Saturday, December 24, 2011

ఆమె దారి ఆదర్శం..!



img131-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణ రాష్ట్రం వస్తే బొమ్మరిల్లులా దిద్దుకుంటం’ అని ఏర్పడబోయే కొత్త రాష్ట్రం రూపురేఖలను, స్వభావాన్ని నాడే తేల్చి చెప్పింది టి.ఎస్. సదాలక్ష్మి. ప్రత్యేక రాష్ట్రం పట్ల తన ఆకాంక్షతో పాటు, స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న ఆమె 1969 నాటి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆమె తన ఉద్యమ ఆచరణ ద్వారా గడించిన అనుభవం, పోరాట పటిమల గురించిన వివరమంతా తెలంగాణ చరివూతలో ముఖ్యభాగమే.

ఒక తల్లి తన పిల్లలకు వివరిస్తున్న తీరులో తన చివరిరోజుల్లో సైతం, ‘ఎప్పుడైనా.. తెలంగాణ రావాలంటే చెయ్యాల్సింది ఒక్కటే’ అని కరాఖండిగా చెప్పారు. ‘తెలంగాణలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చుండి ఒక నిర్ణయం తీసుకుని, మాకు తెలంగాణ రాష్ట్రం కావాలె మేం సపరేటవుతమని గట్టిగా నిర్ణయించుకుంటే, తప్పకుండా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టగలుగుతారు. ముందయితే మీరు ఏకతాటిమీదకు రాండ్రి!’ అని సూటిగా చెప్పగలగడానికి తన సుదీర్ఘమైన రాజకీయ ఉద్యమ జీవిత నేపథ్యమనే చెప్పుకోవాలి. తెలంగాణలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చుండి ఒక నిర్ణయం తీసుకోవాలని సదాలక్ష్మి చెప్పిన ప్రకారంగా 1969 నాటి తొలి దశ ఉద్యమంలో గానీ లేదా మలిదశ ఉద్యమం నాటికి గానీ తెలంగాణలోని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది.

ఈ రకమైన ఐక్యత కోసమే కేసీఆర్ తన ఆమరణ నిరాహారదీక్ష తరువాత అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలవడం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఐక్యపోరాటాన్ని వివిధ అంచెలుగా ఉద్యమాన్ని కొనసాగించడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిసెంబర్ 23 ప్రకటన వెలువడి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఉద్యమం సకల జనుల సమ్మె స్థాయిని అందుకున్నప్పటికీ తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చుండి ఒక నిర్ణయం తీసుకోవాలని సదాలక్ష్మి చెప్పిన ప్రకారంగా ఐక్యం కాలేకపోవడం దారుణం. ఆరు దశాబ్దాలకుపైగా తెలంగాణ ప్రజలు రాష్ట్రం కోసం దశలవారీగా పోరాటం చేస్తున్నారు. అనేక వైవిధ్యాల ప్రజాసమాజాలైన ఉత్పత్తి కులాలు, ఉత్పత్తియేతర ఆధిపత్య కులాలు, తెగలు, దళిత కులాలు, మతాలు ఈ ఉద్యమంలో భాగమయ్యాయి.

సమాజంలో అన్ని రంగాలు వైద్య, న్యాయ, విద్య, విద్యుత్తు, రక్షణ, మున్సిపల్, పారిశుద్ధ్య, అడ్మినివూస్టేషన్లలోని ఉద్యోగులు ఉద్యమంలో తమ భాగస్వామ్యాన్ని చాటారు. సమాజంలో వివిధ అంతరాలు ఉన్నట్టు, వివిధ రంగాలలో అంతరాలున్నాయి. ఉదాహరణకు అధికారి నుంచి గుమాస్తా వరకు, ఆఫీసర్ల నుంచి రోడ్లు ఊడ్చే స్వీపర్ల వరకు అంతరాలు, ఆధిపత్యాలు లేకుండా జై తెలంగాణ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు అద్భుతమైన పోరాట రూపాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్న నాలుగు తరాలు ఒక కుటుంబంలో ఉండి వారసత్వంగా పోరాటాన్ని నడిపిస్తున్నారు. సకల జనుల సమ్మె స్థాయి వరకు ప్రజలు చారివూతాత్మకమైన పోరాటం చేస్తున్నప్పటికీ, రాజకీయ పార్టీలు, నాయకులు ఎప్పటికప్పుడు ప్రజల ఆకాంక్షలను అణచివేస్తూ ప్రజావూదోహులుగా కొనసాగుతూ వస్తున్నా రు.

కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ద్రోహాలు ఒక క్రమం అయితే స్థానికంగా తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు నేతలు చేసిన ద్రోహం మరొక క్రమంగా చెప్పుకోవాలి.
తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతమంది సీమాంధ్ర పెట్టుబడిదారులకు, ఢిల్లీలో తిష్ట వేసిన కాంగ్రెస్ పార్టీలోని దోపిడీశక్తులకు తొత్తులుగా మారారు. వారి బానిసబుద్ధికి మించిన ద్రోహబుద్ధి మరొకటి లేదు. వీరు చేసే దుష్ట చేష్టల వల్లనే తెలంగాణ మోసం మీద మోసం జరుగుతున్నది. అది పెనం నుంచి పొయ్యిల పడుతున్నది. ఇవి ఒకటి తర్వాత ఒకటి బయటపడ్డాయి.

1. తెలంగాణ ప్రజల డిమాండ్ ప్రకారం రాజీనామాలు చేయకపోవడం
2. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి అధిష్ఠానాన్ని ఒప్పించే సామర్థ్యం వీరికి లేకపోవడం.
3. అవకాశం చేతికొచ్చినప్పుడు కనీసం అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకపోవడం అనేది ప్రజావూపతినిధులుగా వారు నిర్వహించాల్సిన బాధ్యతను విస్మరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజావూపతినిధులు అనే మాటకు వీరు తెలంగాణ రాష్ట్రం విషయంలో పూర్తిగా అర్థం మారేలా వ్యవహరించారు. ఈ సందర్భంలో టి.ఎస్. సదాలక్ష్మి నాటి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షురాలిగా ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆ వారం పది రోజుల్లోనే ర్యాలీలు, సత్యాక్షిగహాలు, దీక్షలు, జైల్‌భరోలు, మానవహారాలు, సత్యాక్షిగహాలతో ఆంధ్ర సర్కారును గడగడలాడించారు.

ఇది ఒక ఎత్తుఅయితే 1969 మార్చి 8,9 తేదీలలో రెడ్డి హాస్టల్‌లో నిర్వహించిన కన్వెన్షన్‌తో హైదరాబాద్ మొత్తం దిగ్బంధం అయిన సంగతి నాటి ప్రధాని ఇందిరాగాంధీ తెలుసుకున్నారు. హుటాహుటిన అర్ధరాత్రి ఫ్లెట్‌కు హైదరాబాద్‌లో దిగారు అంటేనే ఆ కన్వెన్షన్ ప్రభావం ఎంత ఉందో మన ఊహించుకోవచ్చు. ఆంధ్ర గవర్నర్‌తో జాతీయ జెండాను ఎగురవేయనీయలేని గట్స్ సదాలక్ష్మివి. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందడ్డి సదాలక్ష్మి తఢాఖాకు తట్టుకోలేక బుల్లెట్ ఫ్రూఫ్‌ను ధరించారు. ఒకానొక ఆర్థిక గడ్డు పరిస్థితుల్లో తన బంగారు నగలు, వెండి సామాను అమ్మి వచ్చిన డబ్బుల తో ఉద్యమం నడిపిందని నేటికి ఆమె శిష్యులు చెబుతారు. నాయకురాలిగా నేటికీ సదాలక్ష్మి అనుభవాలు, ఆలోచనలను తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ టీడీపీ నాయకులు వ్యక్తిగతంగా, రాజకీయంగా అనుసరించక తప్పదు. అప్పుడే ప్రజావూపతినిధులుగా వారు రాజకీయ భవిష్యత్తును కలిగి ఉంటారు. లేదా రాజకీయ భవిష్యత్తు ఉండదని వారు సదాలక్ష్మి జయంతి సందర్భంగానైనా పునఃపరిశీలన చేసుకోవాలి.

-గోగు శ్యామల
తెలంగాణ మహిళా రచయితల మేధావుల వేదిక
నేడు టి.ఎస్. సదాలక్ష్మి జయంతి

No comments:

Post a Comment