Wednesday, January 25, 2012

అడుగడుగునా హక్కుల ఉల్లంఘన




భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ఆ రోజు దేశమంతా రిపబ్లిక్ డేగా జరుపుకుంటుంది. ఆ రాజ్యాంగం భారతదేశ పౌరులకు 19వ అధికరణ కింద ప్రాథమిక హక్కులను కల్పించింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఉన్నాయా.? లేక అవి హరించబడినాయా.?అనే ప్రశ్న ఈరోజు ప్రతి పౌరుడి మనస్సులో కలుగుతుంది. 50 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు తమకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని, ఇంకా అది కొనసాగుతుందని, తమను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పాలకులు, అధికారు లు రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని, తమ ప్రాంతానికి న్యాయ పరంగా దక్కాల్సిన వనరులు, ఉద్యోగాలు, పెట్టుబడులు దక్కకుండా పోతున్నాయని, తమ ప్రాంతానికి చెందిన విలువైన భూములు దోపిడీకి గురవుతున్నాయని, ఇక ఏమాత్రం కలసి ఉండలేమని, తెలం గాణ ప్రజలు ఉద్య మిస్తున్నారు. కలసి వుంటే తమ సంస్కక్షుతి, జీవన విధానం, మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని, అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

ఈ పోరాటాన్ని ప్రజల ఆకాంక్షలను గుర్తించామంటూ అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల ఎన్నికల ప్రణాళికలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చాయి. ఉద్యమ తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభు త్వ ఆదేశం మేరకు అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు అనుకూలమని అన్ని పార్టీలు చెప్పా యి. ఆ విషయాన్ని పరిశీలనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించనున్నామని ప్రకటించగానే కంటి తుడుపు చర్యగా తెలంగాణకు అనుకూలమని చెప్పిన దోపిడీవర్గాలు ఏకమై తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు అడ్డుపడడం జరిగింది. పాలక, ప్రతిపక్ష పార్టీలు సిగ్గుఎగ్గు లేకుండా ఏకమై కుట్రలతో, కుతంవూతాలతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకోవడం చూసి కోపోవూదిక్తులైన సబ్బండ వర్ణాలు, వర్గాలు ఏకమై ఉద్యమబాట పట్టడం జరిగింది.

ఈ ఏకీకృత ఉద్యమాన్ని చూసి ఓర్వలేని సీమాంధ్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో ఉద్యమాన్ని హింసవైపు మళ్ళించే చర్యలకు పాల్పడింది. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా జరుపుతున్న ఉద్యమాన్ని అణచాలని ఏకైక లక్ష్యంతో ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న ఉద్యమకారులపై వందలాదిగా అక్రమ కేసులు బనాయించి, ైజైలుకు తరలించింది. మిగతా ఉద్యమ కారులను ఉద్యమానికి దూరం చేసే కుట్రలు పన్నింది. భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని అనేక అత్యంత తీవ్రమైన అభియోగాలు మోపి, ఉద్యమంలో చురుగా పాల్గొంటున్న ఉద్యమ కారుల భవిష్యత్తును నాశనం చేసే చర్యలకు పూనుకుంది. అంతే కాకుండా విద్యార్థులపై పాశవిక దాడులకు పాల్పడి, వారిని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేసి వారి ప్రాథమిక హక్కులు భంగం కలిగించే చర్యలకు పాల్పడింది.

ఎలాంటి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకపోయిన అనేక సందర్భాలలో బాష్పవాయువు గోళాలు ప్రయోగించి, లాఠీచార్జీలు చేసి మానవ హక్కుల హరణకు పాల్పడింది. శ్రీకృష్ణకమిటీని ప్రలోభాలకు గురిచేసి తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇప్పించుకున్న సీమాంధ్ర పాలకులు ఆ రిపోర్ట్‌లోని చీకటి అధ్యాయాన్ని అమలు పరిచే విధం గా పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నది. మొత్తంగా చూసినటె్లైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చేసిన ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా.? ఉద్యమిస్తున్న ఉద్యమకారులపై వివక్షతో, తీవ్రమైన అసహానంతో తీవ్ర నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపుతూ, తప్పుడు కేసులు మోపు తూ వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తూ, వారి భవిష్యత్తును కాలరాసే చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ ఉల్లంఘన కాదా.?విద్యార్థులపై మోపిన అన్ని అక్రమ కేసులను వెంటనే ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ హామీని నిలబెట్టుకోకుండా ఇంకా అనేక అక్రమ కేసులు బనాయించి ఉద్యమ కారులను చిత్రహింసలకు గురిచేసి జైళ్ళలో మగ్గే విధంగా చర్యలు చేపట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా.? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ, అణచివేతను చూసి తట్టుకోలేక, ఇక తెలంగాణ రాష్ట్రం రాదేమోనని నిస్పక్షుహకు గురై, తమ బలిదానం చూసైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రీతిగా స్పందిస్తాయేమోనని భావించి ఏడు వందల మంది యువకులు ఆత్మార్పణ చేసుకున్నారు. అయినా చూస్తూ నోరు మెదపని ప్రభుత్వాల చర్య రాజ్యాంగ ఉల్లంఘన కాదా.?

సమాచార చట్టం అమల్లోకి వచ్చిన తరువాత కూడా శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి సమాచారం ఈ ప్రాంత ప్రజలకు తెలియకుండా చీకటి అధ్యాయాన్ని తమ రిపోర్ట్‌లో పెట్టింది. శ్రీకృష్ణకమి టీ ఇక్కడి ఉద్యమాన్ని ప్రలోభాలకు, అణచివేతకు గురిచేసి ఉద్యమ తీవ్రతను తగ్గించాలని చూడడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఈ ప్రశ్నలు తెలంగాణలోని ప్రతి పౌరుడి మనస్సులో ఉదయిస్తున్నాయి. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులు హరించబడ్డాయా.? మేము ఈ దేశ పౌరులమేనా.? ఈ ప్రాంతంలో రాజ్యాంగం అమల్లో లేదా..? నియంత పాలనలో గానీ, ఎమ్జన్సీ పాలనలో ఉన్నామా.? రేపు ఏదైన జరగకూడనిది జరిగితే భవిష్యత్తులో హింసాత్మక ఉద్యమం చెలరేగితే ప్రభుత్వాల బాధ్యత అవుతుంది తప్ప ప్రజల బాధ్యత కాబోదు. 

-తన్నీరు శ్రీరంగరావు
తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో- కన్వీ
Namasete telangana news paper dated 26/1/2012 

No comments:

Post a Comment