Sunday, September 1, 2013

చిన్న రాష్ట్రాలు-ఎస్సీ వర్గీకరణ-రాజ్యాధికారం By -బత్తుల రాంప్రసాద్


దేశంలో ప్రతి అంశం కుల పునాదుల మీద నడుస్తూ, తరాలు మారినా కుల వివక్ష సమసిపోవడం లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశించిన కుల రహిత సమాజం ఏర్పాడాలని, రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తే, వాటిని సరిగ్గా అమలు చేయడంలో పాలకవర్గాలు విఫలమయ్యాయి. దేశంలో పీడిత వర్గాలు భవిష్యత్తులో రాజ్యాధికారం సాధించాలని, వారు ఐక్యతతో మెలిగి హిందుత్వ కుల సమాజ పునాదులను బద్దలుకొట్టి పాలితులుగా ఎదగాలన్నారు. కానీ నేడు దోపిడీ వర్గాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి, తమ సొంత కులాలలోనే అసమానతల ఎర చూపి, వర్గీకరించాలనడం విషాదం. వాస్తవాల కు దూరంగా వున్న కల్పిత లెక్కల ఆధారంగా, అర్ధరహిత ఉద్యమాలతో స్వలాభం పొందుతూ సొంత కులాలకు అన్యాయం చేస్తున్నారు. 

ఆంధ్రవూపదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోనున్నది. ఈ రెండు రాష్ట్రాల్లో రాజ్యాధికారం సాధించాలంటే రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణ అంశాన్ని బొందపెట్టాలి. అందుకోసం కేంద్ర గణాంక శాఖ 2011 జనాభా లెక్క లు, అందులో ఎస్సీల జనాభా వారి స్థితిగతులను సూక్ష్మంగా అధ్యయ నం చేయవలసిన అవసరం ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో జనాభా 8,45,80,777. ఇందులో ఎస్సీల జనాభా 1,38,78,078. ఇది రాష్ట్ర జనాభాలో 16.41 శాతం. 2001 రాష్ట్ర జనాభాలో ఎస్సీల జనాభా 1,23,39,496. ఇందులో ఎస్సీల జనాభా 54 లక్షలు. (16.19 శాతం). గత పదేళ్లలో ఎస్సీల జనాభా 0.22 శాతం అభివృద్ధి చెందింది. ఇందులో షెడ్యూల్డ్ కులంలోని 60 కులాలలో ప్రధానకులాలైన మాల, మాదిగల జనాభా 91 శాతం ఉంటే, మిగతా తొమ్మిది శాతం 58 కులాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో ఎస్సీల జనాభా ప్రధానంగా ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని కడప, చిత్తూరు జిల్లాల్లో 80శాతం మాలల జనాభా ఉండగా, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మాదిగల జనాభా ఎక్కువగా ఉన్నది.

తెలంగాణ ప్రాంతంలోని ఎస్సీల జనాభాలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ మాలల జనాభా ఎక్కువగా ఉన్నది. గతం లో రంగాడ్డి జిల్లాలటో మాదిగల జనాభా ఎక్కువగా ఉండేది. కానీ అటు ఆంధ్రా నుంచి షెడ్యూల్డ్ కులాలలోని మాలలు రంగాడ్డి జిల్లాలో స్థిరపడడంతో కొంత ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్‌లో కలవడం వల్ల మాల, మాదిగల జనా భా దాదాపు సరిసమానమైంది. మొదటి నుంచి వరంగల్, నల్గొండ జిల్లాల్లో మాదిగల జనాభా ఎక్కువే. మహబూబ్‌నగర్ జిల్లాలో పట్టణ ప్రాంతా ల్లో మాలలు అధికంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో మాదిగలు ఎక్కువగా ఉన్నారు. మాలలకు కుల వృత్తిలేని కారణంగా ఏ ప్రాంతమైతే అభివృద్ధి చెందు తుంటుందో, ఆ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడతారు. దీంతో ప్రతి జిల్లాల్లో మాలల జనాభా పెరిగి ఆంధ్రాలోని 13 జిల్లాల్లో, తెలంగాణలోని ఏడు జిల్లాల్లో సంఖ్యాపరంగా మాలలు ఎక్కువగా ఉన్నా, స్థిరాస్తులు (భూమి, ఇల్లు) ఉద్యోగాలలో, మాదిగలకు కులవృత్తి కారణంగా, ప్రభుత్వాలు కుల వృత్తి గల వారికి ప్రత్యేక పథకాలతో ఆర్థికంగా సహాయం చేయడంతో మాదిగలు ఆర్థికంగా బలపడ్డారు. ముఖ్యంగా రిజర్వేషన్ల లబ్ధి మాలలే ఎక్కువ పొందారని, ఉద్యోగాల్లో మాలలే ఎక్కువని, మాదిగలు తక్కువ అన్న ప్రచారం అబద్ధమని తేలింది.

ఉన్నత పదవిలో ఉన్న పదుల సంఖ్యలో ఉన్న మాల అధికారులను చూసి, వేల సంక్యలో ఉన్న మిగతా మాదిగ ఉద్యోగుల సంఖ్యను చెప్పకుండా అధికారులంతా మాలలే అని, మాదిగలు రిజర్వేషన్ల లబ్ధి పొందలేదని గోబెల్స్ ప్రచారంతో తప్పుడు లెక్కలు చూపారని తేలింది. అసలు రిజర్వేషన్లను ప్రస్తావించడం అప్రజాస్వామికం. దీనికి షెడ్యూల్డ్ కులాల వర్గీకరణాన్నే ఏకైక పరిష్కారమని వితండవాదంతో, స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేస్తూ, సమాజంలో భయాందోళనలు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. రెండు రాష్ట్రాలలో దళిత వర్గాలు రాజ్యాధికారం కోసం పయనించకుండా అగ్రకుల ఆధిపత్యానికి ఊతమిస్తూ వారికి సహకరిస్తున్నట్టుంది. ఎస్సీలలోని మాదిగలు ఆర్థికంగా భూమి, ఇండ్లు, ఉద్యోగ, కులవృత్తి రంగాల్లో ముందంజలో ఉన్నా రు. జనాభాపరంగా మాలలు ఎక్కువగా ఉన్నా ఆర్థికంగా వెనుకంజలో ఉండి, కేవలం విద్యలో కొంత శాతం ముందంజలో ఉన్నారని తెలుస్తోంది.

ఇలాంటి అంశాలను పరిశీలించకుండా ఎస్సీ వర్గీకరణ గూర్చి రాజకీయ పార్టీలు స్మూక్ష పరిశీలన చేయకుండా హిందు త్వ భావజాలంతో స్పాన్సర్డ్ ఉద్యమాలకు, మీడియా ప్రచారాలకు ఎమ్మార్పీఎస్ బ్లాక్‌మెయిలింగ్‌లకు వత్తాసు పలుకుతున్న రాజకీయ పార్టీలు తమ వ్యవహారశైలిని మానాలి. రిజర్వేషన్లు మొదలైన నాటి నుంచి నేటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల మొత్తం శాతంలో కనీసం సగం కూడా పూర్తి చేయలేకపోయిన పాలక ప్రభుత్వాలు అతి కష్టంగా అయిష్టంగానైనా అమలుపరిచి న రిజర్వేషన్ లబ్ధిలో ఓ కులం ఎక్కువ పొందిందని, ఓ కులం వెనుక బడిందని ఎస్సీల ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం జాతీయ అంశమని తెలిసినా, జాతీయస్థాయిలో ఈ సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో ఒక రాష్ట్రంలో ఒక కులం ముందంజలో ఉంటే, మరో రాష్ట్రంలో ఇంకో కులం ముందంజలో ఉండొచ్చు. 

అదేవిధంగా జిల్లాల్లోనూ పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్లు, అంటరానితనం, ఆర్థిక వెనుకబాటుతనం, వివక్ష ప్రామాణికాలను మరిచి రిజర్వేషన్లకు ఆర్థిక కోణంలో కొలుస్తున్నారు. దేశవ్యాప్తంగా అంటరానితనం, వివక్ష రూపం మార్చుకున్నదే తప్ప సమసిపోలేదు. దేశ, దశ దిశా నిర్దేశకులు, చిన్న రాష్ట్రాల స్ఫూర్తివూపదాత అంబేద్కర్ ఆశించిన ఆశయాలు సాధించాలన్నా, దళిత, బహుజనులు పాలకులు కావాలన్నా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన చెప్పిన బాటలో నడవాలి. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సహకరించి కొత్త రాష్ట్రంతో పాలనా సౌలభ్యంతో దళిత, బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడి సాధించుకుందాం.

-బత్తుల రాంప్రసాద్
మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు


Namasete Telangana Telugu News Paper Dated : 01/09/2013 

No comments:

Post a Comment