Friday, October 26, 2012

ఆస్ట్రేలియాలో తెలంగానం(సాహిత్య యాత్ర)---గోగు శ్యామల



ఆరోజు ఉదయం 9 గంటలకు నేను సిడ్నీలో ఫిలిఫ్ స్ట్రీట్‌లోని ట్రావెలాడ్జిలో దిగాను. నేను హడావిడిగా తయారై వెళ్లడానికి సిద్ధంగా ఉన్న బస్‌లో ఎక్కాను. ఒక్కసారి అందరూ హాయ్ అన్నారు. వారందరకి నేను ‘హాయ్, నమస్కార్ ’ అని బదులు చెప్పిన. కానీ అంత మంది నా కోసం ఎదురు చూస్తున్నరని నేను ఊహించలేదు. ఆ క్షణం ఉక్కిరిబిక్కిరయిన. వారికి ‘నమస్కారం’ అని మామూలుగా విష్ చేయడం, ఏదో వెల్తి అనిపించింది. నా అస్తిత్వం జైపూర్ లిట్రరీ ఫెష్టె నుంచే వారందరికి తెలిసిందనేది నాకు తట్టింది. వెంటనే సీట్లో కూర్చున్నదాన్ని పైకి లేచి నిలబడి ‘జై తెలంగాణ’ అని తిరిగి విష్ చేసిన. అందరూ ముక్తకం ‘జై తెలంగాణ’ అని బదులు చెప్పిండ్రు. అప్పుడు నా మనసు నిమ్మలమయింది. వారందవరో తెలుసా? భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ రచయితలు.

అందులో ప్రముఖ రచయిత ‘యయాతి’, ‘తుగ్లక్’, ‘నాగమండల’ మొదలగు గొప్ప రచనలు చేసి, పద్మభూషణ్, అవార్డు గ్రహీత కన్నడ రచయిత గిరీష్ కర్నాడ్ ఉన్నారు. ఉర్దూలో చారివూతకమైన మౌఖిక కథలను చెప్పే సాంప్రదాయాన్ని పునరుద్ధరించిన ప్రముఖ కళాకారుడు రచయిత మహ్మద్ ఫారుఖి ఉన్నారు. అరుణాచల్‌వూపదేశ్ చరివూతను, సంస్కృతిని ప్రముఖంగా రాస్తూ, ‘రివర్’పోయమ్స్, ‘ది లెజెండ్స్ ఆఫ్ పెన్‌సామ్’ తదితర పేరు గాంచిన రచనలు చేసి పద్మశ్రీ, 2011లో ‘ది ఫోర్తు హైమెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియన్’ అందుకున్న మమాంగ్‌దాయ్ ఉన్నారు. 2012లో జైపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య సంబరాల నిర్వాహకుల్లో ఒకరైన మితాకపూర్ ఉన్నారు.

‘ది ఫేస్ బిహైండ్ ది మాస్క్’ (తమిళ సాహిత్యంలో స్త్రీ) ‘ఎ పర్పుల్ సి’ (కథా సంకలనం) వెలువరించి ‘అంబయ్’ కలం పేరుతో రాస్తున్న సియస్ లక్ష్మి ఉన్నారు.‘అకర్మషి’ ఆత్మకథ, నవలలు రాసిన ప్రముఖ మరాఠీ దళిత రచయిత షరణ్‌కుమార్ లింబాలే ఉన్నారు. ‘లిటానిష్ ఆఫ్ డచ్ బెటరి’ నవల వలన ప్రముఖంగా జాతీయస్థాయిలో పేరుగాంచిన కేరళ రచయిత యన్ యస్ మాధవన్ ఉన్నారు. ‘అరౌండ్ ది ఎర్త్, కాసీ లెజెండ్స్’ రచనల ద్వారా పేరొందిన, కాసీ, ఇంగ్లిష్ భాష ల్లో రాస్తున్న మేఘాలయ రచయిత యనపామ్ సింగ్ నాంగ్‌యనర్రి ఉన్నారు. ‘మిట్రో ’ ‘విననా లోకో’ ‘ప్రియ బయాని సాహెబ్’ ‘కౌన్ బహర్’ రచనల ద్వారా ప్రముఖంగా ముందుకొచ్చిన గుజరాతీ రచయిత ప్రబోద్ పరిక్ ఉన్నారు. 

‘ది వాల్స్ ఆఫ్ ఢిల్లీ’ ‘ది గర్ల్ విత్ ది ఎల్లో అంబ్రెల్లా’ రచనలతో ఎన్నో మన్ననలు పొందిన హిందీ రచయిత ఉదయ్ ప్రకాశ్ ఉన్నారు. పెంగ్విన్ పబ్లిషర్ నుంచి శివవూపియ ఉన్నారు. ఇంకా సిడ్నీలో కార్యక్షికమ నిర్వాహకులు ఉన్నారు.కల్మషంలేని మనస్తత్వాలతో ‘జై తెలంగాణ’ అనడంతో నా ఆలస్యం ద్వారా వారిని ఇబ్బందిపెట్టిన సంగతి కూడా నేను మర్చిపోయిన. ఇంక మా బస్సు సిడ్నీ ప్రధాన పట్టణం నుంచి వెస్టన్ సిడ్నీలోని మెల్‌బోర్న్ వైపువెళ్లింది. అట్ల పరమట్టా కేంపస్‌లోకి ప్రవేశించింది. కేంపస్ ఆవరణమంతా తేటగా తాజాగా కడిగేసినట్లున్నది.

పొద్దుపొడ్పు కిరణాలు పడి చెట్టు ఆకులపై నిలిచున్న నీటి బిందువులు తళుక్కున మెరుస్తున్నయి. అప్పటికే నిర్వాహకులు సుసాన, నికొలస్‌లు వేగంగా మీటింగ్ హాలులోకి వెళ్లుతుంటే మేము వారిని అనుసరించాం. మీటింగ్ హాలు కారిడార్‌లో అప్పటికే మా కోసం ఎదురు చూస్తు న్నారు. అందులో ముగ్గురు భారతీయ మహిళలు, మిగితా వారంతా ఆస్ట్రేలియన్ ఫాకల్టీస్ ఉన్నారు. అయితే నేను ఎప్పుడెప్పుడు మృదులను చూస్తానా అని ఎదురుచూస్తున్న. ఎంతో ఆశతో ఎదిరి చూస్తున్న మృదుల ఈ ముగ్గురిలో ఎవరై ఉంటారా’ అని? ఆతృతతో చూస్తున్న.

నలుపు రంగు చీరకు పసుపు పచ్చ అంచున్న పోచంపల్లి పట్టు చీర కట్టుకున్న ఆమెను చూస్తున్నా.. చీర చాలాబాగుంది. అందులో అది మా తెలంగాణలోని పోచంపల్లి పట్టు చీర. ఆమె చాలా చురుకుగా కనిపిస్తుంది. ఇతరులతో మాట్లాడుతూనే నన్ను గమనిస్తున్నట్లున్నది. నా దగ్గరకు వచ్చి హాయ్ గోగు ఐయామ్ మృదుల అన్నది. ఇంక నా సంతోషానికి అవదుల్లేవు. దానికి రెండు కారణాలున్నయి. ఒకటి నాకు సిడ్నీలో నిర్వహిస్తున్న సాహిత్యసభలో పాల్గొనే అవకాశం రావడానికి గల ప్రధాన కారకుల్లో ఈమె ఒకరు. నన్ను ఎప్పటికప్పుడు ఇంటర్‌నెట్ మెయిల్లో కలిసేది. రెండుసార్లు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి నాతో ప్రత్యక్షంగా మాట్లాడింది.విదేశీ ప్రయాణాలు అలవాటులేని నాకు ప్రతి అంశాన్ని ఎంతో ఓపికతో వివరించింది. 

రెండవ కారణం తాను తెలంగాణ పోచంపల్లి పట్టు చీర కట్టుకుంది. ఆమెనే ఈ మృదుల. మృదులానాథ్ చక్రబర్తి. ఇంక ప్రారంభ కార్యక్షికమంలో యూనివర్సిటీ ఆఫ్ వెస్టన్ సిడ్నీ వైస్‌చాన్స్‌లర్, వివిధ డిపార్టుమెంటులకు సంబంధించిన ప్రొఫెసర్లు వారి వారి సందేశాలను ఇచ్చారు. తరువాత అక్కడికి వచ్చిన రచయితలను, వారి నేపథ్యాలను మృదుల పవర్ పాయింట్ ప్రెజెం ద్వారా ఆమె ఇంగ్లిష్‌లో వివరించింది. అందులో నా గురించి సంక్షిప్తంగా ఇట్ల చెప్పింది. ఈమె గోగు శ్యామల. తెలుగులోనే రాస్తుం ది, కానీ తెలంగాణ తెలుగులో రాస్తుంది. 

నల్లపొద్దు (దళిత స్త్రీల సాహిత్య సంకలనం నల్లరేగటి సాళ్లు (మాదిగ, మాదిగ ఉపకులాల ఆడోళ్ళ కథలు) ఎల్లమ్మ (అనేక అస్తిత్వాల ఆడోళ్ళ కథలు), వాడపిల్లల కథలు, నేనే బలాన్ని(టి.యన్ సదాలక్ష్మి బతుకు కథ) సదాలక్ష్మి గూర్చి ఇంకొంత వివరంగా చెబుతూ ‘ఈమె దళిత రాజకీయ నాయకురాలు, మొదటి దేవాదాయ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేసింది. 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఈమె నాయకత్వం వహించింది. ఈ చరివూతను గోగు శ్యామల సదాలక్ష్మితో దఫ దఫాలుగా కూర్చొని రికార్డు చేసి రాసింది. ఇంగ్లిష్‌లో అనువాదంచేసే ప్రయత్నం జరుగుతున్నది.‘ఫాదర్ మే బి ఎ ఆన్ ఎలిఫెంట్ మదర్ మే బి ఎ స్మాల్ బాస్కెట్.....బట్.’ అనే కథా సంకలనం జైపూర్ లిట్రేచర్ ఫెస్టివల్లో రిలీజ్ అయింది.


అద్భుతమైన కథలు. కావాల్సిన వారికి రేపటి నుంచి స్టేట్ లైబ్రరీలో జరగబోయే సెషన్స్‌లో రచయితలందరి పుస్తకాలను అందుబాటులో పెడతామని ముగించింది. అందరొక్కసా రి నా వైపు అభిమానంతో చూసి చప్పట్లు కొట్టిర్రు. అట్ల అందరి గురిం చి నా గురించి అంత బాగా పరిచయం చేయడం, అందులో మొదటది ‘తెలంగాణ’, రెండవది ‘దళిత’ అని నాకు సంబంధించి ముఖ్యమైన అస్తిత్వంగా ప్రస్తావించడం, వారంతా హర్షం వ్యక్తం చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. కష్టమైనప్పుడే కండ్లు తడి అయితయి కదా. ఆకలి, అలసట సంబరం కలగల్సిన మిగతా రచయితలకు కావచ్చు, కాకపోవచ్చు నాది మాత్రం ఆ పరిస్థితి. 

ప్రారంభ సెషన్‌లో అలసటను, ఆకలిని మర్చిపోయిన నేను మృదుల ప్రత్యేక శ్రద్ధతో వండించి, వార్చి న భోజనాలు నన్ను మరో లోకంలోకి తీసుకెళ్ళింది. అబ్బో కలర్ ఫుల్ గా అలంకరించిన ఆ డైనింగ్ యాదికి తెచ్చుకోకుండా ఎట్ల ఉండగలం. వాటి మధ్యలో ఒక అందమైన కవర్‌తో ప్యాక్ చేసి ఉంది. ఎలియట్ వెయిన్‌బర్గర్ రాసిన ‘ వైల్డ్‌లైఫ్ ’ పుస్తకమున్నది. దాని పైనా పేరు రాసి ఉంది. నా ప్యాకు నేను తీసుకుని దాచుకున్నాను. అందరి మీద అట్లనే ఉన్నది. గిరీష్ కర్నాడ్ గారు నా దగ్గరకొచ్చి ‘తెలంగాణ ఎప్పుడు వస్తుంద’ని అడిగిండు. ప్రత్యేక రాష్ర్టం కోసం పోరాటం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నాము. పోయినసారి మిలియన్ మార్చ్ చేశాం. ఈసారి డిసెంబరు 30న హైద్రాబాదులో పెద్ద ‘మార్చ్’ జరగబోతున్నది. 

వెయ్యి మందిదాక విద్యార్థులు ప్రాణాలిచ్చిండ్రు. అన్ని వర్గాల ప్రజలు 40 దినాల దాక ‘సకల జనుల సమ్మె’ చేసిండ్రు. ఇప్పటి వరకు తెలంగాణ కోసం ప్రజలు చెయ్యాల్సిన పోరాటాలన్ని చేసిం డ్రు. చేస్తుండ్రు. ఇంక మిగిలింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రా న్ని ఏర్పాటు చేయడమే’ అన్నాను. ‘అవును తెలంగాణ ప్రజలు నిజం గా సీరియస్ పీపుల్. నేను చిన్ననాటి నుంచి వివిధ సందర్భాలలో తెలంగాణ గూర్చి వింటున్నాను. ఇప్పుడు చూస్తున్న. ఒకటి మాత్రం నిజం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తమ రాష్ట్రాన్ని తెచ్చుకుంటారు’ అన్నారు. మేం మాట్లాడుతుంటే మా చుట్టూ గుమిగూడి వింటున్న వారిలోఎపూక్స్ వ్రైట్స్, మృదుల, సి.యస్ లక్ష్మి, మమాంగ్‌దాయ్‌లున్నారు.

తెలంగాణ ప్రజలు రాష్ర్టం కోసం చేస్తున్న పోరాటం పట్ల తన నమ్మకాన్ని, అభిమానాన్ని గిరీష్ గారు అంత దృఢంగా చెప్పడం చూసి నేను అవాక్కయిన. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న రచయిత గిరీష్ కర్నాడ్ ద్వారా తెలంగాణ గురించి ఆస్ట్రేలియా రచయితలకు, మన ఇండియాలోని ఇతర రాష్ట్రాల రచయితలకు ఈ సందర్భంలో తెలియడం ఎంతో ముఖ్యమనిపించింది.

మర్నాడు సెప్టెంబరు నాలుగవ తేదీనాడు మొదటిరోజు మొదటి సెషన్‌లో ‘పాత సాంప్రదాయం కొత్త సంస్కృతి’ అనే శీర్షిక గల ప్యాన ల్లో నా పేపరును ప్రెజెంట్ చేసిన. అందులో దక్కన్‌లోని తెలంగాణ చరిత్ర, సంస్కృతిలలో మాతృస్వామిక వ్యవస్థ పునాదిగా ఉన్న కుటుం బ వ్యవస్థ కొనసాగుతున్నది, జీవావరణాన్ని, జీవవైవిధ్యాన్ని వనరులను ఆలంబన చేసుకుని, వాటిని పరిరక్షిస్తూ, వృద్ధి చేస్తూ, వినియోగించుకుంటూ, నాగరిక ఆధునిక సమాజాన్ని నిర్మించిన క్రమాన్ని నేను పాత సాంప్రదాయంగా వివరించిన. ఇందులో ప్రత్యేకంగా ఉత్పత్తి నైపుణ్యంలో అంతర్భాగంగా పని, పాట, ఆటల స్వభావాన్ని కలిగి ఉన్నది.

ఇందులో ప్రధానంగా ఉత్పత్తి యూనిట్‌గా కుటుంబ వ్యవస్థ పనిచేసిన సమాజంగా నిర్మితమైన క్రమంలో వీటన్నింటిలో స్త్రీ అనివార్యంగా కేంద్రబిందువైంది. ఈ క్రమంలోనే నాగరిక సమాజ నిర్మాణంలో అనేక అస్తిత్వాల సమాజాల భాగస్వామ్యాన్ని నా పేపరులో క్లుప్తంగా చెప్పాను. నాగరికతను, సంస్కృతిని, చరివూతను నిర్మించిన అస్తిత్వ సమాజాలే కొత్త సంస్కృతిలో అదృశ్యులుగా, అస్పృశ్యులుగా చేయబడిన తీరును చెప్పాను. ఆధునిక తెలంగాణ సమాజంలో వలస పీడనను, అణిచివేతను, పరాయికరణను, నియంతృత్వపు ఆధిపత్యాలను వ్యతిరేకించే పోరాటాలే నేడు కొనసాగుతున్నవి. జీవ వైవిధ్యం కుటుంబ వ్యవస్థను పునర్మించుకోవడంలో భాగంగా నేటి ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం కొనసాగుతున్నది. వీటినే ప్రతీకలుగా ఉద్యమంలో ఉపయోగించడం తొలిదశ పోరాటం నుంచి మలి దశ పోరాటం వరకు కొనసాగుతున్న విధానాన్ని చూస్తున్నాం. 

మాతృవవ్యస్థ, ఆత్మగౌరవ, స్వయంపాలన, సమానత్వపు ఆకాంక్షలు వెల్లువలై అలుగు దుంకిన చెరువు నీళ్లోలే వెల్లు ఈ ఉద్యమంలో తెలంగాణ తల్లిగా, బతుకమ్మగా, సమ్మక్క సారక్కలుగా, జాతర్లుగా, బోనాలుగా మాతృ వ్యవస్థ ప్రతీకలుగా, ఉద్యమ రూపాలుగా ముందుకు రావడం దక్కన్, తెలంగాణ ప్రత్యేకతనే చెప్పవచ్చు. వీటిలో వృత్తి కళాకారులు, కులాలుగా పేరుపడిన సమాజాలు డక్కలి, చిందు, బయిండ్ల, మాల దాసరి, బుడ గ జంగాలు, మాష్టీలున్నారు. వివిధ కళారూపాల ద్వారా మౌఖిక సాహిత్యాన్ని ఇప్పటికీ బతికిస్తున్నది ఈ కళాకులాల ఆస్తిత్వ సమాజా లే.

దీనినే తరతరాలుగా తమకు దక్కిన వారసత్వంగా నమ్మి, సాంప్రదాయంగా బతుకుతున్న తీరు కొత్త సంస్కృతిలో తెరమరుగైన ఆ కులాలు, కళారూపాలు అంతరించే, పరాయికరించబడే, క్షీణించబడే స్థితి దాపురించింది. అనే అంశాలను మౌఖిక సాహిత్యంలోని పాటల ను, సంగీత వాయిద్యాలను, సంభాషణలను ఉదాహరణలుగా పేర్కొంటూ వివరించాను. వీటితోపాటు ప్రధానంగా భాష గురించిన చారివూతక రాజకీయాలు, ‘అసలు తెలుగు’ అనే ప్రత్యేకాంశాలను వివరించాను. ఇందులో ప్రధానంగా ‘తెలంగాణ, దళిత ఇండిజీనస్’ రచయి త్రిగా నాకు వారిచ్చిన గుర్తింపునకు, గౌరవానికి అనుగుణంగా నా ప్రసంగం, ప్రశ్నలకు జవాబులు నడిచినాయని చెప్పాలి. 

కానీ నేను అంతదూరం వెళ్ళి తెలంగాణ, దళిత రచయిత ప్రాతినిధ్యానికి నేనెంత వరకు న్యాయం చేసిన్నో నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఈ రకమైన ప్రశ్నల పరంపరలో ఎదురు చూస్తున్న నాకు తోటి రచయితల స్పందన కొంతవరకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. తెల్లవారి నుంచి సి.యస్ లక్ష్మిని ఉదయం కల్సిన వెంటనే నేను ఆమెకు గుడ్‌మార్నింగ్ చెపుతుం ఆమె నాకు ‘జై తెలంగాణ’ అనడం మొదలుపెట్టింది. మూడో రోజు ఉదయం మా హోటల్‌కి ఒక కిలోమీటరు దూరం ఒపెరా హౌజ్ బీచ్ ఉంది. అక్కడికి ఉదయం నడ్చుకుంటూ వెళ్దామని ఆ ముందు రాత్రే అనుకున్న ప్రకారం బయలుదేరి నం. వెళ్తున్నదారి మధ్యలో ఉన్న హస్పిటల్ ముందు ఓ బలిష్టమైన అడవి పంది విగ్ర హం ప్రతిష్టించి ఉన్నది.

దాని పునాది గచ్చుపై ఈ విధంగా రాసిఉంది ‘నా మూతిని పట్టుకొని మీ మనసులో కోరికలు కోరుకున్నట్లయితే అవి నెరవేరుతాయి‘ అని రాసి ఉంది. ‘గోగు నీవు దాని మూతిని పట్టుకుని మీ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకో. నేను నా స్పారో సంస్థ బాగా నడవాలని కోరుకుంట’ అన్నది. ఆమె చెప్పినట్లే కోరుకున్న. 

మూడోరోజు ఉదయం సెషన్స్‌లో పాల్గొంటున్నప్పుడు ప్రారంభంలోనే మృదుల ఓ శుభవార్తను వెూసుకొచ్చింది. ఈరోజు సాయంత్రం మనం ఇండస్ (ఇండియన్ ఆస్ట్రేలియన్ అసోసియేషన్) వారు ఇచ్చే డిన్నరుకు వెళుతున్నం. అందరూ సిద్ధంగా ఉండండి అన్నది. ప్రత్యేకంగా నా వైపుకు తిరిగి గోగు శ్యామల మీ తెలంగాణ వారు కూడా వస్తున్నారు. నిజానికి నేను తెలంగాణ వారి కోసం, ఆంధ్రావారి కోసం రోజూ ఎదురుచూస్తున్నా ఎవరైనా తెలుగువారు వస్తారే చూసుడేకాదు, రోజూ సభలో పాల్గొనడానికి వస్తున్న కర్ణాటకకు చెందిన శ్రీనివాస్‌ను అడుగుతున్న, ఈయన సిడ్నీ శ్రీనివాస్ పేరుతో మంచి పుస్తకాలను రాసిండు. ఎదురు చూసినా కానీ ఒక్క గోల్డి ఒసీరి తప్ప ఎవ రూ రాలేదు. ఈరోజు తెలంగాణ వారిని కలవబోతున్నాం అంటే చాలా సంతోషమయింది.

అనుకున్నట్లే సిడ్నీ నగరంలో స్టేట్ లైబ్రరీకి దాదా పు 30 కిలోమీటర్ల దూరంలోఉన్న ఇండియన్ హోటల్‌కు చేరుకున్నం. ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఇక్కడ గుమిగూడి ఉన్నారు. గుంటూరుకు చెందిన భాస్కర్ ఉన్నారు. మమ్ములను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానింంచారు. ఇండస్ అధ్యక్షుడు డాక్టర్ యాదుసింగ్ అందరు తమ పరిచయాలను చేసుకోవాలని ప్రకటించడంతో తమ తమ పరిచయాలను చేసుకుంటున్నారు. అధ్యక్షుడు ఇండస్‌ను గురించి క్లుప్తంగా పరిచయం చేశాడు. వేదికపై మధ్యమధ్యలో ఓ వ్యక్తి హిందీ పాటలు పాడుతున్నాడు. 

అతన్ని మధ్యలో కాస్త ఆపిం చి ఇప్పుడు తెలంగాణ వారు వచ్చారు మనతో జాయిన్ అవుతారు. ‘మనందరికి తెలుసు తెలంగాణలో ప్రత్యేక రాష్ర్టం కోసం ఉద్యమం నడుస్తున్నద’ని అధ్యక్షుడు అనే వరకు నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారు రావడం వారిని చూసిన వెంటనే మా సొంత మనుషులు వచ్చిన భావం కలిగింది. ఉపేందర్, సోమేశ్వర్, స్వర్ణ, ప్రసాద్ రావడం వస్తూ వస్తూనే జై తెలంగాణ అని పలకరించారు. మమ్ముల చూస్తున్న నాతోటి ఇతర భాషా రచయితలు ‘మీ తెలంగాణ వారొచ్చిరి. నీవింక తెలంగాణ తెలుగు మాట్లాడొచ్చు’ అన్నరు. 

ఈ రచయితలు ఎంత మనసెరిగిన వారో కదా అని వారిని అభినందించిన. నిజ మే ఆ వారం రోజులుగా మాట్లాడితే ఇంగ్లిష్ లేకుంటే హిందీ బిగవట్టుకొని మాట్లాటం వల్ల నాకు నేను నా నోటిని పరిమితం చేసుకున్నట్లయింది. వారితో మాట్లాడడం మొదలు తరువాత నేను మాత్రం స్వేచ్ఛగా మాట్లాడాను. తెలంగాణలో ఎవరు ఏ జిల్లా అంటే ఒకరు ఖమ్మం, నల్గొండ, పాలమూరు, హైద్రాబాదు. తూప్రాన్. ఓల్డ్ సిటీ ఇట్ల ప్రతి ప్రాంతం నుంచి ఏరి, కూర్చినట్టు మనవారు సిడ్నీలో ఉన్నారనిపించింది. అధ్యక్షుడు ఇండస్‌ను క్లుప్తంగా పరిచయం చేయడం. తెలంగాణ గూర్చి ఈయనకు బాగానే తెలిసినట్టున్నది, చెబుతూనే ఉన్నడు ‘సౌత్ ఇండియాలో ప్రతేక రాష్ర్టం కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తున్నారు.

నేను ఉత్తరవూపదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన వాణ్ని, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అనేది మనం నమ్ముతున్నాం, చూస్తున్నాం, కనుక తెలంగాణ వారికి తెలంగాణ రాష్ర్టం కావాలి, మాకు బుందేల్‌ఖండ్ రాష్ర్టం కావాలి.’ అని ముగించాడు. మన పోరాటాలను ఆయన కనులారా చూడని వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు, మన రాజ్యాంగంలోని చిన్నరావూష్టాల నియమాన్ని గౌరవించి తన విశాల దృక్పథంతో ప్రకటించిండు. అక్క డ ఉన్న భారత ప్రజలందరి ముఖాలలో అంగీకారం ఉన్నది. గుంటూ రు భాస్కర్‌కు కూడా అంగీకారమున్నది. 

ఎఎల్‌ఎఫ్ ఉత్సవంలో పాల్గొన్న బహుభాషా, సంస్కృతి రచయితలకు, సన్మా నం చేయడం, ఎవరి రాష్ర్ట రచయితకు ఆ రాష్ర్ట వారితో ఇండస్ జ్ఞాపికను బహూకరించారు. నాకైతే సహజంగా తెలంగాణ ఫోరం వారితో జ్ఞాపికను అందచేయించారు. అపుడు కొన్ని ముచ్చట్లు ఉపేందర్, ప్రసాద్ తెలుగులో మాట్లాడిండ్రు, నేను తెలుగులో మాట్లాడిన. ఆ వాతావరణం చూసిన తరువాత ఆంధ్రవూపదేశ్‌లో కొంతమంది మేధావులుగా, రాజకీయనాయకులుగా, ప్రధానక్షిసవంతి తెలుగురచయితలు, సినీ రంగం లో ప్రధానంగా ఉన్నవారు, రాజకీయ నాయకులు. వీరందరికన్నా ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రజలు ఎంతో గొప్పవారనిపించింది. తెలంగాణలో జరిగేవన్నీ కనులార చూసుకుంటూ కూడా తెలంగాణకు మద్దతుగా నోరు విప్పరు.

వారికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష వారికి అర్థం కావడంలేదా? వారు అర్థం చేసుకోదలుచుకోలేదనిపించింది. ఆస్ట్రేలియాలో ముఖ్యంగా సిడ్నీలో తెలంగాణ రాష్ట్ర పోరాటానికి సంఘీభా వం, ఆదరణ రావడానికి కారణం అక్కడి తెలంగాణ బిడ్డలు తమ కుటుంబాల సమేతంగా ఇట్ల రాత్రింబగళ్ళు తపించి, కష్టించి తెలంగాణ పోరాటాన్ని ‘ప్రపంచ ప్రఖ్యాత’ స్థాయిలోకి తీసుకొచ్చారు. సుదీ ర్ఘ కాలం నుంచి ‘ఆవూస్టేలియా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం’, ‘ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరమ్’ పేరుతో చేస్తున్న ఉద్యమ కార్యాచరణ ఫలితమే నేడు నాకు కనిపించిన సంఘీభావం, ఆదరణ అనిపించింది. 

సిడ్నీలో తెలంగాణలోని పది జిల్లాల వారున్నారు. కానీ ఇండస్ నిర్వహించిన కార్యక్షికమానికి కొద్ది మంది మాత్రమే వచ్చారు. తెలంగాణ రాష్ర్టం కోసం వారు పడుతున్న తపన, సంఘీభావాన్ని కూడగట్టాలనే నిరంతర ఆరాటాన్ని ప్రత్యక్షంగా చూసింది నేనేనని గర్వపడుతున్న. అంతేకాదు వారి ఆవేదనను, ఆగ్రహాన్ని కూడా చూసిన. ‘ఆ ఎమ్యెల్యేలు అట్లెందుకు మాట్లాడుతున్నడు? పర్కాల నియోజక వర్గంలో ఆమెకన్ని ఓట్లు ఎట్ల పడినయి? తెలంగాణ కోసం పని చేయకుండా ఇంత మంది మీరేం చేస్తున్నారు? అని నావైపు మళ్లింది వారి ప్రశ్న. వారి ప్రశ్న న్యాయమయింది. 

కానీ కడ్పు చించుకుంటే కాళ్లమీద వడ్డట్లున్నది. అధికార రాజకీయ పార్టీల నాయకులు ప్రజలతో ఆడుతున్న నాటకాలు, సీమాంధ్ర నాయకులతో లాలూచీలు, వారికి తొత్తులుగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమానికి అడ్డంకిగా తయారైన తీరు. ఇంటి దొంగలు, బయటి దొంగలను గురించి చాలాసేపు చర్చ జరిగిం ది. కొంత దూరంలో ఉన్న ఇండియాలోని ఇతర భాషా రచయితలు మమాంగ్‌దాయ్, మాధవన్, శరణ్‌కుమార్ లింబాలె, ప్రకాశ్, శివవూపియలు నా దగ్గరకొచ్చి ‘శ్యామల ఫేస్ ఈజ్ డిలైటింగ్ నవ్’ అన్నరు. శ్యామలా నీవు వారితో మాట్లాడుతున్నావా? కొట్లాడుతున్నావా? అరే మీరు చాలా సీరియస్‌గా చర్చిస్తున్నరు వారు దళితులా అని అడిగిం డు. లేదు వారంత ఆధిపత్య కులాల రెడ్డీలు, వెలమలు, బ్రాహ్మణులు కావచ్చని సమాధానం చెప్పిన. ఆధిపత్య కులాలు, దళితులు కలిసి తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నరా? అడిగిండు.

ఔను.. అది తెలంగాణ గొప్పతనం. రాష్ట్రాన్ని బుడగ జంగాల నుంచి బ్రాహ్మణుల దాక అన్నికులాలు, తెగలు, అన్ని వర్గాలు, అన్ని రంగాలు ప్రజలు ఉద్యమిస్తున్నారని చెప్పిన. ఎందుకు ఆధిపత్య కులాలవారు తెలంగాణను అడుగుతున్నారు? నన్ను ఎదురు ప్రశ్న అడిగిండు? తెలంగాణలో కులాల మధ్య అంతరాలు, వ్యత్యాసాలున్నప్పటికీ తెలంగాణ ఆధిపత్య కులాల వారు ఆంధ్రా పాలకుల దృష్టిలో బానిసలే, లేదా అంటరానివారే. ఈ ధోరణి పాలన విధాన నిర్ణయాల్లో , ఉద్యోగ పంపకాల్లో, నీటి, చదువు, ఆరోగ్యపు, నీటిపారుదల పంపకాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ‘తెలంగాణ ప్రాంతాన్ని అసాంతం మేం ఆక్రమించుకు న్నం’ అనే భావనలో సీమాంధ్ర ఆధిపత్య కులాల పాలకులు వ్యాపారులు బతుకుతున్నారు.

తెలంగాణ ఆధిపత్య కులాలు మాత్రం వారిని మా కులం వారని చూస్తారు. ఆ కులాల్లో వియ్యమందుకున్నా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులను కూడా సాధికారతతో నిర్వహించలేని పరాధీనతలో కొనసాగుతున్నారు. అందుకే ప్రస్తుతం తెలంగాణను మొత్తం నీరులేని, చదువులేని, పంటలేని, కరెంటు లేని చీకటి వాడ వెలివాడను చేసిండ్రు ఆంధ్ర పాలకులని.. తెలంగాణ ప్రజలకం తా అర్థమయింది. కనుకనే అన్ని కులాలు, తెగలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రజలు వారివారి ప్రత్యేక అస్తిత్వాలతో ఉద్యమిస్తున్నారు. 

అధికార, ప్రతిపక్ష, కమ్యూనిస్టు, మత పార్టీలే డైలమాలోనో, వ్యతిరేకంగానో, తొత్తులుగానో ఊగిసలాడుతూనో, అవకాశవాదంగానో కొనసాగుతున్నారని వివరించిన. శరణ్ కుమార్ లింబాలే ఇంతింత పెద్ద కండ్లు చేసి ‘అరే తెలంగాణలో ఈ రకమైన ఉద్యమాలు, రాజకీయాలున్నాయా? మహారాష్ర్టలో ఈ రకమైన పరిస్థితి కనడబడదు. మాకైతే నిజంగా తెలంగాణ కొత్త సమాచారాన్ని విజ్ఞానాన్ని ఇచ్చింది.’ అన్నడు. ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం సూత్రధారుల్లో ఒకరైన వినోద్‌డ్డి ఎలిటె ద్వారా ఎక్కువ వివరాలను తీసున్నంక తెలంగాణ ఉద్యమ నేపథ్యం, మలుపులు వివరంగా అర్థమయింది.

సిడ్నీలో తెలంగాణ వారు ఒక రాజకీయ అస్తిత్వంతో తమ పోరాటానికి ఇతరుల మద్దతును కూడగట్టడంలో విజయవంతమయ్యారనే చెప్పాలి. 
ఈ నేపథ్యంలోనే.. వీరు తెలంగాణ ఏమి కోరుకుంటున్నదనే వివరాలను స్పష్టంగా పిటిషన్‌లో రాసి ఆస్ట్రేలియాలోని తెలంగాణ ప్రజలంతా సంతకాలు పెట్టి భారత ప్రధానికి అందజేశారు. ఆనాటి నుంచి తెలంగాణ అస్తిత్వ సమాజం ‘బతుకమ్మ’ పండుగ ఉత్సవాలను జరుపుకుంటున్నది. అదేవిధంగా ‘ఆపరేషన్ పోలో’ అమరవీరులను స్మరించుకుంటుంది. అలాగే చారివూతక ఘట్టాలతో ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం తన కోసం ప్రణాళికా సూత్రాలను తయారు చేసుకున్నది. ఇందులో తెలంగాణ చరిత్ర, వర్తమాన, భవిషత్తు రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికాంశాలు మిళితమయ్యే విధంగా రూపొందించుకున్నారు. అందులో తెలంగాణ ప్రజలు రజాకారుల నుంచి విముక్తి కోసం ఆనా డు పోరాడినారు. ఈ రోజు సీమాంధ్ర పాలకుల పీడన నుంచి విముక్తి కోసం పోరాడుతున్నారు.

ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతిని కొనసాగించడం దానిని భవిషత్తు తరాల కోసం కాపాడుకోవడం ముఖ్యమైన ఆచరణగా పెట్టుకున్నారు. అవి బతుకమ్మ, బోనాలను జరుపుకోవడం అనే ఆచరణగా పెట్టుకోవడం. ఈ ఒరవడితోనే మొదట టిడియఫ్, తర్వాత ఏ దేశానికాదేశం తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాపితంగా తెలంగాణ రాష్ర్ట ఉద్యమాన్ని విస్తరింప జేశారు. ఆ విధం గా ఖండాంతరాలు దాటినా తెలంగాణ ప్రజలు విముక్తి కోసం పోరాడి పేగుబంధపు రుణం తీర్చుకుంటున్నారు. అపుడర్థమయింది నాకు ఎంతో కాలం నుంచి పోరాడుతున్నారు కాబట్టే ‘ఆవూస్టేలియా ఇండియా లిటరేచర్ ఫోరమ్’లో తెలంగాణ దళిత రచయివూతిగా నేను మాట్లాడిన ప్రతి మాట ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. 


-గోగు శ్యామ
Namasete Telangana News Paper Dated : 24/10/2012 

No comments:

Post a Comment