Thursday, December 29, 2011

టీపీపీఎస్సీతోనే పరిష్కారం




పాలకుల భావాలే పాలితుల భావాలుగా చలమణి చేయబడుతా యి. ప్రస్తుతం రాష్ర్టంలో పబ్లిక్ సర్వీస్8 కమిషన్ కూడా అలా గే వ్యవహరిస్తోంది. అరవయేండ్లుగా తెలంగాణ ప్రాంతాన్ని తమ ప్రాంతం గా భావించని సీమాంధ్ర పాలకుల కనుసన్నల్లో, మరోసారి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ, జీవితకాలపు నిరుద్యోగాన్ని బహుమానంగా ఇవ్వడం కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తోంది. ఇప్పుడు ఆంధ్రవూపదేశ్ పబ్లిక్ సర్వీస్8 కమిషన్ పేరు వింటేనే నిరుద్యోగులు మండిపడుతున్నారు. అసపూందుకు గతం లో ఎన్నడూ లేని విధంగా కమిషన్ నిర్వీర్యమైపోతున్నది? తప్పుల తడక గా పరీక్షలు నిర్వహించడం వెనకాల ఉన్న కారణాలేమిటి? భాష విషయం లో చూపిస్తున్న నిర్లక్ష్యం ఉద్దేశపూరితమైనదేనా? చైర్మన్‌లు మారినా, సెక్రటరీలు మారినా పరీక్షల నిర్వహణలో మార్పెందుకు రావడం లేదు? సీమాంధ్ర ప్రాంతానికి ఎక్కువ ఉద్యోగాలు రావడం వెనకాల కమిషన్ ఉదాసీన వైఖరే కారణమా? ఆగమేఘాల మీద నోటిఫికేషన్‌లు వెలువరించడం వెనుకాల పాలనా పరమైన అవసరాలున్నాయా? పాలకుల ప్రయోజనాలేమైనా దాగున్నాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. 
ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం వెనక రెండు రకాల కారణాలుంటాయి. ఒకటి పాలనా పరంగా తగిన సిబ్బంది అవసరం కావడం, ఎన్నికలు సమీపించడమో, ఉద్యమాలు ఊపిరిసలుపనివ్వకపోవడమో మరో కారణం. ఈ రెండు కారణాలకంటే కిరణ్‌కుమార్‌డ్డి కార్యాచరణ వెనక మూడో కారణమొకటి కనిపిస్తున్నది. అదే అధికార పీఠాన్ని కాపాడుకోవడం. ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, కనీసం మంత్రివర్గంతోనైనా చర్చించకుండానే నిర్ణయాలను తీసుకొని అమలుచేయడం వగైరా అన్నీ గద్దె కాపాడుకోవడం కోసమేననే ది సామాన్యులకు సైతం అర్థమయ్యే విషయం. అలా ఒకవైపు పాలనా రంగంలో భారీగా ఏర్పడ్డ ఖాళీలు, కిరణ్‌కు వరంలా కలిసొచ్చాయి. దాంతో ఇక క్షణాల మీద ఉద్యోగాలు భర్తీ చేయాలని కమిషన్‌కు ఆదేశాలివ్వడం, లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు ప్రచారం చేసుకోవడం అన్నీ గంటల్లోనే పూర్తయ్యాయి. ఎప్పుడో ఐదు, పదేండ్లకొకసారి వెలువడే నోటిఫికేషన్లకే తత్తరపడిపోయే కమిషన్‌కు ఈ ఉద్యోగాల వరద ప్రాణం మీదికొచ్చింది. ఇక ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాక, ప్రభుత్వాన్ని సంతృప్తిపరిచే పనిలో పడింది. దాని ఫలితమే తప్పుల తడకగా పరీక్షపవూతాల తయారీ, పేపర్ లీకేజీలు, రాష్ర్టపతి ఉత్తర్వులకు తిలోదకాలివ్వడం వంటి పనులన్ని పరంపరగా జరగడం. వీటి మీద ఎవరైనా ప్రశ్ని స్తే కమిషన్ రాజకీయ నాయకుల మాదిరిగానే దాటవేసే ప్రయత్నం చేస్తోంది.
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్‌లలో తెలంగాణకు దక్కుతున్న ఉద్యోగాలు ఎన్ని? అని ప్రశ్నించుకుంటే, ఏ తెలంగాణ బిడ్డ గుండె అయినా రగలకమానదు. అందుకు కారణం చాపకింద నీరు లా సీమాంవూధులే మరోసారి తెలంగాణ ఉద్యోగా ల్లో తిష్టవేయడమే. తెలంగాణను ఆంధ్రాలో విలీ నం చేసేటపుడు రాసుకున్న పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కిన విషయాన్ని కొన్ని వందలసార్లు గుర్తుచేసినా సీమాంధ్ర సర్కారు మాత్రం మొద్దునివూదపోతున్నది. కనీసం రాష్ర్టప తి ఉత్తర్వులనైనా పాటించకుంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలంగాణ నిరుద్యోగులు ఆలోచించాలి. ఇటీవల డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఉద్యోగాల కోసం సీమాంధ్ర అభ్యర్థులు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్‌లతో తెలంగాణ జిల్లాల్లో అడుగుపెట్టారు. 
తెలుగు నేల మీద ఇంగ్లీషు పాలన సాగుతున్నది. తెలుగు భాషకు ప్రాచీనహోదా కల్పించి అరదశాబ్ద కాలం కూడా పూర్తికాలేదు. కానీ, కిరణ్ సర్కార్ మాత్రం భాష విషయంలో నేలవిడిచి సాము చేస్తోంది. అందుకు ఇటీవల వెలువడిన గ్రూప్1 ఫలితాలే సజీవ సాక్ష్యం. 400మంది అభ్యర్థులను మెయిన్స్‌కి ఎంపిక చేస్తే అందులో 320మంది ఇంగ్లీషు మీడియం అభ్యర్థులే ఎంపికయ్యారంటే పబ్లిక్ సర్వీస్8 కమిషన్‌కు ఆంగ్లం పట్ల ఉన్న ప్రీతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థుల్లో కూడా, తిరుపతి కేంద్రంలోనే ఎక్కువమంది ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 
ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన ఏ పరీక్షను చూసిన ఒక్కటి కూడా సమర్థవంతంగా నిర్వహించలేదు. 2008లో ఇచ్చిన జూనియర్ లెక్చరర్‌ల నోటిఫికేషన్‌కు ఇదే నెల మొదటి వారంలో పరీక్ష నిర్వహించింది. దాంతో అభ్యర్థుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. సబ్జెక్ట్ విషయం ఫర్వాలేదు కానీ, 150 ప్రశ్నల జనరల్ స్టడీస్8లో 63 ప్రశ్నలు అనువాదం చెయ్యకుండానే ఇచ్చారు. ఇది ఎందుకిలా జరిగిందో ఎవ్వరికీ అంతుపట్టలేదు. కనీసం కమిషన్‌కైనా అర్థమయ్యిందా అంటే అదీ లేదు. లేదా అభ్యర్థులు ఎక్కువమం ది ఉండడం వల్ల ఇంగ్లీషు నైపుణ్యమున్న అభ్యర్థులనే ఎంపిక చేద్దామని కమిషన్‌లోని అధికారులు, చైర్మన్, సెక్రటరీలు నిర్ణయించుకున్నారా? అన్నది అర్థం కానీ విషయమే.
డిగ్రీ లెక్చరర్ పోస్టులది మరో అరిగోస. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్. దీంతో పిహెచ్‌డీలు చేసి, నెట్‌లు క్వాలిఫై అయి, పరిశోధనలను సైతం పక్కన పడేసి ఉద్యోగవేటకు సిద్ధమయ్యారు. కానీ, ఏం లాభం ఎప్పటిలాగే కమిషన్ మొద్దు నిద్రతో సర్దుకోవాల్సిన వాళ్లు సర్దుకొని, అప్పనంగా సీమాంధ్ర ప్రాంతమే తన్నుకపోయిం ది. ‘ఊహించిన’ విధంగానే తెలంగాణకు మరోసారి అన్యాయమే జరిగిం ది. డీఎల్ పరీక్ష జరిగిన మరుసటి రోజే ఆంధ్రా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పేపర్ లీక్ చేసి, తన అయిదుగురు శిష్యులకు ఉద్యోగాలు వచ్చేందుకు చక్రం తిప్పాడని రాష్ర్టవ్యాప్తంగా వార్తలు గుప్పుమన్నాయి. అయినా ప్రభుత్వంగానీ, కమిషన్‌గానీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్ని సబ్జెక్టుల్లో తెలంగాణకు దక్కిన ఉద్యోగాలను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఒక్క అర్థశాస్త్రం సబ్జెక్టులో 26 పోస్టులు ఉంటే 23 ఆంధ్రాకు, మూడు మాత్రమే తెలంగాణకు దక్కాయి. అలాగే మరికొన్ని సబ్జెక్టుల్లో ఒక్కటి రెండు పోస్టులు మాత్రమే తెలంగాణను వరించాయి. దీని వెనుకాల సీమాంధ్ర అభ్యర్థుల ప్రతిభాపాటవాలు ఎలా ఉన్నా, కమిషన్ నిర్లక్ష్యం, ఉద్దేశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీలో- రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు తెచ్చిపెట్టుకున్న చైర్మన్‌లు చేసిన మోసం, దగా తెలంగాణ బిడ్డలు ఎప్పటికీ మరువలేరు. రాతపరీక్షలో టాప్‌లో ఉన్నవారిని కాదని అప్పుడున్న చైర్మన్ లంచాలకు మరి గి, అనేకమంది రాయలసీమ వారికే ఉద్యోగాలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల విషయంలో మళ్లీ అదే పొరపాటు కావాలనే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ర్టపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో తెలంగాణ వారినే నియమించాలి. కానీ, కమిషన్ ఈ ఉత్తర్వులను తోసిపుచ్చి, గతవారమే పోస్టింగ్ ఆర్డర్‌లను ఇచ్చింది.
ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో పరీక్షలు రాసే పరిస్థితి లేదన్నది వాస్తవం. ఒకవైపు సుదీర్ఘ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి తెలంగాణ విద్యార్థులు ఉద్యమంలో పోషించిన పాత్ర చరివూతత్మకమైంది. అటువంటి ఉద్యమ వాతావరణాన్ని విచ్ఛిన్నంచేసి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులను ఉద్యమబాట నుంచి వేరు చేయడం కోసమే కిరణ్ సర్కార్ ఉద్యోగాల భర్తీ పేరుతో కుట్రకు పాల్పడింది. ఇప్పటికే మూడుతరాలు నిర్వీర్యమైన తెలంగాణ సమాజంలో ఏ విద్యార్థికైనా భవిష్యత్తుపట్ల ఒకింత భయమే ఉం టుంది. కన్నవారి కలలు నిజం చేయడం కోసం పోటీపరీక్షలకు సిద్ధమయ్యారు. కానీ, ప్రభుత్వం వారి ఆశలను అడియాసలు చేసిం ది. వేరే ప్రాంతానికి చెందినవారు తమ ప్రాం తానికి వచ్చి పాఠాలు చెబితే ఈ పోరుబిడ్డలు ఆ పాఠాలు వింటారా? అన్నదమ్ముల్లాగా విడిపోదామని ఓపికతో ఉన్న తెలంగాణ ప్రజల సహనానికి ఎందుకీ పరీక్షలు? 
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో జరిగిన దశాబ్దాల అన్యా యం భూమికగా పురుడుపోసుకున్నది. ప్రభు త్వం తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ అందరూ కండ్లు తెరచి చూస్తుండగనే మరోసారి తీరని అన్యాయానికి పాల్పడుతున్నది. అసలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలంటే తక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్8 కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణకు దక్కితే కనీస అభివృద్ధికైనా నోచుకుంటుంది. ఇప్పుడు మార్చాల్సింది పబ్లిక్ సర్వీస్8 కమిషన్ చైర్మన్‌నో, సెక్రటరీనో కాదు, మొత్తం గా కమిషన్‌ను మార్చాలి. ఇంత ఉద్యమం జరుగుతున్నా, ఇన్నివందల మంది బలిదానాలు చేసుకున్న సమయంలో సీమాంధ్ర సర్కారు మరోసా రి తెలంగాణ ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నది. ఇప్పుడు తెలంగాణ విద్యార్థిలోకంతో పాటు చదువులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు డిమాండ్ చేయాల్సింది రీఎగ్జామ్‌ల కోసమో, లేకపోతే పరీక్షల రదు ్దకోసమో కాదు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడేలోపు ఉద్యోగాల వాటాలో భద్రత కోసం ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్8 కమిషన్’ను డిమాండ్ చేయాలి. ఇందుకోసం టీఎస్8 జేఏసీ, ఉద్యోగ జేఏసీతో పాటు, రాజకీయ జేఏసీలు ఉద్యమించాలి. 
-పసునూరి రవీందర్
డాక్టోరియల్ ఫెలో, సెంట్రల్ యూనివ

Namasete Telangana News Paper Dated 29/12/2011

No comments:

Post a Comment