Friday, August 31, 2012

గిరిజన స్వేచ్ఛా గీతం కొమురం భీం ----కట్టగాని రవీందర్ర్



భారతదేశంలోని గిరిజన ఉద్యమాలన్నీ చరిత్రాత్మకమైనవే. మధ్యభారత దండకారణ్యంలోని మహారాష్ట్ర, ఒడిషా, మధ్యవూపదేశ్, నిజాం రాష్ట్రాల్లోని ఆదివాసీ సమూహాలతో కలిసి గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలనకంటే ముందే ఏర్పడింది. ఆదివాసీ నాయకుల పాలన క్రీ.శ 1240 నుంచి 1750 వరకు సాగింది. తర్వాత కాలంలో మరాఠీలు ఆంగ్లేయులతో ఒప్పందాలను చేసుకుని గోండ్వానా రాజ్యాన్ని తెల్లదొరలకు అప్పగించారు. మార్సీకోల్లా రాంజీగోండు తెల్లదొరల సామ్రాజ్య విస్తరణను అడ్డుకోవడానికి అసిఫాబాద్ కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్నాడు. వేయిమంది రోహిల్లాలు, గిరిజనులతోపాటుగా నిర్మల్ ఊడలమపూరికి 1860 ఏప్రిల్ 9న ఊరితీయ్యబడ్డాడు. ఉత్తర తెలంగాణ గడ్డమీద ఇతని పోరాట వారసునిగా కొమురంభీం 1900లో సంకెనపల్లిలో జన్మించాడు. తల్లిదంవూడులు కొమురం చిమ్నా, పొంబాయి.భీం వయసు 17 ఏళ్ళు ఉన్నప్పుడు అటవీ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించాడు. అడవిలో క్రూర మృగాలతో, పులులతో తెగించి పోరాడే గిరిజనులు జంగ్లాత్ సిబ్బందిని చూసి ఎందుకు హడలిపోతారో భీంకు అర్థం కాలేదు.

గిరిజనులు గుట్టల మీద ఎంతో శ్రమకోర్చి చెట్లను కొట్టి రాయిరప్పలను పెకిలించి చదును చేసి కాస్తు చేస్తే, నిజాం అనుయాయుడు సిద్ధిఖీ పట్వారీతో కలిసి దొంగ పట్టాలతో భూమిని ఆక్రమించుకునేవాడు. అమాయకులైన గిరిజనులను మరోచోట పోడు చేసుకొమ్మని చెప్పేవాడు. అందుకుగాను అప్పిచ్చి గిరిజనులను వెట్టి బానిసలుగా మార్చుకునేవాడు. ఒకవైపు మరాఠా సేట్లు గిరిజనులకు అప్పిచ్చి వడ్డిమీద వడ్డీ వసూలు చేసేవారు. పోలీసులు గిరిజనుల గూడాల మీద బడి కోళు,్ల గొర్రెలు ఎత్తుకుపోయేవారు. గోండు స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడేవారు. కొమురంభీం ఈ అఘాయిత్యాలను భరించలేకపోయాడు. నిజాం అనుచరుడు, దుర్మార్గుడైన సిద్ధిఖీని హత్యచేశాడు. భీం కోసం నిజాం పోలీసుల వేట మొదలైంది. గిరిజన గూడాలను జల్లెడ పట్టి భీం బంధువులను కుటుంబసభ్యులను చిత్రహింసలు పెట్టారు. 

భీం నిజాం పోలీసులకు చిక్కకుండా కొంతకాలం అడవుల్లో దాక్కున్నాడు. ఆతర్వాత చంద్రాపూర్, బల్లార్షా మీదుగా అసోం వెళ్ళి తేయాకు తోటల్లో పని చేశాడు. అక్కడ కూలీరేట్లు పనిగంటలకు సంబంధించిన ఉద్యమాల ద్వారా భీం చైతన్యవంతుడయ్యాడు. కొంతకాలం తర్వాత భీంకు ఇంటిపై ధ్యాస మళ్ళింది. ఆకలితో అలమటించే గిరిజనులు, అవకాశం దొరికితే సర్వం దోపిడీ చేసి అత్యాచారాలకు తెగబడే జంగ్లాత్ వాళ్ళు గుర్తుకొచ్చారు. తమ గూడెం వెళ్తే తననూ చంపివేయడమో, శిక్షించడమో జరుగుతుందని తెలిసి తెగించి సొంత గూటికి పయనమయ్యాడు. రహస్యంగా ఆసిఫాబాద్ దగ్గరి తన గూడెం చేరుకున్నాడు. తనవాళ్ళను కలుసుకున్నాడు. చావైనా రేవైనా మీతోనే అన్నాడు. మంచిర్యాల్ అసిఫాబాద్ అడవుల్లోని గిరిజన గూడాలు తిరిగాడు. జల్,జంగల్,జమీన్ ఎవరిదో గిరిజనులకు విడమర్చి చెప్పాడు.

అడవి బిడ్డల్లో చైతన్యం నిప్పులా రాజుకుంది. గిరిజనులు భీం పోరాటంలో భాగమయ్యారు. మేకపన్ను, నాగటిపన్ను, ఇంటిపన్ను బంచ్‌రాం, దూపపట్టి పేర్లతో వసూలు చేసే పన్నులు బంద్ అయ్యాయి. పన్నుల వసూలుదార్లు వచ్చినప్పుడు గోండుల తరఫున భీం పన్నులు నిరాకరిస్తున్నట్టు చెప్పాడు. పన్నుల నియంవూతణ తాలూక్‌దార్ చేతిలో ఉంటుందని వసూల్‌దార్లు చెప్పారు. భీం తన అనుయాయులను వెంటబెట్టుకొని అసిఫాబాద్ తాలూక్‌దార్ నాజంను కలుసుకున్నాడు. పన్నుల నిర్ణయాధికారం తనది కాదని, అది నిజాం, ప్రధాని ప్రభువుల పరిధిలో ఉందని చెప్పాడు.

భీం గిరిజనులందరితో చర్చించి యాభై మంది గిరిజనులతో జొన్నరొట్టె, సంకటికూడు, కారం మూటలు గట్టుకొని నిజాం ప్రభువు వద్దకు బయలుదేరారు. రెండురోజుల ప్రయాణం తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజులు నిజాం నివాసాల గేట్ల ముందు పడిగాపులు కాశారు. తెలంగాణ ప్రాంత ప్రజల రక్తమాంసాలకు విలువ, గుర్తింపు లేని ఆ రోజుల్లో గిరిజనుడైన భీంకు అతని అనుచరులకు నిజాం ప్రధాని అపాయింట్‌మెంట్ దొరకక పోగా అధికారుల నుంచి అవమానాలు ఎదురయ్యాయి.
గిరిజనులు తిరుగు ప్రయాణమయ్యారు. భీం రెండు రోజుల నడక తర్వాత అసిఫాబాద్ చేరుకున్నాడు. తర్వాత రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భీం శ్రీకారం చూడుతున్న ఈ పోరాట కార్యక్షికమానికి మంచిర్యాల నుంచి బొగ్గుగని ట్రేడ్ యూనియన్ నాయకులొచ్చారు. 

మూడు గంటలపాటు సమావేశం జరిగింది. అంతిమంగా భీం, గిరిజనులు ఈ అడవితల్లిపై హక్కు మాదని నినదించారు. జల్ జంగల్, జమీన్ పై హక్కులకు జంగ్ తప్ప మరోమార్గం లేదని భీం తేల్చిచెప్పాడు. గిరిజనులు దండుగట్టారు. తొడగొట్టి తుడుం మోగించారు. కొమురం సూరు, లచ్చు పటేల్ అనుయాయులుగా గిరిజనోద్యమం మొదలైంది. జోడేఘాట్ మొదలుకొని పట్నాపూర్ వరకు గల పన్నెండు గిరిజన గూడాలను భీం యుద్ధ కేంద్రాలుగా మార్చాడు. శత్రువు ఎటువైపు నుంచి వచ్చినా తుడుం మోతతో సమష్టిగా శత్రువుతో తెగబడి పోరాడేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఉప్పులు, పప్పులు సాగు అవసరమైన విత్తనాలు, సరుకులు ఇచ్చి జీవితాంతం బానిసలుగా చేసుకున్న మరాఠా సేట్లను గిరిజనులు జోడేఘాట్ గుట్టల సరిహద్దుల నుంచి పరుగులు పెట్టించారు. గిరిజన గూడాల్లో వడ్డీ వ్యాపారస్థులు, జంగ్లాత్ వాళ్ళు కనిపించకుండాపోయారు. భీం సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి సన్నద్ధమవుతున్న విషయం నిజాం ప్రభుత్వానికి తెలిసింది. ప్రభుత్వం ఆసిఫాబాద్ తాలూక్‌దార్‌ను సర్కార్ దూతగా పంపింది. చర్చలు విఫలమయ్యాయి. నిజాం సైన్యం దాడి గిరిజన గూడాలపై మొదలైంది. భీం గెరిల్లా వ్యూహాలతో సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. పోరాటం క్రమంగా తీవ్రమైంది. భీం అనుచరులైన కొమురం సూరు, లచ్చుప నిర్బంధించబడ్డారు. నిజాం పోలీసు ఎరకు లొంగి కుర్దుప నమ్మక ద్రోహిగా మారాడు. 1940 సెప్టెంబర్1న పచ్చని అడవిపై వెన్నెల ప్రసరిస్తున్న అర్థరాత్రి సడీచప్పుడు చెయ్యకుండా దొంగదారిలో వచ్చిన వందలాది పోలీసులు జోడేఘాట్ అడవుల్లోని గుట్టల మీదున్న భీం అతని అనుచరులపై దాడికి దిగి కాల్పులు జరిపారు. ఈ పోరులో చివరికంటా పోరాడి భీంతో సహా 12 మంది అనుచరులు అమరులయ్యారు. కొమురం భీం ఒక గిరిజన స్వేచ్చాగీతం. ఆదివాసీ హృదయంలో రెపపలాడే రగల్ జెండా, విప్లవ చైతన్య ఉత్తుంగ తరంగం. సమస్త తెలంగాణ ప్రజాపోరాటాల దిక్చూచి.

ప్రొఫెసర్ క్రిస్టఫర్ హైమన్ డార్ఫ్ భీం మరణం తర్వాత ఆదిలాబాద్ వచ్చి గిరిజనుల జీవితాలతో కలిసిపోయారు. ఇతని సూచనల కారణంగా 1946లో ఆదివాసీ ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలోని 5,7 షెడ్యూల్డ్‌లో ఉన్న ఆదివాసీ అవాసాలు భూములకు సంబంధించి ఉన్న చట్టాల ఆధారంగా 1/70 చట్టం వచ్చింది. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు సంక్రమించిన అధికారాలను ప్రభుత్వాలు ఇంకా గుర్తించకపోవడం దారుణం. గిరిజన పోరాటాలు, త్యాగాల వల్ల సంక్రమించిన రాజ్యాంగంలోని చట్టాలను గిరిజనులకు నిర్దిష్టంగా వర్తింపచేయాలి. గిరిజన పోరాట వీరుడు కొమురం భీం పేరు మీద జిల్లాను విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.

-కట్టగాని రవీందగిరిజన స్వేచ్ఛా గీతం కొమురం భీం
భారతదేశంలోని గిరిజన ఉద్యమాలన్నీ చరిత్రాత్మకమైనవే. మధ్యభారత దండకారణ్యంలోని మహారాష్ట్ర, ఒడిషా, మధ్యవూపదేశ్, నిజాం రాష్ట్రాల్లోని ఆదివాసీ సమూహాలతో కలిసి గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలనకంటే ముందే ఏర్పడింది. ఆదివాసీ నాయకుల పాలన క్రీ.శ 1240 నుంచి 1750 వరకు సాగింది. తర్వాత కాలంలో మరాఠీలు ఆంగ్లేయులతో ఒప్పందాలను చేసుకుని గోండ్వానా రాజ్యాన్ని తెల్లదొరలకు అప్పగించారు. మార్సీకోల్లా రాంజీగోండు తెల్లదొరల సామ్రాజ్య విస్తరణను అడ్డుకోవడానికి అసిఫాబాద్ కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్నాడు. వేయిమంది రోహిల్లాలు, గిరిజనులతోపాటుగా నిర్మల్ ఊడలమపూరికి 1860 ఏప్రిల్ 9న ఊరితీయ్యబడ్డాడు. ఉత్తర తెలంగాణ గడ్డమీద ఇతని పోరాట వారసునిగా కొమురంభీం 1900లో సంకెనపల్లిలో జన్మించాడు. తల్లిదంవూడులు కొమురం చిమ్నా, పొంబాయి.భీం వయసు 17 ఏళ్ళు ఉన్నప్పుడు అటవీ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించాడు. అడవిలో క్రూర మృగాలతో, పులులతో తెగించి పోరాడే గిరిజనులు జంగ్లాత్ సిబ్బందిని చూసి ఎందుకు హడలిపోతారో భీంకు అర్థం కాలేదు.

గిరిజనులు గుట్టల మీద ఎంతో శ్రమకోర్చి చెట్లను కొట్టి రాయిరప్పలను పెకిలించి చదును చేసి కాస్తు చేస్తే, నిజాం అనుయాయుడు సిద్ధిఖీ పట్వారీతో కలిసి దొంగ పట్టాలతో భూమిని ఆక్రమించుకునేవాడు. అమాయకులైన గిరిజనులను మరోచోట పోడు చేసుకొమ్మని చెప్పేవాడు. అందుకుగాను అప్పిచ్చి గిరిజనులను వెట్టి బానిసలుగా మార్చుకునేవాడు. ఒకవైపు మరాఠా సేట్లు గిరిజనులకు అప్పిచ్చి వడ్డిమీద వడ్డీ వసూలు చేసేవారు. పోలీసులు గిరిజనుల గూడాల మీద బడి కోళు,్ల గొర్రెలు ఎత్తుకుపోయేవారు. గోండు స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడేవారు. కొమురంభీం ఈ అఘాయిత్యాలను భరించలేకపోయాడు. నిజాం అనుచరుడు, దుర్మార్గుడైన సిద్ధిఖీని హత్యచేశాడు. భీం కోసం నిజాం పోలీసుల వేట మొదలైంది. గిరిజన గూడాలను జల్లెడ పట్టి భీం బంధువులను కుటుంబసభ్యులను చిత్రహింసలు పెట్టారు. 

భీం నిజాం పోలీసులకు చిక్కకుండా కొంతకాలం అడవుల్లో దాక్కున్నాడు. ఆతర్వాత చంద్రాపూర్, బల్లార్షా మీదుగా అసోం వెళ్ళి తేయాకు తోటల్లో పని చేశాడు. అక్కడ కూలీరేట్లు పనిగంటలకు సంబంధించిన ఉద్యమాల ద్వారా భీం చైతన్యవంతుడయ్యాడు. కొంతకాలం తర్వాత భీంకు ఇంటిపై ధ్యాస మళ్ళింది. ఆకలితో అలమటించే గిరిజనులు, అవకాశం దొరికితే సర్వం దోపిడీ చేసి అత్యాచారాలకు తెగబడే జంగ్లాత్ వాళ్ళు గుర్తుకొచ్చారు. తమ గూడెం వెళ్తే తననూ చంపివేయడమో, శిక్షించడమో జరుగుతుందని తెలిసి తెగించి సొంత గూటికి పయనమయ్యాడు. రహస్యంగా ఆసిఫాబాద్ దగ్గరి తన గూడెం చేరుకున్నాడు. తనవాళ్ళను కలుసుకున్నాడు. చావైనా రేవైనా మీతోనే అన్నాడు. మంచిర్యాల్ అసిఫాబాద్ అడవుల్లోని గిరిజన గూడాలు తిరిగాడు. జల్,జంగల్,జమీన్ ఎవరిదో గిరిజనులకు విడమర్చి చెప్పాడు.

అడవి బిడ్డల్లో చైతన్యం నిప్పులా రాజుకుంది. గిరిజనులు భీం పోరాటంలో భాగమయ్యారు. మేకపన్ను, నాగటిపన్ను, ఇంటిపన్ను బంచ్‌రాం, దూపపట్టి పేర్లతో వసూలు చేసే పన్నులు బంద్ అయ్యాయి. పన్నుల వసూలుదార్లు వచ్చినప్పుడు గోండుల తరఫున భీం పన్నులు నిరాకరిస్తున్నట్టు చెప్పాడు. పన్నుల నియంవూతణ తాలూక్‌దార్ చేతిలో ఉంటుందని వసూల్‌దార్లు చెప్పారు. భీం తన అనుయాయులను వెంటబెట్టుకొని అసిఫాబాద్ తాలూక్‌దార్ నాజంను కలుసుకున్నాడు. పన్నుల నిర్ణయాధికారం తనది కాదని, అది నిజాం, ప్రధాని ప్రభువుల పరిధిలో ఉందని చెప్పాడు.

భీం గిరిజనులందరితో చర్చించి యాభై మంది గిరిజనులతో జొన్నరొట్టె, సంకటికూడు, కారం మూటలు గట్టుకొని నిజాం ప్రభువు వద్దకు బయలుదేరారు. రెండురోజుల ప్రయాణం తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజులు నిజాం నివాసాల గేట్ల ముందు పడిగాపులు కాశారు. తెలంగాణ ప్రాంత ప్రజల రక్తమాంసాలకు విలువ, గుర్తింపు లేని ఆ రోజుల్లో గిరిజనుడైన భీంకు అతని అనుచరులకు నిజాం ప్రధాని అపాయింట్‌మెంట్ దొరకక పోగా అధికారుల నుంచి అవమానాలు ఎదురయ్యాయి.
గిరిజనులు తిరుగు ప్రయాణమయ్యారు. భీం రెండు రోజుల నడక తర్వాత అసిఫాబాద్ చేరుకున్నాడు. తర్వాత రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భీం శ్రీకారం చూడుతున్న ఈ పోరాట కార్యక్షికమానికి మంచిర్యాల నుంచి బొగ్గుగని ట్రేడ్ యూనియన్ నాయకులొచ్చారు. 

మూడు గంటలపాటు సమావేశం జరిగింది. అంతిమంగా భీం, గిరిజనులు ఈ అడవితల్లిపై హక్కు మాదని నినదించారు. జల్ జంగల్, జమీన్ పై హక్కులకు జంగ్ తప్ప మరోమార్గం లేదని భీం తేల్చిచెప్పాడు. గిరిజనులు దండుగట్టారు. తొడగొట్టి తుడుం మోగించారు. కొమురం సూరు, లచ్చు పటేల్ అనుయాయులుగా గిరిజనోద్యమం మొదలైంది. జోడేఘాట్ మొదలుకొని పట్నాపూర్ వరకు గల పన్నెండు గిరిజన గూడాలను భీం యుద్ధ కేంద్రాలుగా మార్చాడు. శత్రువు ఎటువైపు నుంచి వచ్చినా తుడుం మోతతో సమష్టిగా శత్రువుతో తెగబడి పోరాడేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఉప్పులు, పప్పులు సాగు అవసరమైన విత్తనాలు, సరుకులు ఇచ్చి జీవితాంతం బానిసలుగా చేసుకున్న మరాఠా సేట్లను గిరిజనులు జోడేఘాట్ గుట్టల సరిహద్దుల నుంచి పరుగులు పెట్టించారు. గిరిజన గూడాల్లో వడ్డీ వ్యాపారస్థులు, జంగ్లాత్ వాళ్ళు కనిపించకుండాపోయారు. భీం సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి సన్నద్ధమవుతున్న విషయం నిజాం ప్రభుత్వానికి తెలిసింది. ప్రభుత్వం ఆసిఫాబాద్ తాలూక్‌దార్‌ను సర్కార్ దూతగా పంపింది. చర్చలు విఫలమయ్యాయి. నిజాం సైన్యం దాడి గిరిజన గూడాలపై మొదలైంది. భీం గెరిల్లా వ్యూహాలతో సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. పోరాటం క్రమంగా తీవ్రమైంది. భీం అనుచరులైన కొమురం సూరు, లచ్చుప నిర్బంధించబడ్డారు. నిజాం పోలీసు ఎరకు లొంగి కుర్దుప నమ్మక ద్రోహిగా మారాడు. 1940 సెప్టెంబర్1న పచ్చని అడవిపై వెన్నెల ప్రసరిస్తున్న అర్థరాత్రి సడీచప్పుడు చెయ్యకుండా దొంగదారిలో వచ్చిన వందలాది పోలీసులు జోడేఘాట్ అడవుల్లోని గుట్టల మీదున్న భీం అతని అనుచరులపై దాడికి దిగి కాల్పులు జరిపారు. ఈ పోరులో చివరికంటా పోరాడి భీంతో సహా 12 మంది అనుచరులు అమరులయ్యారు. కొమురం భీం ఒక గిరిజన స్వేచ్చాగీతం. ఆదివాసీ హృదయంలో రెపపలాడే రగల్ జెండా, విప్లవ చైతన్య ఉత్తుంగ తరంగం. సమస్త తెలంగాణ ప్రజాపోరాటాల దిక్చూచి.

ప్రొఫెసర్ క్రిస్టఫర్ హైమన్ డార్ఫ్ భీం మరణం తర్వాత ఆదిలాబాద్ వచ్చి గిరిజనుల జీవితాలతో కలిసిపోయారు. ఇతని సూచనల కారణంగా 1946లో ఆదివాసీ ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలోని 5,7 షెడ్యూల్డ్‌లో ఉన్న ఆదివాసీ అవాసాలు భూములకు సంబంధించి ఉన్న చట్టాల ఆధారంగా 1/70 చట్టం వచ్చింది. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు సంక్రమించిన అధికారాలను ప్రభుత్వాలు ఇంకా గుర్తించకపోవడం దారుణం. గిరిజన పోరాటాలు, త్యాగాల వల్ల సంక్రమించిన రాజ్యాంగంలోని చట్టాలను గిరిజనులకు నిర్దిష్టంగా వర్తింపచేయాలి. గిరిజన పోరాట వీరుడు కొమురం భీం పేరు మీద జిల్లాను విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.

-కట్టగాని రవీంద

Namaseete Telangana News Paper Dated : 1/09/2012

No comments:

Post a Comment