Thursday, November 10, 2011

నాయకులకు ఇది పరీక్షా సమయం! by పొఫెసర్ ఘంటా చక్రపాణి



తెలంగాణ అంశాన్ని ఇంకా నాన్చలేమని ఢిల్లీ పెద్దలకు అర్థమయిపోయింది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై ఏదో ఒక ప్రకటన రావొచ్చనీ అంటున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీతో పనిలేకుండా ప్రభుత్వమే హోం శాఖ ద్వారా ఒక ప్రకటన చేస్తుందన్న వార్తలు వచ్చాయి. నిజానికి మొదట ఈ విషయాలు మీడియాకు చెప్పింది ఆంధ్రవూపదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్. ఆయన సోనియాగాంధీ అంతరంగికుల్లో ఒకరు. సోనియాగాంధీతో సమావేశమైన అనంతరమే ఆయన ఈ సంకేతా లు ఇచ్చినట్టు పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ వార్తలేవీ తెలంగాణ ప్రజానీకా న్ని పెద్దగా ఉత్సాహ పరచలేదు. ఎందుకంటే ‘ఏదో ఒకటి’ అనడంలో తెలంగాణ అనుకూలత ఏదీ లేదు. రెండు సంవత్సరాలుగా ఊరించి ఇప్పుడు రుచీ పచీ లేని మాటలు చెప్పడం తెలంగాణ వాదులేవరికీ పెద్దగా ఊరటనిచ్చే విషయం కాదు. కానీ ఆ వెంటనే రెండవ రాష్ట్రాల పునర్విభజన కమి షన్ (ండో ఎస్‌ఆర్‌సి ) వేయబోతున్నారన్న కథనాలు కొంత కలవరపెడుతున్నాయి. 

ఉత్తరప్రదేశ్ పరిణామాలపై జాతీయ కాంగ్రెస్‌లోని కొందరు నేత లు చేసిన ప్రకటనలను తెలుగు మీడియా తనకు తోచిన రీతిలో విశ్లేషించి ఈ కలవరానికి కారణం అయ్యింది. సహజంగానే ఏదో రకంగా తెలంగాణ ఏర్పాటు వాయిదా పడితే బాగుండునని అనుకుంటున్న వాళ్లకు ఇదొక మంచి ఆసరా అయ్యింది. అలాగే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్ర తెలిసిన వారికి ఆ పార్టీ అలాంటి ప్రయత్నమేదో చేసి కావాల నే సమస్యను మరింత సాగదీయవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే శ్రీ కృష్ణ కమిటీ పేరుతో రెండేళ్ళ కాలాన్ని వృథా చేసిన కాంగ్రెస్ సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేయవచ్చన్న సంకేతాలు అందుతున్నాయి. అదే గనుక జరిగితే ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే బాధ్యత ఇంతకాలం ప్రజలను కేంద్ర ప్రభు త్వం తరఫున, తమ అధిష్ఠాన వర్గం తరఫున వకాల్తా పుచ్చుకుని ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్లమెం టు సభ్యులు తీసుకోవాల్సి ఉంటుంది. 
ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియకపోయినా ఏదో జరుగుతున్న సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరవూపదేశ్ విభజనకు సంబంధించి మాయావతి చేసిన ప్రకటన అక్కడి కాంగ్రెస్ పెద్దలను కలవరపెడుతున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఉత్తరవూపదేశ్ ఎన్నికలు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ భవిష్యత్తుకు ఒక సవాలుగా మారాయి. 

ఎలాగైనా యూపీలో పైచేయి సాధించాలని ఆ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలకు మాయావతి యూపీ విభజన ప్రతిపాదనతో చెక్ పెట్టారు. మాయావతి మొదటినుంచీ చెపుతున్నట్టుగానే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని, ఆయన 1955లో చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆమె నవంబర్ చివర్లో శాసన సభలో ఒక తీర్మానం కూడా పెట్టబోతున్నారు. చిన్న రాష్ట్రాల వల్ల యూపీ రాజకీయాల్లో అగ్రవర్ణాలు ముఖ్యం గా బ్రాహ్మణ, జాట్ సామాజిక వర్గాల అండతో కాంగ్రెస్, బీజేపీలు చక్రం తిప్పకుండా చేయాలని అలాగే యాదవ, ముస్లిం బలగాలను నమ్ముకుని తన కొడుకు అఖిలేష్ యాదవ్‌ను అధికారంలోకి తేవాలని ప్రయత్నిస్తోన్న ములాయం సింగ్‌ను నిలువరించి కొత్తగా ఏర్పడే నాలుగు రాష్ట్రాల్లో దళిత బహుజన రాజ్యం ఏర్పాటు చేయాలన్నది మాయావతి కల. ఆ కల ఎలా వున్నా ఆమె ప్రకటన ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలతో పాటు సమాజ్ వాదీ పార్టీలలో కలకలం సృష్టిస్తున్నది. ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళే ముందే ఆయా పార్టీలు విభజన పై వారి వారి వైఖరులు చెప్పాల్సి ఉంటుంది. 

విచివూతమేమిటంటే ఉత్తరవూపదేశ్‌లో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క ప్రాంతంలో జనాదరణ కలిగిఉంది. కాబట్టే తరచుగా వాళ్ళు కూడా యూపీ విభజన గురించి మాట్లాడుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి బుందేల్ ఖండ్ కావాలని అంటోంది. యూపీలోని ఏడు జిల్లాలు మధ్యవూపదేశ్‌లోని పన్నెండు జిల్లాలను కలిపి బుందేల్ ఖండ్ పేరుతో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో మొదటినుంచీ కాంగ్రెస్ కొంత బలంగా ఉండడం మూలంగా ఆ పార్టీ బుందేల్‌ఖండ్ ఏర్పాటుకు మద్దతునిస్తోంది. బుందేల్‌ఖండ్ ఏర్పడితే మధ్యవూపదేశ్‌లో బీజేపీ బలం తగ్గించవచ్చన్నది కాంగ్రెస్ ఎత్తుగడ. అలాగే బుందేల్‌ఖండ్ ప్రజల ఆశీస్సులతో అక్కడ అధికారంలోకి రావోచ్చన్న ఉద్దేశ్యంతో ఆ పార్టీ ఉంది. పశ్చిమ ఉత్తరవూపదేశ్‌లో కొంత బలం, జాట్ కులస్తుల బలగం ఉన్న అజీత్ సింగ్ కూడా ఈసారి కాంగ్రెస్‌కే మద్దతునిస్తున్నారు. ఆయన పశ్చిమ ప్రాంతం హరితప్రదేశ్‌గా అవతరించాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికి కాంగ్రెస్ హరితప్రదేశ్ పై తన వైఖరిని చెప్పనప్పటికీ అజీత్ సింగ్ మాత్రం అనేక ఆశలతో ఉన్నాడు. 

బుందేల్‌ఖండ్‌లో ఉద్యమ సానుభూతి, అజిత్ సింగ్ మద్దతు ఇటివలి కాలంలో దగ్గర అవుతున్న ముస్లింల అండతో అధికారానికి దగ్గర రావొచ్చన్నది కాంగ్రెస్ ఆశ. ఇప్పుడు మాయా నాలుగుముక్కలు అనే సరికి కాంగ్రెస్ అయోమయంలో పడిపోయింది. ఆ అయోమయంలో నుంచి తెరుకోవడానికే ఆ పార్టీ రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణను ముందుకు తీసుకువస్తోంది. వెంటనే ఒక్క బుందేల్‌ఖండ్‌కు మాత్రమే మా మద్దతు అని చెపితే మిగితా మూడు ప్రాంతాలలో జనం తిరగబడే ప్రమా దం ఉంది కాబట్టి ఆ పార్టీ తాత్కాలికంగా తప్పించుకోవడానికి ఇప్పుడు ఎస్ ఆర్‌సి అంటోంది. బహుశా బీజేపీ కూడా ఎస్‌ఆర్‌సికి ఓకే అనక తప్పని పరిస్థితి. అందుకే ఆ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మొదట్నుంచీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని చెప్తూ వస్తోన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు యూపీ విషయంలో ఏం చేయాలో తోచని అయోమయంలో పడింది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగితే హిందూ ఓటు బ్యాంకు విడిపోతుంది. నిజానికి హిందుత్వ ఎజెండా పట్ల అంతో ఇంతో ఆకర్షణ ఉన్నది యూపీ లోనే. విభజనను గట్టిగా వ్యతిరేకిస్తున్నది మాత్రం ఒక్క సమాజ్‌వాదీ పార్టీ మాత్రమే. రాష్ట్రం కలిసి ఉంటేనే ముస్లిం ఓట్లు చెక్కు చెదరకుండా ఉంటాయని, అలాగే ఆధిపత్య బీసీ వర్గాలు ప్రధానంగా యాదవులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నందువల్ల కలిసి ఉంటేనే తనకు ప్రయోజనమని ములాయం సింగ్ యాదవ్ భావిస్తున్నారు. మొత్తానికి మాయావతి ప్రకటన వెనుక పకడ్బందీ రాజకీయ వ్యూహం వుందనడంలో సందేహం లేదు. పక్కా వ్యూహాలు రూపొందించి ప్రత్యర్థులను బిత్తర పోయేలా చేయడంలో ఆమె దిట్ట. ఇప్పుడు యుపిలో నాలుగు రాష్ట్రాలు అని ఆమె మూడు కూటములకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎస్‌ఆర్‌సి అలాగే మళ్ళీ తెలంగాణ చర్చలోకి వస్తోంది. 

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేయబోయే రెండో ఎస్‌ఆర్‌సి పరిధిలోకి తెలంగాణను కూడా తెస్తారని కొందరు గట్టిగా చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నిజంగానే రెండో ఎస్‌ఆర్‌సి వేసి కొత్త కొరివిని కొని తెచ్చుకుంటుందా అన్నది ఆలోచించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు చిన్నరాష్ట్రాలకు సంబంధించి అనేక డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ లాగా తెగించి పోరాడుతున్న వాళ్ళు లేకపోవచ్చు కానీ ప్రజల్లో ఆకాంక్షలు మాత్రం ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా అలాంటి డిమాండ్లను అప్పటికప్పు డు ఏదోరకంగా పరిష్కరిస్తూ వస్తునాయి. అంతేతప్ప మన దేశంలో రాష్ట్రాల విభజనకు ఒక ప్రాతిపదిక ఒక విధానం అంటూ లేదు. ఈ పరిస్థితుల్లో ఎస్‌ఆర్‌సి వేసే సాహసం కాంగ్రెస్ పార్టీకి ఉందని నేననుకోను. మహా అయి తే యూపీ గండం గడిచే దాకా ఎస్‌ఆర్‌సీ మంత్రం జపిస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ చరివూతలో కీలకమైన 2014 ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయోగాలు చేయడం నిజంగానే కొరివితో తల గోక్కోవడం అవుతుంది. 

ఎస్‌ఆర్‌సి వేయడం సులభమే, కానీ ఈ తరుణంలో దేశంలోని రాష్ట్రా లను పునర్ వ్యవస్థీకరించడం కష్టం. 1953లో వచ్చిన మొదటి ఎస్‌ఆర్‌సికే రాష్ట్రాల విభజన చాలా కష్టమయింది. ఫజల్ అలీ ఆధ్వర్యంలోని మొదటి ఎస్‌ఆర్‌సి ప్రక్రియను, సిఫార్సులను అంబేద్కర్ మొదలు రాజగోపాలచారి దాకా చాలామంది విమర్శించారు. రాష్ట్ర విభజనకు కమిటీ ఎన్నుకున్న పద్ధతిని, ప్రామాణికతను అంబేద్కర్ తప్పుపట్టారు. దక్షిణ భారతదేశాన్ని అనేక ముక్కలు చేసి ఉత్తరభారత దేశంలో ఉత్తరవూపదేశ్ లాంటి రాష్ట్రాలను విడగొట్టకుండా ఒక దేశమంతా పెద్దగా ఉంచడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి. 

నిజానికి అప్పటికి దేశం అప్పుడే స్వాతంత్రం వచ్చిన ఉద్వేగంలో ఉంది. జాతీయ భావమే తప్ప పెద్దగా ప్రాంతీయ అస్తిత్వాలు లేని రోజులవి. అప్పుడు కమిటీ ఇంకొంత శ్రద్ధ పెట్టినా, లేదా శాస్త్రబద్ధంగా ఆలోచించినా ఇప్పుడు ఇన్ని చిక్కులు ఉండేవికాదు. అయినా ఆ కమిటీ ప్రజల ఆకాంక్షలను గుర్తించనట్టే ప్రభుత్వం కూడా ఆ కమిటీ నివేదికను గౌరవించలేదు. ముందుగా తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలు రెండూ ఏర్పాటు చేసి 1961-62 ఎన్నికల తరువాత కొత్తగా ఏర్పడే తెలంగాణ తొలి శాసనసభ ఆమోదిస్తేనే రెండు రాష్ట్రాలను కలిపి ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు చేయాలన్న సిఫారసును అప్పటి కాంగెస్ పెద్దలు బుట్టదాఖలా చేసారు. ఆ ద్రోహం ఇప్పటికీ తెలం గాణ ప్రజలను వెంటాడుతూనే ఉన్నది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ తెలంగాణను రెండో ఎస్‌ఆర్‌సికి నివేదించాలని అనుకుంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ట అవుతుంది. తెలంగాణ విషయంలో ఇప్పుడు కేంద్రం చేయాల్సింది, మొదటి ఎస్‌ఆర్‌సిని గౌరవించడం. లేదా యూపీ ఏ రూపంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చివున్న హామీలను, నెరవేర్చడం. అంతే తప్ప యూపీ నాటకం లో ఏపీ సమస్యను కలిపితే మొదటికే మోసం ఉంటుంది. 

అయినా తెలంగాణ సమస్య కొత్తది కాదు. ఈ ప్రాంతానికి ఇప్పటికే ఒక నిర్వచనం మాత్రమే కాదు, చరిత్ర కూడా ఉన్నది. అదంతా మొదటి ఎస్‌ఆర్ సిలో రికార్డ్ అయి ఉన్నది. చరివూతలో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు గత అరవై సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. అంతే కాదు ఉద్యమాలు సాగినప్పుడల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలు వేసి ఉన్నాయి. ఇప్పటికే కనీసం పది పన్నెండు కమిటీలు తెలంగాణకు అన్యా యం జరిగిన సంగతి తేల్చి చెప్పాయి. అలాంటి తెలంగాణను మళ్లీ ఎస్‌ఆర్‌సి పరిధిలోకి తేవడం పార్లమెంటరీ సాంప్రదాయానికి కూడా విరు ద్ధం. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ పేరుతో దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నామని, ఆ ప్రక్రియ మొదలు కాబోతున్నదని కేంద్ర దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. డిసెంబర్ 10న పార్లమెంటులో చిదంబ రం చేసిన తెలంగాణ ఏర్పాటు ప్రకటన ఇంకా అలా గే సజీవంగా ఉన్నది. దానిపై అదే పార్లమెంటులో కనీసం రెండు మూడు సార్లు చర్చ కూడా జరిగింది. చివరి సారి చర్చ సందర్భంగా కూడా కేంద్ర హోంమంత్రి త్వరలోనే పరిష్కరిస్తామని సభకు హామీ ఇచ్చారు. ఇప్పు డు తెలంగాణకు కావాల్సింది కేవలం రాజకీయ నిర్ణయం. 

ఎస్‌ఆర్‌సి రాజకీయ నిర్ణయాలు తీసుకోదు. అది కేవలం ప్రభుత్వ విధివిధానాలు అనుసరించి రాష్ట్రాల మధ్య సరిహద్దులు గుర్తిం చి ఆయా రాష్ట్రాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను చర్చిస్తుంది, తెలంగాణ రాష్ట్రం కొత్తగా సరిహద్దులు గుర్తించాల్సినది కాదు. చరివూత పొడుగు నా తెలంగాణ ప్రాంతం ఉన్నది. రాష్ట్రంగా తెలంగాణలో ఏయే ప్రాంతాలు ఉన్నాయో మొదటి ఎస్‌ఆర్‌సి గుర్తించింది. మొదటి ఎస్‌ఆర్‌సి పాతది, ఇప్పటి ప్రజల అభివూపాయం కావాలని అనుకున్నా ప్రభుత్వం ఏడాది క్రితం వేసిన శ్రీకృష్ణ కమిటీ ఇప్పటికే ఆ పని చేసి పెట్టింది. బహుశా చరివూతలో ఏ రాష్ట్ర ఏర్పాటుకు జరగనంత సుదీర్ఘ ప్రక్రియ ఇప్పటికే తెలంగాణ విషయంలో జరిగిపోయింది. ఈ దశలో తెలంగాణను ఎస్‌ఆర్‌సి పరిధిలోకి తెచ్చి నైతిక, రాజ్యాంగ, పార్లమెంటరీ సాంప్రదాయాల ఉల్లంఘనకు కేంద్ర వూపభుత్వం పాల్పడుతుందా? నిజాయితీ ఉంటే అలాంటి పని చేయకూడదు. కానీ ఇటీవల కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిజాయితీతో ఉండక పెట్టుబడులకు లొంగిపోతున్నందు న ఇప్పుడు ఈ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అందుకే ప్రభుత్వాల నిజాయితీకి ఇదొక పరీక్ష. ఒక్క ప్రభుత్వాలకే కాదు. తెలంగాణ కోసం పోరాడుతున్నామని మాట్లాడుతున్న అందరికీ ఇది పరీక్షే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ పరీక్షకు నిలబడాల్సి ఉంది. రేపో మాపో హైదరాబాద్ రానున్న గులాం నబీ ఆజాద్ తెలంగాణ ఏర్పాటు రోడ్ మ్యాప్ మినహా ఎస్‌ఆర్‌సి సహా ఇంకొక వంకర ప్రకటన ఏది చేసినా తిప్పికొట్టి తీరాలి. 

పొఫెసర్ ఘంటా చక్రపాణి 
రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్: ghantapatham@gmail.com     Namasete Telangana News Paper Dated 11/11/2011

No comments:

Post a Comment