Monday, November 19, 2012

దళితన్నా నువ్వెటు?-----సుజాత సూరేపల్లి




గీతారెడ్డికి కోపం వచ్చింది. గీతాడ్డి అంటే ఆనాడు అసెంబ్లీలో ఎవరికీ తలవంచకుండా, తెలంగాణ కోసం నిర్భయంగా మాట్లాడి , పోట్లాడిన ఈశ్వరీబాయి, తెలంగాణ అమరవీరుల స్తూపం కోసం కృషి చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ, రచయిత కూతురు ‘గీత’ కాదు. ఒక నాన్ తెలంగాణ రెడ్డిని చేసుకుని పేరుని కూడా మార్చుకుని ‘గీతాడ్డి’గా రూపాంతరం చెందిన దళితడ్డి మహిళా మినిస్టర్ ‘గీతాడ్డి’. ప్రొఫెసర్ కోదండరాం గీతాడ్డిని జహీరాబాద్, విద్యార్థిజేఏసీ పదిరోజుల పాదయాత్ర ముగింపు సభలో, ‘కర్రు కాల్చి వాత పెడితే తెలంగాణ వస్తుంది, ఆ తల్లికి ఎట్లా పుట్టిందో’ అని అనడం ఇక్కడ పెద్ద వివాదాస్పదమైంది. ఒక టీవీ చానల్, దానికి సంబంధించిన పేపర్ రాసిందే రాసి, వేసిందే వేసి, గీతా‘డ్డి’ గారిని అడిగిందే అడిగి పండుగ చేసుకున్నది. నిజానికి మహిళలని, దళితులని ఇంకా కింది కులాలని ఎవరు ఏ విధంగా కించ పరిచినా క్షమాపణ చెప్పాల్సిందే. కోదండరాం చెప్పడం జరిగింది. ఇక్కడ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి-ఇంకా ఇతర రెడ్డిమినిస్టర్ మహిళలు ఉండగా ఎందుకు గీతాడ్డిని మాత్రమే అనవలసి వచ్చింది? రెండు- మహిళ అయి ఉండి, దళితురాలు అయిన గీతాడ్డిని అనడం సబబేనా? ఈ రెంటికి సమాధానం చెప్పాల్సిన సందర్భం, సమయం ఇది.
ఒక మినిస్టర్ గీతాడ్డిని ఒకటి రెండు మాటలు అనడం ఇవాళ దళిత సంఘాలకు కోపం వచ్చింది. ఎన్నడూ లేనిది గీతాడ్డి నోట్లోంచి మాదిగ పేరు వినపడింది, నిజానికి ఆమె మాల మినిస్టర్‌గా మాత్రమే చాలామంది మాదిగలకి ఇతర కులాలకి తెలుసు.


ఇప్పుడు పదవిలో ఉన్న మాదిగలను ఎంత టార్గెట్ చేస్తుందో, ఎన్ని కుట్రలు, కుతంవూతాలు పన్ని వారిని దింపే ప్రయత్నాలు చేస్తుందో బయటికి చెప్పుకునే పరిస్థితిలో మాదిగలు లేరు. మాల కంటే ఎక్కువ రెడ్డి మినిస్టర్‌గా ఆ నియోజకవర్గంలో ఉన్న దళిత సంఘాలకి అందరికి తెలుసు, బయట ఉన్న ఇతర కులాలకి తెలుసు. ఆమె పోలేపల్లి పోరాటంలో దళితులందరూ భూములు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంటుంటే పరిక్షిశమల మినిస్టర్‌గా ఉండి దళితులకు ఏమాత్రం అండగా నిలబడిందో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆవిడ నియోజక వర్గంలో ఉన్న నాలుగు మండల ఇన్‌చార్జ్‌లలో ఉన్న మాదిగలను తీసేసి రెడ్డిలను పెట్టడం, యూత్ కాంగ్రెస్ మాదిగని మార్చేసి రెడ్డిని పెట్టడం కూడా ఆమె నమ్మిన దళిత సిద్ధాంతానికి నిదర్శనం. ఈ మాటలు చెప్పింది జహీరాబాద్ సభ నిర్వహించిన ఆశప్ప. అదికూడా గీతారెడ్డి గారు చానల్ నిర్వహించిన కార్యక్షికమంలోనే. అక్కడ పదిరోజులు పాదయాత్ర చేసింది అంతా దళితులే అని, కనీసం ఒక్క రోజు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలుపలేదని, గీతాడ్డి గారు పోలీసు వాళ్లకి చెప్పి ఎక్కడ షెల్టర్ కూడా దొరక నీయకుండా చేసిందని వాపోయాడు. దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడడం కానీ, రాయడం కానీ ఆ పత్రిక, చానల్ చేయవు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మసాల లేదు.




కోదండరాం కానీ, నాకు తెలిసి ఏ నాయకుడు అయినా మాట్లాడే వారు ఏ మీటింగ్‌కు పోయినా, అక్కడి ప్రాంత పరిస్థితుల్ని, సభ నిర్వహించిన వారి కోరిక మేరకు మాట్లాడుతారు. అక్కడ గీతాడ్డి గురించి మాట్లాడారంటే సభ నిర్వాహకులు చెప్పిన విషయాలని బట్టే మాట్లాడారు. అందులో మినిస్టర్‌లను టార్గెట్ అనుకున్నారు కాబట్టి అక్కడ దళిత మినిస్టర్‌లను తిట్టకూడదని ఏ రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ ప్రజలు అమలు పరచలేదు. అయితే అక్కడ కోదండరాం ఉండబట్టే అంత కథ. ఇంకా వేరే దళితుడు ఉంటే? ఇక్కడ ఎవరిని అనాలని సమర్థించడం కాదు. ప్రభుత్వం తొడుగు తొడుక్కున్నాక, దళితుల పక్షాన ఎన్నడూ నిలబడని వారు మాట్లాడే మాటలు కాదు అని చెప్పడమే. కులంతోని దళితత్వం రాదు. మనం ఆచరించిన విధానాలతోని వస్తుంది. మనం నమ్మిన సిద్ధాంతాలతోని వస్తుంది. నిజానికి దళితులంతా ఈ అగ్రకుల బానిసలు, మనువాదులు కాకుండా ఉంటే ఈ రోజుకి ఇన్ని అత్యాచారాలు, ఇంత వెనుక బాటుతనం ఉండేది కాదు. తెలంగాణ విషయంలో మంత్రులంతా బాధ్యత వహించాలి అన్నది ఇక్కడ డిమాండ్. కానీ దళిత మినిస్టర్లు, మహిళలు మాత్రమే అని ఎక్కడ లేదు. తెలంగాణ ప్రజలంతా ఈ దళిత, ఆదివాసీ బడుగు వర్గా ల రాజకీయ నాయకులని కొంతకాలంగా చూస్తూనే ఉన్నారు. అటు చూస్తే కాంగ్రె స్ సోనియమ్మ భక్తులు, ఇటు చూస్తే చంద్రబాబు గులాములు.



వీరిని కాదని తెలంగాణ కోసం స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఉద్యమంలో పాల్గొన్న దళితులు కానీ, అగ్ర కులాల వాళ్ళు కానీ చాలా తక్కువ. వచ్చినా వెంటనే మరొక అగ్రకుల పార్టీలోనే, ఇండిపెండెంట్ గానో మిగిలిపోయారు. నిన్న కాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీ లో ఉరి వేసుకున్న సంతోష్ దళితుడే. ఈ ఆంధ్రా పాలనలో మాలాంటి వాళ్ళు ఎన్ని చదువులు చదువుకున్నా ఉద్యోగం రాదు, ప్రభుత్వాలు, పాలకులు మారినా ఏమీ పరిస్థితులు మారలేదు’ అని సూసైడ్ నోట్ రాశాడు. ఏ ఒక్క దళిత మినిస్టర్‌కి గానీ, ఇతర నాయకులకి, సంఘాలకి చీమ కుట్టినట్టైనా లేదు. పది తరువాత పదకొండు చావులు అని సరి పుచ్చుకున్నాయి. లెక్కలు పెట్టుకోవడానికి కూడా బద్ధకమే కదా! ఇక్కడ వ్యవస్థ ని, ప్రభుత్వాలని గురించి మాట్లాడినపుడు అందరూ భాగస్వాములే. అయినా వారి జీవితంలో ఎప్పుడైనా దళితులకి, ఇతర అణగారిన కులాలకి ఏమైనా చేస్తే అది ప్రజలే చెపుతారు కదా. ఏ చానల్ కానీ, పేపర్లు కానీ నెత్తిమీదికెత్తుకోనక్కర్లేదు. గీతాడ్డి గారే స్వయంగా చెప్పినది, వారి నాయకుడు జానా‘డ్డి’ మాట జవదాట లేమని, వారికి కొన్ని పరిమితులు ఉంటాయని. దీనర్థం మా దళిత పిలగాం డ్లు ఎంత మంది చచ్చినా కూడా నేను రెడ్డి వారి మాటనే వింటాను అని చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చా మేడం మినిస్టర్? ఈశ్వరీబాయి నిజమైన ప్రజాస్వామిక నేత. ఆ కాలంలోనే అన్ని పరిమితులను దాటి సభలలో, రాతలలో నిర్భయంగా తన అభివూపాయాన్ని బల్లగుద్ది చెప్పారు. ఈశ్వరీబాయికి, గీతారెడ్డికి పోలిక ఎక్కడ? అన్నది సందర్భం.



కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని, కాంగ్రెస్ వారి ఉప్పు, కారం తినుకుంటూ, దళిత ‘గీత’ ని రెడ్డి కులంగా మార్పు చెందినపుడు మీరు ఎటువైపు ఉన్నారన్నది ప్రజలు మీకు ఇవ్వాల్సిన కితాబు. నాలుగు సంఘాలు కావు, ఇన్ని ఏండ్లు ఎన్నిసార్లు మీ దళితుల కు మరిచిపోలేని కార్యక్షికమాలు చేశారో గుర్తుకు తెచ్చుకోండి. ఎంతమందిని అభివృద్ధి పథంలోకి తెచ్చారు, ఎన్నిసార్లు తెలంగాణ ఆకాంక్షని బయటపెట్టారు? మీ కులంలో కనుక రెడ్డి లేకపోతే మీకు ఇన్ని పదవులు వచ్చి ఉండేవా! అన్నది కూడా ఒక్కసారి మీరు పరిశీలించాలి. సత్యసాయి బాబా గారికి సంబంధించిన ఆస్తి పాస్తుల విషయంలో మీరు అతి సన్నిహిత మనిషి అని తెలిసినపుడే అర్థం అయింది మీరు ఎంత పెద్ద వారో. మీలో ఏ మూలనో దాగి ఉన్న దళితత్వం ఇపుడు ఇంతగా బయటికి వచ్చిందంటే, అందునా మీరు మాదిగలకి నాయకత్వం ఇవ్వాలని మాట్లాడినారంటే మాదిగ దళిత యువతకి ముందుగా అభినందనలు చెప్పాలి. కనీసం ఇట్లాంటి సంద ర్భం లోనైనా మనం నిజాలు మాట్లాడుకుంటాం.



మీ దాకా వచ్చిందంటే ఇంత బాధ పడుతున్నరే మరి, దళిత బిడ్డలు నాయకులు ఎక్కువగా పాల్గొన్న తెలంగాణ ఉద్య మం కంటే మీ పదవి ఎక్కువైందా? నేను ఒక్కదాన్ని రాజీనామా చేస్తే వస్తుందా అన్న మాటలు వింటుంటే సిగ్గుగా ఉంది. నా ఒక్క చావుతోని వస్తుం దా అని ఎనిమిది వందల మంది చనిపోయిన వారు ఎవరూ అనుకోలేదు. ప్రతి మీటింగ్‌లో పాల్గొని, ప్రతిసారి దెబ్బలు తిన్న, తింటున్న, కేసులు మీదేసుకున్న ఉద్యమకారులు ఎవరూ అనుకోలేదు. నాలుగు నెలలు రాజీనామా చేశానని ఇరవైసార్లు చెప్పుకున్నారు. మరి ప్రాణాలు పోగొట్టుకున్న బిడ్డలు, వాళ్ళ తల్లిదంవూడులు ఎన్ని తరాలు చెప్పుకోవాలి? ప్రాణం విలువ కట్టగలరా? ఒకసారి ప్రాణం తీసుకుంటే మళ్లీ ప్రాణాలు వస్తాయా? మీ డాక్టర్ భాషలో చెప్పండి మేడం? మా ప్రాణాల కంటే ఎక్కువా మీ పదవులు? ఒక్కసారి రాజీనామా చేస్తే పూవుల్లో పెట్టి మళ్లీ గెలిపిస్తాం అన్నా కూడా, గెలిపించినా కూడా నమ్మకం లేదా? మీరు చేసిన పనులకి మళ్లీ మీరు జీవితంలో గెలవరని మీకు అంత నమ్మకమా? అందుకే పదవులు పట్టుకొని వేలాడుతున్నారా? అసలు తెలంగాణ రాక పోవడానికి కాంగ్రెస్, తెలుగుదేశం కారణమైనప్పుడు, మీరు అందు లో భాగమే కదా? మీరు తెలంగాణకు ప్రత్యేకించి ఇన్ని ఏండ్లుగా చేసింది ఏమైనా ఉందా? మహిళగా ఉండి మహిళలకి చేసింది ఏమిటి? దళితులుగా ఉండి దళితుల కి, సారీ మీ మాలలకి ఏమి చేశారు? మినిస్టర్‌గా అది కూడా రెడ్డిగా ఉన్న మీరు ఆ కులం గొప్పదనే కాదా ఆ తోక తగిలించుకున్నారు? ఈశ్వరీబాయి ఉంటే ప్రాణం పోయినా ఆ పని చేసేదా? ఆ మహాతల్లి చేసిన సేవలో ఒకటో వంతు సేవ చేసినట్టు మాకైతే తెలియదు. ఏమైనా చేసి ఉంటే మాకు చెప్పండి.



మరి కోదండరాం ఆ రెడ్డి తోకని తీసేసుకున్నట్టు మాకు తెలుసు. హక్కుల కార్యకర్తగా, మేధావిగా, గత మూడేళ్లు గా ఉద్యమ రథసారథిగా ముందు పడి, ఉద్యోగానికి సెలవు పెట్టి అహర్నిశలు ఎదో ఒక గ్రామంలోనో, మీటింగ్‌లోనో తిరుగుతున్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో బయటికి వచ్చి మాట్లాడిన సందర్భాలు ఎన్ని? నిజంగా మీకు దళిత స్పృహ ఉంటే, దళితుల చావుకైనా స్పందించి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొని ఉంటే తమరే ఉద్యమ రథసారథి అయ్యే వారేమో! ఎప్పుడైనా ఆలోచించారా? అపుడు ఈశ్వరీబాయి కడుపున పుట్టిన బిడ్డ కాబట్టే ఇట్లా ఉంది అని తెలంగాణ జేజేలు చెప్పే వారు కదా!
కోదండరాం బాధ్యత గల ప్రొఫెసర్ కాబట్టి ఆయన అట్లా మాట్లాడకూడదు. నాలుగున్నరకోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఒక బాధ్యత. వారికి ఎటువంటి పదవులు లేవు అని తెలిసినా ప్రజలు ముందు పడి అన్ని చేస్తున్నారు. అసలు బాధ్యత అంటే రాజకీయనాయకులకి తెలుసా? ఒక సారి ఎన్నుకున్న ప్రజలకు దించే హక్కు కూడా ఉంటుందని? అయినా రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు ఒకరు ఎట్లా అయితరు? ప్రొఫెసర్లు విద్యార్హతలతోని ఒక పద్ధతి ప్రకారం అనేక పరీక్షల అనంతరం వస్తారు. మరి మీరు? ఓట్లు వేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి? ఎన్ని తీరని వాగ్దానాలు తేవా లి? యూనివర్సిటీలు అంటే సమాజంలో ఉన్న అనిశ్చితి పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతలు తీసుకుంటాయి, అయి నా డాక్టర్ అయినా, యాక్టర్ అయినా , ప్రొఫెసర్ అయి నా కూడా ముందుగా మానవత్వం ఉన్న మనుషులు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుంటారు. 



ప్రజలకు బాధ్యత వహించాల్సింది వారే. రాజకీయ నాయకుల లాగా కొండలని పిండి చేసి, అడవులని, ఇసుకని, బొగ్గుని, రేషన్ సరకులని, దళిత నిధుల ని, ప్రజల కోసం వచ్చిన డబ్బుని సొమ్ము చేసుకోరు. ఎవ రు ఏ ఉద్యోగం చేసినా అన్యాయం గురించి మాట్లాడొ చ్చు, పోట్లాడొచ్చు. మీరు లగడపాటి లాగా మాట్లాడకం డి. యూనివర్సిటీ టీచర్లు ప్రజల జీవితాలకి దశ దిశా నిర్దేశం చేస్తారు, పరిశోధనలు చేస్తారు. రాబోయే మార్పులను ముందుగా పసిగడతరు, బోధిస్తరు, పుస్తకంలో ఉన్న విషయాలను బట్టి కొట్టడం కాదు. మరోసారి కోదండరాంను రాజీనామా చేయాలని మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ప్రొఫెసర్ల కంటే మినిస్టర్‌ల కంటే ముందు మనం మనుషులం అన్న ముచ్చట మరిచిపోవద్దు. ఇంకా మీరు ఎక్కువ గొడవ చేస్తే మీ వెనుక ఉన్న శక్తులు అందరూ బయటికి వస్తారు, అది పేపర్ వాళ్ళు కావొచ్చు, ఇతర పార్టీ నాయకులు కావొచ్చు లేదా స్వార్థ పూరిత శక్తులు కూడా ఉండొచ్చు. అవన్నీ మీ మాటలలో అర్థం అవుతూనే ఉన్నాయి, ప్రజలు అనుకుంటే ఏదైనా చేస్తా రు ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పటికైనా దళిత కార్డు, స్త్రీల కార్డులు అడ్డం పెట్టుకొని ఉద్యమాలను నడపకండ్రి. ముందుగా మీరు ఫూలే, అంబేద్కర్ ఆలోచనా విధానంతోని బతకడం నేర్చుకుంటే అదే పది వేలు. ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రజాస్వామిక వాదులు, రైట్ సంఘాలు, లెఫ్ట్ సంఘాలు అందరూ తెలంగాణ సమస్య పట్ల స్పందించండి. మీకున్న భయాలని అయినా చెప్పండి. కులం నీడలో అన్యాయం చేస్తామంటే ఊరుకొనేది లేదు. 

-సుజాత సూరేపల్లి
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యద

Namasete Telangana Telugu News Paper Dated: 20/11/2012

No comments:

Post a Comment