ఎండతీవ్రత, నీరులేక చనిపోయిన సంఘటనలున్నాయని స్థానికులు అంటారు. గోండుల సంప్రదాయా నికి వ్యతిరేకంగా పోలీసులు శవాలను కుప్పలు కుప్పలుగా వేసి కాల్చి ఆదివాసులను మరింత గాయపరిచారు.ఎంతమంది చనిపోయారో కూడా నేటికి ప్రభుత్వం దగ్గర రికార్డు కాని పరిస్థితి. ప్రభుత్వం 13 మంది మాత్రమే మతులు అని కాకి లెక్కలేసిం ది కూర్చుంది.పక్కకున్న పిట్టబొంగరం గోండు గూడెంలో నీటికి బదులు రక్తం పారిం దంటే ఈ మారణహోమాన్ని అంచనా వేయవచ్చు. ఈ సంఘటన అనంతరం ప్రభు త్వం కొన్ని ఆదివాసుల కోసం ప్రత్యేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా అవి ప్రచా రానికే పరిమితమయ్యాయి.నేడు.. ఇంద్రవెల్లి గిరిజనేతరుల వలసల కేంద్రమైంది. గోండుల ఆశయం మాత్రం నెరవేరకపోగా.. స్థూపం మాత్రం అమరుల జ్ఞాపకంగా మిగిలింది. 

స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ రాజ్యం 1836లో 1000 మంది గోండులతో సహా, ఆదివాసీ రాజు అయిన రాంజీ గోండును నిర్మల్‌లోని మర్రిచెట్టుకు ఉరితీసి రాజ్య క్రూరత్వాన్ని చాటుకుంది. ఇది రాజ్య ఆక్రమణలో భాగమైంది. 1940లో జోడెఘాట్ కేంద్రంగా జల్, జంగల్, జమీన్ కోసం నడిపిన పోరాటంలో కొమరంభీంతో సహా 11 మంది కాల్చివేయబడ్డారు. అది రాజ్య నిర్బంధంలో భాగమయింది. ప్రజాస్వామ్య పాలనలో జరిగిన ఇంద్రవెల్లి దుర్ఘటనకు కారణమేంటనే ప్రశ్నలు సమాధానాలు దొరకనేలేదు. కాని నేటికి వాకపల్లి, బల్లుగూడ, బాసగూడ, ఆలుబాక,ఎడ్సమెట్ట లాంటివి రాజ్యహింసలో కొనసాగింపుగానే ఉన్న వి. బహుశా ఇటువంటి నిర్బంధం అణిచివేత, దోపిడీకి వ్యతిరేకం గా ఉద్యమించినట్టు, ఉత్తరాంధ్రలోని సవర జాతాపులు నడిపిన శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం కూడా చరిత్రలో నిలిచిపోయింది. రాజ్యహింసకు రక్తసిక్తమైంది. భూస్వామ్య వలస దోపిడీ నుంచి విముక్తి కోసం, భూమిపై హక్కు కోసం నడిపిన ఈ పోరాటం దేశ చరిత్రలోనే ఒక మైలురాయి. దీని తర్వాత ప్రభు త్వం ఆదివాసుల ఆరాట పోరాటాల వెలుగులో 1/70 చట్టాన్ని తెచ్చింది.

ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో (ఆదివాసీ ప్రాం తం) లో గిరిజనేతరులు, భూములు కలిగి వుండటం, స్థిర చర ఆస్తులు కలిగి వుండటం నిషేధం. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఆదివాసుల భూములు 48శాతం గిరిజనేతరుల చేతుల్లో ఉన్నవి. అయినా ఈ చట్టాన్ని అమలు చేసి ఆదివాసులకు భూములిప్పించే సాహసం నేటికి ఏ ప్రభుత్వం చేయలేదు. కాని ఈ పోరాటం ఆదివాసులకు చైతన్యాన్ని మిగిల్చింది. ఈ చైతన్యం ఇంద్రవెల్లి మీదుగా అడవిపై హక్కు కోరుతూ అమరత్వాన్ని మూటగుట్టుకొని దండ కారణ్యంలో గూడు కట్టుకున్నది. జగిత్యాల జైత్రయాత్ర మైదానం మీదుగా వచ్చి మళ్ళీ సిరొంచ, గడ్చిరోలి మీదుగా అబుజ్‌మాడ్‌లోని గోండుల వారసత్వాన్నందుకొని దండకారణ్యంలో నేడు సామ్రాజ్యవాద విషసంస్కతిని, పెట్టుబడిదారీ, బహుళజాతి సంస్థ ల నుంచి దేశాన్ని విముక్తి చేసే దిశగా జనతన సర్కార్‌ను ఏర్పాటు చేస్తున్నది. మనం ఇవ్వాళ.. చూస్తున్న దేశ పరిణామాలలో ఇది ఒకటి. 

భారత పరిపాలన వ్యవస్థ జనతన సర్కారు పరిపాలన వ్యవస్థ ను ఆదివాసీ ప్రాంతాలలో సరిపోల్చి చూసినప్పుడు అనేక విషయా లు అవగతమవుతాయి. 1950 జనవరి 26 న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని 244(1) అధికరణం ఆదివాసీ ప్రాంతాలపై స్వయం పాలన, నిర్ణయాధికారం వారికే ఉండాలనంటున్నది. 67 సంవత్సరాలుగా దీనిని ప్రభుత్వాలు ఎందుకు అమలు చేసి ఆదివాసీల అభివద్ధికి దోహదపడలేదు? 1996లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన పెసా చట్టం ప్రతి ఆదివాసీ గూడాన్ని గ్రామసభగా పరిగణించి మా వూళ్ళో మా రాజ్యం పాలనా హక్కును ఆదివాసులకిచ్చింది. 2006 ఆడవి హక్కుల చట్టం ఆదివాసులకు అడవిపై సర్వాధికారాలు కల్పించింది. కాని వీటి అమలు మాత్రం కాగితాలకే పరిమిత మైంది. 
ఇదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా.. ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసీలపై మానవ హక్కుల ఉల్లంఘనా చర్యలు జరుగుతున్నాయి. పోలవరం, కంతనపల్లి ప్రాజెక్టుల పేరిట ఆదివాసీ గూడెలను జలసమాధి చేస్తున్నారు. బాక్సైట్, లాటరైట్, గ్రానైట్ పేరిట, ఓపెన్‌కాస్టుల పేరిట జీవన విద్వంసం చేస్తున్నారు. టైగర్ జోన్, ఎలిఫెంట్ జోన్‌ల పేరిట అడవి నుంచి ఆదివాసీల గెంటివేస్తున్నారు. వాకపల్లి, బల్లుగూ డ, సత్యమంగళం లాంటి లైంగిక దాడు లు నిత్యకత్యమయ్యాయి. 

అన్యమత ప్రచారాలతో ఆదివాసీ ఉమ్మడి సాంస్కతిక జీవన వ్యవస్థపై సాంస్కతిక దాడి జరుగుతున్నది. ఈ పరిస్థితులలో ఆదివా సీల మనుగడ ఏమిటనేది ప్రశ్న. ఇప్పుడు ఆదివాసుల మనుగడకే ప్రమాదం వచ్చి పడిందని స్పష్టంగా కనబడుతూనే ఉన్న ది. ఆదివాసీల ఉమ్మడి జీనవ వ్యవస్థను బలోపేతం చేస్తూ సాంస్కతిక, జీవన వ్యవస్థను సంరక్షిస్తూ, నిర్మాణం చేస్తూ ఆదివాసీ గూడాలకు స్వయంపాలనా హక్కుల్ని కల్పిస్తున్న జనతన సర్కార్ వైపు ఆదివాసీలు చూస్తున్నారు. దేశానికి స్వా తంత్య్రం వచ్చినప్పుడు ఆదివాసీలదే ఈ దేశమనీ, దేశంలోని వారంతా బ్రిటిష్ వారిలాగే వలస వచ్చిన వారే అని చరిత్ర చెబుతున్నది. భారత సమాజంలో ఆదివా సీలు తమ అస్తిత్వం కోసం ప్రత్యేక భార తం కావాలని ఆదివాసీలు నినదించేరోజు పునరావతమయ్యే పరిస్థితి వస్తు న్నది. ఇలాంటి పోరాటాలను ప్రభుత్వం అణచివేయ జూసి మరొక చారిత్రక పోరాటాన్ని ఆదివాసీల నుంచి కొనితెచ్చుకుంటున్నది. ఇవ్వాళ.. మధ్య భారతం కేంద్రంగా జనతన సర్కార్‌లు చెబుతున్నది ఇదే..







Namasete Telangana Telugu News Paper Dated: 20/4/2014 

No comments:

Post a Comment