Tuesday, January 15, 2013

ప్రాంతాలవారీ వర్గీకరణే పరిష్కారం!--Donta Badraiah



సామాజికన్యాయంతోనే రాజకీయ, ఆర్ధిక న్యాయం 
రాజ్యాంగ ఏర్పాట్లు ఉన్నా అందని న్యాయం 
మాల- మాదిగల మధ్యా అసమానతలు 
అనుబంధ కులాలపై ఆధిపత్యం 
తెలంగాణలో మాదిగవర్గం అధికం
ఆంధ్రలో మాల వర్గం మెజారిటీ 
జనాభా ప్రాతిపదికనే పంపకాలు 

clasification
సామాజికన్యాయం జరగనంతవరకు ఈదేశంలో రాజకీయ, ఆర్థిక న్యాయం జరిగే అవకా శంలేదని భారత రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్‌. అంబేద్కర్‌ స్పష్టం చేశాడు. సామాజిక న్యాయ పరమైన అవగాహన ఉండగానే సరిపోదు, దానిని ఆచరణలో సాధ్యం చేయాలనే చిత్తశుద్ధి ప్ర భుత్వాలకు ఉండాలి. సరిగ్గా ఈ విధంగానే రాష్రప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణపట్ల వ్యవ హరిస్తున్నది. అనేకవేల కులాలుగా చీలిఉన్న భారత సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రి యులు, వైశ్యులు, శూద్రులు- ఆతర్వాత కాలంలో ఎస్‌సి, ఎస్‌టిలు అతి శూద్రులుగా ఉన్నా, అంతర్గతంగా సామాజిక యాయంకోసం తమలోతాము ప్రాకులాడిన చరిత్ర గతంలోనూ ఉంది. అయితే అప్పుడు సామాజిక కట్టుబాట్లు, ఆచారాలు ఆ అంతర్గతమైన పోరాటాన్ని గుర్తించడానికి నిరాకరించాయి.

ఎందుకంటే అప్పుడు మత పరమైన గ్రంథాలు లేదా స్మ ృతులు పరిపాలనకు మార్గదర్శ కంగా ఉండేవి. కానీ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటినుండి వర్ణవ్యవస్థలో అంతరాలన్నింటినీ ప్రక్షాళనచేసే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వాలు ప్రజలందరినీ కులమత భేదాలు లేకుండా సమానంగా చూడాలని రాజ్యాంగం నిర్దేశించింది. అంతరాలను రూపుమాపాలంటే కొన్ని రక్షణలు ఉండాలని రాజ్యాంగకర్తలు సూచించారు. ఆ విధంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందేందుకు కొన్ని నిబంధనలను 15(4), 16 ప్రవేశపెట్టారు. వీటిని పరిపుష్ఠం చేసేందుకు అనేక చట్టాలు వచ్చాయి. అయినా వీటివల్ల సామాజిక న్యాయం అమలు జరగడంలేదు. 
సామాజిక న్యాయం ఒక సైద్ధాంతిక, రాజ్యాంగపరమైన భావన. ఈ భావన ప్రజల్లో లేదా రాజ్యాంగంలో ఉండగానే సరిపోదు. ప్రభుత్వాలు,పాలకులు ఆ భావనను కలిగి ఉండాలి. ఎందుకంటే చట్టాలు విధానాలు రూపొందించేది ప్రభుత్వాలు. 

సామాజిక న్యాయం అనేది వర్ణాలమధ్య ఉండే ఆధిపత్యాన్ని, కులాలమధ్య ఉండే అంతరాన్ని తగ్గించేందుకు తద్వారా వాటి సమానత్వాన్ని సాధించేందుకు తోడ్పడుతుంది. భారతరాజ్యాంగానికి సామాజిక న్యాయభావన భూమికగా ఉంది. సుమారు 15 సంవత్సరాలుగా రాష్ర్టంలో ఎస్‌సిల మధ్య రగులుకొన్న వర్గీకరణ సమస్యకూడా సామాజిక న్యాయం అంశం ఆధారంగానే కొనసాగుతోంది. ఎస్‌సిల్లో ఈ రాష్ర్టంలో 59 కులాలు ఉన్నాయి. వీటిలో మాల- దాని అనుబంధ కులాలు; మాదిగ- దాని అనుబంధ కులాలుగా విభజించినప్పుడు, రాష్ర్ట గెజిట్‌ ఆధారంగా మాల అనుబంధ కులాలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి. ఈ ‘అనుబంధ కులాలు’ అనే బావన కూడా సరియైనదికాదు. ఎందుకంటే మాల అనుబంధ కులాలుగా చెప్పేవాటిలో వివాహ లేదా ఆచారవ్యవహారాల విషయంలో సారూప్యతలేదు. 

అలాగే మాదిగ అనుబంధ కులాలమధ్య కూడా ఏకరూపత లేదు. మాల అనుబంధ కులాలన్నిటికి తమదే అధీకృత నాయకత్వం అంటూ మాలవర్గం నాయకులు- మాదిగ అనుబంధ కులాలన్నింటికి తామే పేటెంట్‌ నాయకులమని మాదిగవర్గం నాయకులు సమీకృతమవుతున్నారు. మాల,మాదిగ వర్గాల ప్రజలు- తమను అగ్రకులాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీ యంగా అణచివేస్తున్నాయని ఏవిధంగా ఉద్యమాలు చేస్తున్నాయో- అదేవిధమైన అణచివేత మాల, మాదిగలనుంచి వాటి అనుబంధ కులాపైన కూడా కొనసాగుతోంది. అటువంటప్పుడు మాల మాదిగ వర్గాలకు అగ్రకులాలను విమర్శించే నైతిక అర్హత ఉంటుందా అని ఎవరైనా ప్రశ్నిస్తారు. అయితే, సమాజంలో మాల- మాదిగ వర్గాలు కూడా దోపిడీ, అణిచివేతకు గురైనవే కాబట్టి ఆ భావజాలం వారిపై కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వర్గాల ప్రజల్లో ఇప్పటివరకు పై వర్గాల వారికి అధీనులమనే మానసిక స్థితిలోనే ఉన్నారు.

తమకు ఈ రాజ్యాంగం అనేకమైన రక్షణలను, హక్కులను ఇచ్చిందనే అవగాహన గానీ, అవి లభించప్పుడు ప్రభుత్వాలను సైతం ప్రశ్నించేఅవకాశం ఉందనే విషయంగానీ వారికి తెలియదు. కాబట్టి ఆ వర్గాలు, వాటికి అనుబంధంగా ఉన్న కులాలవారిని దోపిడీ చేయడం, అణిచివేయడం ఉద్దేశపూ ర్వక చర్యగా భావించడానికి వీలులేదు. ఈ విధమైన భావజాలం నుండి చూసినప్పుడు, మాల వర్గంప్రజలు - మాదిగవర్గం వారిని అణిచివేస్తున్నారనే అభిప్రాయంలోంచి- వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. అన్నిపార్టీలతో సహా- చివరికి మావోయిస్టులుకూడా వర్గీకణకు అనుకూలంగా ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే.గత 15 ఏళ్ళుగా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వర్గీకరణ సమస్యను ఎందుకు పరిష్కరించలేక పోతున్నాయి? ఇక్కడ, మాలవర్గం ప్రజలు మాదిగవర్గం ప్రజలను- ఆ వర్గం నాయకత్వం ఆరోపిస్తున్నట్లు- ఏ మేరకు దోపిడీ చేస్తు న్నాయి అనే శాతాలు అవసరం లేదు. ఎందుకంటే అగ్ర కులాలు మాల, మాదిగ ప్రజలను ఎంత శాతం దోపిడీ చేస్తున్నాయని వారిపై ఉద్యమాలు చేస్తున్నారని వెంటనే ప్రశ్న వస్తుంది. 

కాబట్టి, పైమెట్టుపై ఉన్న కులం క్రిందిమెట్టుపై ఉన్న కులంపై ఆ విధమైన భావజాలం ప్రదర్శిస్తుంది. ఈ విషయాన్నికూడా అదేవిధంగా చూడాలి. వర్గీకరణ అంశానికి- సామాజిక న్యాయ భావన సమర్థనీయం అనుకు న్నప్పుడు ఎందుకు ఆ సమస్య పరిష్కారం కావడంలేదు? ప్రభు త్వాలు లేదా పాలకులకు దాన్ని ఆచరణలో పెట్టడానికి చిత్తశుద్ధి లేకపోవడమే. ప్రభుత్వాలు- పరి పాలనలో సామాజికన్యాయ భావ నను ఆచరణలో పెడతాయనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలాగా వ్యవహరించవు. ఎందుకంటే, ప్రజ లకు ఆ అభిప్రాయం ఏర్పడితే ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో ఉన్న పాలకులకు ముప్పు ఏర్పడుతుంది. అందుకే ఏ పాలకులు తెలిసీ ఆ విధమైన ముప్పును కొని తెచ్చుకోలేరు. ఆ కోణంలో చూసినప్పుడు- కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా ఉండడంవల్లనే వారు ఇంకా పరిపాలనలో కొనసాగుతున్నారనుకునేందుకు అవకాశం ఉంది.

వర్గీకరణ సమస్య పరిష్కారమైతే, గత 65 సంవత్సరాలుగా ఆధిపత్యం వహిస్తున్న పాలకుల స్థానంలో దళితులు, ఆదివాసీలతో కూడిన ప్రభుత్వాలు ఏర్పడే వీలుండేది.ఈనాటి సామాజిక ఉద్యమాలు రాజాధికారం వైపే దృష్టి సారిస్తున్నాయి. ఆ కోణంలో చూసినప్పుడు, పాలకులు వెంటనే ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు అధికారాన్ని బదిలీ చేయాల్సి వస్తుంది. అటువంటి ఉపద్రవంగా పరిణమించే అధికార మార్పిడికి అగ్రకుల పాలకులు ఒప్పుకోరు. అందుకే సామాజికన్యాయం అంశం ఈ దేశ అగ్రకుల పాలకులకు వణకు పుట్టిస్తుంది. అందుకే సామాజిక న్యాయం పునాదిగావచ్చే ఏ ప్రజాడిమాండునైనా పట్టించు కోవడంలో లేదా అమలుచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇక వర్గీకరణ సమస్యలో వాస్తవంగా ఎదురవుతున్న సాంకేతికపరమైన అంశాలున్నాయి. మొదటగా వర్గీకరణ సమస్య జాతీయస్థాయిలో చర్చకు వచ్చినప్పుడు- ప్రభుత్వం జాతీయ ఎస్‌సి కమిషన్‌ను సలహా కోరింది. 

అప్పటి మిషన్‌ చైర్మెన్‌ హనుమంతప్ప ఎస్‌సి వర్గీకరణ ఆచరణ సాధ్యంకాదని స్పష్టం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి ప్రజలు ఒక రాష్ర్టంలో ఒకే రకంగా లేరని, సామాజిక ఆర్థిక విషయాల్లో తేడాలున్నాయని, ఒక రాష్ర్టంలో మెజారిటీగా ఉన్న కులం ప్రజలు మరొక రాష్ర్టంలో మైనారిటీగా ఉన్నారని, కాబట్టి జాతీయ స్థాయిలో ఇటువంటి అవకాశం దుస్సాధ్యమని చెప్పారు. ఆ తరువాత ప్రభుత్వం రాజ్యాంగ నిపుణులను సంప్రదించింది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 341 వర్గీకరణ అంశాన్ని కష్టసాధ్యంచేస్తుందని రాజ్యాంగనిపుణులు అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగంలోకూడా ఎస్‌సిలను వర్గీకరించే అవకాశం లేకపోవడంతో- గతంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తీర్మానంచేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లుపెట్టి, రాజ్యాంగ సవరణచేస్తే- ఆ తరువాత రాష్ర్ట ప్రభుత్వం తగు విధం గా వర్గీకరణ చేసుకొనే అవకాశం ఉం టుందని భావించారు. అయితే రాష్ర్ట అసెంబ్లీలో సులువుగా తీర్మానం జరిగినట్లు, పార్లమెంటులో రాజ్యాంగ సవ రణ జరిగే అవకాశం లేకపోయింది. 

ఎందుకంటే జాతీయ స్థాయిలో, ఆయా రాష్ట్రాల్లో రాజకీయ నాయకత్వంలోని మెజారిటీ నాయకులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రాష్ర్టంలో ఉన్న మాదిగవర్గానికి సారూ ప్యంగా ఉండే చమార్‌ కుల ప్రజలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మెజార్టీ సంఖ్యలో ఉన్నారు. ఆ విధంగా ఎస్‌సి లకుఉన్న 15 శాతం రిజర్వేషన్‌ సదుపాయాన్ని వారే ఎక్కువగా అనుభ విస్తున్నారు. కాబట్టి వర్గీకరణకు మద్దతుఇస్తే వారి రాష్ట్రాల్లోకూడా చమా ర్లు కానివారు తమకు అన్యాయంజరుగుతుందని, తమ జనాభా పరంగా వర్గీకరణ చేయాలని డిమాండుచేస్తే అక్కడ చమార్లు నష్టపోయే పరిస్థితి అధికంగా ఉంది.అయితే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరగకుండా వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించే అవకాశంలేదు. ఈ సాంకేతిక కారణంతో సమస్య ముడిపడుతోందని తెలిసికూడా వర్గీకరణ మద్దతుదారులు, ప్రభుత్వాలు ఎందుకు రాజ్యాంగ సవరణకోసం ప్రయత్నంచేయడం లేదు? మాల వర్గం ప్రజలు వర్గీకరణను ఎందుకు వ్యతిరేి స్తున్నారో కూడా గమనించాలి. 

మాదిగ నాయకత్వం వాదన ప్రకారం- ‘రాష్ర్టంలో మాదిగలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. కానీ విద్య, ఉద్యోగ అవకాశాలన్నీ మాలవర్గం అనుభవిస్తున్నది, మాదిగలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలనే డిమాండు సామాజికన్యాయ కోణంలో సమంజసం’. ఇందుకు మాలవర్గం వాదన ప్రకారం- ‘రాష్ర్టంలో మాల మాదిగల వ్యత్యాసం సుమారు 0.9 లేదా 1 శాతం ఉన్నది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలుగా చూసినప్పుడు ఇది భిన్నంగా ఉంటుంది. తెలంగాణలో మాదిగ జనాభా అధికంగా ఉంటే మాల జనాభా తక్కువగా ఉంటుంది. ఆంధ్రలో మాల జనాభా అత్యధికంగా ఉంటే మాదిగ జనాభా తక్కువగా ఉంటుంది. రాయలసీమలో స్వల్పతేడాతో మాల- మాదిగలు ఉంటారు. వర్గీకరణ సమస్యకు మూలం- ఆంధ్ర మాల వర్గంలోఉన్న బ్యూరోక్రసీ అని చెప్పాలి. ఇందుకు వారిని కూడా తపపట్టాల్సిన అవసరంలేదు. తెలంగాణలో మాల మాదిగ వర్గాల్లో సామాజికంగా పెద్ద తేడాలు లేవు. అయినప్పటికీ వర్గీకరణను రాష్ర్టం యూనిట్‌గా జరగాలనే చేస్తున్న ప్రయత్నాలను మాల వర్గం వ్యతిరేకిస్తోంది. 

సామాజికన్యాయం కోణంలో స్వల్ప మెజారిటీతో ఉన్న మాదిగలు రాష్ర్టం యూనిట్‌గా వర్గీకరణ జరగాలని కోరడం ఎంతన్యాయమో- ఆంధ్రాలో అత్యధిక మెజారిటీతో ఉన్న మాల వర్గం వ్యతిరేకించడం కూడా అంతేన్యాయం! వర్గీకరణ జరిగితే తెలంగాణలో మాల వర్గం నష్టపోయేదేమీ లేదు. కానీ ఆంధ్రలోఉన్న మాలలు తీవ్రంగా నష్టపోతారు. తెలంగాణలో మాదిగ వర్గం ప్రజలు అధికంగా ఉన్నారు. తెలంగాణలో ఆ ప్రజలు అధికంగా ఉండగా ఆ జనాభాకంటే తక్కువ శాతం రిజర్వేషన్‌ కోరడంలో ఆంతర్యమేమిటో మాదిగ నాయకత్వంతో పాటు ప్రభుత్వాలు ఆలోచించాలి. తెలంగాణలో వర్గీకరణ జరిగితే వారికి 7 శాతం అమలవు తుంది. తెలంగా ణలో వారు మొత్తం 15 శాతంలో 7 శాతమే ఉన్నారనేది అంగీకరిస్తారా? మాల వర్గం జనాభాకు తెలంగాణలో వర్గీకరణ జరిగితే నష్టంలేదు, లాభంలేదు. వారు ఎంత జనాభా ఉన్నారో అంత రిజర్వేషన్‌ వర్గీకరణ జరిగినా జరగకపోయినా వారి జనాభాకు అనుగుణంగానే విద్య, ఉద్యోగ అవకాశాలు న్నాయి.ఏ విధంగా చూసినా ‘జనాభా ఎంతనో రిజర్వేషన్‌ అంత’ అనే కోణం లో చూసినప్పుడు ఆంధ్రాలో ఉన్న మాల వర్గం ప్రజలు వర్గీకరణను వ్యతిరేకించడంలో తప్పులేదు. అక్కడ ఆదిఆంధ్రా రెల్లి గ్రూపులు ఉన్నాయి. వాటి రెండు శాతం రిజర్వేషన్‌పోగా మిగిలిన 6 శాతం రిజర్వేషన్‌తో మాలవర్గం తీవ్రంగా నష్టపోతుంది.వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించాలంటే ఈవిషయాలన్నింటినీ పరిశీలించాలి.

bdri
గత 15 సంవత్సరాలకుగా ఈ విషయాలన్నీ ఇరు వర్గాలు క్షుణ్ణంగా విశ్లేషించుకోవడం జరిగింది. కానీ చిత్తశుద్ధితో పరిష్కారాన్ని వెదకడంలో తాత్సారం చేస్తున్నారు. ఇది అగ్రకుల పాలకులకు, వారు అధికారాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. కాని, మాదిగ, మాల నాయకత్వాల ఒంటెద్దు పోకడలవల్ల సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఈ విషయంలో కొంతమంది మాదిగవర్గం ప్రతినిధులు ప్రాంతాలవారీగా వర్గీకరణ జరిగితే పరిష్కారం లభిస్తుందని ప్రతిపాదించారు. కానీ ఈ ప్రతిపాదన విస్తుృతంగా చర్చకు రాకుండా చేస్తున్నారు. కాబట్టి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి, రాష్ర్టంలో వర్గీకరణ చేసే క్రమానికంటే ముందు ప్రాంతాల వారీగా వర్గీకరణ గురించి ఆయా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిఉంది.

రచయిత న్యాయవా



Surya Telugu News Paper Dated:  16/1/2013

No comments:

Post a Comment