Friday, July 27, 2012

విప్లవ దార్శనికుడు ( చారుమజుందార్)----వరవరరావు


man
‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం ‘గమ్యం’ అంకితమిస్తూ చారుమజుందార్‌పై ఈ చరణాలు రాశాడు. చారుమజుందార్ అమరుడై నిండా నలభైఏళ్లు. ఆయన నక్సల్‌బరీ నిర్మాతగా పీడిత ప్రజల ప్రియతమ నాయకుడయ్యారు. నక్సల్‌బరీలో 1967 మే 23-25 తేదీలలోవూపజావూపతిఘటన వెల్లువ తర్వాత 22 ఏప్రిల్ 1969న సీపీఐ మార్క్సిస్ట్-పూనినిస్ట్ ఏర్పడి ఆయన దానికి కార్యదర్శిగా ఎన్నికైనట్లుగా కలకత్తాలో షహీద్ మినార్ మైదానంలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్న బహిరంగసభలో ఎర్రజెండాల మధ్యన కానుసన్యాల్ ప్రకటించాడు. నక్సల్‌బరీ నాటి నుంచి అజ్ఞాతంలో గడుపుతూ పార్టీ ఏర్పాటు తర్వాత పూర్తి అజ్ఞాత నిర్మాణంలోని రాజకీయ విశ్వాసంతో 1972 జూలై 20న అరెస్టు అయ్యేదాక కూడా చారుమజుందార్ అజ్ఞాత జీవితంలోనే ఉన్నాడు. ఆయనది చాలా బలహీనమైన ఆరోగ్యం. మధుమేహం, రక్తపో టు, ఆస్తమా వ్యాధులతో బాధపడుతూ.. తన బక్క పలుచటి శరీరాన్ని విప్లవ సంకల్పం కోసమే అజ్ఞాత జీవితమంతా మందులతో కాపాడుకున్నాడు. ఆయనకు ఆశ్రయం ఇచ్చినవాళ్లు, శ్రేణులు, ప్రజలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. చారుమజుందార్ స్వభావ రీత్యా ఎంత భావావేశపరుడో అంత విప్లవ స్వాప్నికుడు కూడా అని, ఆయన రచనలు చదివిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. 1972 జూలై 20న ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని కలకత్తా నగరంలోనే అరెస్టు చేసి చిత్రహింసలకు ప్రఖ్యాతి గాంచిన లాల్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో గోప్యంగా నిర్బంధించారు. భౌతిక చిత్రహింసల కన్నా ఆయన పలురకాల వ్యాధులకు తీసుకుంటున్న మందులన్నీ స్వాధీనం చేసుకుని, వాటిని వాడకుండా చేసి ఆ వారం రోజులు ఆయనను చికిత్స లేకుండా మరణించేలా చేశారు. చిలీ అధ్యక్షుడు అలెండి హత్య తరువాత అమెరికన్ సామ్రాజ్యవాదం మిలాకత్‌తో పినోచెట్ నియంతృత్వం క్యాన్సర్‌తో బాధపడుతున్న పాబ్లో నెరుడాను ఎట్లా చనిపోయేలా చేసిందో, సరిగ్గా అట్లాగే చారుమజుందార్ విషయంలోనూ మన పాలకులు చేశారు. మనుషులు, డాక్టర్లు కలవకుండా చికిత్స అందకుండా చేసి చారుమజుందార్‌ను చంపారు.
కానీ.. నలభై ఏళ్లుగా చారుమజుందార్ విప్లవ, పీడిత ప్రజల హృదయాల్లో ఒక నిప్పు రవ్వ. ‘జానకి తాడు’కు అంటిన మంటలా దేశమంతటా విస్తరిస్తూనే ఉన్నాడు. ఇవ్వాళ.. దండకారణ్యంలో ప్రజాయుద్ధమై ప్రజలపై ప్రభుత్వయుద్ధాన్ని ప్రతిఘటిస్తున్నాడు. అయన తెరాయి దస్తావేజుల్లో(1965నుంచి 67 వరకు రాసిన 8 వ్యాసాలను తెరాయి దస్తావేజులు, ‘ఎనిమిది డాక్యుమెంట్లు’ అనే పేరు తో పిలుస్తారు.) ప్రతిపాదించిన అన్ని అధికారాలు ప్రజల కే (ALL POWER TO PEOPLE) ఇవ్వాళ దండకారణ్యంలో ముఖ్యంగా బస్తర్‌లో క్రాంతికారీ జనతన సర్కార్‌లో ప్రయోగంగా ఆచరణకు వచ్చింది. ఆయన ప్రతిపాదించిన గెరిల్లా యుద్ధం ఇవాళ దండకారణ్యంలో చలనయుద్ధం స్థాయికి చేరుకున్నది. చారుమజుందార్ ప్రతిపాదించిన దున్నేవానికి భూమి దండకారణ్యంలో ప్రతి ఆదివాసీ అనుభవంలోకి వచ్చింది. తమ శ్రమతో, సహకారంతో భూమిని స్వాధీనంచేసుకొని, చదును చేసుకుని, గ్రీన్‌హంట్ పేరిట భారత ప్రభుత్వం ప్రకటించిన యుద్ధ సమయంలోనూ వాళ్లు ఉత్పత్తిలో పాల్గొంటున్నారు. భూస్వామ్య పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దళారీ నిరంకుశ పాలకులకు నక్సల్‌బరీలో చారుమజుందార్ వేసిన దారి అత్యంత ప్రమాదరకరమైన అంతర్గత శత్రువుగా భయపెడుతున్నది. ఒకప్పుడు యూరప్‌ను వెంటాడి భయపెడుతుందని మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టోలో చెప్పిన కమ్యూనిస్టు భూతం, ఇవ్వాళ బుంకాల్ మిలిషియా రూపంలో అదేవిధంగా భారత పాలకులను భయపెడుతున్నది. ఎందుకంటే.. ఇది భూత, వర్తమానాల్లో స్పష్టంగా ఆవిష్కరించపడుతున్న భవిష్యత్తు. అందుకే చారుమజుందార్ 40 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు ఆజానుబావుడై అజరామరంగా మన మధ్య నిత్య సమరశీలిగా మసలుకుంటున్నాడు.

1967 నక్సల్‌బరీ నాటికి చారుమజుందార్ సీపీఎం డార్జిలింగ్ జిల్లా సిలిగురి డివిజన్ కార్యదర్శి. 1967లో సీపీఐ చీలి సీపీఎం ఏర్పడ్డప్పుడు పార్టీలోనూ, ప్రజల్లోనూ చాలామంది ఆశించినట్లుగానే ఆయన కూడా సీపీఎం వర్గపోరాట పంథా తీసుకుంటుందని భావించాడు. అందుకే 65నుంచి ‘తెరాయి దస్తావేజు లు’ రాయడం ప్రారంభించాడు. తెరాయి ఇండియా-టిబెట్ చైనాకు మధ్యన ఉన్న ఒక కీలకమైన భూభాగం. సంతాల్ తెగలు ఉండే ఆదివాసీ ప్రాంతం. ‘దస్తావేజులు’ రచిస్తున్న కాలంలోనే.. 1956-65 దాకా కృశ్చెవ్ సిద్ధాంతంపై (శాంతియుత పరివర్తన, శాంతియుత పోటీ, శాంతియుత సహజీవనం) మావో నాయకత్వంలో గ్రేట్ డిబేట్ ముగిసి చైనాలో శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. బోల్షివిక్ విప్లవం, చైనా విప్లవం తరువాత చారుమజుందార్ ఇది మూడో విప్లవం అన్నాడు. తెరాయి దస్తావేజుల్లో ఆయన ప్రజల ముందు కార్మిక వర్గపార్టీ నాయకత్వంలో ఆచరించాల్సిన మూడు కర్తవ్యాలను ఉంచాడు. అవి-భూమిలేని నిరుపేదలు భూమిని స్వాధీనం చేసుకోవడమనే ఆర్థిక పోరాటం. భూస్వాముల చేతుల్లో ఉన్న మిగులు భూములు, భూస్వాముల ఆక్రమణలో ఉన్నవి కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు. అది సాఫిగా సాగే పనికాదు కాబ ట్టి అవి స్వాధీనం చేసుకోవడానికి, నిలుపుకోవడానికి గెరిల్లా పోరాటమనే సైనిక పోరాట ప్రతిపాదన చేశాడు. ఇది మొదట భూ ఆక్రమణదారుల గూండాల నుంచి, మాఫియాల నుంచి, ఆ తరువాత వాళ్లకు అండగా ఉండే పోలీసు, ప్రభుత్వాల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రజలకు అండగా ఉంటుంది. ఈ క్రమమంతా గెరిల్లా పోరాటం ద్వారా శత్రువు బలహీనంగా ఉండే గ్రామాలను విము క్తం చేయడంగా ఉండాలి. ఒకసారి విముక్తం అయిన గ్రామం ఎల్లకాలం విముక్తం అయి ఉంటుందని గ్యారంటీ లేదు. ఒకసారి గెలుచుకున్న కోట ఎప్పుడూ మన వశంలోనే ఉంటుందనీ లేదు. ఇది సరళ రేఖగా సాగే పోరాటం కాదు. అందుకే ప్రజలకు రాజ్యాధికారం ఇచ్చే రాజకీయ పోరాటంగా రాజకీయ లక్ష్యంగా కొనసాగాలి. అన్ని అధికారాలు ప్రజలకు అన్నప్పుడు అందులో ఇమిడి ఉన్నది రాజకీయ లక్ష్యమే. అదే ఇప్పటి దండకారణ్యంలోని క్రాంతికారీ జనతన సర్కార్. ‘తెరాయి దస్తావేజు’ల రచన చేసే నాటికే దేశంలో (1967) సాధారణ ఎన్నిక లు వచ్చాయి. నెహ్రూ, ఇందిర కుటుంబ పాలనతో ప్రజలు విసిగి పోవడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రేసేతర ప్రభుత్వాలుగా బూర్జువాపార్టీలు అధికారంలోకి వచ్చాయి. బెంగాల్‌లో కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చిన అజయ్‌ముఖర్జీ బంగ్లా కాంగ్రెస్ పెట్టాడు. సీపీఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ఆయనకు ఎన్ని స్థానాలు వచ్చినా ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామనే ఒప్పందంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. రాష్ట్రంలో ఉన్న మిగులు భూములను ప్రజలకు పంచుతామని లెఫ్ట్ ఫ్రంట్ వాగ్దానం చేసింది. బెంగాల్‌లో ఆరు లక్షల హెక్టార్ల భూమి జోతేదారుల (భూస్వాముల) ఆక్రమణలో ఉందని, తాము అధికారంలోకి రాగానే ఆ భూమిని భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు.

ఎన్నికల్లో ఈ పొత్తు విజయం సాధించి బంగ్లా కాంగ్రె స్‌కు 5 సీట్లు, లెఫ్ట్ ఫ్రంట్‌కు 80 సీట్లు వచ్చాయి. జ్యోతిబసు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా అయ్యారు. కనుక సీపీఎం సిలిగురి డివిజన్ కార్యదర్శిగా చారుమజుందార్ చేసిందల్లా ఈ వాగ్దానాన్ని ఆచరణలో పెట్టడమే. కాకపోతే బూర్జువాపార్టీలు వాగ్దానాలు చేస్తాయి. కార్మికవర్గ పార్టీలు ప్రాణాలకు తెగించి వాటిని ఆచరణలోకి తెస్తాయి. వాగ్దాన భంగాలను ప్రజలకు బట్టబయలు చేస్తాయి. అయితే దున్నేవానికే భూమి భూస్వామ్య వ్యతిరేక ఆర్థిక పోరాటమే. చారుమజుందార్ దృష్టిలో చాలా స్పష్టంగా నూతన ప్రజాస్వామిక విప్లవం ఉన్నది. వ్యవసాయ విప్ల వం ఇరుసుగా సాగేది దీర్ఘకాలిక సాయుధ పోరాటం. నక్సల్‌బరీ గ్రామస్తుడే అయిన కానుసన్యాల్, బంగత్ సంతాల్ నాయకత్వంలో మే 23వ తేదీ నుంచి 25 వరకు 10వేల మందికి పైగా సంతాల్ ఆదివాసీలు నక్సల్‌బరీ, కేలిబరీ గ్రామాల్లో విశాలంగా పరుచుకొని ఉన్న నేల మీద నిలబడి ఇది మా భూమి అని ప్రకటించారు. వాళ్లం తా విల్లంబులు, గొడ్డళ్లవంటి సంప్రదాయక ఆయుధాలతో ప్రతిఘటనకు సిద్ధమై వచ్చారు. వారిపై మే 25న భూమి వాగ్దానం చేసిన లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం నక్సల్‌బరీ రైల్వేస్టేషన్ నుంచి బుల్లెట్ల వర్షం కురిపించింది. కేవలం లెఫ్ట్ ఫ్రంట్ పోలీసులే కాదు, ఇందిరాగాంధీ సీఆర్‌పీఎఫ్ బలగాలు కూడా తోడయ్యాయి. ఆ కాల్పుల్లో ఏడుగురు స్త్రీలు, నలుగురు పిల్లలు అక్కడికక్కడే అమరులయ్యారు. రేపటి చరిత్ర ఆధునిక స్త్రీ రచిస్తుందని గురజాడ అప్పారావు చెప్పినట్లుగా ఈ నక్సల్‌బరీ మహిళలు నలభై ఏళ్లుగా చరివూతను తిరగరాస్తున్నారు. ఈ చరిత్ర నిర్మాణా న్ని, రచనను శ్రీకాకుళం, వైనాడు మొదలు ఇవ్వాళ.. జంగల్‌మహల్, దండకారణ్యం, నారాయణపట్నం దాకా ప్రజలకు అందించారు. ఈ చరిత్ర నిర్మాణాన్ని, ప్రజలు రచించే ఈ చరివూతను కలగన్న విప్లవ దార్శనికుడు చార్‌మజుందార్. అందుకే ‘ఆయనకు మరణం లేదు. అప్పుడే అతడు ఒళ్లు విరుచుకొని సమాధి నుంచి లేచి, ఆయుధం చేతబట్టి తిరిగి రణరంగంలో చేరినాడు.’ అని శివసాగర్ ‘అమ్మా’ అనే కవితలో జూలై 1972లో రాశాడు. రణరంగానికి కేంద్ర బిందువు, ఇవ్వాళ దండకారణ్యపు పోరాటంగా చారుమజుందారే కాదు (ఆయన పోరాటంలో ఒరిగిన మొదటివాడు, చివరివాడూ కాదు.) ఈ జూలైలో దక్షిణ బస్తర్‌లో అమరుడైన విప్లవోద్యమ నాయకుడు విజయ్ మడ్కం కూడా లేచి ఆయుధం చేతబట్టి తిరిగి రణరంగంలో చేరినాడు. మనం కళ్లు తుడుచుకొని ఆ పోరాటానికి బాసటగా నిలుద్దాం. అడుగుల్లో అడుగులేద్దాం. ప్రజలు తమ స్వప్నంగా ఆవిష్కరించుకుంటున్న జనతన సర్కార్‌కు అండగా నిలుద్దాం. ప్రజల ఆశలను చిదిమేస్తున్న భూస్వామ్య, దళారీ భారత ప్రభుత్వ దాడిని వ్యతిరేకిద్దాం. భారత విప్లవోద్యమ నిర్మాత చారుమజుందార్ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుద్దాం.
-వరవరరావు
(నేడు నక్సల్‌బరీ ఉద్యమ నిర్మాత చారుమజుందార్ 40 వ వర్ధంతి
Namasete Telangana News Paper Dated : 28/07/2012 

No comments:

Post a Comment