Saturday, May 18, 2013

పాటకు పత్రహరితం కలేకూరి -డాక్టర్ చెరుకు సుధాకర్



‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా ఇంకా చేతికి ‘దక్కని పిడికెడు ఆత్మగౌరవం’ కోసం, ‘చోళీకే పీచే’ బరు కన్నీటి కథల కోసం, సామాజిక, రాజకీయార్థిక వికా సం కోసం వేయిన్నొక్క అద్భుత తెలుగు అనువాదాలు చేసి తానే ఒక చర్చ అయి, పరుగెత్తి పరుగెత్తి డస్సిపోయి మృత్యువు ఒడిలో నిండా యాభై ఏండ్లు నిండకముందే వాలిపోయాడు. ఒంగోలు ఆస్పవూతిలో మన మిత్రుడు, సాహితీవేత్త, దళిత ఆత్మగౌరవ పతాక, అలుపెరగని నిత్యనూతన సాహితీ ‘యువక’ కలేకూరి ప్రసాద్.

1964 అక్టోబర్ 25న కృష్ణా జిల్లా కంచికచర్లలో జన్మించాడు ప్రసాద్. విద్యాధికులు, ఉపాధ్యాయులైన లలితా సరోజిని, శ్రీనివాసరావుల సంతానం. మార్క్సిజం ప్రభావంతో అనేక ఉద్యమాలు నడిచే కంచికచర్ల గడ్డపైన దళితుడు కోటేశు సజీవ దహ నం చేయబడినాడు. అంబేద్కర్ శ్రమించి నిలబెట్టిన ఎస్సీ రిజర్వేషన్లతో విద్య-ఉద్యోగ అవకాశాలు పెరిగినా, ఆత్మగౌరవం కోసం ఒక్క అడుగు ముందుకు వేసినా ‘కో గుర్తు చేస్తుం ది. చిన్నతనంలోనే కలేకూరి ప్రసాద్‌కు నిత్యం కాటేసే మనువాదమని అర్థమయింది.
విద్యార్థి ఉద్యమాల్లో ఎగుస్తున్న విప్లవ కెరటాలకు కేరింతలు కొడుతున్న కుర్రకారుకు, తాను సై అంటూ జై కొట్టిన ప్రసాద్, విప్లవ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నిలదొక్కుకునే ప్రయత్నంలో రాడికల్ అయ్యాడు. పీపుల్స్‌వార్ ప్రభావంతో నూనూ గు మీసాల వయస్సులో ఒక చేత్తో ఉద్యమం, మరో చేత్తో సాహి తీసాధన చేస్తూ విప్లవ రచయితల సంఘంలో భాగమై విస్తృతసాహితీ అధ్యయనం కొనసాగించాడు.

పాట, కవిత, కథానిక, వ్యాసం ఏదైనా తాను నమ్మిన ప్రాపంచిక దృక్పథంలోనే కొనసాగిన కలేకూరి ప్రసాద్‌కు వరుసగా జరిగిన నీరుకొండ, కారంచేడు, చుండూరు సంఘటనలు ఒక్క కుదుపు కుదిపాయి. ఎక్క డో తమిళనాడులో దళితులపై జరిగిన దాడికి అనేక రెట్ల పైశాచికత్వంతో తాను పుట్టిన కంచికచర్లలోనే కోటేశ్‌ను మరో దాడి బలిగొన్నది. వాటి కొనసాగింపుగా వేట కొడవల్ల వెంటాడే హత్య లు. గోనె సంచుల్లో కుక్కిన దళితుల శవాలు ప్రసాద్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దళితవాడల్లోని చర్చీల్లో క్రీస్తును స్తుతిస్తూ ఉన్న పాటల పల్లవి ‘ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్త మే... ప్రభువా! నీ వాక్కుకై వేచియుంటిని-నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా!’.. అనేదాని బాణితోనే ‘కుమిలిపోయినా, నలిగిపోయినా-చుండూరు గుండెల గాయం దళితా! సాగుతు న్న సైనిక శపథం... దళితా! ఆవేదనంతా పోరాట సెగలై ఊరూ రా చుండూరు మండుతుందిలే! దళిత వీరులే చలిచీమల దండై కడతేర్చులే ‘కోడే త్రాచులన్-దళితా!’ అన్న పాట కట్టి లక్షల గొంతులతో తెలుగు నేలంతా పాడుకునేలా చేసినవాడు కలేకూరి ప్రసాద్.
చుండూరు ‘రక్తక్షేత్రం’ దాటి ప్రసాద్ ఆ పాట ధర్మక్షేవూతమైన ప్రతి పల్లెను తాకింది. 

భారతదేశంలో విప్లవమంటే మార్క్సిస్టు తాత్వికతలో మాత్రమే లేదు. అంబేద్కర్, ఫూలే పూర్తి చేయని దళిత, బహుజన ఆత్మగౌరవ పోరాట బాటలో కూడా ఉందని ఒక్క కుదుపులో వందలాదిమందిని కారంచేడు, చుండూరుకు తీసుకు వచ్చిం ది ఈ పరిణామమే. ‘దళిత పులులమ్మా! కారంచేడులో కలెబడి నిలబడి గెలిచి తీరిన దళిత పులులమ్మ’ అన్న గద్దర్ పాట ‘చుండూరు గుండెల గాయం’ అన్న ప్రసాద్ పాట గుంటూరును వొరుసుకొని, అమరావతిని ముద్దాడి, కృష్ణమ్మకు గొంతు కూర్చి, నల్లగొండ వాడపల్లి ఒడ్డును దాటి పది జిల్లాల తెలంగాణకు పరివ్యాపితమైంది. అదే సమయంలో ‘యువక’గా ఆయన రాసిన అనేక పాటలు తెలుగు సాహిత్యంలోనే కొత్త ఊపును తీసుకొచ్చాయి.

తొలినాళ్లలో విరసం పతాక ప్రారంభ పాట పల్లవి, పరిటాల శ్రీరాములు జీవిత పోరాట కథకు దగ్గరగా తీసిన ‘శ్రీరాములయ్య’ తర్వాత వచ్చిన ఇతర సినిమాల్లో ‘యువక’ పాటలు జనంలో ప్రాచుర్యం పొందాయి. ‘భూమికి పచ్చని రంగేసినట్లు’ అని యువక రైతు శ్రమ గురించి, కంట్రిబ్యూషన్ గురించి రాసిన పాట ఒక రొమాంటిక్ ట్యాగ్ కూడా అయ్యింది. ప్రసాద్ నిత్య అధ్యయనశీలి. చేగువేరాను చదువుతాడు. లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ సాహిత్యం చదువుతాడు. మహాశ్వేతాదేవిని చదువుతాడు. పాల్ రాబ్సన్, పాబ్లో నెరూడాలని తెలుగు నేల నల్లరేగళ్లలో, తెలంగాణ ఎర్రనేలల్లో రూపు కట్టాలని ఉబలాటపడుతాడు. ఎక్కడా స్థిరంగా నిలువనీయని అత్యుత్సాహం. ఏదో జరిగిపోవాలనే ‘సహజ’ యువకత్వం ప్రసాద్‌ను కవిగా, గాయకునిగా, పాటగాడిగా, యుద్ధంలో పాల్గొన్న విప్లవకారుడిగా పరుగుపెట్టించాయి. 

ఎంత ఉత్సాహంగా ముందుకు ఆయన వ్యక్తిగత కారణాలైనా కావొచ్చు, నడుస్తున్న ఉద్యమంల్లో వచ్చిన మార్పులు కావొచ్చు, కలేకూరి ప్రసాద్ ఎక్కడో నిరుత్సాహానికి గురయ్యా డు. తెలియని బాధని అధిగమించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయి మద్యం ఆధిపత్య స్థాయిలోకి చేరిం ది. రెండు సంవత్సరాల క్రితం నల్గొండలో ఒక సాహిత్య సభకు వచ్చినప్పుడు ప్రసాద్‌ను పోల్చుకోలేకపోయాను. కూర్చోబెట్టి ఎంతో సముదాయించి, కొన్ని అత్యవసరమైన వైద్యసేవలు చేసి పంపించిన తర్వాత ఇంతలోనే మరణవార్త వినాల్సి వచ్చింది. భూమికి పచ్చని రంగేసిన ప్రసాద్ తన జీవితానికి వేయలేకపోయాడు. ఆ పాటలోని చిత్రకారుడు కాన్వాస్ మీద పత్రహరితం ఒలకబోసినంత పలువరింత ఉన్న పాట రాసిన ప్రసాద్, జీవన పత్రహరితాన్ని కాపాడుకోలేక, రోజు రోజుకు ఎండిపోయి ఆరబెట్టిన చెక్కపొట్టులా రాలిపోవడం నన్ను కలచివేస్తున్నది. ‘నిఘా’ పేరు తో పత్రిక నడిపిన కలేకూరి ప్రసాద్‌ను ఇంత పెద్ద సాహితీ కుటుంబ ‘నిఘా’ ఏమీ రక్షించలేకపోయింది.

‘పిల్లలు ఎలా నేర్చుకుంటారు? అనే అనువాద పుస్తకంలో పిల్లలమనస్తత్వం-పెద్దల మార్గదర్శకం-అసమాన వేగవంత గ్రాహక తత్వం గురించి అనేక విషయాలు తెలుగు చదువరుల కు పరిచయం చేసిన కలేకూరి నేర్చుకున్న, కూర్చుకున్న అసమాన జ్ఞానం మోస్తున్న శరీరమే పెద్ద ధర్మ సాధనమని విస్మరించి మనందరిని నిండా యాభై పూర్తికాక ముందే వదలి విషాదంలో ముంచిండు. 

తెలుగు సాహిత్యంలో గొప్పగా రాస్తున్న వాళ్లు, ప్రపంచాన్ని గొప్పగా గీస్తున్న వాళ్లు, తెలంగాణ ఉద్యమాన్ని, నడుస్తున్న ప్రజ ల పోరాటాలను గొప్పగా పాడుతున్న వాళ్లు, ప్రపం చ సాహిత్యాన్ని నిత్యం తెలుగులో అక్షరబద్ధం చేస్తున్న వాళ్లు అందరూ కలేకూరి జీవితం నుంచి గుణపాఠం నేర్చుకుంటే.. మన మధ్యే వందల సాహితీమూర్తుల్ని చాలాకాలం సజీవంగా నిలుపుకోగలుగుతాం.


టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యు


Namasete Telangana Telugu News Paper Dated : 19/5/2013

No comments:

Post a Comment