Sunday, October 14, 2012

దళిత మహిళ బతుకు చిత్రం---సుజాత సూరేపల్లి




అది మహబూబ్ నగర్ పోలేపల్లి సెజ్ కావొచ్చు, కరీంనగర్ అన్నారం గ్రానైట్ గుట్టలే కావొచ్చు లేదా కాలుష్యం వెదజల్లే ఇథనాల్ కం పెనీ వ్యతిరేక ఉద్యమమే కావొచ్చు. మహిళలు ముందుండి పోరాటం చేస్తున్నరు.అందులో దళిత మహిళలు, ఇంకాస్త ముందుకు పోయి మాదిగ మహిళలు అని కూడా చెప్పాలి. వారు ఎక్కువ చదువుకొని ఉండక పోవచ్చు, కానీ పచ్చని పంటపొలాలు పొతే, నీళ్ళు, గాలి కలుషితం ఐతే బతు కు ఆగం అయితది అనే ఒకేఒక్క కారణంతో మహిళలు పోరాడు తున్నరు. అగ్రకులాల గుప్పి ట్లో ఉన్న రాజ్యాన్ని, రాజ్యానికి కొమ్ము కాస్తున్న పోలీసు వ్యవస్థ ను అడుగడుగునా ఎదిరిస్తున్న రు. పోలేపల్లి చుక్కమ్మ భూమిని కోల్పోయింది. భర్తని పోగొట్టుకొంది. ఆఊర్ల చాలమంది భర్తలను పోగొట్టుకున్నవాళ్ళు ఉన్నరు. ఇప్పటికీ రాత్రనక పగలనక ‘మాభూములు మాకు కావాలని గొంతెత్తి అరిచింది. ప్రపంచాన్ని కదిలించింది. ధర్నాలు, ఊరేగింపులు,రాస్తారోకోలు చే సింది. ఆమెతో చాలామంది దళి త మహిళలు ముందుండి పోరా టం చేశారు.కానీ చుక్కమ్మ చైత న్యం, తెలివి తేటలు తట్టుకోలేని ఊరి పెద్దలు, అధికారులు, దళిత ఎమ్మెల్యేలు ఆమె నోరు మూసిన్దాక కుట్ర పన్నినరు. అక్కడి ఎమ్మార్వో బూతులు తిడితే, కాగితాలు చింపి మొఖాన కొడితే, పోలేసువాళ్ళు కేసుపెట్టడానికి పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చింది. కాని ఆ కేసు కొట్టివేసేదాకా చిత్రహింసలు, ఇంట్ల , బయట అనుభవించింది. ఇదే విధంగా అటుఇటుగా కరీంనగర్ అన్నారం గుట్టల పోరాటంలో మహిళా అధికారి మీద కేసు పెడితే పట్టించుకొనే నాథుడు లేడు. కులస్తులంత బహిష్కరించి కేసు వెనక్కితీసుకొనే దాకా వెంట పడ్డరు. విచివూతంగా అక్కడ కూడా దళిత ఎమ్మెల్యేనే ఉన్నాడు. ముందుండి రాయబారం నడిపిస్తాడు. అగ్ర కులాల దగ్గర బానిస బతుకులు బతుకుతూ, నీ బాంచన్ దొరా! అనే వాడు నాయకుడు ఎట్లా అయితడు ? కులంపేరు చెప్పుకోగానే మనవాడు అని మోసపోతే ఏమి జరుగుతుందో మనం ప్రత్యక్షంగా చూ స్తున్నం. ఇప్పటి నుంచి కాదు, కులం పుట్టినప్పటినుంచీ ఇదేకథ. పోరాటం పేరు చెపితే మమ్మల్ని వదిలేయండి అని మొకం చాటేస్తరు. 

పర్లపల్లి ప్రజలు చేస్తున్న హరిత బయో ప్రోడక్ట్ కంపెని వ్యతిరేక పోరాటం చరివూతాత్మకమైనది. చుట్టూ పచ్చని పంట పొలాలు, బావులు,గుట్టలు. నట్టనడుమ పుట్టుకొచ్చింది హరిత బయో ప్రోడక్ట్ కంపెనీ. విత్తనాల కంపెనీ అని మభ్యపెట్టి నరకం అంటే ఎట్లా ఉంటదో చూపించినరు.డ్డి దొరలూ, ఎన్నారైలు దాదాపు అరవై కోట్లతో కంపెనీ పెట్టారు. రోజురోజుకు జీవితం దుర్భరమైతుంటే మహిళలంత కలిసి ఆ కంపెనీ మూసివేయాలని అనేక రకాలైన పోరాట రూపాలను చేపట్టినరు. కలెక్టర్‌కు విన్నవించుకున్నరు, కనపడ్డ సంఘాలని సాయం అడిగినరు, తెలంగాణ జాక్‌లు, డాక్టర్లు, వివిధ ప్రజా సంఘాలు అన్నీ ఆ కంపెనీ అక్కడ ఉండడం కుదరదని చెప్పినై. ఢిల్లీలోని, హైదరాబాద్‌లోని మానవహక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు చేసినై. ఈనెల నాల్గవ తేదీన ఆ కంపెనీ పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్ చెప్పిన సమాధానం మూసివేసినం అని. కానీ గత నెలనే అనుమతులు ఇచ్చినం అని కంపెనీ వారు, వారి తరఫున మాట్లాడిన ఆర్‌డీవో చెప్పినరు. ఈ లోపున పర్లపల్లి గ్రామ మహిళా సంఘాల కార్యకర్తలకు విధులు సక్రమంగా నిర్వర్తిస్తలేరని వారి కార్యాలయాల నుంచి మెమోలు అందినై.

మొదటి నుంచి ముందుండి నడిపిస్తున్న కవ్వంపల్లి రేణుక అనే మాదిగ మహిళ పై అందరి కన్నుపడ్డది. అంజలి, పద్మ, శోభ అనే మహిళలపై కూడా విపరీతమైన ఒత్తిడి చేశారు. బెదిరించి నోరునొక్కే ప్రయత్నాలు చేశారు. దళితులంటే పోలీసులకు, ఊరి వాళ్లకు, అధికారులకు చిన్న చూపు. బూతులు లేనిదే మాటలు రావు. పోలీసు వారి సమక్షంలో, ఆర్‌డీవో సాక్షిగా రేణుకపై బండి రాజు అనే అతడు చున్ని మెడకు వేసి చుట్టి, కొట్టితే దిక్కులేదు. కంటితుడుపుగా పోలీసులు తీసుకొని పోయినారు కాని ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టలేదు. విచారణ జరపడానికి వచ్చిన ఆర్‌డీవో కంపెనీ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతుంటే మహిళలు అభ్యంతరం చెప్పినరు. పోలీసులు, ప్రభుత్వ ప్రతినిధులు మహిళలపై దాడులు చేస్తూ, కేసులుపెట్టి వేధింపులకు పాల్పడుతున్నరు.ఇథనాల్ కంపెనీలతో జరుగుతున్న నష్టాలను డబ్బుకు అమ్ముడుపోయే ప్రభుత్వాలు, సంస్థ లు పట్టించుకోవడంలేదు. లంబాడ తండాలో, ఆదివాసీ ప్రాంతాల్లో పొట్టకూటికి బట్టీలు పెట్టి సారా అమ్మితే మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, కొట్టి చిత్రహింసలు పెడుతున్నరు. 
కరీంనగర్ పట్టణానికి ఒకే ఒకదిక్కు మానేర్ డ్యాం.అందులోంచి దాదాపు రోజుకు పదిహేను లక్షల లీటర్ల నీటిని తీసుకోవడానికి అనుమతి ఎట్లా ఇస్తారు? ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తెలంగాణకు ఇటువంటి ఫ్యాక్టరీలు అవసరమా? బొగ్గు, ఇసుక, గ్రానైట్, కంకర తవ్వకాలతో అతలాకుతలం అయితున్న కరీంనగర్‌ను రక్షించే వారు లేరా? దీనిని చూస్తూ ఊరుకున్న ప్రజా ప్రతినిధులా రేపు తెలంగాణ తెస్తాం అని కొట్లాడేది? ప్రజల నోరునొక్కి డబ్బులకు ఆశపడి పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వాలు జీవ వైవిధ్య సదస్సును ఏ మొఖం పెట్టుకుని నిర్వహిస్తున్నాయి? 

దళితుల పరిస్థితి, అందులో మహిళల దుస్థితి చూడాలంటే ప్రజా పోరాటాలను ప్రత్యక్షంగా చూడాల్సిందే. ప్రజల విన్నపాలను పట్టించుకోకపొతే అవి హింస వైపు దారి తీయవచ్చు. నేడు గ్రామాల్లో ఏ పోరాటం చేసినా అది దళిత మహిళలే. కొద్దో గొప్పో బీసి కులాల మహిళలు చేస్తున్నారు. ఇక ముందు లక్షింపేటలు జరగకూడదనుకుంటే దొంగ రాజకీయ నాయకులు ఏ కులం ముసుగులో ఉన్నా ముందే పసిగట్టి దళిత జాతిని రక్షించుకోవాల్సిన బాద్యత అందరిమీదా ఉన్నది. ఎవరికీ భయపడకుండా, ఎన్ని అవమానాలకు అయి నా ఓర్చి ముందుకు సాగుతున్న పేద, దళిత , బీసి, ఆదివాసి, మైనారిటీ మహిళలందరికీ ఉద్యమాభివందనాలు. ఈ దేశంలో కింది కులాల మహిళలకు మర్యాద ఇచ్చి, వారి చేసే పోరాటాలకు మద్దతునిచ్చి, వారు భుజాన మోస్తున్న పర్యావరణం, వనరులను కాపాడడం అనే బాధ్యతని అందరూ పంచుకోవాలి. కరీంనగర్ పర్యావరణాన్ని, ఇక్కడి భిన్న కులాల హక్కులను కాపాడాలి. రాబోయే తెలంగాణలో అందరికి సమాన హక్కులు ఉంటాయని ఇప్పటినుంచే మనం ప్రజలను చైతన్య పరచాలి. 

-సుజాత సూరేప
Namasete Telangana News Paper Dated : 15/10/2012 

No comments:

Post a Comment