Monday, March 10, 2014

నయా ఉదారవాదం - అవినీతి, అస్తిత్వ ఉద్యమాలు By ప్రభాత్‌ పట్నాయక్‌


నయా ఉదారవాద దృశ్యం గురించిన మరో విషయంపై మనం దృష్టిని సారించాలి. ఇది 'అవినీతి'కి సంబంధించినది. అలాంటి ఆర్థిక వ్యవస్థలో చిన్న ఉత్పత్తిదారులను బడా పెట్టుబడి కబళించే ధోరణి ఉంటుంది. అయితే కేవలం చిన్న ఆస్తులను మాత్రమే అది లక్ష్యంగా చేసుకోదు. చిన్న ఆస్తులనే కాక సమిష్టి ఆస్తులనూ, తెగల ఆస్తులనూ, ప్రభుత్వ ఆస్తులనూ నామమాత్రపు వెలకుగానీ, ఉచితంగా కానీ పోగు చేసుకుంటుంది. వేరే విధంగా చెప్పాలంటే నయా ఉదారవాదం కాలంలో 'పెట్టుబడి యొక్క ఆదిమ సంచయం' ప్రక్రియ కసిగా కొనసాగుతుంది. దీనికి ప్రభుత్వాధికారుల సమ్మతి అవసరం.

పెట్టుబడిదారీ వ్యవస్థ సామాజికంగా మనగలగటానికి కారణం దాని అంతర్గత తర్కం బలంగా ఉండటం వలన కాక అది బలహీనంగా ఉన్నప్పటికీ మనగలగటం దాని ప్రత్యేకత. వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన కార్మికులు ఈ ప్రపంచంలో ఒకేచోటకు చేర్చబడి చిన్నచిన్న గ్రూపులుగా విభజితమై ఒకరితో మరొకరు పోటీ పడతారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కం కోరేదీ అదే. అలాంటి ప్రపంచం సామాజికంగా విజయవంతంగా మనగలగటం సాధ్యపడదు. (ఎందుకంటే అలాంటి ప్రపంచంలో ఎలాంటి 'సమాజం' ఉండజాలదు). పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కానికి వ్యతిరేకంగా మొదట్లో ఒకరితో మరొకరికి పరిచయంలేని కార్మికులు ట్రేడ్‌ యూనియన్ల ద్వారా 'మేళవింపులు' (ఒకటిగా కలిసిపోవడం) జరిగి వర్గ సంస్థలుగా ఏర్పడతాయి. వీటి నుంచి 'నూతన సమాజం' ఆవిర్భవిస్తుంది.

              ప్రపంచీకరణ శకం వర్గ శక్తుల సమతౌల్యంలో బూర్జువా వర్గానికి అనుకూలంగా నిర్ణయాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. ఈ మార్పుకు కనీసం రెండు ప్రధాన పర్యవసానాలున్నాయని గమ నించాలి. మొదటిది, వర్గ రాజకీయాలు బలహీ నపడటంతోపాటు 'అస్తిత్వ రాజకీయాలు' బలోపేత మయ్యాయి. అయితే 'అస్తిత్వ రాజకీయాలు' అనే పదబంధం గందరగోళపరిచేదిగా ఉంటుంది. ఇది రెండు పరస్పర విరుద్ధ ఉద్యమాలను తన పదబంధంతో బంధిస్తుంది. ఇక్కడ మూడు విశిష్ట విషయాల మధ్య తేడాను గమనిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. దళిత, మహిళా ఉద్యమాల (వీటి ప్రత్యేకతలు వీటికున్నప్పటికీ) వంటి 'అస్తిత్వ ప్రతిఘటనా ఉద్యమాలు', 'అస్తిత్వ బేరసార రాజకీయాలు' - ఇవి 'రిజర్వేషన్స్‌'ను ఉపయోగించుకుని తమ స్థితిని మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో 'వెనుకబడిన తరగతి' హోదా కోసం జాట్‌ కులస్తులు చేసే డిమాండ్‌ లాంటివి. 'అస్తిత్వ ఫాసిస్టు రాజకీయాలు - దానికి ఉదాహరణగా మతతత్వ - ఫాసిజాన్ని తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక 'అస్తిత్వ గ్రూపుల' ఆధారంగా ఈ రాజకీయాలున్నప్పటికీ కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ పెట్టుబడిదారుల సహకారంతో ఇతర 'అస్తిత్వ గ్రూపుల'ను లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేయటం ఈ రాజకీయాల ప్రత్యేకత. తాము ఏ అస్తిత్వ గ్రూపు ప్రయోజనాల ఉన్నతికి సమీకరింపబడ్డామో వాటి కోసం పాటుపడకుండా వాస్తవంలో కార్పొరేట్‌ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగస్వాములవడం ఈ రాజకీయాల ప్రత్యేకత.
ఈ మూడు రకాల 'అస్తిత్వ రాజకీయాల' నడుమ ఎన్ని విభేదాలున్నప్పటికీ బలహీనపడిన వర్గ రాజకీయాల ప్రభావం వీటిన్నిటిపైనా ఉన్నది. వర్గ సంస్థల కార్యాచరణలో లేని సభ్యులున్న 'అస్తిత్వ బేరసార రాజకీయాల'ను ఈ పరిస్థితి ప్రోత్సహిస్తుంది. కార్పొరేట్‌ ఫైనాన్స్‌ వర్గ ఆధిపత్యానికి అవసరమైనందున 'అస్తిత్వ ఫాసిస్టు రాజకీయాల'కు కూడా ఈ పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 'అస్తిత్వ ప్రతిఘటనా రాజకీయాల' మీద దీని ప్రభావం మరోలా ఉంటుంది. వర్గ రాజకీయాలు బలహీనపడడం వలన ఈ రాజకీయాలలో సమరశీలత నశించి అవి 'అస్తిత్వ బేరసార రాజకీయాల' దిశలో పయనిస్తాయి. మొత్తం మీద బలహీనపడిన వర్గ రాజకీయాలు వ్యవస్థకు ప్రమాదకరం కాని 'అస్తిత్వ రాజకీయ' రూపాలను బలోపేతం చేస్తాయి. దానితో ప్రజలలోని ఒక సెక్షన్‌ను మరో సెక్షన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టి వ్యవస్థకు వచ్చే ప్రమాదాలను మరింతగా తగ్గించటం జరుగుతుంటుంది. దేశంలోని కుల వ్యవస్థకు మూలమైన భూస్వామ్య వ్యవస్థ అవశేషం అయిన 'పాత సమాజా'న్ని నాశనం చేసి ప్రజాస్వామ్యానికి అవసరమైన 'నూతన సమాజా'న్ని తీర్చిదిద్దే ప్రయత్నానికి దానితో విఘాతం కలుగుతుంది.
ఈ విఘాతం వ్యక్తీకరణ రెండవ పర్యవసానంగా ఉంటుంది. ఈ పరిస్థితి సమాజాన్ని మొద్దుబారుస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ సామాజికంగా మనగలగటానికి కారణం దాని అంతర్గత తర్కం బలంగా ఉండటం వలన కాక అది బలహీనంగా ఉన్నప్పటికీ మనగలగటం దాని ప్రత్యేకత. వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన కార్మికులు ఈ ప్రపంచంలో ఒకేచోటకు చేర్చబడి చిన్నచిన్న గ్రూపులుగా విభజితమై ఒకరితో మరొకరు పోటీ పడతారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కం కోరేదీ అదే. అలాంటి ప్రపంచం సామాజికంగా విజయవంతంగా మనగలగటం సాధ్యపడదు. (ఎందుకంటే అలాంటి ప్రపంచంలో ఎలాంటి 'సమాజం' ఉండజాలదు). పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కానికి వ్యతిరేకంగా మొదట్లో ఒకరితో మరొకరికి పరిచయంలేని కార్మికులు ట్రేడ్‌ యూనియన్ల ద్వారా 'మేళవింపులు' (ఒకటిగా కలిసిపోవడం) జరిగి వర్గ సంస్థలుగా ఏర్పడతాయి. వీటి నుంచి 'నూతన సమాజం' ఆవిర్భవిస్తుంది. ఆ విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి విజయవంతమైన సమాజం ఆవిర్భవిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో గతంలో ఇది సాధ్యమైంది. దానికి కారణం పెట్టుబడిదారీ అభివృద్ధి బాగా జరిగిన కేంద్ర స్థానాల నుంచి సమశీతోష్ణ ప్రాంతాలకు పెద్దఎత్తున యూరోపియన్‌ ప్రజలు వలసలుగా వెళ్లటంతో దేశీయ నిరుద్యోగ సైన్యం సాపేక్షంగా పరిమిత పరిమాణంలో ఉండటం జరిగింది. ఈ పరిస్థితి ట్రేడ్‌ యూనియన్లు శక్తివంతంగా మారటానికి దారితీసింది. నేటి తృతీయ ప్రపంచ దేశాల కార్మికులకు అలా వలస వెళ్లే అవకాశం లేదు. ఇంతకు ముందు విశ్లేషించినట్లుగా నిరుద్యోగం సాపేక్ష పరిమాణాన్ని నయా ఉదారవాదం పెంచుతోంది. ట్రేడ్‌ యూనియన్లనూ, కార్మికుల ఇతర సమిష్టి సంస్థలనూ బలహీనపరుస్తోంది. దీని పర్యవసానంగా విడివడిపోయే వైపు కొట్టుకు పోతారు. వర్గ భ్రష్ట శ్రామికవర్గం సంఖ్య పెరుగు తుంది. విభిన్న సామాజిక నేప థ్యాల నుంచి వచ్చిన కార్మికుల మధ్య అనుబంధం ఉండ కుండా పోవటమో లేక ఉన్నది బలహీ నప డడమో జరుగుతుంది. ఇద ంతా భ్రష్టత్వాన్ని పెంచే స్పష్ట మైన ధోరణిని సృష్టిస్తుంది. నిజానికి అన్ని పెట్టు బడిదారీ సమా జాలలో అలాంటి భ్రష్టత్వం ఉం టుంది. అభి వృద్ధి చెందిన పెట్టు బడిదారీ దేశా లలోని కార్మికవర్గ సమిష్టి సంస్థలు అలాంటి భ్రష్టత్వాన్ని అదుపు చేస్తాయి. నయా ఉదారవాదం కింద ఇది బలహీ నపడుతుంది. నయా ఉదారవాదానికి దాసోహం అనే తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభు త్వాల పాలనలో ఇది నిరర్థకమవుతుంది. నా దృష్టిలో నేటి భారతదేశంలో మహిళలపై జరిగే నేరాలూ, ఘోరాలూ ఈ ప్రక్రియతో సంబంధం లేకుండా లేదు.
నయా ఉదారవాద దృశ్యం గురించిన మరో విషయంపై మనం దృష్టిని సారించాలి. ఇది 'అవినీతి'కి సంబంధించినది. అలాంటి ఆర్థిక వ్యవస్థలో చిన్న ఉత్పత్తిదారులను బడా పెట్టుబడి కబళించే ధోరణి ఉంటుంది. అయితే కేవలం చిన్న ఆస్తులను మాత్రమే అది లక్ష్యంగా చేసుకోదు. చిన్న ఆస్తులనే కాక సమిష్టి ఆస్తులనూ, తెగల ఆస్తులనూ, ప్రభుత్వ ఆస్తులనూ నామమాత్రపు వెలకుగానీ, ఉచితంగా కానీ పోగు చేసుకుంటుంది. వేరే విధంగా చెప్పాలంటే నయా ఉదారవాదం కాలంలో 'పెట్టుబడి యొక్క ఆదిమ సంచయం' ప్రక్రియ కసిగా కొనసాగుతుంది. దీనికి ప్రభుత్వాధికారుల సమ్మతి అవసరం. ఇంతకు ముందు పేర్కొన్నట్లు ప్రపంచీకరణ యుగంలో జాతి రాజ్యం విధానపర విషయాలలో ఎదుర్కొనే ఒత్తిడులు కాక ధరను చెల్లించి అలాంటి సమ్మతిని బడా పెట్టుబడి పొందుతుంది. దీనినే మనం 'అవినీతి' అని పిలుస్తాం.
బడా పెట్టుబడి ఆదిమ సంచయంతో లాభపడినందు వల్ల మనం అంటున్న 'అవినీతి' ఆచరణలో ప్రభుత్వాధికారులు, ముఖ్యంగా 'రాజకీయ వర్గం' దానిపై వేసే పన్నులాంటిది. ఈ మధ్యకాలంలో భారతదేశంలో బహిర్గతమైన అవినీతి కుంభకోణాలు - ఉదాహరణకు 2జి స్పెక్ట్రమ్‌, బొగ్గు గనుల కేటాయింపుల వంటి వాటిని ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పెట్టుబడిదారులకు నామమాత్రపు ధరకు బదలాయించటంగా చూడవలసి ఉంటుంది. అలా బదలాయించటానికి నిర్ణయాలు తీసుకున్నవారు లంచాలు తీసుకున్నారు. దానినే మనం 'అవినీతి' అంటున్నాం. ఆ విధంగా 'అవినీతి' అనేది పెట్టుబడి యొక్క ఆదిమ సంచ యంపై వేసే పన్నుగా భావించాలి. ఈ మధ్యకాలంలో అవినీతి తీవ్రంగా పెరగటానికి కారణం నయా ఉదావాదంలో పెట్టుబడి యొక్క ఆదిమ సంచయం తీవ్రస్థాయిలో ఉండటమే. 'అవినీతి' రూపంలో ఉండే అలాంటి పన్నును రెండు ప్రత్యేక కారకాలను దృష్టిలో ఉంచుకుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది, రాజకీయాలు సరుకుగా మార్చబడటం. వేరువేరు రాజకీయ సమీకరణలు నయా ఉదారవాదం పరిధిలోనే ఉండటం అనే వాస్తవం వేరువేరు ఆర్థిక ఎజెండాలను రూపొందించుకోనివ్వదు. దానితో ప్రజామోదం పొందటానికి వేరే మార్గాలను వెదకాలి. ఇది తమను తాము 'మార్కెట్‌' చేసుకోవటం అవుతుంది. ప్రచారం చేసే కంపెనీల సేవలను వినియోగించుకోవటం, మీడియాలో 'చెల్లింపు వార్తలు' వచ్చేలా చూడటం, ఎక్కువ ప్రాంతాలను చుట్టిరావటం ద్వారా ఎక్కువమందికి కనిపించటానికి హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవటం లాంటివి రాజకీయ పార్టీలు తమను తాము 'మార్కెట్‌' చేసుకోవటానికి అవసరమౌతాయి. ఇవన్నీ చాలా ఖరీదైన అవసరాలు. అందుకే రాజకీయ పార్టీలు వనరుల కోసం అర్రులు చాస్తుంటాయి. అవి ఎలాగైనా ఈ వనరులను సమీకరించుకోవాలి.
అంతేకాకుండా ఒక వైపు 'రాజకీయ వర్గం' ముందుకు సాగాలంటే ఎక్కువ వనరులు అవసరం ఏర్పడుతుండగా మరో వైపు నిర్ణయాలు తీసుకోవటంలో ఆ వర్గం పాత్రకు ప్రాధాన్యత తగ్గుతుంది. 'ప్రపంచ ద్రవ్య పెట్టుబడిదారీ సమాజం'గా పిలువబడే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, బహుళజాతి బ్యాంకులు, ఇతర సంస్థలకు చెందిన అధికార గణం ప్రభుత్వ పాలనలో నిర్ణయాలు తీసుకునే ముఖ్య స్థానాలను ఆక్రమిస్తారు. ఆర్థిక విషయాలను నిర్ణయించే అధికారం సంప్రదాయ రాజకీయ పార్టీల చేతుల్లో ఉండటం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఇష్టం ఉండక పోవడమే దానికి కారణం. సంప్రదాయ 'రాజకీయ వర్గం' దానిని సహజంగా తిరస్కరిస్తుంది. ఈ వర్గాన్ని 'ఎంతో కొంత' పోగు చేసుకునేందుకు అనుమతిస్తేనే అది పరిస్థితులతో రాజీపడుతుంది. 'అవినీతి' రూపంలో ఉండే పెట్టుబడి యొక్క ఆదిమ సంచయంపై వేసే పన్నులోనే ఆ 'ఎంతో కొంత' ఉంటుంది. 'రాజకీయవర్గం'కు రాజకీ యాలను సరుకుగా మార్చడం వల్ల ఆ అవసరం ఎలాగూ ఉంది గనుక దానికి ఆ వర్గం అభ్యంతర పెట్టదు.
నయా ఉదారవాద పాలనలో 'అవినీతి'కి ప్రయోజనకర పాత్ర ఉన్నది. 'రాజకీయ వర్గం' తన 'నైతికత'ను అకస్మాత్తుగా కోల్పోవటం వలన 'అవినీతి' జరగటం లేదు. ఇది నయా ఉదారవాదం విలక్షణత. నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ పెంచి పోషించే 'అవినీతి' కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ వర్గానికి మరో కారణం చేత ఉపయో గకరంగా ఉంటుంది. అవినీతి 'రాజకీయ వర్గం'కు అపకీర్తిని కొనితెస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య సంస్థలైన పార్లమెంటు, ఇతర సంస్థలకు 'అవినీతి'తో చెడ్డ పేరు వస్తుంది. అదే సమయంలో కపటోపాయాలతోనూ, మీడియాను నియంత్రిం చటంతోనూ ప్రజల దృష్టిని రకరకాల విషయాలపై కేంద్రీకరింపజేసి 'అవినీతి' పాపపంకిలం తనకు అంటకుండా కార్పొరేట్‌ ఫైనాన్స్‌ వర్గం చూసుకుంటుంది. కార్పొరేట్‌ పాలన ప్రవేశానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించటంలో 'అవినీతి'కి సంబంధించిన ప్రవచనాలు తమ పాత్రను తాము నిర్వహిస్తాయి.
- ప్రభాత్‌ పట్నాయక్‌
Prajashakti Telugu News Paper Dated: 10/3/2014 

No comments:

Post a Comment