Tuesday, November 5, 2013

కులవృత్తులకు ఆదరణ ఏదీ? By డి నరసింహ రెడ్డి

మంగళవారం , నవంబర్ 05 ,2013


ప్రపంచీకరణ విధానాల వల్ల చేతివృత్తులు చేతులిరిగాయి. కులవృత్తులు కూలిపోయాయి. మరణ మృ దంగం తాటిచెట్లపై ఆధారపడిన గీతకార్మికులు పది లక్షల మందికి పనిలేకుండాపోయింది. మద్యం వచ్చి గీతకార్మికులు తమ కులవృత్తికి దూరమయ్యారు. ప్రమాదవశాత్తు తాటి చెట్లు ఎక్కి పడి చనిపోయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవటంతో మన రాష్ట్రంలో పదివేల కుటుంబాలు జీవచ్ఛావాల్లా బ్రతుకు వెళ్లదీస్తున్నాయి.
మన రాష్ట్రంలో 80 లక్షల మంది రజక వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. వాషింగ్టన్‌ యంత్రాలు వచ్చి వారి కులవృత్తి కనుమరుగైపోయింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో తప్ప బట్టలు ఉతికే రజకులు ఎక్కడా కన్పించడం లేదు. కేవలం బట్టలు విస్త్రీ మాత్రం కొంతమందికయినా పొట్టనింపుతోంది.  బొగ్గు ధర పెంచడంతో రజకుడి రోజుకు వందరూపాయలు సంపాదించడం కష్టతరంగా మారింది. లెదర్‌ పార్సులు, హ్యాండ్‌ బ్యాగులు కేవలం బహుళజాతి సంస్థల కోసమేనా అనిపిస్తోంది. ఇవి చర్మ కారులకు ఏ విధంగా ఉపయోగపడ్తయాన్న అంశంపై ప్రభుత్వా నికి అవగాహన లేదు. చెప్పులు, డప్పులు తయారీకి చర్మాకా రులు దూరమయ్యారు. ప్లాస్టిక్‌ కుండలు వచ్చి కుమ్మరుల కుం డలకు కాలం చెల్లింది. చలివేంద్రాలకు విలువలేకుండా పోయింది. కుమ్మరి వాములలో తుమ్మ, సర్మారీ తుమ్మ చెట్లు మొలకెత్తుతున్నాయి.బుట్టలు,తట్టలు,గంపలు, అల్లే మెదరులకు వేదురు అవసరం వారికి సబ్సిడీలురావు. కాగితం పరిశ్రమకు సబ్సిడీలతో రవాణా చేస్తారు వెదురు కోసం అడవికిపోయిన వారిపై అటవీశాఖ అధికారులు కేసులు బనాయిస్తున్నారు. నీలి విప్లవం పేరుతో లక్షలాది మత్య్సకారుల జీవితాలు ఆగమ య్యాయి. వంశరాజులను సంచారజాతులు అంటారు వీరి కుల వృత్తి చాపలు అల్లడం సంచారిస్తుంటారు. రాష్ట్రంలో ఇరవై లక్షలమంది ఉంటారని అంచనా. రానురాను కనుమరుగైపోతున్నారు. సాలెలమగ్గంపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నారు.
వ్యవసాయరంగంతర్వాత రెండోది చేనేతరంగం. చేనేత కార్మి కులు ఆత్మహత్యలు ఆకలిచావులకు గురయ్యారు. అగ్గిపెట్టేలో చీరను, అల్లీ ప్రపంచానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన సరిసిల్లా చేనేత కార్మికుడు ఆత్మహత్య విషాదం. పవర్‌లాంలో తయారైన బట్టలను మార్కెట్‌లలో అమ్మడానికి ముడిసరుకుల ధరలు విచ్చల విడిగా పెంచడం బడ్జెట్‌లో కోత విధించడం బతుకులేక చేనేత కార్మికుఉ వలసలు సూరత్‌, దుబాయి, ప్రాంతాలలో దుర్భరంగా జీవిస్తున్నారు. క్షౌరవృత్తిదారులు సుమారు ఇరవై లక్షల మంది. క్షౌరవృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు. క్షౌర వృత్తిదారులను సెలూన్‌మసాజ్‌ సెంటరులు కూలీలుగా మార్చారు. అత్యాధునికమైన హంగులతో నిర్మించినపటికీ మా మూలుగా ఉన్నటువంటి క్షౌరవృత్తిదారులు మూతపడుతున్నారు. మాయదారి యంత్రాలు రావడంతో చేతివృత్తులకు స్వస్తీపలికి పనులు వెతుక్కుంటూ దూరప్రాంతాలకు వలసలు పోయారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు ఈ వృత్తులకు శాపంగా మారాయి.
1991లో ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాల మూలంగా చేనేత కార్మికులు 850 మంది, కల్లుగీత కార్మికులు 395 మంది శాలివాహనులు 319 మంది కమ్మరి కుమ్మరులు, 175 మంది దర్జీలు వెయ్యి మంది ఆత్మహత్యలు ఆకలిచావులతో మరణించారు. చేతివృత్తిదారుల పోరాట ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘాన్ని అధ్యయనం చేయకుండానే రద్దు చేసారు. కులవృత్తులు కూడుపెట్టలేవని అమెరికా ఆర్థికసంక్షోభం నిరూపించింది. కనుమరుగైపోయిన కులవృత్తులు చేతివృత్తులకు ప్రభుత్వం జీవంపోయాలి. సబ్సి డీపై ముడిసరుకులు అందించాలి. వృతికళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చేతివృత్తులు కులవృత్తుల దారులు సొం తంగా నిలబడేలాగా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. ప్రభు త్వం, బ్యాంకుల నుంచి రుణాలు అందించాలి. ప్రపంచీకరణ సరళీకరణలో అంతరించిపోతున్న కులవృత్తులు చేతివృత్తులకు ప్రభుత్వమే జీవం పోయాలి. పాలకుల నిర్లక్ష్యం విడనాడి చేతివృత్తులకు చేయూతనందించాలి. విదేశవస్తువులన్నీ బహిష్కరించి స్వదేశీవస్తువులని కాపాడుకోవాలి


Vaartha Telugu News Paper Dated: 05/11/2013 

No comments:

Post a Comment