Sunday, September 4, 2011

విధ్వంసమైన స్వప్నం--- ప్రొ.హరగోపాల్ (అరుంధతీరాయ్ సాహిత్య) Namasethe Telangana 01/09/2011


8/31/2011 11:25:31 PM
విధ్వంసమైన స్వప్నం
అరుంధతీరాయ్ సాహిత్య ప్రపంచంలోనే కాక, సామాజిక ప్రక్రియలో భాగమేకాక రాజకీయాలను ప్రభావితం చేసే ఒక అపూర్వమైన రచయివూతిగా ఎదిగారు. ఆమె మొదటి నవలకు అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ రావడంతో ఆమె సాహిత్య ప్రస్థానం ప్రారంభమయింది. అవుతే ఆ నవల రాయడానికి అమెది చిన్న వయసైనా ఆమె జీవితానుభవం చాలా లోతైంది. పురుష ఆధిక్యంలేని కుటుంబంలో తాను పెరిగానని, తన తల్లి తనకు చాలా స్వేచ్ఛ నివ్వడమే గాక స్వేచ్ఛగా జీవించమనే విలువల నిచ్చిందని తెలుగు రచయితలనుద్దేశించి మాట్లాడిన ఒక చిన్న సమావేశంలో ఆమె చెప్పారు.
తాను రాయాలని ఎప్పుడు అనుకోనని, రాయడమంటే తనకు చాలా అయిష్టమని (Reluctance ) అవుతే కొన్ని అనుభవాలు కొన్ని ఆలోచనలు తనను వెంటాడేవి రాసే దాకా మనసు కుదుట పడదని అంటారు. తాను స్వేచ్ఛగా జీవించాలనే తపనే తనను ఆర్కిటెక్చర్ విద్యార్థిని చేశాయని, అర్కిటెక్చర్ అవుతే ఏ ఉద్యోగంలో చేరకుండా తోచినప్పుడు పనిచేసే వెసులు బాటు ఉంటుందని తాను భావించానని ఒక సందర్భంలో అన్నారు. మనిషిగా అంతరంగాలలోకి వెళ్లే ఒక మానవీయకోణం కూడా ఆమె వ్యక్తిత్వంలో ఉంది. ఈ మానవీయ కోణమే ఇవ్వాళ్ల ఆమెను ఒక బలీయమైన శక్తిగా మలచిందేమో అనిపిస్తుంది.
ఆమె రాజకీయ అభివూపాయాలు బలంగా రూపొందింది అమెరికా మీద జరిగిన 9/11 సంఘటన నేపథ్యంలో నే. ఆ సంఘటన తనకు తన రచనా శక్తికి , తన నిజాయితీకి ఒక పెద్ద పరీక్ష అని భావించింది. ఆరోజు ప్రపంచం దిగ్భ్రాంతి చెందినప్పుడు, ‘‘టెర్రరిస్టుల’’ మీద ప్రపంచమంతా ఆగ్రహంగా ఉన్నప్పుడు - అమెరికా విదేశీ విధానం, అమెరికా భిన్న దేశాల పట్ల అవలంబించిన వైఖరి , అమెరికా సామ్రాజ్యవాదం ఈ సంక్షోభాన్ని ఎలా కొని తెచ్చుకుందో చాలా స్పష్టంగా చెప్పిన వాళ్లలో ఒకరు అరుంధతీరాయ్. మరొకరు నోం చాంస్కీ. ప్రతిభావంతమైన మేధావి చాంస్కీకి దక్కినంతటి గౌరవాన్ని అరుంధతీరాయ్ పొందగలిగారు. ఇది సాధారణమైన విషయమేమీ కాదు.
ఆ తర్వాత ఆమె రాసిన ప్రతి రచనలో ఒక స్పష్టమైన సామ్రాజ్యవాద వ్యతిరేకత ఉంది. అలాగే ఎదిగే క్రమంలో మొత్తం ప్రపంచీకరణ నమూనాను ప్రశ్నిస్తూ చాలా మౌలికమైన అంశాలమీద వ్యాసాలు రాస్తూ మేధావుల ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తున్నారు. లేదా కనీసం వాళ్లు పునరాలోచించేంత లోతైన విశ్లేషణ చేస్తున్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఆమెను తీవ్రంగా ఆలోచింపచేసిన అంశం- మనిషికి ప్రకృతికి ఉండే అతి సున్నితమైన సంబంధం, దాని విధ్వంసం. మనుషులను ప్రేమించే స్వభావమున్న వాళ్లు ప్రకృతిని ప్రేమించడం సహజమేమో లేదా ప్రకృతిని ప్రేమించేవాళ్లు మనుషులను ప్రేమిస్తారేమో. ఆర్.ఎస్. రావు గారు ప్రకృతిని ముఖ్యంగా పూలని అతిగా ప్రేమించడంతో ఆయన రాజకీయ ఆలోచనా ప్రస్థానం ప్రారంభమయ్యిందంటారు. అందుకే మనిషిని విశాలమైన ప్రకృతిలో ఇతర జీవరాసులలో ఒక జీవిగా చూడాలే తప్ప మనిషి కేంద్రంగా విశ్వాన్ని చూడడాన్ని ఆమె సంపూర్ణంగా తిరస్కరించారు. దీంతో ఆమె అభివృద్ధిని కూడా ప్రకృతి కోణం నుంచే చూడడం వలన చారివూతకంగా ఆమె అవగాహనకు పరిమితులుండవచ్చని భావించేవారు కూడా ఉన్నారు.
అవుతే ప్రకృతిని ప్రేమించే క్రమంలో ప్రకృతికి చాలా దగ్గరగా జీవిస్తున్న గిరిజనుల దగ్గరకు వెళ్లిపోయారు. నిజానికి గిరిజనుల జీవితం ప్రకృతితో విడదీయరాని సంబంధంగా ఉంటుంది. అందుకే ప్రకృతి వనరుల విధ్వంసం గిరిజనుల జీవిత విధ్వంసంగా మారడంతో దానికి వ్యతిరేకంగా పోరాడే గిరిజన పోరాటాలను, ఆ పోరాటాలలో వాళ్లకు బాసటగా నిలిచిన మావోయిస్టు పార్టీని అభిమానించి ఆ విప్లవ ఉద్యమాల గురించి రాయడం ప్రారంభించారు.
విధ్వంసమైన స్వప్నం పుస్తకంలోని మూడు వ్యాసాలలో ఛత్తీస్‌గఢ్ లో లేదా దండకారణ్యంలో జరుగుతున్న పోరాటాల మీద ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. పేదలలో అతిపేదవావూ్లైన , అతి బలహీనులైన గిరిజనులు సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా గత ఆరు సంవత్సరాలుగా రాజీలేని పోరాటాలు చేస్తూ ఈ రోజు ప్రధానమంత్రి, హోం మంత్రి చిదంబరం ఈ గిరిజనులను దేశభవూదతకు అతి పెద్దముప్పుగా పరిగణించే దశదాకా చేరుకున్నాయని పేర్కొన్నారు. ఈ పోరాటాన్ని ఎదుర్కోవడానికి పోలీస్, పారామిలిటరీ, సల్వా జుడుం లాంటి అసాంఘిక శక్తులను ఉపయోగించడమే కాక భారత సైన్యాన్ని , విమాన దళాలని దించడం ద్వారా ప్రభుత్వం తన స్వంత ప్రజలతో యుద్ధానికి సన్నద్దమైందని అంటూ.., సైన్యాన్ని దండకారణ్యంలో తప్పక ఉపయోగిస్తారని అరుంధతీ రాయ్ అంటున్నారు. సైన్యం ‘మావోయిస్టులతో పోరాట’మనే అంటూ సామాన్య గిరిజనుల మీద యుద్ధం చేయడం ప్రారంభిస్తే మనదేశ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మీడియా, రాజకీయాలు ఎలా స్పందిస్తాయన్న అంశంమీద భవిష్యత్తు పరిణామాలు ఆధారపడి ఉంటాయని ఆమె భావిస్తున్నారు.
అరుంధతీ రాయ్ ఆలోచనా క్రమం ఇలా ఉన్న సందర్భంలోనే ఒక మూడు నాలుగు రోజుల క్రితం భారత సైన్యాధి పతి ముంబయి లో మాట్లాడుతూ మావోయిస్టు రాజకీయాలు శాంతి భద్రతల సమస్య కాదని , ఇది ఒక సామాజిక ఆర్థిక సమస్య అని , సమస్య ఇంత జటిలం కావడానికి పాలకుల దుష్పరిపాలన (మిస్ గవ్నన్స్) కారణమని చాలా స్పష్టంగా అన్నారు. ఒక దశాబ్దం కంటే పూర్వం జాతీయ మానవహక్కుల సంఘం నిర్వహించిన ఒక అంతర్గత సమావేశంలో మా లాంటి వాళ్లం ఈ శాన్యభారతదేశంలో సైన్యం జోక్యాన్ని, అణచివేత చట్టాన్ని ప్రశ్నించాం. సైన్యానికి ప్రత్యేక అధికారాలను కల్పించిన చట్టాన్ని కూడా ప్రశ్నించినప్పుడు అప్పటి సైన్యాధిపతి శంకరరాయ్ చౌదరి కూడా ఇప్పటి సైన్యాధిపతి చేసిన వ్యాఖ్యలే చేశారు. సైన్యం మొదటినుంచి కూడా అంతర్గత సమస్యలకు తమను ఉపయోగించ వద్దని అంటున్నది.
ఎన్ని సలహాలు ఇచ్చినా ప్రపంచబ్యాంకు అంతర్జాతీయ పెట్టుబడికి దళారులైన చిదంబరం లాంటి వాళ్లు సైన్యం మీద విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఈ విషయంలో రచయివూతిగా అరుంధతీ రాయ్ దేశవూపజలను చైతన్యవంతులను చేయాలనే ఒక బాధ్యత తీసుకున్నారనేది చాలా స్పష్టం. అలాగే ఈ మధ్య అన్నాహజారే ఉద్యమం గురించి ఆమె రాసిన వ్యాసం పెద్ద దుమారమే లేపింది. ఢిల్లీలో ఉన్న చాలామంది ఆలోచనా పరులను , ప్రజాస్వామిక వాదులను కదిలించింది. అవుతే అన్నా హజారే ఉద్యమం ఒక మార్పు కొరకు జరుగుతున్న ఉద్యమంగా లేదని , ప్రపంచీకరణ విధానాలను ప్రశ్నించడం లేదని , అవినీతికి మూల కారణమైన కార్పొరేటు రంగాన్ని ప్రశ్నించకుండా , భ్రష్టుపట్టిన పాలక వ్యవస్థ మీద ప్రజా ఆగ్రహాన్ని సరియైన దిశలో సమీకరించడంలో విఫలమైందని విళ్లేషించారు. ఏ అభివూపాయాన్ని అయినా తన రచనా పటిమను ఉపయోగించి ఒక స్పష్టమైన , సహజమైన రాజీలేని అభివూపాయాలను, విశ్లేషణలను సమకాలీన సమాజానికి అందిస్తున్న అరుదైన రచయిత్రి అరుంధతీ రాయ్.
ఆమె చెప్పిన ప్రతి అంశాన్ని అంగీకరించాలని ఎవరూ అనడం లేదు. కానీ మనిషి ఆలోచనను సమస్య వేళ్ల దగ్గరకు తీసుకుపోయే శక్తి ఆమె రచనలకుంది. అలాగే దాదాపు సంవత్సరం క్రితం హైదరాబాదు వచ్చినప్పుడు తెలంగాణ మీద తన అభివూపాయాలను అడిగితే, తెలంగాణ సరే, ఎలాంటి తెలంగాణ అనే సందేహాలను వెలిబుచ్చింది. ఈసారి తన విధ్వంసమైన స్వప్నం బోకెన్ రిపబ్లిక్ ) పుస్తక ఆవిష్కరణ సభకు వచ్చినప్పుడు తెలంగాణ మీద చాలా స్పష్టమైన అభివూపాయాలను చెబుతూ , ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలా కాక తెలంగాణకు ఒక రాజకీయ పోరాట చరిత్ర ఉందని, విలువలకొరకు పోరాడే ఈ వారసత్వం వలన ఒక ప్రజాస్వామ్య తెలంగాణ సాధ్యమే అని అభివూపాయపడ్డారు. అవుతే ఆమె ఈ అభివూపాయాన్ని ఏర్పరుచుకుంటున్న ఈ సందర్భంలో ప్రెస్ క్లబ్‌లో జరిగిన సభను కొందరు బిజెవైఎం కార్యకర్తలు అడ్డుకోవడం తెలంగాణ ఉద్యమానికి కొన్ని కొత్త సవాళ్లను సంధించింది.
జీజేపీ తెలంగాణ రాష్ట్రం కొరకు పనిచేసే అన్ని శక్తులతో , న్యూ డెమాక్షికసీ లాంటి పార్టీలతో కూడా కలిసి జేఏసీలో భాగస్వామిగా ఉంది. ఒక అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగిన రచయిత్రి, అందులో తెలంగాణ ఆకాంక్షను బలపరుస్తున్న మనిషిని గౌరవించే బదులు ‘ అరుంధతీరాయ్ డౌన్ డౌన్’ అని ‘గో బ్యాక్’ అని ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంటే తెలంగాణ ఆకాంక్షకంటే తమ మతతత్వ సంకుచితత్వ మేకాక ,ఒక స్త్రీని , ఒక మైనారిటీకి చెందిన మనిషిగా ప్రజాస్వామ్య భావాలు గల వ్యక్తిగా గౌరవించే సంస్కృతి, సంస్కారం లోపించిన ఈ రాజకీయాలు తెలంగాణ ఉద్యమం పేరిట బలపడడం తెలంగాణ ప్రజాస్వామ్య శక్తులు జాగ్రత్తగా గమనించవలసిన అవసరముంది. ఎలాంటి తెలంగాణ అని సంవత్సరం క్రితం అడిగిన ప్రశ్న తెలంగాణ ఉద్యమం లో ఒక భాగం కావాలి. నామటుకు నాకు మన కంటూ ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అరుంధతీరాయ్ లాంటి రచయివూతులు స్వేచ్ఛగా మాట్లాడే తెలంగాణే నిర్మించుకోవాలి. కానీ అదొక విధ్వంసమైన స్వప్నంగా పరిణమించరాదు.
- ప్రొ.హరగోపాల్

No comments:

Post a Comment