Sunday, September 4, 2011

హక్కులడిగితే అశాస్త్రీయమా?----మైపతి అరుణ్‌కుమార్ ఆదివాసీ విద్యార్థి సంఘం


హక్కులడిగితే అశాస్త్రీయమా?
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో కొంతమంది ఆదివాసీ నేతలు మన్యసీమ రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. 2009 తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా ఈ నేతలు మన్యసీమ డిమాండ్ ముందుకు తీసుకువచ్చారు. నాటి నుంచి నేటి వరకు ఈ నేతలు మన్యసీమ రాష్ట్ర డిమాండ్ చేసిన పాపానదని కొంతమంది గిరిజన నేతలు ‘మన్యసీమ’ ఉద్యమాన్ని ఆంధ్రవూపాంత పెట్టుబడిదారీ ఉద్యమం అంటున్నారు. అయితే గిరిజనులు తమను తాము పాలించుకోవడానికి రాజ్యాంగంలో 5,6 షెడ్యూల్డ్‌లను కల్పించారు. దీని ప్రకారం ఐదవ షెడ్యూల్డ్‌లో భాగమైన ఆంధ్రవూపదేశ్ ఆదివాసీలకు స్వయంపాలన 64 ఏళ్ల భారతావనిలో అమలు చేసిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తారా లేదా అన్న గ్యారంటీ లేదు.


ఈ షెడ్యూల్డ్ ప్రకారం మా ప్రాంతాలకు స్వయంపాలన అధికారం కల్పించబడాలి. కానీ నేటి ఆంధ్రవూపదేశ్ పాలకులు కల్పించలేదు. అందుకే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులను కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. దీనిని కోరడం తెలంగాణ ఉద్యమాన్ని నీర్చుగార్చడం ఎలా అవుతంది? న్యాయమైన రాజ్యాంగబద్ధమైన డిమాండ్‌ను అడగటం పాపమెలా అవుతుంది? మన్యసీమ రాష్ట్ర డిమాండ్‌ను కేంద్రంలో వినిపించడానికి కిశోర్ చంద్రదేవ్ (ఇతడు గిరిజనుడు కాదు అనే వివాదం ఉంది) కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకునేటట్లు ఈ సీమాంధ్ర పెత్తందారులు సోనియా, మన్మోహన్ సింగ్‌లను ఒప్పించగలిగారని విమర్శిస్తున్నారు. కిశోర్ చంద్రదేవ్ ఎస్టీ కాదనే వివాదం ఉన్నప్పుడు లంబాడీలు కూడా ఎస్టీలు కాదని, రాజ్యాంగంలో ఎస్టీలుగా గుర్తించబడలేదని కోర్టులో వివాదం నడుస్తున్నది. అలాంటప్పుడు లంబాడీలను తెలంగాణ వాదులు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అయినా కిశోర్ చంద్రదేవ్ మన్యసీమను సమర్థించడం లేదని ప్రతికాముఖంగానే ప్రకటించారు.‘మన్యసీమ’ రాష్ట్రం కావాలనే డిమాండ్ ఆదివాసీల గుండెలోతుల నుంచి రావాలంటున్నారు కొందరు గిరిజన నేతలు. చరివూతలో ఆదివాసీలు ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం, తమ సంస్కృతి పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. తమ మనుగడ కోసం 13వ శతాబ్దం నుంచే తిరుగుబాటు జెండా ఎగురవేశారు.


మేడారం కేంద్రంగా సమ్మక్క-సారలమ్మల పోరా టం, బీహార్ కొండల్లో పహాడియల తిరుగుబాటు, సంతాల్ తిరుగుబాటు, బిర్సాముండా తిరుగుబాటు, రంప తిరుగుబాటు, కొమురం భీం తిరుగుబాటు, అల్లూ రి, గంటందొర, మల్లుదొర తిరుగుబాట్లు చరివూతలో పేరెన్నిక గన్నవి.స్వాతంవూత్యానంతరం 1968 శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం, ఇంద్ర తిరుగుబాటు ఆదివాసుల పోరాటాలకు వన్నెతెచ్చినవి.విశాఖ మన్యంలో బాకె్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం అక్కడి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల మూడు లక్షల మంది జల సమాధి అవుతామని ప్రాజెక్టుకు వ్యతిరేకం గా ఉద్యమిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు భూములు దోచుకునే వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సామాజిక, సాంస్కృతిక అణచివేతలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ.. మనుగడ కోల్పోతున్న ఆదిమ తెగలు తమ గుండెలోతుల నుంచి సాంస్కృతిక పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. వనరులను రక్షించుకోవడానికి ఉద్యమిస్తున్నారు.


‘మన్యసీమ డిమాండ్ అశాస్త్రీయం’ అంటూ చేస్తున్న వాదన ఏ విధంగా చూసినా దానికి శాస్త్రీయత లేదు. అలాగే ఒక తెగకు మరో తెగకు మధ్య సంబంధాలు లేవన్నది కూడా చారివూతక తప్పిదం. చరివూతలో ఆదివాసీలు ఐక్యతకు మారుపేరని చెప్పుకునే వారికి, తెగల మధ్య వైరుధ్యం ఎక్కడ కనపడిందో? రాజ్యాంగబద్ధంగా.. ఆదివాసీ ప్రాంతాలకు ఆనాడే సరిహద్దులను నిర్ణయించారు. ఐదవ షెడ్యూల్డ్‌లో 244(1)(2) క్లాజు ప్రకారం 31484 చదరపు కిలోమీటర్ల భూభాగంలోని షెడ్యూ ల్డ్ ప్రాంతానికి స్వయం పరిపాలన కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే మన్యసీమ కోరుతున్నాం. దీనిలో అసంబద్ధత ఎక్కడుందో మన్యసీమను వ్యతిరేకిస్తున్న వారికే తెలియాలి.


తెలంగాణ రాష్ట్ర డిమాండ్ న్యాయమైనది. రాజ్యాంగబద్ధమైనది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఎనలేని త్యాగాలు చేస్తున్నారు. దశాబ్దకాలంగా పోరాడుతున్నారు. అదే తరుణంలో ఆదివాసీ ప్రాంతాలకు కూడా స్వయంపాలన కావాలని ఆదివాసులు కోరుతున్నారు. దీనికోసం ఆదివాసులు అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు లంబాడీల కన్న ఆదివాసీలే తెలంగాణకు ఎక్కువగా మద్ద తు తెలుపుతున్నారు. కానీ తెలంగాణ వా దులు మాత్రం ఆదివాసీల సమస్యలను ప్రస్తావించడంలో విఫలమయ్యారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో, అదే విధంగా ఆదివాసులకు కూడా అన్యా యం జరిగింది. మరోమాటలో చెప్పాలంటే.. ఆదివాసీ ప్రాం తాలకు అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది.


గోండ్వాన ప్రాంతం నుంచి విభజించబడిన ఆదివాసీ ప్రాంతం ఆంధ్రవూపదేశ్ పరాయి పాలనలో సాంస్కృతిక విచ్ఛిన్నానికి బలైంది. భవిష్యత్ తెలంగాణలో కూడా అగ్రకుల పాలనలో మగ్గుతామనే భయం ఆదివాసీలలో నెలకొన్నది. తెలంగాణ ప్రాంతం వారు ఆంధ్రవూపాంతం వలసలను వ్యతిరేకిస్తున్నారే తప్ప లంబాడీల గురించి మాత్రం ప్రస్తావించడం లేదు. సీమాంవూధులు తెలంగాణ ప్రాంత వారి ఉద్యోగాలు దోచుకున్నట్లే, లంబాడీలు ఆదివాసీల ఉద్యోగాలను దోచుకున్నారు. 610 జీవో వలస లంబాడీలకు వర్తించదా అనేది ఆదివాసీల ప్రశ్న!
ఆదివాసీలు తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడూ వ్యతిరేకులు కారు. అయితే వెనుకబడిన ఆదివాసీ ప్రాంతాల గురించి తెలంగాణలోని ప్రజాసంఘాలకు, బాహ్య ప్రపంచానికి తెలియనిది కాదు. ఎన్నో ఆటుపోట్ల మధ్య పభుత్వ నిర్బంధాల మధ్య ఆదివాసులు నలిగిపోతున్నారు. ఇవ్వాళ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోఆదివాసీ ప్రాంతాలకు స్వయంపాలన కల్పించాలని కోరుతున్నారు. ఈ విధానం ద్వారా నే ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్ముతున్నారు.
-మైపతి అరుణ్‌కుమార్
ఆదివాసీ విద్యార్థి సంఘం (తుడుందెబ్బ) ఉపాధ్యక్షులు

No comments:

Post a Comment