Saturday, December 8, 2012

వైకల్యం వైఫల్యం కాదు



ప్రపంచంలో పనికి రాని వాడంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైన వాళ్లే ఉండరు. తెలివికి, తెలివి తక్కువ తనానికి మధ్యనే జీవితం. చేయడానికి, చేయలేకపోవడానికి మధ్యలోనే మనం. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేకపొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వ సాధారణమైపోయింది. అయితే వికలాంగులను అర్థం చేసుకోడానికి ఐరిస్‌ అనే ఆవిడ ఏమంటారంటే ‘‘కూర్చున్న చోటి నుండి లేవలేకపోవడం శారీరక సమస్య ఐతే, అలా లేవలేక పోవడానికి సరైన సహకారాన్ని అందించకపోవడమే అసలైన వైకల్యం’’ అంటారు. అందుకే సమాజంలో ఎవరు ఏ పని చేసినా, చేయలేకపోయినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది. ఈ వికలాంగుల దినోత్సవం (డిసెంబర్‌ 3) సందర్భంగా మనం వారికి ఎంతవరకు సహాయపడుతున్నాం. ప్రభుత్వాలు వారి ఏ విధమైన న్యాయం చేకూర్చుతున్నాయి వంటి పలు అంశాలను తెలుసుకుందాం...

goyal-3
సాధ్యమైనంత వరకు మనం వికలాంగు లు అనే పదం మన వాడుక భాషలో వాడడం లేదు. ఇంగ్లీషులో మాత్రం హేన్డీ క్యాప్డ్‌, డిజేబుల్డ్‌, ఫిజికల్లీ చాలెన్జ్‌డ్‌ అని రకర కాల పదాలలో వాడుతూ ఉంటాం. కాని చాలామందికి ఎందుకు ఏ పదాన్ని వాడుతు న్నామో తెలియదు. అలాంటి సమయాల్లో ఒక్కోసారి మంచి ఉద్దేశ్యాన్ని చెడుగాను, చెడు ఉద్దేశ్యం మంచిగాను చెప్పే ప్రమాదం వుంది. కాబట్టి ఈ పరిస్థితి నుండి బయటపడే ప్రయ త్నానికి ఈరోజే నాంది పలుకుదాం.

వికలాంగులకు సహకారం, ప్రోత్సాహం అం దిస్తే... ఎవరైనా ఎంత ముందుకైనా వెళ్ళగల రు అనే సత్యాన్ని మనమంతా తెలుసుకోవాలి.

నిజమైన సామర్థ్యం గురించి చర్చించుకుంటే ఎవరు ఎవరినీ తక్కువగా చూడలేం. అలా అర్ధం చేసుకోలేక కొన్ని తరాలుగా కొంత మంది పై నిర్లక్ష్యంగా సామర్థ్యం అని చెప్పి, చేయగలిగిన వాళ్ళను కూడా అసమర్థులుగా మార్చిన సమాజం నుండి బయటికి వచ్చి అందరినీ అర్థం చేసుకొనే సమాజం వైపు మన పెద్ద వాళ్లు ప్రారభించిన అడుగులు ముందుకు తీసుకు వెల్లడానికి ఈరోజే నిర్ణయం తీసుకుందాం.

1992 లో యునైటెడ్‌ నేషన్స్‌ వికలాంగుల సహాయార్థం వికలాంగుల దినోత్సవాన్ని ప్రా రంభించింది. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తం గా జరుపుకుంటున్నాం. వికలాంగులు మాన సికంగా ఆధైర్యపడకుండా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలి. వికలాం గులకు ఈ రోజు క్రీడలను నిర్విహస్తున్నారు. వికలాంగ క్రీడాకారులు సాధారణ క్రీడాకా రులకు ఏమాత్రం తీసిపోకుండా ఆత్మస్థైర్యం తో క్రీడలలో పాల్గొనాలి.

వికలాంగుల పట్ల మన బాధ్యత!
పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాం. మరి ఈరోజు (డిసెంబరు) వికలాంగుల గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాం.

blog480
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశం లోని వికలాంగుల సంఖ్య 2 కోట్ల 19 లక్షలు. మొత్తం జనాభాలో 2.1 శాతం వికలాంగులు న్నారు. వికలాంగులు తమ దైనందిన కార్య క్రమాలు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదు ర్కొనువారు, వికలాంగులను ప్రస్తుతం 11 రకాలుగా వర్గీకరించవచ్చు. పూర్తి అంధత్వం, పాక్షిక అంధత్వం, చెవిటి మూగ, భాషణలో పం, శారీరక వికలాంగులు, బుద్ధిమాద్యం, కండరాల క్షీణత, బహుళ వైకల్యం, అభ్యసన లోపం, ఆటోస్టిక్‌ స్పెక్ట్రం డిజార్డర్‌. 1981 ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది. 


వికలాంగుల కోసం పార్లమెంట్‌లో వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 1995 చేయబడింది. ఇది 1996 ఫిబ్రవరి 7 నుండి అమల్లోకి వచ్చింది. వికలాంగులు జిల్లా మెడికల్‌ బోర్డు వారిచే జా రి చేయబడిన వికలాంగ ధ్రువపత్రం తీసుకో వాలి. ప్రభుత్వం విద్యాపరంగా అందిస్తున్న సేవలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ర్యాంపు సౌకర్యం, వికలాంగులందరికి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, వికలాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఇతరుల సహాయంతో పాఠ శాలకు వచ్చే వారికి ఎస్కార్‌ అలవెన్సు, తీవ్ర వికలాంగత్వంతో ఉన్న వికలాంగులకు ఇంటి వద్ద విద్య బోధన, వికలాంగులకు అవసరమై న పరికారాలు. ఉదాహరణకు వీల్‌ చైర్స్‌, ట్రైసైకిల్స్‌, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ పలకలు ఉచితంగా పంపిణీ. 

వికలాంగులకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్ష ఫీజులు చెల్లింపులో మినహాయింపు, బధిరులు, అంధులకు పాస్‌ మార్కులు 20 మాత్రమే. ఇతర సదుపాయా లు ఇంటి నిర్మాణం కోసం రుణం, ఇంటి నిర్మాణం కోసం ఖాళీ స్థలం పంపిణీ, 50 శాతం రాయితీతో బస్‌పాస్‌ సౌకర్యం, 75 శాతం రాయితీతో రైల్‌ పాస్‌ సౌకర్యం, ఉద్యో గాలలో 3 శాతం రిజర్వేషన్‌, వివాహ ప్రోత్సా హక బహుమతులు. వికలాంగుల కోసం ప్రభుత్వ ఉత్తర్వులు జిఓ ఎంఎస్‌ నెంబర్‌ 198 ఎడ్యూకేషన్‌, బధిరులకు ఒకే భాషను అభ్యసించును, జిఓ ఎంఎస్‌ నంబర్‌ 33 ఎడ్యుకేషన్‌ 19-3-2001 పరీక్ష ఫీజు నుండి మినహాయింపు, జిఓ ఎం.ఎస్‌. నంబర్‌ 42 - 19-10-2011 ఉద్యోగాలలో ప్రమోషన్లకు రిజర్వేషన్లు. 

640x480
వికలాంగులకు తక్షణమే అవసరమైనవి బధిరులకు ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌ కళాశాల, అన్ని ప్రభుత్వ కా ర్యాలయాలకు, ప్రముఖ హాస్టళ్ళకు, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు ర్యాంపు సౌక ర్యం, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా అన్ని పోలీస్‌ స్టేషన్‌, కోర్టులలో సంజ్ఞల భాష, ట్రాన్స్‌లేటర్‌ల నియామకం, నిరుపేద వికలాంగులకు ఎటువంటి నిబంధన లు లేంకుడా పావలా వడ్డీ రుణాలు మంజూ రు, ప్రతి టీవీ ఛానల్‌లో బధిరులకు సైగల భాషలో వార్తలను ప్రసారం చేయాలి.


వికలాంగులు - ప్రభుత్వ సంక్షేమ పథకాలు...
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికలాంగుల పునరా వసం, వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాల ను అమలు చేస్తోంది. 1995వ సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేయబడి 7-2-96వ తేదీన అమలులోకి తేబడిన విక లాంగుల సమాన అవకాశాలు, హక్కుల పరి రక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం చట్టం, 1995 ఒకటవ చాప్టర్‌లో వికలాంగుల నిర్వచనం ఈ విధంగా ఇవ్వబడి అమలులో ఉంది. 

ఎ) అంధత్వం, తక్కువ కంటిచూపు: ఈ క్రింద తెలిపిన పరిస్థితులకు లోనైన ఏ వ్యక్తి అయిన ఈ పరిధిలోకి వస్తాడు.
1) పూర్తిగా చూపు కనిపించకపోవడం లేదా
2) కళ్ళద్దాలు ధరించినప్పటికీ కొంచెం మెరు గ్గా ఉండే కంటిచూపు 6/60 లేదా 20/200 (స్నెలెన్‌) మించినట్టయితే లేదా,
3) కంటిచూపు పరిధి 20 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే, తక్కువ కంటిచూపు కలిగిన వ్యక్తి అంటే దృష్టిదోషాన్ని చికిత్సతో సరిచేసిన అనంతరం కూడా ఆ వ్య క్తి దృష్టిలోపం కలిగి ఉండటం, అయితే తగిన సహకార సాధనంతో ఒక లక్ష్యాన్ని నెరవేర్చ డానికి లేదా ప్రణాళిక రూపందించడానికి అవసరమైన దృష్టి, శక్తి కలిగి వున్నప్పటికి తక్కువ కంటిచూపు కలిగి వ్యక్తిగానే పరిగణించబడుతుంది.

blind
బి) కుష్ఠు వ్యాధిగ్రస్తులు - వ్యాధి నయమయినవారు: కుష్ఠువ్యాధి నయమయిన వ్యక్తి అంటే కుష్ఠు వ్యాధి నయమైన తర్వాత ఈ క్రింది కారణాలతో బాధపడే వ్యక్తి.

1) అరికాళ్ళు, అరిచేతులు, కంటిలో పూర్తిగా గాని పాక్షికంగా కాని స్పర్శ లేకుండుట, కంటిలో పాక్షికంగా కాని, పూర్తిగా కాని చచ్చుబడినట్లుగా బయటకు తెలియని వైకల్యం లేకపోవుట.
2) అంగవైకల్యముతో చచ్చుబడిన చేతులు, కాళ్ళు కదిలిక కలిగి, దైనందిత కార్యకలా పాలు నిర్వహించగలగడం.
3) పూర్తి అంగవైకల్యం, వయస్సు పై బడిన కొద్దీ, దైనందిన కార్యక్రమాల్లో మార్పు కాని, వృత్తిలో ప్రావీణ్యతతో పాల్గొన లేకపోవుట.
సి) వినికిడి లోపం: వినికిడి లోపం అంటే సంభాషణల తరంగాల పరిధిలో చెవికి సంబంధించి 60 డిసిబుల్స్‌ లేదా అంతకంటే ఎక్కువ వినికిడిని కోల్పోవడం.

డి) కదలిక లేకపోవడం లేదా చలనశక్తికి సంబంధించిన వికలాంగత: చలనశక్తి వైక ల్యం అంటే ఎముకలు, కీళ్ళు, కండరాలు వైక ల్యం వల్ల చలనాంగముల కదలిక తగినంతగా లేకపోవడం లేదా ఏ రకమైన సెరిబ్రల్‌ పాల్సీ (మెదడుకు పక్షవాతం) అయినా.
ఇ) బుద్ధి మాంద్యం: మానసిక వికలంగత అంటే బుద్ధి మాంద్యతే కాకుండా మానసిక ఇతర మానసిక అస్వస్తత, బుద్ధిమాంద్యం అంటే ఒక వ్యక్తి మానసికంగా అసంపూర్తిగా ఎదగడం లేదా ఎదుగుదల ఆగిపోవడంతో ప్రత్యేకంగా అతి తక్కువ తెలివితేటలు కలిగి ఉండటం.
వికలాంగత గల వ్యక్తి అంటే ఒక వ్యక్తి 40 శాతానికి తక్కువ లేకుండా వైకల్యం కలిగి ఉన్నట్లుగా మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడం. అయితే మెడికల్‌ బోర్డు ప్రతినెల నిర్ణీత సమ యాల్లో జిల్లా వైద్యశాలలో సమావేశమై సర్టిఫి కెట్లు ఉచితంగా అందజేస్తుంది.

peds-
వికలాంగుల పునరావాసం నిమిత్తంఆంధ్రప్రదే శ్‌ ప్రభుత్వంచే 1981 సం ఆంధ్రప్రదేశ్‌ విక లాంగుల సహకార సంస్థ. 1983 సంవత్సరం వికలాంగుల సంక్షేమ శాఖ స్థాపించడం జరి గింది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ పథకాలు అమ లు పరిచే నిమిత్తం సహాయ సంచాలకుల కా ర్యాలయాలు పనిచేస్తున్నవి. వికలాంగుల సహకార సంస్థ కార్యకలాపాలు పదవిరీత్యా జాయింటు కలెక్టరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా, సహాయ సంచాలకులు పదవిరీత్యా విక లాంగుల సహకార సంస్థ జిల్లా మేనేజరుగా వ్యవహరిస్తారు. మొత్తం మీద జిల్లా కలెక్టరు అధికార పర్యవేక్షణలో వికలాంగు సంక్షే మం కొరకు నిర్దేశించబడిన పునరావాస కార్యక్రమాలు అమలుపరచబడు తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు పునరావాసం, అభివృద్ధి కోసం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా విభజించబడినవి.


విద్య...
అంధ, బధిర, మూగ బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలకు నడుపబడుచున్నవి. వికలాంగ లు సంక్షేమ శాఖ, ప్రాథమిక విద్యాశాఖ ఆధ్వ ర్యంలో ఈ పాఠశాలలు నడుపబడుచున్నవి. భారత ప్రభుత్వం ద్వారా సహాయం పొంది, పొందుండా కూడా ఉన్న ప్రభుత్వేతర సంస్థలు విద్యారంగంలో తమ వంతు సహాయం అంది స్తున్నవి. ప్రత్యేక పాఠశాలల్లో ప్రవేశ నిమిత్తం ఆయా పాఠశాల ప్రిన్సిపాల్స్‌ / హెడ్‌ మాస్టర్ల ను సంప్రదించాలి. ప్రతి సంవత్సరం మే నెల నుంచే తమ, తమ పిల్లలను చేర్పించడానికి చ ర్యలు తీసుకోవాలి. అంగవైకల్య శా తం, తల్లి దండ్రుల ఆదాయ పరిమితికి లోబడి పాఠశా ల స్క్రీనింగ్‌ కమిటీ విద్యార్థులను ఎంపిక చే స్తుంది. 

ఇది గాక విద్యాశాఖ ద్వారా సమీకృత విద్యా విధానం కూడ ప్రవేశపెట్టబడినది. ప్రతి జిల్లాలో బధిరులకు, అంధులైన విద్యార్థుల కోసం ఒక్కొక్క తరగతి గుర్తించిన పాఠశాలలో ప్రారం భించబడినది. అందరి కీ విద్య లక్ష్యంతో అవ సరమైన ప్రతి చోట ఇటు వంటి విద్యా విధా నం అమలుకు విద్యా శాఖ దశల వారీగా చర్యలు తీసుకుంటున్నది.

విద్యాపరంగా ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు...
3261379
ఎ) అన్ని రకాల విద్యా సంస్థలలో ప్రవేశానికి వికలాంగులయిన విద్యార్థులకు రిజర్వేషన్‌ కల్పించబడినది. విశ్వవిద్యాలయాలు, సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు వగైరాలతో సహా ప్రతి యొక్క వికలాంగుడు తమకు అన్ని టా సమాన అవకాశాలు, సంఘంలో ప్రత్యే కించి ప్రభుత్వ యాజమాన్య సంస్థలో కల్పిం చబడాలి అనే ప్రాతపదిక గుర్తుంచుకొని జీవి తంలో వారి హక్కుల సాధనకు ముందుకు పోవాలి. డాక్టరు కోర్సులలో 0.25% ఇంజనీ రింగు కోర్సులలో 0.50% ప్రవేశంలో రిజర్వేషను కలదు.


బి) వికలాంగుల ఆశ్రమ పాఠశాలలే కాకుం డా, వసతి గృహాలలో కూడా ఉండి చదువుకొ నేందుకు వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా 3 అవకాశాలు కల్పించబడినవి. వికలాంగులైన బాలబాలికలు తమ దగ్గరలో గల రాష్ట్ర సంక్షే మ శాఖ ఏ వసతి గృహంలోనయినా వారి నిబంధనలకు లోబడి ప్రవేశం పొందవచ్చు.
సి) ప్రభుత్వ గుర్తింపు, సహాయం పొందిన విద్యాసంస్థలో చదివే వికలాంగ విద్యార్థులకు వారి విద్యా స్థాయిననుసరించి ఉపకార వేతనం మంజూరు చేయబడుతుంది. చలన సంబంధమైన వైకల్యం కల వారికి ప్రయాణపు అలవెన్స్‌, చలన పరికరాలను నిరంతరం ఉపయోగంలో ఉంచేందుకు (మెయింటెనెన్స్‌ అలవెన్సు), అంధులకు రీడర్స్‌ అలవెన్స్‌ మంజూరు చేయబడతాయి.
డి) ప్రిమెట్రిక్‌ (1 నుంచి 8 తరగతి వరకు) పోస్టు మెట్రిక్‌ (9వ తరగతి నుంచి ఆపైన) చదువులకు చెల్లించే ట్యూషన్‌ ఫీజులు వసతి గృహంలోని విద్యార్థులకు కొన్ని పరిమితుల కు లోబడి చెల్లించబడతాయి.

ఇ) మానిసిక వికలాంగులకు ఉపకార వేతనాలు చెల్లించబడతాయి.
Nagar
ఎఫ్‌) మెట్రిక్‌ పూర్వపు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచిత సరఫరా (1 నుంచి 10వ తరగతి వరకు) (ప్రస్తుతం విద్యాశాఖ ద్వారా సరఫరా చేయబడుతున్నవి) అంధ విద్యార్థుల కు రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా బ్రెయిలీలో పాఠ్యపుస్తకాలు ముద్రించి సరఫరా చేయబడుచున్నవి.

జి) రీసెర్చి స్కాలర్లుకు ఉపకారవేతనాలు చెల్లించబడతాయి.
హెచ్‌) ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకారం సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు టేప్‌ రికార్డులు, క్యాసెట్‌లు చదువుకొనే నిమిత్తం ఉచిత సరఫరా.

ఐ) అంధులు, చలన సంబంధమైన వైకల్యం కలవారికి పబ్లిక్‌ పరీక్షల సమయంలో 30 ని అదనంగా అనుమతిస్తారు.
జె) బధిర విద్యార్థులకు పబ్లిక్‌ 10వ తరగతిలో రెండు లాంగ్వేజెస్‌ వ్రాయకుండా ఇంటర్‌లో ఇంగ్లీషు లాంగ్వేజి వ్రాయకుండా మినహాయింపు.
కె) వికలాంగులైన 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు రాయితీ.
ఎల్‌) అంధ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షల సమయంలో స్కైబ్‌ని ఇస్తారు.

శిక్షణ...
capped
వికలాంగుల కోసం వికలాంగుల సహకార సంస్థ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిం చబడుచుండేవి. ప్రస్తుత తరుణంలో పారిశ్రా మిక శిక్షణ సంస్థలు, బీఈడీ, టి.టి.సి, కో ర్సులలో వికలాంగులకు ప్రవేశానికి రిజర్వేష న్లు ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులలో ట్యూష న్‌ ఫీజు తిరిగి ఇచ్చే పథకం ఉన్నది. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ సంస్థలు 1995 విక లాంగులకు సమాన అవకాశాలు. సంపూర్ణ భాగస్వామ్యం చట్టం అనుసరించి ఎంపిక చేసిన ఐ.టి.ఐలలో ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పిం చింది. అయితే ప్రభుత్వం, మారుతున్న పరిస్థి తులలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌లో శిక్షణలాంటి క్రొత్త కోర్సులలో ప్రవేశానికి చర్యలు తీసుకొంటుంది. ఐ.టి.ఐ సీట్లలో 2 శాతం, టి.టి.సి.లో 3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అన్ని కోర్సులలో రిజర్వేషన్లు వికలాం గులకు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ. కాలానుగుణంగా సమాన అవకాశాలు, ప్రత్యేక అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఏ అంశాన్నయినా ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చు.


ఉపాధి అవకాశాలు...
వికలాంగుల పునరావాసం నిమిత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం పోస్టులు వికలాంగులకు కేటాయించబడినవి. (1 శాతం అంధులకు, 6వ రోష్టరు పాయింటు, 1 శాతం మూగ బధిరులకు, 31వ రోష్టరు పాయింటు, 1 శాతం చలన సంబంధమైన అంగవైకల్యం గల వారికి 56వ రోష్టరు పాయింటు) వికలాంగుల కొరకు గుర్తించిన పోస్టులు 3 సంల వరకు ఖాళీగా ఉంచాలి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వయో పరిమితి అర్హత, వికలాంగుల కొరకు 10 సంవత్సరాలు సడలించారు.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో వికలాం గులకు కేటాయించబడిన ఉద్యోగాల నియా మకం ఆ పోస్టు స్థాయిననుసరించి ఉపాధి కల్పన కార్యలయం ద్వారా గాని, పేపరు ప్రక టనలు, సర్వీస్‌ కమీషను ద్వారా గాని జరుగు తాయి. కాలేజి సర్వీసు మిషన్‌ నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, అభ్యర్థికి రూ. 180/- పరీక్ష రుసుము ఇవ్వబడుతుం ది. ఆదాయ పరిమితి సం రూ. 3600/-

స్వయం ఉపాధి...
whtcne1
అందరికి ఉద్యోగాలు లభించవు. కానీ జీవ నం సాగించాలి. అందుచేత ప్రజల విస్తృత ప్రయోజనాలు, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయాణం సాగించేటట్లు చేయటానికి స్వ యం ఉపాధి పథకాలు ప్రవేశపెట్ట బడినవి. స్వయం ఉపాధికి నిర్దేశించిన అన్ని గ్రామీణా భివృద్ధి, పట్టణాభివృద్ధి పథకాలలో వికలాంగు లకు 3 శాతం కేటాయించారు. అలాగే సి.యం.ఇ.వై., పి.యం.ఆర్‌.వై. అన్ని బలహీ న వర్గాల ఆర్థిక సహాయ సంస్థలలో వికలాం గులకు ప్రత్యేక కేటాయింపు ఉంది.

యన్‌.హెచ్‌.యఫ్‌.డి.సి. ద్వారా బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వమే స్వయం ఉపాధికి అప్పులిచ్చే పథకం ప్రవేశపె ట్టింది. 

వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా సబ్సి బీ యిచ్చే పథకం అమలులో ఉంది. దీని ద్వా రా చిన్న, చిన్న వ్యాపారాలకు బ్యాంకులు అప్పు మంజూరు పత్రం ఇవ్వనిచో ప్రత్యేక పరిస్థితులలో నేరుగా రూ.3,000 మంజూరు చేయవచ్చు. అయితే వికలాంగులు స్వయం ఉపాధిపథకం కోరే ముందు ఆ పథకం గురిం చి సరైన అవగాహన ఉండాలి. ఆ ఉపాధి పథ కం వివరాలు పూర్తిగా తెలుసుకొని అందులో అవసరమయిన శిక్షణ పొంది ఉంటే ఆ పథకం సద్వినియోగానికి తోడ్పడుతుంది.
ఇవి గాక అనేక ఉపాధి పథకాలు రాష్ట్ర ప్రభుత్వంచే అమలు చేయబడుతున్నవి.
ఎ) వికలాంగులయినటువంటి లా కోర్సు చదివిన పట్టభద్రులు లా పుస్తకాలు కొనుగోలు, ఎన్‌రోల్‌మెంటు ఫీజు నిమిత్తం రూ. 1,700 మంజూరు అవుతున్నాయి.
బి) సివిల్‌ సప్లయిస్‌ వారి రేషన్‌ షాపులలో 3 శాతం వికలాంగుల నిమిత్తం కేటాయించాలి.
సి) స్టాంపుల అమ్మకం వ్యాపారం మంజూరు చేయునపుడు వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

డి) ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సహాయ సంస్థ అంద చేసిన రుణాలలో వికలాంగులైన లబ్దిదారుల నిమిత్తం రూ. 50,000 వరకు తక్కువ వడ్డీతో అప్పు మంజూరు చేయబడుతుంది.
విద్య, చలనన సంబంధమైన పరికరములు సరఫరా...
వికలాంగుల పునరావాసానికి, చలనం అతి ముఖ్యమైన అంశం, వారు పరికరాల సహా యంతో ఇతర మార్గాల ద్వారా క్రొత్త క్రొత్త ప్రాంతాలకు వెళుతున్నట్లయితే ఎన్నో విషయాలు తెలుసుకోవడం, విద్యసభ్యసించ డం ద్వారా వారి స్వయం పునరావసాన్ని మా ర్గం సుగమం చేసుకుంటారు. అందుచేత చలన పరికరాలు వికలాంగుల పునరావసం లో విడదీయలేని అంశం.

Logo
ఈ పరికరాలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా సరఫరా చేయబడుచున్నవి. అయితే రాష్ట్ర ప్రభుత్వ కూడా ముందుకు వచ్చి, వికలాంగు లందరికీ చలన పరికరాలు అందచేయాలనే ఉద్దేశ్యంతో వారి అవసరాలను గుర్తించి దశల వారీగా వాటిని తీర్చే ప్రయత్నం చేయుచున్న ది. ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకార సంస్థ ఈ చలన పరికరాలు అందచేసే బాధ్యత తీసు కొన్నది. వికలాంగుల సహకార సంస్థ పరిధి తో గల మూడు చక్రాల బళ్లు, సరఫరా కేం ద్రాలు, కృత్తిమ అవయవములు, కాలిపర్లు, వినికిడి యంత్రాల సరఫరా కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమం అమలు పరచబడుతోంది. అంధులకు చేతికర్రలు కాసెట్స్‌, టేపురికార్డర్స్‌ బ్రెయిలీ పలకలు, టైపురైటర్లు, ఇతర విద్యసభ్యసించేందుకు అవసరమైన అన్ని పరికరాలను సరఫరా చేస్తుంది. పోలియో సోకిన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయబడుచున్నది.


సాంఘిక భద్రత...
వికలాంగుల కొంత బలహీనులు కావటం వలన వారికి సాంఘిక భద్రత కల్పించే విషయమై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు పరుస్తోంది.
ఎ) వికలాంగులకు పెన్షన్‌ నెలకు రూ.500/-
బి) సకలాంగుల, వికలాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే రూ.10,000/-లు ప్రోత్సాహక బహుమతి.
సి) బలహీనవర్గాల ఇండ్ల కేటాయింపులో లబ్దిదారుల వాటా వికలాంగులు 3 వాయిదాలలో కట్టే సౌకర్యం.
డి) ఎ.పి. హౌసింగు బోర్డు ద్వారా కట్టి మంజూరయ్యే ఇళ్ళలో 2 శాతం వికలాంగులకు కేటాయింపు.


Surya News Paper Magazine Cover story  Dated : 2/12/2012 

No comments:

Post a Comment