Showing posts with label Sub Plan. Show all posts
Showing posts with label Sub Plan. Show all posts

Monday, September 9, 2013

సబ్‌ప్లాన్‌తో సామాజిక న్యాయం జరిగేనా? By జాన్‌వెస్లీ


  • ప్రచారం ఘనం - ఆచరణ అధ్వాన్నం - 42 ప్రభుత్వ శాఖల్లో నామమాత్రపు ప్రచారం
షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు న్యాయం చేయడం కోసం అనేక పోరాటాల ఫలితంగా సబ్‌ప్లాన్‌ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. రాష్ట్రమంతటా ఆర్భాటంగా ప్రచారం చేసింది. ప్రచారం చేసినంత వేగంగా ఆచరణలో అమలు చేయడం లేదు. 42 ప్రభుత్వ శాఖల ద్వారా అనేక రకాల అభివృద్ధి పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మినహా మిగతావి నత్తనడకన సాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల ఉన్నత విద్యకు సంబంధించి వెబ్‌సైట్‌లో పెట్టిన అడ్రస్‌ ఓపెన్‌ కావడం లేదు. 42 ప్రభుత్వ శాఖలలో కదలిక ఉందని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజాశక్తితో తెలిపారు. కాని ఆచరణలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఒక పక్క ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు ఇటీవల సమైక్య , ప్రత్యేక రాష్ట్ర ఆందోళనలతో ఎక్కడి ఫైళ్లు అక్కడ పెండింగులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం... ద్వారా ఉన్నత చదువులకు తోడ్పాటు అంశాన్ని ఈవారం పరిశీలిద్దాం....
అంబేద్కర్‌ ఓవర్సీన్‌ విద్యానిధికి సబ్‌ప్లాన్‌ చట్టంకింద 10లక్షల ప్రభుత్వ సాయం
ఇందిరమ్మ కలలు పేరుతో ప్రభుత్వం రూపొందించిన ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం దళిత విద్యార్థులకు సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. విద్య కోసం ఈ చట్టంలో నిధుల కేటాయింపుకు పెద్దపీట వేశారు. ప్రత్యేకించి విదేశీ చదువులకూ అవకాశం కల్పించారు.'అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి' పేరుతో ప్రత్యేకంగా ఒక పథకానికి రూపకల్పన చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌ వరకూ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో విద్యార్థికి పది లక్షల వరకూ సబ్‌ప్లాన్‌ చట్టం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తాయి. ఒక్కో విద్యార్థికి పది లక్షల ఖర్చు చేస్తారు. మరో ఐదు లక్షల వరకూ బ్యాంకు రుణ సౌకర్యం కల్పిస్తారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాల్లో ఉన్నత చదువులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇక్కడ ఏదయినా గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన విద్యార్థులకు ఎంఎస్‌, డాక్టరేట్‌, ఇతర ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ 15మందిని ఎంపిక చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. తలిదండ్రుల వార్షికాదాయం 2.5లక్షల రూపాయలుగా పరిమితి విధించారు. విదేశీ చదువులంటే మాటలా? అది మా వల్ల అయ్యే పనేనా? అంబేద్కర్‌ లాంటి మహానుభావుడికే అది సాధ్యం కాలేదు. ఆయనే బరోడా మహారాజా వారి సహాయం తీసుకున్నారు. అని విద్యారంగంపై అవగాహన కలిగిన దళితులు అనుకునే మాటఇది. కానీ ఇదంతా మొన్నటి మాట. దళిత, ప్రజాసంఘాల పోరాట ఫలితంగా దేశంలోనే మొదటి సారిగా సబ్‌ప్లాన్‌ నిధుల ఖర్చుకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. చట్టం అమలులో భాగంగా అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధికి రూపకల్పన చేశారు.
సబ్‌ప్లాన్‌లో విద్యారంగానికి పెద్దపీట
సబ్‌ప్లాన్‌ చట్టంలో అభివృద్ధి పథకాలతో పాటూ విద్యారంగానికి పెద్దపీట వేశారు. సాంఘిక సంక్షేమశాఖకు కేటాయించిన నిధుల్లో 80శాతం నిధులను విద్యకు కేటాయించారు. సాదారణంగా ఖర్చుచేసే నిధులతో పాటూ కొత్త అవకాశాలు కల్పించారు. స్కాలర్‌షిప్స్‌, ట్యూషన్‌ ఫీజులు, మెస్‌ఛార్జీలు, రియంబర్స్‌ మెంట్‌, ప్రొఫెషనల్‌ కోర్సులు, ఫారిన్‌ ఎడ్యుకేషన్‌, స్టడీ అబ్రాడర్‌, సెల్ప్‌ ఫైనాన్స్‌ వంటి కోర్సులకు అవకాశాలు కల్పించారు.
సాంఘిక సంక్షేమశాఖకు 3077కోట్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా సాంఘిక సంక్షేమ శాఖకు 3077కోట్లా 85లక్షలా 52వేల రూపాయలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం 907కోట్లా 57లక్షలా 67వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 2170కోట్లా 27లక్షలా 85వేల రూపాయలు ఈ శాఖ ఆధ్వర్యంలో సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు చేయ నున్నారు. వసతి గృహ విద్యార్థులకు వసతులను మెరుగుపర్చడం, కొత్త హాస్టల్‌ భవనాల నిర్మాణం, రాజీవ్‌ విద్యామిషన్‌ పాఠశాల భవనాల నిర్మాణం, కెజిబివి పాఠశాలల నిర్మాణం, పౌష్టికాహారం వంటి వంటి వాటికి భారీగా నిధులు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం సబ్‌ప్లాన్‌ చట్టం కింద దళిత సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ వాటాగా 1259కోట్లా 97లక్షలా 3వేలు ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 9844కోట్లా 54లక్షలా 40వేల రూపాయలు ఖర్చు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం నుండి నిధుల ఖర్చు ప్రారంభం కావాల్సింది. ఎస్సీ, ఎస్టీ నిధులను ప్రత్యేకంగా ఖర్చు చేయగల అవకాశం ఉన్న 42శాఖలతో పాటూ ప్రభుత్వ ఖాతా పరంగా అవిభాజిత శాఖలుగా ఉన్న మేజర్‌ ఇరిగేషన్‌, మీడియం ఇరిగేషన్‌, నీటిపారుదల అభివృద్ధి అథారిటీ, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ఫ్రా వంటి ఏడు రంగాల్లో కేంద్ర ప్రభుత్వం 1008కోట్లా 55లక్షలా 51వేలు కేటాయించింది. ఈ నిధులనూ ఖర్చు చేసే అవకాశం ఉంది. కాని సబ్‌ప్లాన్‌ చట్టం చేశాక ఆచరణలో నత్తనడక సాగడం విచారకరం. ఇప్పటికైనా వేగంగా అమలు చేయడానికి పాలకులు నడుంబిగించాలని ఆశిద్ధాం. 
సబ్‌ప్లాన్‌ అమలుకు మానిటరింగ్‌ కమిటీలు వేయాలి
కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ
సబ్‌ప్లాన్‌ చట్టం చేశారు. రూల్స్‌ ఇంకా ప్రేమ్‌ చేయలేదు. నిధులను ఖర్చు చేయడానికి మానిటరింగ్‌ కమిటీ వేయాలి. అందులో దళిత , గిరిజన సంఘాలుండాలి. జిల్లా స్థాయినుంచి మండల స్థాయి వరకు ప్రత్యేక అవగాహన కల్పించాలి. దళిత, గిరిజన సంఘాలతో ఈ అంశంపై చర్చ పెట్టాలి. దేనికి ఎంత నిధులు ఖర్చు చేయాలనే ప్రణాళిక ఉండాలి. ఎస్సీ కార్పోరేషన్‌కు ప్రత్యేకంగా తక్షణం వెయ్యికోట్లు కేటాయించాలి. ప్రధానంగా లబ్ధిదారులైన దళితులను సబ్‌ప్లాన్‌ పట్ల చైతన్య పరచాలి. ఇవన్ని చేయకపోతే నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది సబ్‌ప్లాన్‌చట్టాన్ని అమలు చేస్తామన్నారు. కిందిస్థాయి అధికారులకు కావల్సిన ఆదేశాలు ఇంకాపూర్తిస్థాయిలో చేరాలి.
వై.నరసింహులు, హైదరాబాద్‌ 

Prajashakti Telugu News Paper Dated : 09/09/2013 

Saturday, April 20, 2013

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం పూర్వాపరాలు By దిగుపాటి రాజగోపాల్‌


  Sat, 20 Apr 2013, IST  

రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలు, తెగలు, సామాజిక, ఆర్థిక అసమానతలు అంతకంతకు ఎక్కువవ్వడమే కాక ఈ వర్గాలలో మా వాటా మాకివ్వండని నినదించే పరిస్థితి వచ్చింది. దానికి కొన్ని సంఘాలు, సంస్థలు, ఈ వర్గాలకు చెందిన అధికారులు, విశ్రాంత అధికారులు మహా ఉద్యమంగా ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఈ దశకంలో మంచి పరిణామం. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సబ్‌ప్లాన్‌ అమలుకు నోడల్‌ ఏజెన్సీలకు చట్టబద్ధత కల్పించాలని ఐక్య పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం తప్పని పరిస్థితిలో సబ్‌ప్లాన్‌ చట్టం చేసింది. తరతరాలుగా అభివృద్ధిలో వెనుకబడిన ఈ వర్గాల అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ ప్రణాళికల అమలుకు నిర్దిష్టమైన యంత్రాంగం ఏర్పరుచుకోవడానికి, ఆశించిన ఫలితాలు ఓ మేరకు సాధించుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడగలదు. సబ్‌ప్లాన్‌ చట్టం దేశంలో మొదటగా కాంగ్రెస్‌ పార్టీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. సబ్‌ప్లాన్‌ నిధులను దళిత, గిరిజన అభివృద్ధికి ఖర్చు చేసేందుకు నోడల్‌ ఏజెన్సీలు ఏర్పాటు చేయాలని, బడ్జెట్‌ కేటాయింపులలో జనాభా ప్రాతిపదికన వచ్చే నిధులను నోడల్‌ ఏజెన్సీలకు కేటాయించి ఖర్చు చేయాలని వివిధ సంఘాలు, వామపక్షాలు చేపట్టిన ఉద్యమాలు, నిరవధిక దీక్షలు, చలో అసెంబ్లీ, శాసనసభలో చర్చ ఫలితంగా 2007 నవంబర్‌ 5న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 177 విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 22.8 శాతం బడ్జెట్‌ కేటాయింపులు చూపిస్తూ ఖర్చు చేయకుండా భారీగా కోత విధించింది. ఖర్చు చేసిన నిధులు సైతం దళిత, గిరిజనులకు ప్రయోజనం లేని రంగాలకు కేటాయించింది. అన్ని శాఖలలో ఇదే పరిస్థితి ఉంది.
దేశ, రాష్ట్ర జనాభాలో దళిత గిరిజనుల జనాభా శాతం కంటే కాకుండా అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లలో నిధులు కేటాయించి వారి ప్రయోజనాలకే ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1980లో ఎస్సీలకు స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాను (ప్రస్తుతం ఎస్సీ సబ్‌ప్లాన్‌) గిరిజనులకు ట్రైబల్‌ సబ్‌ప్లానును రూపొందించింది. అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ, జాతీయ ప్రణాళికా సంఘం మెంబరు సెక్రటరీగా ఉన్న నేటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు లేఖలు రాసి 40 సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోకపోవడం శోచనీయం. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నను అమలు చేయకుండా ప్రభుత్వ పాలకులే వివక్ష చూపి అన్యాయం చేస్తున్నవి. దళిత గిరిజన నిధులను దోచి అగ్రకుల ధనిక వర్గాల ప్రయోజనాలకు ఖర్చు పెడుతున్నాయి.
మన రాష్ట్రంలో గత 19 సంవత్సరాలలో రూ.17,970 కోట్లు కోత విధించారు. రూ.5,000 కోట్లు దారి మళ్లించారు. మొత్తం 21,604 కోట్లను దళితులకు ఖర్చు చేయలేదు. గత ఏడేళ్ళ కాంగ్రెస్‌ పాలనలో రూ.13,601 కోట్లు, అంతకుముందు 9 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పాలనలో రూ.4,047 కోట్లు కోత విధించారు. ఈ నిధులను తిరిగి కేటాయించలేదు. అంటే గత 19 సంవత్సరాల కాలంలో కోత విధించిన రూ.28 వేల కోట్లు దశలవారీగా తిరిగి కేటాయించవలసి ఉండగా 2013 బడ్జెట్‌లో ఆ ప్రయత్నం చేయలేదు. ఇప్పటికే దళితులకు ఉన్న చట్టాల అమలు తీరు ఏవిధంగా ఉన్నదో మనకందరికీ తెలిసిందే. కానీ సబ్‌ప్లాన్‌ చట్టం అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు వేయడానికి బలమైన ఐక్య ప్రాతిపదిక ఏర్పడిందనేది వాస్తవం.
దేశంలోని షెడ్యూల్‌ కులాల్లో సుమారు 51 శాతం మంది వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. ఇతర కులాలకు చెందిన వారిలో 19 శాతం వ్యవసాయ కార్మిక కుటుంబాలుగా ఉన్నారు. దళితులలో అక్షరాస్యత 2001 జనాభా లెక్కల ప్రకారం 54.69 శాతం ఉన్నారు. డిగ్రీ చదువులలో దళితుల సంఖ్య 8.37 శాతం ఉండగా ఇతర కులాలలో 91.63 శాతం ఉన్నారు. గిరిజనులు 8.2 శాతం జనాభా ఉన్నారు. వారి నిష్పత్తి ప్రకారం హక్కులు అవకాశాలు, నిధులు, సంక్షేమ పథకాలు గిరిజనులకు లభించుట లేదు. ప్రత్యేక కాంపోనెంట్‌ ప్రణాళిక ప్రకారం దళితుల సంక్షేమానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ జనాభాలో వారి దమాషాకు అనుగుణంగా ఉండాలి. అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉల్లంఘించింది. వారికి కేటాయించిన గ్రాంట్లను ఇతర అవసరాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని మంత్రిత్వశాఖలు, విభాగాలు మళ్లించకుండా అడ్డుకట్టవేసే శాసనం లేకపోవడం వలన నిధులకు ఇతర శాఖలు మళ్లిస్తున్నారు. నిధులను మళ్లించకుండా సమగ్రమైన చట్టం చేయవలసిన అవసరం ఉన్నది.
దళిత, గిరిజన సెక్షన్ల పట్ల చిత్తశుద్ధితో ఆలోచించేవారు ఇప్పటికే పట్టిపీడిస్తున్న రెండు అంశాలను పరిశీలన చేయవలసి ఉన్నది. దళిత గిరిజనులలో ప్రధానంగా సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్య్రం వచ్చి 64 సంవత్సరాలు పైబడినా దళిత గిరిజనులు సామాజిక, ఆర్థిక పీడనలకు గురవుతూనే ఉన్నారు. సామాజిక ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్య, వైద్యం, తిండి, బట్ట, ఇల్లు వంటి కనీస అవసరాలకు నోచుకోని స్థితిలో దళితులు ఉన్నారు. అంబేద్కర్‌ ఆశించిన హోదా దళితులకు దక్కాలంటే సామాజిక, ఆర్థిక అంశాల కీలక పాత్రను పరిగణనలోకి తీసుకోవాలి. దళిత కుటుంబాలకు సామాజిక అసమానతలు పోవాలంటే ఆర్థికశక్తి కల్పించినట్లయితే అన్ని రంగాలలోనూ అభివృద్ధి సాధ్యపడుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వానికి చెందిన, ఇతరులు ఆక్రమించుకున్న లక్షలాది ఎకరాల భూములు ఉన్నది. ఈ భూములను దళిత, గిరిజన కుటుంబాలకు పంచినట్లయితే సామాజిక ఆర్థిక హోదా పెరిగి సమాజంలో గౌరవంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. దళితుల పట్ల చిత్తశుద్ధితో ఆలోచించే ప్రభుత్వాలు, పాలకులు, సంస్థలు ఆర్థిక, సామాజిక అంశాలపై దృష్టిపెట్టి అమలుచేస్తే ఒక మేరకైన ఈ వర్గాలను ముందు పీఠిలో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది.

-దిగుపాటి రాజగోపా


Prajashakti Telugu News Paper Dated : 20/4/2012

Thursday, April 18, 2013

మైనార్టీలకూ సబ్‌ప్లాన్‌ కావాలి By Jalil Khan

శనివారం , ఏప్రిల్ 13 ,2013


రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ అవసరముంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో మైనారిటీ వర్గాలు 13 శాతం ఉన్నారు. జనాభా దామాషా ప్రకారం వారి అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. భారీస్థాయిలో బడ్జెట్‌ కేటాయించిన అవి కాగితాలకే పరిమితి అవుతోంది. పూర్తిస్థాయిలో నిధులు కేటాయించిన దాఖలు లేవు. ఉదాహరణకు సమాచార్‌కమిటి నివేదిక ప్రకారం ప్లానింగ్‌లో నివేదిక ప్రకారం 58.11 కోట్లు బడ్జెట్‌ మైనారిటీ సంక్షేమశాఖకు కేటాయించాలి. అయితే యు.పి.ఎ. ప్రభుత్వం 17 వేల కోట్లు కేటాయించింది. 2011-12 సంవత్సరం బడ్జె ట్‌లో 17 కోట్లు కేటాయించారు. విడుదల చేసింది 7 వేల కోట్లు, ఖర్చు చేసింది 4 వేల కోట్లు మాత్రమే. రాష్ట్రప్రభుత్వం 2014వ సంవత్సరం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సుమారు వివిధ పథకాలు కింద 1,100 కోట్లు కేటాయించింది. ఈ పరిస్థితిలో మైనారిటీ వర్గాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికా అవసరం వుంది. ఎస్‌.సి, ఎస్‌.టి కమీషన్‌ తరహాలో మైనారిటీ కమీషన్‌కు చట్ట బద్ధత కల్పించాలి. అందుకు అవసరమైన చట్టాలను రూపొందించాలి. ముస్లింలలో అత్యధికులు స్వయం ఉపాధితో చిన్నచిన్న వృత్తులలో అసంఘటిత రంగంలో జీవనం సాగిస్తున్నారు. ఉత్పత్తి పద్ధతులలో వస్తున్న మార్పులు మూలంగా వారి వృత్తులు దెబ్బతింటున్నాయి. నైపుణ్యం పెంచుకొనేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలి. రాయితీతో కూడిన పరపతి సౌకర్యం అందించాలి. ఇందుకోసం ప్రభుత్వం 500 కోట్లు రివాల్వింగ్‌ఫండ్‌ ఏర్పాటుచేయాలి.
రాష్ట్రంలో ముస్లిం ఆదాయ స్థాయి సాధారణ సగటుకంటే దిగువున ఉంది. ముస్లింలలో 65 శాతం కుటుంబాల సంవత్సర ఆదాయం 24 వేల రూపాయలలోపు మాత్రమే అంటే నెలకు 2వేల రూపాయలులోపు మాత్రమే. అంటే నెలకు 2వేల రూపాయలు రోజుకు 63 రూపాయలు. ఆకాశాన్ని అంటిన ధరలతో తమ కనీస అవసరాలు ఎలా తీర్చుకోవాలో తెలియక మైనారిటీలు మానసికంగా కుంగిపోతున్నారు. అందుకే విద్య, వైద్యంలాంటి అత్యవసర సేవలు మైనారిటీ వర్గాలకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. మైనారిటీ వర్గాలలో 80శాతం ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే వెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. ముస్లిం సమాజంలో 45శాతం ప్రజలు చిన్నాచితకా వ్యాపారులు, చేతివృత్తిపనివారు, పాన్‌దుకాణాలు, కూరగాయలు, పండ్లు, పూల దుకాణాల్లో పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. మరో 30 శాతం మంది వ్యవసాయకూలీలుగా, కార్మికులుగా పనిచేస్తూ కడుపునింపు కొంటున్నారు. రోజూ రెక్కాడితే, డొక్కాడని ఈ మైనారిటీ వర్గం విద్యాపరంగా కూడా అంతే వెనుకబడి వున్నారు. రాష్ట్ర సగటు అక్షరాస్యత 60శాతం ఉండే ముస్లింలలో అది కేవలం 19.5శాతం అక్షరాస్యత తక్కువుగా ఉన్న వర్గం సహజంగానే ఉద్యోగ, ఉన్నతవిద్య శిఖరాలు చేరుకోవడంలో వెనుకబడి ఉంది. మైనారిటీ వర్గాలలో విద్యా వికాసానికి కేంద్ర,రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రయత్నమే జరగలేదు. ముస్లిం వసతి గృహాలు అంతంత మాత్రమే, రాష్ట్రంలో ఉర్దూ అకాడమీకి స్వయంగా పుస్తకాలు ముద్రించుకునే స్వతంత్య్రం ఎప్పుడు వస్తుందో? దేశంలో మైనారిటీలలో 52శాతం మందికి సెంటుభూమి కూడా లేదు. 28శాతం మందికి ఒక ఎకరం, 5శాతం మందికి ఐదు ఎకరాలు ఉన్నాయి. 2000వ సంవత్సరంలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే సమర్పించిన నివేదిక వెల్లడించిన పరిస్థితుల్లో ఇవ్వటానికి ఏమార్పు రాలేదు. జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాలు నిర్వహించిన సర్వేలు, గోపాల్‌సింగ్‌ కమీషన్‌, కేరళ నరేంద్రర్‌ కమీషన్‌, కర్ణాటక మైనారిటీ కమీషన్‌, గుజరాత్‌ కెజిమున్షిసర్వే, మధ్యప్రదేశ్‌ శ్యామలిచంద్రలేఖ సర్వేల నుండి నేటి సంచాల్‌ కమిటి వరకు ఈ వాస్తవాలను అంగీకరించాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలకులు టైంపాస్‌ కమిటీలతో కాలాన్ని, ప్రభుత్వధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది.
ప్రతి రాజకీయ పార్టీ కేవలం మైనారిటీ వర్గాల ఓట్లు కోసం పరుగులు తీస్తుంది. ఎస్‌.సి, ఎస్‌.టి తరహాలో మైనారిటీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు అవసరం వుంది. ఈ దశలో దేశంలో రెండవ అతిపెద్ద వర్గమైన మైనారిటీ వర్గం అందులో ముస్లింల ఆర్థిక పరిస్థితి ఇంత దయనీయంగా ఉండడం దేశ ప్రతిష్ఠను ఏమాత్రం పెంచదు. ఈ పరిస్థితి మారడం కేవలం ముస్లిం ప్రజలకే కాక దేశం మొత్తానికే అవసరం. ప్రపంచంలో ముస్లింలు అధికంగా గల దేశాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ముస్లింలు నిరాదారణకు గురౌతుంటే పాశ్చాత్యదేశాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. దేశంలో నివసించే మైనారిటీలు భారతదేశంను మాతృభూమిగా పరిగణిస్తారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఏ శక్తులు ఎన్ని కుట్రలుపన్నినా ఈ భావనలో మార్పు ఉండదు. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అతిపెద్ద మైనారిటీ వర్గీయులైన ముస్లింల  జీవన ప్రమాణాలును పెంచేందుకు కృషి చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం 2012వ సంవత్సరంలో ఎస్‌.సి, ఎస్‌.టి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి చట్టబద్దత కల్పించడం జరిగింది. అదే తరహాలో అట్టడుగు వర్గం మైనారిటీ కొరకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. అందు కొరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వున్న మైనారిటీ వర్గాలు మైనారిటీ విద్యాసంఘాలు, మైనారిటీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న మైనారిటీ సెల్‌ కమిటీలు మైనారిటీ అభ్యుదయ వాదులు తమవంతుగా మీ ప్రాంతాలలో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేసి, మైనారిటీ సంక్షేమ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మైనారిటీ వర్గ ప్రజలకు అవగాహన కల్పించాలి. మైనారిటీ సంక్షేమ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు వల్ల ప్రయోజనాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక వుంది. మైనారిటీ కార్పోరేషన్‌కు లక్ష నుంచి 5 లక్షల వరకు రుణాలు ప్రతి ఏడాది వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. మైనారిటీ కార్పోరేషన్‌ సబ్సిడీలు మాత్రమే ఇస్తోంది. దీనిపై సబ్సిడి కాంపౌనెంట్‌ పెంచటానికి అవకాశాలు ఉన్నయి. జాతీయ మైనారిటీ ఆర్థిక సంస్థ కూడా లబ్ధిదారులకు సహాయం చేస్తుంది. అణగారిన వర్గాల కోసం తమవంతుగా సంక్షేమాన్ని కృషి చేయాలి. ఎస్‌.సి, ఎస్‌.టి సబ్‌ప్లాన్‌ తరహాలో మైనారిటీల కొరకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు ఉద్యమించాలి. వాడవాడలా ఉద్యమిస్తేనే వాటి ప్రయోజనాలు పేద మైనారిటీ వర్గాలు పొందుతారు. తమ హక్కులు పరిరక్షణ కొరకు ఉద్యమించాలి, హక్కులను సాధించుకోవాలి.

Vaartha Telugu News Paper Dated : 13/4/2013

ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్టం అమలుకు ఉద్యమించాల్సిందే By Digupati Rajagopal


శుక్రవారం , ఏప్రిల్ 12 ,2013


కేంద్ర,రాష్ట్ర బడ్జెట్‌లలో ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు సబ్‌ప్లాన్‌  అమలుకు  నోడల్‌ ఏజన్సీలకు చట్టబద్ధత కల్పించాలని ఐక్యపోరాటాలు ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం తప్పని పరిస్థితిలో సబ్‌ప్లాన్‌ చట్టం చేసింది. తరతరాలుగా అభివృద్ధిలో వెనుకబడిన ఈ వర్గాల అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ ప్రణాళికలు అమలుకు నిర్ధిష్టమైన యంత్రాంగం ఏర్పరచుకోవడానికి, ఆశించిన ఫలితాలు  సాధించుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడగలదు. సబ్‌ప్లాన్‌ చట్టం దేశంలో మొదటగా కాంగ్రెస్‌ పార్టీ చట్టం చేసిందని రాష్ట్రప్రభుత్వం పెద్ద ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడమే కాకుండా దళితుల సమస్యలు, సంక్షేమం ఈ చట్టం వలనే అవుతుందని ఈ వర్గాలలో భ్రమలు కల్పించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ఆరాటపడుతున్నారు.
  కాంగ్రెస్‌ పార్టీ దళిత, గిరిజన సంక్షేమాలపై శ్రద్ధ ఉన్నట్లయితే ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1980 మార్చి 13న దళిత, గిరిజనుల జనాభా ప్రాతిపదికన ప్రణాళికా బడ్జెట్‌లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని ఆదేశించినప్పటికి ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని? దళిత, గిరిజన వర్గాలలో ఆలోచన రేకెత్తిస్తుంది. అంతేకాదు సబ్‌ప్లాన్‌ నిధులతో దళిత, గిరిజన అభివృద్ధికి ఖర్చు చేసేందుకు నోడల్‌ ఏజన్సీలు ఏర్పాటు చేయాలని బడ్జెట్‌ కేటాయింపులలో జనాభా ప్రాతిపదికన వచ్చే నిధులను నోడల్‌ ఏజన్సీలకు కేటాయించి ఖర్చు చేయాలని, వివిధ సంఘాలు, రాజకీయ పక్షలు చేపట్టిన ఉద్యమాలు, నిరవధిక దీక్షలు, చలో అసెంబ్లీ, శాసనసభలో చర్చ ఫలితంగా 2007 నవంబర్‌ 5న రాష్ట్ర ప్రభుత్వం జీవో 177ను విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 22.8 శాతం బడ్జెట్‌ కేటాయింపులు చూపిస్తూ, ఖర్చు చేయకుండా భారీగా కోత విధించింది. ఖర్చు చేసిన నిధులు సైతం దళిత గిరిజనులకు ప్రయోజనం లేని రంగాలకు కేటాయించింది. గత సంవత్సరము బడ్జెట్‌లో ఔటర్‌రింగురోడ్డు, హుస్సేన్‌సాగర్‌ ఆధునీకరణ, హుడా పార్కులు, గెస్టుహౌస్‌ల నిర్మాణం తదితర వాటిని 430 కోట్లు దళిత నిధులను కేటాయించింది. అన్ని శాఖలలో ఇదే పరిస్థితి ఉంది. జాతీయ ప్రణాళిక జాతీయ ఎస్‌సి,ఎస్‌టి కమీషన్‌ సూచనలు ప్రకారం దళితులకు కేటాయించిన నిధులలో కోత విధించినను దారి మళ్లించిన, ఖర్చుచేయని ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులు వచ్చే సంవత్సరము బడ్జెట్‌లో అధనంగా కలిపి కేటాయించి ఖర్చు చేయాలని సూచించింది.
 దేశ, రాష్ట్ర జనాభాలో దళిత గిరిజనుల జనాభా శాతం కంటే తక్కువ కాకుండా అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లలో నిధులు కేటాయించి వారి ప్రయోజనాలకే ఖర్చు చేసేందుకు కేంద్రప్రభుత్వం 1980లో ఎస్‌సిలకు స్సెషల్‌ కాంపోనెంటు ప్లాను  (ప్రస్తుతం ఎస్‌సి సబ్‌ ప్లాను) గిరిజనులకు ట్రైబల్‌ సబ్‌ ప్లానును రూపొందించింది. అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ జాతీయ ప్రణాళికా సంఘం మెంబర్‌ సెక్రటరీగాఉన్న నేటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు లేఖలు వ్రాసి 40 సంవత్సరాలు గడిచినను అమలుకు నోచుకోకపోవడం శోచనీయం. ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నా అమలు చేయకుండా ప్రభుత్వ పాలకులే వివక్ష చేసి అన్యాయం చేస్తున్నారు.దళిత గిరిజన నిధులను దోచి అగ్ర కుల, ధనిక వర్గాల ప్రయోజనాలకు ఖర్చు పెడుతున్నాయి. దళిత, గిరిజన ప్రజలు కోరుతున్న విధంగా సంపదలో వాటా బడ్జెట్‌లో కోటా అంశం సామాజిక న్యాయమనేది వాస్తవంగా అంగీకరించాలి, అమలు చేయడానికి ప్రభుత్వము ముందుకు రావాలి.
దారిమళ్లించిన, కోతపెట్టిన నిధుల సంగతేమిటి?
 మన రాష్టంలో గత 19 సంవత్సరములలో 17,970 కోట్లు కోత విధించారు. 5 వేల కోట్లు దారి మళ్లించారు, మొత్తం 21,604 కోట్లును దళితలకు ఖర్చు చేయలేదు. గత 7 సంవత్స రముల కాంగ్రెస్‌ పాలనలో 13,601 కోట్లు, అంతకు ముందు 9 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పాలనలో 4047 కోట్లు కోత విధించారు. ఈ నిధులను తిరిగి కేటాయించలేదు. అంటే గత 19 సంవత్సరముల కాలములో కోత విధించిన 28 వేల కోట్లు దశల వారిగా తిరిగి కేటాయించవలసి ఉండగా 2013 బడ్జెట్‌లో ఆ ప్రయత్నం చేయలేదు. కేవలం ఒక ప్రత్యేక చట్టం వల్లనే ఎస్‌సి, ఎస్‌టి వర్గాల సమగ్రాభివృద్ధికి ఉద్ధేశించిన నిధులు ఆయా వర్గాల ఆర్ధికాభివృద్ధికి ఆశించిన పద్ధతిలో జరుగుతుందని భావిస్తే అది ముమ్మాటికి తప్పవుతుంది. ఇప్పటికే దళితులుకు ఉన్న చట్టాలు అమలు తీరు ఏవిధంగా ఉన్నదో మనకందరికి తెలిసినదే. కాని సబ్‌ప్లాన్‌ చట్టం అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు వేయడానికి బలమైన ఐక్య ప్రాతిపదిక ఏర్పడిందనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పక్షాలు ఐక్య కార్యాచరణ ఉద్యమాలు, ఆందోళన ఫలితంగా రాష్ట్రప్రభుత్వం మెడలను వంచి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని సాధించు కున్న మార్గం ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి చట్టం కోసం ఒత్తిళ్లు, ఉద్యమాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇతర కులాలకంటే ఇప్పటికి దళిత గిరిజనులు వెనుకబాటే
  దేశంలో షెడ్యూలు కులాల వర్గాల్లో సుమారు 51 శాతం మంది వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. ఇతర కులాలకు చెందిన వారిలో 19 శాతం వ్యవసాయ కార్మిక కుటుంబాలుగా ఉన్నారు. దళితులలో అక్షరాస్యత 2001 జనాభా లెక్కల ప్రకా రం 54.69 శాతం ఉన్నారు. డిగ్రీ చదువులలో దళితుల సంఖ్య 8.37శాతం ఉండగా ఇతర కులాలలో 91.63 శాతం ఉన్నారు. గిరిజనులు 8.2 శాతం జనాభా ఉన్నారు. వారి నిష్పత్తి ప్రకారం హక్కులు అవకాశాలు, నిధులు, సంక్షేమ పథకాలు గిరిజనులకు లభించుట లేదు.ప్రత్యేక కాంపోనెంట్‌ ప్రణాళిక ప్రకారం దళితుల సంక్షేమానికి ఉద్ధేశించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ జనాభాలో వారి దామాషాకు అనుగుంగా ఉండాలి.ఆ అంశాన్ని కేంద్ర, రాష్ట్రప్రభు త్వం కూడా ఉల్లంఘించింది. 2006 సంవత్సరంలో ప్రణాళికా సంఘం ప్రధాన సలహాదారు నివేదికలో మొత్తం ప్రభుత్వ ప్రణా ళికల దళితులు, గిరిజనులకు చేసే కేటాయింపులలో జనాభా దామాషా ప్రాతిపదికన కేటాయించాల్సిన మొత్తం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఇటువంటి స్థితిలో జనాభా ప్రాతిపదికన ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయింపులు జరిగేలా చూడటం ప్రణాళికా సంఘం బాధ్యతని స్పష్టం చేయడం జరిగింది. కేటాయించిన గ్రాంట్లను ఇతర అవసరాలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలలోని మంత్రిత్వ శాఖలు, విభాగాలు మళ్లించకుండా అడ్డుకట్ట వేసే శాస నం లేకపోవడం వలన నిధులకు ఇతర శాఖలకు మళ్లిస్తున్నారు. నిధులను మళ్లించకుండా సమగ్రమైన చట్టం చేయవలసిన అవస రం ఉంది. దేశజనాభాలో 16 శాతం ఉన్న దళితులకు కేంద్ర ప్రణాళిక బడ్జెట్‌లో గత సంవత్సరం 50 వేల కోట్లు కేటాయిం చవలసి ఉండగా 30,500 కోట్లు ప్రతిపాదించింది. ఇప్పటి వరకు 10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మొత్తం 40 వేల కోట్లు కోత, దారి మళ్లింపు చేసింది. గత దశాబ్ధాలు లెక్కలు చేస్తే ఎస్‌సిలకు ఖర్చు చేయాల్సిన నిదులలో 4 లక్షల కోట్లు కోత విధించింది. 1953వ సంవత్సరం నుండి కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల బడ్జెట్‌లో ఎస్‌సి, ఎస్‌టిలకు ఖర్చు చేయాల్సిన నిధుల్లో లక్షల కోట్లు కుంభకోణానికి పాల్పడింది. రాష్ట్రంలో కోటి 50 లక్షల పై బడి ఉన్న దళితులు 75 వేల దళితవాడల, బస్తీల్లో ఉన్నారు. సగం కుటుంబాలకుపైగానే ఇళ్ళస్థలాలుగాని, ఇళ్ళుకానిలేవు. 65 శాతం దళితవాడలలో రక్షిత మంచినీటి సౌకర్యం లేదు. 85 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు, బహిరంగ ప్రదేశాలలో వెళ్లే పరిస్థితి. వీధిలైట్లు రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాల్స్‌ తదితర సౌకర్యాలు లేక మురికివాడలలో మురుకికంపుతో మూలుగుతున్నయి. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమహాస్టల్స్‌ సౌకర్యాలతో పాటు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు. సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి
  దళిత, గిరిజన వర్గాల యొడల చిత్తశుద్ధితో ఆలోచించేవారు ఇప్పటికే పట్టి పీడిస్తున్న 2 అంశాలను పరిశీలన చేయవలసి వున్నది. దళిత, గిరిజనులలో ప్రధానంగా సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉన్నది. స్వాతంత్య్రం 64 సంవత్సరాలు పై బడిన దళిత గిరిజనులు సామాజిక, ఆర్థికపీడనలకు గురిఅవుతున్నారు.  ఎస్‌సి,ఎస్‌టి రిజర్వేషన్లు కేవలం ప్రభుత్వరంగ శాఖలలో మాత్రమే అమలు జరుగుతాయి. కాని నూతన ఆర్ధిక విధానాలు పేరుతో ప్రైయివేటైజేషన్‌ సాకుతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైయివేటు కార్పోరేటర్ల పరం చేయడం వలన దళితులకు ఉద్యోగాలు, రిజర్వేషన్లు గండికొట్టే చర్యల చేపడుతున్నారు.   
  మనరాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి బాక్‌ లాగ్‌ పోస్టులు 80 వేలు ఉన్నయి, నియామకాలు చేయుటలేదు. కేంద్రప్రభుత్వ శాఖలలో లక్షలాది దళితులు, గిరిజనులకు రావల్సిన ఉద్యోగాలు నియమకాలు చేయుటలేదు. కాబట్టి ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టం మొత్తం సమస్యలను పరిష్కారమవుతాయనే ప్రచారం సరైనదికాదు.
  ఏది ఏమైనప్పటికి సబ్‌ప్లాన్‌ చట్టం అంశాలను అమలు జరిపించే విధంగా ప్రభుత్వాలు, పాలకులపై వత్తిడి తెచ్చి కొంత మేరకైన దళిత, గిరిజన సంక్షేమాన్ని కాపాడడానికి మరోసారి ఉద్యమించాల్సిందే.


Vaartha Telugu News Paper Dated : 12/4/2013

Saturday, April 13, 2013

స్వప్రయోజనాల కోసమే 'సబ్‌ప్లాన్'4 - దుడ్డు ప్రభాకర్



ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లును కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం గత నవంబర్ 30న శాసనసభలో ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టబద్ధతకు మూడు రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అన్ని పార్టీల నాయకులు ఎవరిస్థాయిలో వాళ్ళు ఎస్సీ, ఎస్టీలపై ప్రేమ జల్లులు కురిపించారు. అందరూ ఎస్సీ, ఎస్టీల క్షేమం కోరేవారైతే వారి బతుకులు, ఇప్పటికీ ఇంత దుర్భరంగా ఎందుకున్నాయి? అనే ప్రశ్నకు ఏ ఒక్కరి వద్ద సమాధానం లేదు. ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన నిధులలో వేలకోట్ల రూపాయలు ఎందుకు దారిమళ్ళాయి? ఎవరు మళ్ళించారు? అనే ప్రశ్నకు అందరూ సమాధానం దాటవేసే వాళ్ళే.

కేంద్ర ప్రభుత్వం ఐదో పంచవర్ష ప్రణాళికలో ఎస్సీల అభివృద్ధి కోసమని స్పెషల్ కంపోనెంట్ ప్లాన్, ఎస్టీల అభివృద్ధి కోసం ట్రైబల్ సబ్‌ప్లాన్ రూపొందించింది. ఈ పథకం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి. ఆ నిధులను వాళ్ళ సంక్షేమానికే ఖర్చుపెట్టాలి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు సక్రమంగా నిధులు కేటాయించడం లేదు. ఆ కేటాయించిన అరకొర నిధులు కూడా సరిగ్గా వినియోగించడం లేదు. ప్రజా వ్యతిరేక విధానాలతో అంతర్గత కుమ్ములాటలతో ప్రజలకు దూరమైన కాంగ్రెస్ పార్టీ స్థానికసంస్థల ఎన్నికలు, 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల ఓట్లు కొల్లగొట్టడానికి మాత్రమే ఉపప్రణాళిక బిల్లును తెరమీదకు తెచ్చిందనేది స్పష్టం. కానీ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని అందుకే చట్టం తెచ్చామని ప్రజల్ని నమ్మించడానికి పార్టీలోని ఎస్సీ, ఎస్టీల నాయకుల్ని, కులసంఘాల నాయకుల్ని, ఎన్జీఓలను రంగంలోకి దింపి విస్తృత ప్రచారం చేస్తోంది.

1977 అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి ఎస్సీ, ఎస్టీల భూముల్ని బహుళజాతి కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఎన్.ఎస్.ఎఫ్.డి.సి. (నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ని రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్‌ను అంపశయ్య మీదకు చేర్చారు. మరోవైపు దళిత విద్యావంతుల్ని పారిశ్రామికవేత్తలను చేస్తా, సంవత్సరం తిరక్కుండానే కోటీశ్వరుల్ని చేస్తానని దళితుల్ని మభ్యపెట్టి రెండవ సారి అధికారం చేజిక్కించుకున్నారు. అదే ఫార్ములా ఇప్పడు కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేస్తున్నారు. కాకుంటే ఎన్.ఎస్.ఎఫ్.డి.సి.ని, ఎస్సీకార్పొరేషన్‌ని పునరుజ్జీవింప చేస్తామంటున్నారు.

ఆదివాసులు పోరాడి సాధించుకున్న 1/70 యాక్ట్, షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయేతర అటవీ హక్కుల గుర్తింపు చట్టం, వడ్డీవ్యాపార నిషేధ చట్టం లాంటి అనేక చట్టాలను ఉల్లంఘిస్తూ ఆదివాసులను అడవి నుంచి తరిమేస్తున్నారు. చట్టాలను అమలు చేయండని అడుగుతున్న ఆదివాసులపై తూటాల వర్షం కురిపిస్తున్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం వల్ల మన రాష్ట్రంలో 400 పైగా ఆదివాసీ గ్రామాలు, వ్యవసాయ భూములు ముంపునకు గురౌతున్నాయి. వాకపల్లి, భల్లుగూడ ఆదివాసీ మహిళలపై సామూహిక అత్యాచారం చేసిన పోలీసులపై కనీసం ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదు కాలేదంటే చట్టాలకు పాలకులిచ్చే విలువేంటో అర్థమౌతుంది. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన చట్టాలను నిర్లక్ష్యం చేస్తూ వారి భూముల్ని, బతుకుని, బతుకుదెరువుని బుగ్గిచేస్తున్న పాలకులు ఆ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో వాటా కేటాయించి, ఆ కేటాయింపునకు చట్టబద్ధత కల్పిస్తూ, దాన్ని అమలు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 'ప్రాజెక్టుల కోసం, పరిశ్రమల కోసం ప్రభుత్వం సేకరించిన భూమి నిరుపయోగంగా ఉంటే అది పూర్వ యజమానులకు ఇవ్వరాదు. 

భూమిలేని నిరుపేదలకు పంచవచ్చు' అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రభుత్వానికి కోర్టులపై, చట్టాలపై ఏ మాత్రం గౌరవమున్నా పది సంవత్సరాల క్రితం మొత్తం 250 ఎకరాల భూమిని లక్షింపేట దళితులకు, పక్కన ఉన్న కొట్టిశ గ్రామంలోని భూమిలేని పేదలకు పంచి ఉండాల్సింది. అక్రమంగా, చట్టవ్యతిరేకంగా భూమిని అనుభవిస్తూ దళితుల నుంచి దౌర్జన్యంగా కౌలు వసూలు చేస్తున్న పెత్తందారులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాల్సింది. కానీ అగ్రకుల పక్షపాత ప్రభుత్వం ఆ పెత్తందారుల పక్షం వహించడమే కాకుండా దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. లక్షింపేట మాలలపై మారణకాండ జరిగిన తర్వాతైనా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం బాధితులందరికీ నష్టపరిహారం/పునరావాసం కింద కుటుంబానికి రెండెకరాల నుంచి ఐదెకరాల వరకూ భూమి ఇవ్వాలి. కానీ ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఒకటుందనే స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఎస్సీ, ఎస్టీల వాస్తవ జీవితాలు ఇంత దుర్భరంగా ఉంటే అందుకు కారకులైనవారు ఎన్ని గారడీలు చేసినా ఎంత ప్రచారం చేసుకున్నా ఆశాభంగం తప్పదు.

- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాటసమితి

Andhra Jyothi Telugu News Paper Dated: 12/4/2013




- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాటసమితి

Wednesday, February 20, 2013

Andhra Pradesh SC, ST Sub Plan


The Legislative Council of Andhra Pradesh on 2 December 2012 had passed the historic Andhra Pradesh Scheduled Castes Sub-Plan and Tribal Sub-Plan (Planning, Allocation and Utilization of Financial Resources) Act, 2012. Through the passage of this bill Andhra Pradesh had become the first state to make such legislation, of all the states in the country by giving statutory status to the scheduled castes and scheduled tribe sub-plans by ensuring allocation of funds to these sections in proportion to their population. The legislation would be helpful in ensuring the right to equality for SC and ST community apart from being effective in ensuring social security and a comprehensive development of the people of the community.

Historical background of the sub plan: The demand for according legal status to the Sub-Plans was made on states for a long time by the Planning Commission of India and National Development Council (NDC). The ST sub-plan was introduced by Indira Gandhi during 1975-76 and the SC sub-plan during 1979-80. In Andhra Pradesh after Sustained struggle waged by the “Kulavivaksha Vyatireka Porata Sangham (Struggle Committee against Caste Discrimination)” and the CPI (M) has resulted in the enactment of a legislation to ensure proper implementation of SC/ST Sub-Plans.

Why do we need such legislation?The need for separate legislation was felt as funds allocated for SC, ST sub-plan were not utilized fully and efficiently, and have been used for other purposes including infrastructural development by almost all the parties that were in power in spite of Planning Commission’s guidelines on fund utilization. The state government recognized the need for legislation in place of guidelines, as funds were used even for Necklace Road works and cleaning of Hussain Sagar. As per the population, the government should allocate 16.23 pc funds in the budget for SCs and 6.6 pc for STs, but spending remained mostly on paper as the funds meant for them are diverted for other programmes. And in order to prevent diversion of sub-plan funds of SC and ST population for other activities and not to allow them unspent, the AP government has passed this historic bill. There is also a mandatory provision for allocation of almost a fourth of the State’s annual plan of the budget for SC, ST. The legislation will also ensure total utilization of funds allocated to these sections in the planned budget. A state council headed by the chief minister will release the funds and review the progress of utilization of funds. The council will meet at least twice in a year. State-level and district-level SC and ST sub-plans will also be prepared. Last year the state spent only 12.24 per cent for SCs and 5.98 per cent for STs. In the plan budget for 2012-13, as against the state allocation of Rs 8,657 crore under SC sub-plan and Rs 4,060 crore under ST sub-plan. The law would facilitate comprehensive development of SCs and STs and provide them protection and equality on par with other sections of society.

Why do we need a separate plan for SC/ST?It is since ages that there are worst forms of social oppression, economic exploitation and discrimination towards Dalits and Tribals in India. Even after 67 yrs after independence and after several attempts by the government, it is unable to curb the menace of discrimination and uplift the social, economic and status of SC/ST. Recently even the PM Man Mohan Singh accepted that SC/ST are subjected to discrimination and harassment in many parts of the country. And the money which is sanctioned towards the upliftment of the SC/ST is spent for other purposes or left unspent since ages. Thus depriving the legitimate rights for the upliftment of the SC/ST. In order to make better use of the resources and for the overall development of SC/ST a separate sub plan funds was considered as the need of the hour and the government was successful in passing the legislation. This legislation can be considered as first of its kind in the country.

What are these Sub-Plan funds?Sub-Plan funds are those that must be allocated to the SC/ST Nodal Agencies at the time of preparing the budget itself with a mandate to spend them exclusively for the welfare of Dalits and Tribals.

What is Special Component Plan and Tribal Sub-Plan?As general development programmes could not specially cater to their socio-economic upliftment and bring them on par with other sections of society, Special Component Plan (which was later renamed as Scheduled Caste Sub Plan) and Tribal Sub-Plan (TSP) were formulated. The SCSP is an important intervention through the planning process for social, economic and educational development of Scheduled Castes and also for the improvement in their working and living conditions. It was started from the Sixth Five Year Plan period.
In accordance with the government policy all PSU’s under the administrative control of the Ministry makes allocation for various activities related to the welfare of the economic development of the SC/ST and people of the weaker sections in the neighbourhood of project locations through Special Component Plan and Tribal Sub-Plan which are as follows:

Objectives:
  1. Construction of community latrines on the lines of Sulabh Shauchalay’s etc in villages inhabited mainly by SC/ST and weaker sections communities
  2. Construction of schools/collage buildings, scholarships, adult education, distribution of teaching materials and other aids to SC/ST students, etc
  3. Financial assistance for establishing libraries in villages inhabited by SC/ST communities
  4. Construction of open air stage cum training halls
  5. Provision of community health facilities, free medical services, medicines through medical camp and family planning camps, etc
  6. Provision of drinking water facility to nearby villages through ring wells/tube wells, etc
  7. Provision of agriculture and irrigation facilities etc in surrounding villages of project locations
  8. Financial assistance to SC/ST women through co-operative societies for providing facilities for handlooms, weaving, etc so as to enable them for self –employment
  9. Financial assistance to physically handicapped persons belonging to SC/ST communities for their rehabilitation.
  10. Vocational training guidance to enable the SC/ST persons become self reliant under the scheme “Earn while you learn”. Training are arranged in various trades, like basket weaving, coir-rope making, sewing, poultry training, fishing, tailoring, typing, motor driving as well as supply of necessary tools, machines, etc
  11. Economic development /self employment by organising entrepreneurship development training programme
  12. Welfare programmes such as distribution of seeds and fertilizers free of cost to needy SC/ST farmers and distribution of smoke less chulas and solar cookers to SC/ST women and also construction of approach roads and adoption of villages.
  13. Social forestry schemes like distribution of fruit bearing seeds, sapling and other plants etc
Issues raised before and after the passage of the bill:The opposition sought an amendment that the allocation of the funds should be based on ABCD groups within the SCs based on their populations and socio-economic conditions. The chief minister pointed out that in 2004 Supreme Court had struck down the classification of SCs into sub-groups as unconstitutional and said no fresh law could be passed in any form on the issue.

APCC president said that he would raise the issue of separate sub-plans for Backward Classes and the Minorities in the Assembly. He said that the BCs and the minorities should get their fair share in budget. His support for the separate budgetary allocation is similar to the demand by the MIM asking for sub-plan for the minorities.