Thursday, November 10, 2011

పిడికిలికి ‘పీడీ’ సంకెళ్లు By వరవరరావు



ముప్ఫై ఏళ్లుగా విద్యార్థి, సాహిత్య ఉద్యమాల్లో పాల్గొంటూ, ఇరవై ఏళ్లుగా గ్రామీణ నల్లగొండ జిల్లాలో వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్‌ను ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులపై జిల్లాల్లో కలెక్టర్లు, నగరాల్లో పోలీసు కమిషనర్లు సంతకం చేస్తారు. కనుక ‘ఫస్ట్‌క్లాస్ మెజివూస్టేట్’ చేస్తాడని అర్థం. ఇది నేరుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమన్న మాట. ‘పీడీ’ చట్టం కింద అరెస్టు చేస్తే బెయిలు ఉండదు. గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ యిచ్చాక హైకోర్టులోనైనా సవాల్ చేయాలి లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఎడ్వయిజరీ బోరు ్డముందుకు వెళ్లాలి. నెలరోజులైనా నిర్బంధించి కక్ష తీర్చుకోవడానికి ఈచట్టం ప్రయోగిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఇది మొట్టమొదటి ప్రివెంటివ్ అరెస్టు. 

పదిహేనేళ్లుగా తెలంగాణ ఉద్యమం ఎంత ఉధృతంగా నడిచిన కాలంలో కూడా ఇటువంటి ముందస్తు నిర్బంధం లేదు. బంద్ పిలుపు, మిలియన్‌మార్చ్, ముట్టడి, రైల్‌రోకో వంటి పిలుపులు ఇచ్చినపుడు గృహనిర్బంధాలు, ఒకటి రెండురోజుల కోసం ముందుగా అరెస్టు చేయడం ఉండవచ్చు. గానీ బ్రిటిష్ కాలపు రౌలట్ చట్టం వంటి ప్రివెంటివ్ డిటెన్షన్‌ను ప్రయోగించడం మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఇదే మొదటిసారి. శ్రీకృష్ణ కమిషన్ ఎనిమిదవ రహ స్య అధ్యాయం అమలు పొరలు పొరలుగా విచ్చుకుని ఏయే రూపాల్లో అణచివేత రూపాలు పొందనుందో ఇది ఒక తాజా దాఖలా. సుధాకర్ ప్రివెంటివ్ డిటెన్షన్ ‘నజర్‌బంద్’ నిర్బంధమన్న మాట.

తరచు నేరాలు చేసేవాళ్ల మీద, ఎన్నిసార్లు కేసులు పెట్టి, అరెస్టులు చేసినా నేరస్వభావం మార్చుకోనివాళ్ల మీద, నేరనిరోధం కోసం చేసే అరెస్టుగా ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని నిర్వచిస్తున్నారు. ఇది రౌడీషీటర్ల మీద, నేరస్తులుగా ముద్రపడిన వాళ్ల మీద ప్రయోగించే చట్టంగా చెప్పడమే తప్ప బ్రిటిష్ కాలం నుంచీ పేర్లు ఎట్లా మారుతూ వచ్చినా ఇది రాజకీయ ప్రత్యర్థుల మీదనే ప్రయోగిస్తున్నారు. మన రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ హంతకులకు, ఫాక్షన్ హంతకులకు, రియల్ ఎస్టేట్ హంతకులకు రాజకీయ అధికారమార్పిడి కోసం హత్యలు చేసేవారికి, ఇటీవల కాలంలో దళారీ హంతకులకు కొదువలేదు. వాళ్లమీద నామమావూతంగా నవెూదయిన కేసులు కూడ తక్కువేమీ కాదు. వాళ్లనెవరినీ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద నిర్బంధించలేదు. కొందరిమీద నైతే కేసులే నడపలేదు. 

కేసులు కోర్టుల్లో విచారింపబడినా కొందరు ఎన్నడూ జైలుకుకూడా వెళ్లలేదు. తాజాగా సత్యం రామలింగరాజు, గాలి జనార్దన్‌డ్డి, కోనేరు ప్రసాద్‌లను కూడ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద జైల్లో పెట్టలేదు. ఇప్పుడు తిహార్ జైల్లో, రాంచీ జైల్లో (మాజీ ముఖ్యమంత్రి), బెంగాల్ జైల్లో ణొఫ్ట్‌వూఫంట్‌లో మంత్రి)ఉన్న ప్రముఖులు ఎవరూ వాళ్లమీద ఎంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నా ముందస్తుగా అరెస్టయినవాళ్లు కాదు. వీళ్లెవరూ అధికారంలో ఉన్న వాళ్లకు ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించి జైలుకు వెళ్లిన వాళ్లే గానీ ప్రత్యర్థులు కారు. వీళ్లంతా పాలకవర్గంలోని వాళ్లే. బ్రిటిష్‌కాలం నుంచి కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కేవలం ప్రత్యర్థుల మీద ప్రయోగించిందే తప్ప నేరస్తులమీద ప్రయోగించ లేదు.

భారత రిపబ్లిక్‌లో మొట్టమొదటిసారి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని సుప్రసిద్ధ కమ్యూనిస్టుపార్టీ నాయకుడు ఎకె గోపాలన్ మీద ప్రయోగించారు. బ్రిటిష్‌వాళ్లు రౌలట్ చట్టం పెట్టినపుడు తీవ్రంగా వ్యతిరేకించిన జవహర్‌లాల్ నెహ్రూయే అధికారంలోకి వచ్చి, గణతంత్ర రాజ్యాంగం రచించిన ఏడాదికే ఈ చట్టాన్ని ఒక రాజకీయ ప్రత్యర్థిపై ప్రయోగించాడు. ఈచట్టాన్ని రాజకీయ విశ్వాసాలను నిషేధించడానికే తప్ప చర్యల గురించి ప్రయోగించడం లేదు. ఇది నైసర్గిక ప్రాథమిక హక్కులయిన భావవూపకటన, సంఘ నిర్మాణం, విశ్వాసాలు కలిగి ఉండడమనే వాటిపై గొడ్డలిపెట్టు అని స్వయంగా ఎకె గోపాలన్ వాదించాడు. అయినా మళ్లా 1965లో దేశవ్యాప్తంగా మార్క్సిస్టుపార్టీ నాయకులపై అభూతకల్పనల వంటి ఆరోపణలతో ప్రయోగించారు. చైనాయుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చడానికి వీరు కుట్ర చేసారని సుందరయ్య మొదలుకొని ప్రముఖ నాయకులందరినీ 85మందిని జైల్లో పెట్టారు. ఈ నిర్బంధాన్ని ప్రశ్నించడానికే మొదటిసారిగా 1965లో అఖిలభారత స్థాయిలో ఎన్‌సి ఛటర్జీ నాయకత్వంలోను, ఆంధ్రవూపదేశ్‌లో శ్రీశ్రీ నాయకత్వంలోను ‘ఆంధ్రవూపదేశ్ పౌరహక్కులసంస్థ’ ఏర్పడింది.

ప్రివెంటివ్ డిటెన్షన్, ‘పిడి యాక్ట్’ పేరుతో రాష్ట్రంలో, ‘మీసా’ పేరుతో దేశంలో అమలయింది.(మెయిన్టేనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెూక్యూరిటీ యాక్ట్-మీసా), రాష్ట్రానికి చెందిన పిడి చట్టం కిందనే. 71 ఆగస్టులో దిగంబరకవులయిన విప్లవ రచయితలు జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజులను అరెస్టు చేసారు. అప్పటి పిడి చట్టం కింద ప్రభు త్వం చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిజమైనా ‘నిర్బంధం’ చెల్లుతుంది. న్యాయశాస్త్ర తాత్విక దృక్పథం ప్రకారం ‘ఒక నేరారోపణపై ఎందరు నేరస్తులయినా తప్పించుకోవచ్చు, కానీ ఒక్క అమాయకుడు కూడా నిర్బంధించబడకూడదు’. అట్లాగే ‘ఒక్క ఆరోపణ అబద్ధమైనా నిందితుని పక్షం న్యాయసూత్రం మొగ్గుచూపాలి’. ఈ తాత్విక దృక్పథంతోనే జస్టిస్ చిన్నపడ్డి 71 సెప్టెంబర్‌లో రాష్ట్ర పిడి చట్టాన్ని కొట్టివేసి ‘విశ్వాసాల కోసం ఎవరినీ నిర్బంధించడానికి వీలులేదు’ అని చరివూతాత్మకమైన తీర్పు యిచ్చి వీళ్లను విడుదల చేసాడు. 1973 అక్టోబరులో ప్రభుత్వం మళ్లా మీసా కింద చెరబండరాజు, ఎంటి ఖాన్, వరవరరావులను అరెస్టు చేసింది. 

‘తక్షణ ప్రమాదం ఉందని భావిస్తే తప్ప రచనలు, ప్రసంగాలు, విశ్వాసాల గురించే ముందస్తు నిర్బంధం తగద’ని జస్టిస్ ఆవుల సాంబశివరావు వీరిని విడుదల చేసాడు. అందుకే విశ్వాసాలకు, చర్యలకు సంబంధాన్ని ముడిపెట్టే సికిందరాబాదు కుట్రకేసు పెట్టి మళ్లా 1974 మేలో ఆరుగురు విప్లవ రచయితలను (పై ముగ్గురితో పాటు కెవి రమణాడ్డి, త్రిపురనేని మధుసూధనరావు, ఎం.రంగనాథంలను కూడా చేర్చి) సికిందరాబాదు కుట్రకేసు పెట్టారు. ఇపుడెట్లాగయితే చెరుకు సుధాకర్‌ను జనశక్తి, మావోయిస్టు పార్టీలతో అనుబంధాన్ని ఆరోపిస్తున్నారో.. అపుడట్లా ఆరుగురు రచయితలపై కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తిల నాయకత్వంలో ఉన్న ఎంఎల్ పార్టీ చర్యలతో సంబంధాన్ని అంటకట్టి కలిపి నేరారోపణలు చేసారు.

ఎమ్జన్సీలో దేశవ్యాప్తంగా ‘మీసా’కింద లక్షా యాభై వేలమందిని వివిధ జైళ్లలో పెట్టారు. వీరిలో ఆర్‌ఎస్‌ఎస్ మొదలుకొని ఎంఎల్ పార్టీల వరకున్నారు. చివరకు కాంగ్రెస్‌పార్టీలో ఉండి ఎమ్జన్సీని వ్యతిరేకించినవాళ్లూ ఉన్నారు. జలగం వెంగళరా వు కాలంలో బ్లాక్‌మ్కాట్ చేసేవాళ్లను, ఎన్టీఆర్ కాలంలో గూండాయాక్ట్ కింద ప్రివెంటివ్ డిటెన్షన్ పెట్టిన సందర్భాలు లేకపోలేదు. కాని వెంగళరావు కాలంలో కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇస్తే విడుదలయ్యేవాళ్లు. ఎన్టీఆర్ హయాంలో గూండాయాక్ట్ కింద అరెస్టయినవాళ్లు ఎవరూ నెల, రెండునెలల కన్నా ఎక్కువగా జైళ్లలో లేరు. ఇదే కాలంలో కె.బాలగోపాల్‌ను, ఎస్‌ఎ రవూఫ్‌ను మీసా కింద అరెస్టు చేసారు. బాలగోపాల్‌నయితే మీసా (టాడా) కింద అరెసు ్టచేసారు. కానీ ఆయన తల్లి నాగరత్నమ్మ హైకోర్టులో సవా ల్ చేస్తే విడుదల చేసారు.. ఎస్‌ఎ రవూఫ్ రెండేళ్ల కన్నా ఎక్కువే జైల్లో ఉన్నారు. ఈ కాలంలోనే ఇంకెందరో ట్రేడ్‌యూనియన్ నాయకులు కూడా ఇట్లా ముందు నేరారోపణలు లేకుండా జైళ్లలో మగ్గారు. 

అరవైఏళ్ల చరివూతలో ‘ప్రివెంటివ్ డిటెన్షన్’ రౌడీషీటర్ల పై, తరచు నేరాలు చేసేవాళ్లపై కాదు, రాజకీయ విశ్వాసాలు కల వాళ్లపై, రాజకీయ ఉద్య మాల్లో పాల్గొంటున్న వాళ్లపై, అధికారాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లపై మాత్రమే ప్రయోగి స్తున్నారనేది స్పష్టమే. అట్లని వాళ్లనయినా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద పెట్టాలని కాదు. స్పష్టమైన, నిర్దిష్టమైన నేరారోపణ లేకుండా ఎవరినీ నిర్బంధించడానికి వీలులేదని, ఎమ్జన్సీలో ఒక రిట్ పిటిషన్ వేసి స్వయంగా వాదించుకోవడానికి హైకోర్టుకు వెళ్లినపుడు పత్తిపాటి వెంక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆవుల సాంబశివరావు అడిగారు ‘మీతోపాటు జైళ్లలో ఉన్న బ్లాక్‌మ్కాటీర్లను కూడ మీవపూనే చూడాలంటా రా?’ అని. ‘అసలు ఎవరినీ ప్రివెంటివ్‌గా అరెసు ్టచేయవద్దన్నదే ఎపిసిఎల్‌సి సూత్రబద్ధమైన అవగాహన’ అని జవాబు చెప్పాడు. చెప్పడానికే ఈ చరిత్ర అంతా కాని ప్రభు త్వాలు పిడిలు, నిషేధాలు, టాడా, పోటా, ఎస్మా, యుఎపిఎ వంటి చట్టాలన్నిటినీ హింసాత్మక చర్యలు అరికట్టడానికి కాదు, అధికారంలో ఉన్నవాళ్ల ప్రయోజనాలకు భిన్నమైన విశ్వాసాలు కలిగి ఉన్నవారిపైనే ప్రయోగిస్తున్నారు. జైళ్లలో పెడుతున్నారు, వేధిస్తున్నారు.

చెరుకు సుధాకర్ విషయమే తీసుకుందాం. ఆయన చిరకాలం విర సం సభ్యునిగా ఉన్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు పిడిఎస్‌యులో ఉన్నాడు. ఆయనమీద ఎస్పీ ఎన్నో ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ఆయన గతం లో మావోయిస్టు, జనశక్తి రాజకీయాలతో ఉన్నాడని కూడా చెబుతున్నారు. గతంలో ఏమైనా ఇపుడాయన తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు. అంటే ఆయనకు కొన్ని రాజకీయ విశ్వాసాలున్నాయి. ఈ సమాజం సమూలంగా మారాలన్న విశ్వాసం ఉన్నది. అందుకోసం ప్రజలు ఏ పోరాట రూపాన్నయినా చేపట్టవచ్చునన్న విశ్వాసం ఉన్నది. సామాజిక తెలంగాణ ఏర్పడాలన్న విశ్వాసం ఉన్నది. ఈ విశ్వాసాలకు అనుగుణంగా ఆయన తెరాస గానీ, రాజకీయ జెఎసి గానీ యిచ్చిన పిలుపులకు స్పందించి నల్లగొండజిల్లాలో, ముఖ్యంగా నకిరేకల్‌లో ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆ నిర్దిష్టమైన కేసు గురించి ఆయన జైలుకుపోయాడు. అది విచారణ జరుగుతున్నది. ఆయనకు నకిరేకల్‌లో ఆసుపత్రి ఉన్నది. ఆయన బహిరంగ రాజకీయ, సామాజిక జీవితంలో నిత్యం ఎందరికో అందుబాటులో ఉన్నాడు. ఎక్కడికీ పారిపోయేవాడు కాదు.

మావోయిస్టులైనా, జనశక్తి వాళ్లయినా తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని మాత్రమే డిమాండు చేస్తున్నారు. వాళ్లు సూచిస్తున్న పోరాటమార్గాల్లో రాష్ట్ర సాధన కోసం సాయుధ పోరాటం చేయాలని ఏమీ చెప్పడం లేదు. రాస్తారోకో లు, రైల్‌రోకోలు, సహాయనిరాకరణలు, శాసనోల్లంఘనలు, ఆమరణ నిరాహారదీక్షలు, బంద్‌లు, సమ్మెలు, వీటిమీద ఎవరైనా ఏ వ్యాఖ్యానాలయినా చేయవచ్చు గానీ ఇవి ప్రజాస్వామ్య పోరాట రూపాలు కాదని ఏ ప్రజాస్వామ్యవాదీ అనలేడు. మీడియా, ప్రభుత్వం, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అనడంలేదని కాదు, అవి తమకు అనుకూలం కాని సందర్భాల్లో మాత్రమే అంటున్నాయి. ప్రపంచబ్యాంకు భావజాలం గలవారు తప్ప మనుషుల మీద గాక అన్యాయార్జిత ఆస్తుల మీద ప్రేమ ఉన్న వాళ్లు తప్ప తెలంగాణ ఉద్యమంలోని పోరాట రూపాలను మావోయిస్టు, జనశక్తి బూచి చూపి ఎవరూ తప్పుపట్టలేరు. చెరుకు సుధాకర్ ప్రివెంటివ్ డిటెన్షన్ మళ్లా ఒకమారు ప్రభు త్వాలు చర్యలకన్నా విశ్వాసాలను నిరోధించి నిషేధించడానికి తమ రాజ్యాంగయంత్రాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తాయని మనను హెచ్చరిస్తున్నది..

-వరవరరావు     Namasete Telangana News Paper Dated 11/11/2011

No comments:

Post a Comment