Showing posts with label వికలాంగులు. Show all posts
Showing posts with label వికలాంగులు. Show all posts

Monday, December 7, 2015

తీరని వికలాంగుల వెతలు


Updated : 12/3/2015 1:59:08 AM
Views : 190
సమాజంలో వికలాంగులు అసమానతలకు, వివక్షకు బలవుతున్నారు. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. సంక్షే మ రాజ్యంలో బడ్జెట్ కేటాయింపులు, విద్య, ఉపాధి రంగాలు, పునరావాసం, ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు ఇలా ప్రతి అంశంలోనూ వికలాంగులకు అన్యాయమే జరుగుతున్నది. రాజకీ య పార్టీలను నమ్మి ఓట్లేసినా అధికారంలోకి అడుగుపెట్టాక వికలాంగుల సంక్షేమాన్ని మరుస్తున్నాయి. దేశం లో 2011లెక్కల ప్రకారం 2,68,10,557 వికలాంగులున్నారు. వీరిలో పురుషులు 55.8 శాతం ఉంటే స్త్రీలు 44.2 శాతం ఉన్నారు. గ్రామీణ ్రప్రాంతాల్లో నివసించే వికలాంగుల జనాభా 69.4 శాతం ఉండగా పట్టణ ప్రాంతంలో 30.6 శాతం ఉన్నారు. వివిధ రకాలుగా శారీరక లోపాలతో.. పాక్షికంగా చూపు కోల్పోవడం, కుష్ఠు వ్యాధి, పూర్తిగా చూపు కోల్పోవడం, మూగ, వినికిడి లోపం, శారీరక లోపం, మానసిక రుగ్మతలు, బుద్ధి మాంధ్యం తదితర అంశాల ను పరిగణనలోకి తీసుకొని ఆయా లోపాలున్న వారిని వికలాంగులుగా పరిగణిస్తారు.


vasu


వికలాంగుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం 1995లో వికలాంగుల చట్టం చేసింది. చట్టం పరిధిలో వీరి కి సామాజిక న్యాయం, అనేక పథకాలు అమలుచేయాల్సి ఉన్నది. సమాజ పౌరులుగా వికలాంగులను అభివృద్ధి పరిచేందుకు ముఖ్యంగా విద్యా, ఉపాధి అవకాశాల్లో మూడు శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. అయితే పలు పథకాలు కాగితాలకే పరిమితమై ఉంటున్నాయి. దీన్‌దయాల్ వికలాంగుల పునరావాస పథకం కింద వికలాంగులకు సంక్షేమ పాఠశాలలు, వృత్తి విద్యా కేంద్రాలు, కమ్యూనిటీ పునరావాస కేంద్రాలు తదితర సౌకర్యాలు కల్పించాలి.


కానీ అవి క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంవల్ల వికలాంగులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో వికలాంగులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం ద్వారా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంత వికలాంగులకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా వారు నోచుకోవడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలలో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ల ఊసే లేదు. దామాషా ప్రకా రం ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ద్వారా నైరాశ్యానికి లోనవుతున్నారు.


ఇక వికలాంగుల ఆరోగ్య పరిస్థితులు దారుణపరిస్థితిలో ఉన్నాయి. వికలాంగుల కుటుంబాలు ఆర్థికంగా లేకపోవడంతో తగిన పోషక ఆహార విలువలతో కూడిన భోజనం దొరకడంలేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల్లో పరిస్థితి దయనీయంగా ఉన్నది. వికలాంగులకు ఉచిత వైద్య అవకాశాలు ఉన్నప్పటికీ అది పట్టణ ప్రాంతంలోని వారికే అరకొర అందుతున్నాయి. పల్లెల్లో ఉన్న వికలాంగులకు వైద్యసాయం అసలే అందడంలేదు. వికలాంగుల సర్టిఫికెట్ల కోసం ఏర్పాటు చేస్తున్న సదరన్ క్యాంప్‌లు డివిజన్ స్థాయిలోనే ఏర్పాటు చేయడంతో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. అంగవైకల్యానికి సంబంధించి అన్ని పరీక్షలు అయిపోయాక కూడా నిర్ణీత సమయంలో వికలాంగుల సర్టిఫికెట్స్ అందటం లేదు. ఈ సర్టిఫికెట్ల విషయంలో దళారుల బెడద ఎక్కువై పోయింది. వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ ముఖ్యం కావడంతో దళారుల చేతి లో మోసపోకతప్పడం లేదు. ప్రస్తుతం వైకల్యం 40 శాతం ఉంటేనే, వారికి అర్హత సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. 39 శాతం వైకల్యం ఉన్నా అనర్హులుగా తేల్చుతున్నారు.


దీంతో లక్షలాది మంది వికలాంగులు ప్రభుత్వ పథకాలకు రాయితీలకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి 40 శాతంగా ఉన్న అర్హతను 30 శాతానికి కుదించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంపై పునరాలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

అనేక సామాజిక కారణాల కారణంగా రోజురోజుకూ వికలాంగుల జనాభా గణనీయంగా పెరుగుతున్నది. ప్రభుత్వ శాఖలల్లో వీరి నియామకాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. వీరికి మల్టీనేషనల్ కంపెనీలల్లో పనిచేసే అర్హతలున్నా ఏ కంపెనీ కూడా వీరికి ఉద్యోగాలు ఇవ్వడం లేవు. అన్నిరకాల ప్రభుత్వ ఉద్యో గాల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటే నిరుద్యోగ సమస్య కొంతమేరకు తగ్గించిన వారవుతారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్క్‌లో వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది.


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనటువంటి పథకాలతో వికలాంగుల సంక్షేమాన్ని అమలు చేస్తున్నది. అర్హులైన వికలాంగులందరికి ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నది. నెలకు 1500 రూపాయల ఆసరాను అందిస్తూ వారి వికాసానికి తోడ్పాటునందిస్తున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 4,38,526 మంది వికలాంగులు లబ్ధిపొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యం గా ముందుకు సాగుతున్నది. అదే లక్ష్యంతో వికలాంగుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి.


తెలంగాణ రాష్ట్ర సాధనలో వికలాంగుల పోరాటం అద్వితీయమైనది. అందుకోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో వీరిని భాగస్వాములను చేస్తూనే వీరి అభివృద్ధికి బాటలు వేయాలి. ప్రస్తుతం వికలాంగులకు ఉన్న రిజర్వేషన్‌ను ఎనిమిది శాతానికి పెంచాలి. ఇత ర కార్పొరేషన్స్ మాదిరిగా వికలాంగుల కార్పొరేషన్‌కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్‌రూం పథకంలో వికలాంగుల కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వికలాంగుల వివాహ ప్రోత్సాహాకాన్ని 2 లక్షలకు పెంచాలి. వ్యక్తిగత రుణసౌకర్యం 5 లక్షలు ఇవ్వాలి. ఉన్నత చదువులు చదువుతున్న వికలాంగులకు ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. అలాగే వారికి వాహన సౌకర్యం కూడా అందించాలి. మరోవైపు వికలాంగ మహిళలపై అనేక లైంగిక దాడులు జరుగుతున్నాయి.


వీటిని అరికట్టాలంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అన్ని జిల్లాలల్లో వికలాంగుల వసతిగృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నా యి. వాటికి ప్రత్యామ్నాయంగా సొంత భవనాలు ఏర్పాటుచేసి విద్యార్థుల కష్టా లు తీర్చాలి. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ల కింద ఒక కుటుంబంలో ఎందరు వికలాంగులు ఉన్నా వారందరిని ఆసరా పథకం ద్వారా ఆదుకోవాలె. ప్రభుత్వం నిర్వహించే పరీక్ష రుసుముల్లో వికలాంగలకు మినహాయింపును ఇవ్వాలి. వికలాంగులకు ప్రభుత్వ రవాణా రంగాలన్నింటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలి. అర్హులైన వికలాంగులందరికీ ఆరోగ్య భద్రత కార్డులు జారీ చేయాలి. వికలాంగుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగాలి. సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సమాజంలో పూర్తిస్థాయి భాగస్వామ్యం పెంచేందుకు ఉద్దేశించిన 1995 చట్టాన్ని అమలుచేయాలి. జీఓ నెం.1095 ప్రకారం మిగులు భూముల్లో ఐదెకరాలు వికలాంగులకు కేటాయించాలి. బడ్జెట్ కేటాయింపులో ఎనిమిది శాతం నిధులు ప్రత్యేకంగా కేటాయించాలి. వికలాంగులను అన్ని విధా లా ఆదుకొని వారికి రక్షణ, ఉపాధి కల్పించిన నాడే వికలాంగులు ఆత్మగౌరవం తో తలెత్తుకొని నిలుచుంటారు.

Andhra Jyothi Telugu News Paper Dated : 03/12/2015


వికలాంగుల రాజ్యాంగబద్ధ హక్కులు


( నేడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం)ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించి సమాజ పురోగమనంలో ప్రజలందరి మానసిక, శారీరక సామర్థ్యాలను వినియోగించి అభివృద్ధికి బాటలు వేయాలంటే ప్రజలందరి భాగస్వామ్యమే కీలకం. కానీ ఈ సమాజ అభివృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యం లేకపోవడంవల్లనే సంపూర్ణ అభివృద్ధి జరగడం లేదు. దీనికి ప్రధాన కారణాల్లో వైకల్య సమస్య కూడా ఒకటి అని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించడం ద్వారా వారి మానసిక, శారీరక శక్తి సామర్థ్యాలు సమాజ అభివృద్ధిలో మిళితం చేయాలనే లక్ష్యంతో 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ఐరాస ప్రక టించింది. అందులో భాగంగానే అనేక దేశాలు వికలాం గులను విలువైన మానవ వనరులుగా గుర్తించి వారికి అనేక చట్టాలు, అంతర్జా తీయ ఒడంబడికలు, హక్కులు కల్పించాయి.

ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు వికలాంగుల హక్కులు పక్కాగా అమలుపరిచి వాటి ఫలితాల వల్ల అభివృద్ధి రథంపై దూసుకుపోతున్నాయి. కానీ భారతదేశం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వికలాంగుల ఒడంబడికను ఆమోదించినా, వికలాంగులకు ఎన్నో చట్టాలు చేసినా వాటి అమలు అంతంతమాత్రంగానే ఉండటానికి ప్రధాన కారణం వాటి పట్ల వికలాంగులకు, ప్రభుత్వ యంత్రాంగానికి అవగాహన లోపించడమే ప్రధాన కారణం. కనుకనే డిసెంబరు 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా భారతదేశం రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ద్వారా వికలాంగులకు కల్పించని హక్కులపై ఈ ప్రత్యేక వ్యాసం.

రాజ్యాంగం ద్వారా వికలాంగులకు సంక్రమించిన హక్కులు :
1. 14వ అధికరణ ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే.
2. 15(1) అధికరణం ప్రకారం పౌరులపై జాతి, మతం, లింగం, పుట్టుక ఆధారంగా ఎలాంటి వివక్ష ప్రదర్శించడానికి వీలు లేదు.
3. 16(2) అధికరణం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులపై జాతి, లింగం, పుట్టుక, వారసత్వం, స్థిర నివాస ప్రాతిపదికన వివక్ష ప్రదర్శించరాదు.
4. 21(ఎ) అధికరణ ప్రకారం విద్యా హక్కును 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21(ఎ) ప్రకరణలో చేర్చారు. దీని ప్రకారం 6 - 14 సంవత్సరాల వయస్సుగల వారందరికి ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారింది. విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1న దేశవ్యాపితంగా అమలులోకి వచ్చింది. దేశంలో వున్న వికలాంగ పిల్లలకు కూడా ప్రాథమిక విద్య అనేది హక్కుగా ఏర్పడింది.

5. 29 (2) అధికరణ ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న లేదా ప్రభుత్వం ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల్లో ప్రవేశానికి జాతి, మతం, కులం, భాషా ప్రాతిపదికపై వివక్ష చూపరాదు.
6. 41వ అధికరణ ప్రకారం నిరుద్యోగులకు, వృద్ధులకు వికలాంగులకు జీవన భృతి కల్పించాలి.
వీటితో పాటుగా జీవించేహక్కు, భాగస్వామ్య హక్కు, తదితర హక్కులు రాజ్యాంగబద్ధంగా పౌరులందరికి కల్పించిన హక్కులే. కానీ 15(1), 16(2) అధికరణలో వైకల్యం అనే పదం వీటిలో చేర్చకపోవడం మూలంగా ప్రభుత్వం ఎన్ని చట్టాలు, జిఓలు చేసినా వాటి అమలు తీరు అంతంతమాత్రంగానే ఉంటోంది.

పార్లమెంటు చేసిన చట్టాలు
ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించిన అనంతరం భారతదేశం వికలాంగుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించి అనేక చట్టాలు చేసింది.
ఎ. మెంటల్ హెల్త్ యాక్ట్ : మానసిక వికలాంగుల ఆరోగ్యం వారి జీవన ప్రమా ణాలు మెరుగుపరిచేందుకు, కావాల్సిన చికిత్స అందించేందుకు మరియు వారిని సంరక్షించేందుకు, వారి ఆస్తులను రక్షించేందుకు 1993లో మెంటల్ హెల్త్ యాక్ట్ రూపొందించారు.. దీని ప్రకారం మానసిక వికలాంగులకు రక్షణ, పునరావాస సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్వర్యంలో సంస్థలను ఏర్పరిచే అవకాశం చట్టపరంగా ఏర్పడుతుంది. ఈ చట్టం ఉన్నా అమలు జరగడంలేదు.

జాతీయ ట్రస్టు చట్టం : ఆటిజం, సెరిబ్రల్ పాల్సి, బుది ్ధమాంద్యం, బహుళ అంగ వైకల్యాలతో బాధపడేవారి కోసం రూపొందించినదే ఈ జాతీయ ట్రస్టు చట్టం. ఇది దేశవ్యాప్తంగా 1999లో అమల్లోకి వచ్చింది. మానసిక, అంగ వైక ల్యం కలిగిన వికలాంగులకు జీవితాంతం ఆసరా ఇవ్వడానికి వారి తల్లిదండ్రుల తదనంతరం వికలాంగులను ప్రధాన స్రవంతిలో భాగస్వాముల్ని చేయడమే ఈ చట్టం ముఖ్యోద్దేశం. ఈ బోర్డుకు ఛైర్మన్ కూడా లేకపోవడం వల్ల అమలు పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది.
వికలాంగుల చట్టం 1995 (సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం) : ఈ చట్టం వికలాంగులలో కొత్త ఆశలు చిగురింపచేసింది. వైకల్య నిర్వచనం, కేంద్ర రాష్ట్ర సమన్వయ కమిటీల ఏర్పాటు, వైకల్యాల ప్రారంభ దశ, నిరోధక చర్యలు, వికలాంగులకు విద్యా హక్కు, ఉపాధికి సమాన గౌరవం, గుర్తింపు, సంస్థల స్థాపన, వివక్ష నిర్మూలన, సౌకర్యాలు, ఉద్యోగ భద్రత, పరిశోధన, మానవ వనరుల అభివృద్ధి, సాంఘిక చైతన్యం, ఎన్‌జిఓల గుర్తింపు, పని నాణ్యత, వైకల్యంగల వారి కోసం పనిచేసే సంస్థల ఏర్పాటు చేయాలన్న అంశాలు వంటి వాటితో ఉంది. ఈ చట్టం కూడా పూర్తి స్థాయిలో అమలు జరగకపోవడం మూలంగా దేశ అత్యున్నత న్యాయస్థానం పదేపదే స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఐక్యరాజ్యసమితి (యూఎన్‌సిపిఆర్‌డి) వికలాంగుల ఒప్పందం పత్రం:
భారత ప్రభుత్వ కేబినేట్ సిఫారసులతో 2007 అక్టోబరు 1న రాష్ట్రపతి దీనిని ఆమోదించారు. అప్పటి నుండి యుఎన్‌సిపిఆర్‌డి ఒప్పంద పత్రం అమలౌతోంది. వికలాంగులు ప్రధానంగా ఇతరులతో సమానంగా జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, స్వేచ్ఛను అనుభవించే హక్కు, ప్రోత్సాహకాన్ని అందిస్తూ, భద్రతను కల్పిస్తూ వికలాంగుల్లో స్వాభిమానాన్ని పెంచడమే ఈ ఒప్పంద ముఖ్యోద్దేశం.
వికలాంగులకు విద్య చేరువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవశపెట్టిన పథకాలు :
1. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఎ) :
2000-01 విద్యా సంవత్సరం నుండి సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం కోసం 6 - 14 సంవత్సరాల బాల బాలికలకు ప్రాథమిక విద్యనందించేందుకు ఈ పథకం రూపొందించారు. ఇది వికలాంగులైన పిల్లల విద్యపై దృష్టిసారించింది.

2. ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబుల్డ్ ఎట్ సెకండరీ స్టేజ్ :
ఈ పథకం 2009 - 10 విద్యా సంవత్సరంలో ప్రారంభమైంది. 9వ తరగతి నుండి ఇంటర్‌మీడియట్ వరకు సమ్మిళిత విద్యనభ్యసిస్తున్న వికలాంగ విద్యా ర్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
3. యుజిసి, సిబిఎస్ఇ, ఇంటర్‌బోర్డులు, ఎస్ఎస్‌సి బోర్డులు :
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, అన్ని ర్రాష్టాల్లోని ఇంటర్‌మీడియట్ బోర్డులు, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులు, వికలాంగ విద్యార్థులకు విద్యా సంస్థలు అవరోధ రహితంగా ఉండాలని,దానికి సంబంధించి వివిధ పథకాలతో యూజీసీ దీనిని జారీ చేసింది. పిడబ్ల్యుడి చట్టం అమలులో భాగంగా విశ్వవిద్యాలయాల్లో 3 శాతం విద్య, ఉద్యోగాలు భర్తీ, తదితర అనేక ఉత్తర్వులు యుజిసి జారీ చేసింది. కానీ వికలాంగుల హక్కుల్ని విశ్వవిద్యాలయాల అధికారులు నిర్లక్ష్యం చేయడం మూలంగా యుజిసి అందించిన హక్కులు వికలాంగులు పొందలేకపోతున్నారు.

4. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా : వికలాంగులకు బోధించడానికి గాను, బోధకులను తయారుచేయడానికి కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే నూతన స్వతంత్ర సంస్థను ఏర్పరచింది. ఈ సంస్థ స్పెషల్ బిఇడి, డైట్, యం.ఇ.డి, యం.ఫిల్, పిహెచ్‌డి కోర్సుల ద్వారా వికలాంగులకు బోధకులను తయారుచేస్తుంది.
5. దీన్‌దయాల్ డిసేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీం (డిడిఆర్ఎస్) : ఈ పథకం ద్వారా వికలాంగుల విద్య కోసం కృషి చేసే పరభుత్వేతర సంస్థలకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ స్కీం ద్వారా 11వ పంచవర్ష ప్రణాళికలో రూ.364.10 కోట్లు 586 ఎన్‌జిఓ సంస్థలకు అందించింది.

6. నేషనల్ హ్యాండికాప్డ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఎఫ్‌డిసి)
వైకల్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా వికలాంగులకు స్వయం ఉపాధి, నైపుణ్యం పెంపు, ఉన్నత విద్యనందించడానికి ఎన్‌హెచ్ఎఫ్‌డిసి అనే సంస్థను ఏర్పరచి కృషి చేస్తోంది.
7. రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్‌లు : రిసర్చ్ చేసే వికలాంగ స్కాలర్స్ కొరకు ప్రతి విద్యా సంవత్సరం 200 మందికి ఫెలోషిప్‌లు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ ఫెలోషిప్ ద్వారా నెలకు 25 వేల రూపాయలతోపాటుగా హెచ్ఆర్ఎ, స్రైబ్ ఆలవెన్సులు కూడా ఇస్తారు.
8. దేశ వ్యాపితంగా వికలాంగుల కోసం 7 జాతీయ సంస్థలను ఏర్పరచి వాటి ద్వారా వికలాంగుల సమస్యలపై పరిశోధనలు, విద్య, పునరావాసం, రక్షణ, స్వయం ఉపాధి, స్పెషల్ స్కిల్స్ డెవలప్‌మెంట్, వికలాంగులను మానవ వనరులుగా తీర్చిదిద్దడానికి క్రియేటివ్ తదితర అంశాలపై అబివృద్ధి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. కెజి నుండి పిజి వరకు విద్యను అందిస్తున్నారు.

పిడబ్ల్యుడి యాక్ట్ 1995 కల్పించిన 3 శాతం ఉద్యోగాల్లో రిజర్వేషను అమలు చేయడంలో భాగంగా అనేక ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా 3 శాతం ఉద్యోగాలు వికలాంగులకు తప్పకుండా కేటాయించాలని చెప్పింది.
ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, ఒకేషనల్ ్రటైనింగ్ పరిశోధన, వికలాంగ మానవ వనరుల అభివృద్ధి, పునరావాసం తదితర సమస్యలపై అలాగే వికలాంగుల్ని ప్రధాన స్రవంతిలో భాగస్వాములను చేయడం కోసం ఈడిడిఆర్‌సిఎస్, సిఆర్‌సిఎస్‌లు పనిచేస్తాయి. అలాగే ఇందిరాగాంధీ ఆవాస్ యోజన పథకం ద్వారా వికలాంగులకు ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందచేస్తుంది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంత బస్సుల్లో 100%, జిల్లా బస్సుల్లో 50% రాయితీ మరియు దేశవ్యాపితంగా రైల్వే ప్రయాణ ఛార్జీల్లో, విమాన ఛార్జీల్లో 50% రాయితీలు వికలాంగులకు అందుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రూప్1 నుండి అటెండర్ స్థాయి ఉద్యోగాల్లో వికలాగులకు 3 శాతం రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు.. ప్రొఫెషనల్ టాక్స్ మినహాయింపు, జిఓఎంఎస్ 1063 ప్రకారం, అలాగే కేంద్ర ప్రభుత్వ నియామకాలకు అనుగుణంగానే ఉద్యోగులకు అలవెన్సులు, సౌకర్యం, పిఆర్‌సి సౌకర్యం ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ ద్వారా వైకల్యోపకరణాలు, రుణాలు అందిస్తుంది. తెలంగాణాలో వికలాంగుల విద్య కొరకు రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్స్‌ను కొనసాగిస్త్తోంది. 10 వికలాంగుల హాస్టళ్లు రాష్ట్ర రాజధానిలో ఉండటం చెపకోదగ్గ విషయం. ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, అంధ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పోస్టుగ్రాడ్యుయేట్ చదివే శారీరక వికలాంగ విద్యార్థులకు మోటార్ వాహనాలు ఇస్తున్నారు. అంధులకు, బధిరులకు పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలను నిర్వహిస్తూ వికలాంగుల విద్య కోసం పనిచేసే ఎన్‌జిఓలకు నిధులు కేటాయిస్త్తోంది. తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కొరకు కమిషనర్ కార్యాలయం ద్వారా కృషి చేస్తోంది. వికలాంగులకు సాయపడటంలో అవిరళంగా పాటు పడుతోంది .
పి.రాజశేఖర్
 
 
Surya Telugu News Paper Dated: 03/12/2015

Post Comment

Thursday, January 16, 2014

వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం రాజశేఖర్‌

  • Tuesday, December 3, 2013

    హక్కుల అమలే ముఖ్యం ? By చిక్క హరీష్ కుమార్

    వికలాంగత్వం అంటే ఏంటి? మానవుని సహజ దేహ నిర్మాణంలో శారీరక లోపం ఉన్నట్లయితే అది వికలాంగత్వంగా చెప్పవచ్చు. నేటి సమాజంలో మానసిక లోపం ఉన్నవారినీ వికలాంగులుగా గుర్తిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన వికలాంగుల కంటే సకలాంగులే ఎక్కువగా ఉన్నారు కనుక వికలాంగులను, వారి సమస్యలను సకలాంగుడికి అవసరం అని అనుకుంటే అది సానుభూతితోనే మొదలవుతుంది (మనిషిగా కాదు). కానీ ఆ సానుభూతి రూపం - సహకార రూపం పరిశీలిస్తే నిజంగా అది వికలాంగులకు వారి జీవన స్థాయి మెరుగుపడటానికి ఉపయోగపడుతుందా? లేక ఆ సహకారం భిక్షంగానో దానంగానో మారుతుందా? ఈ సమాజంలో బానిసత్వానికి దాసోహానికి లోబడిన ప్రతి వ్యక్తిపై ఆధిపత్యాన్ని కానీ అధికారాన్ని కానీ చలాయిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇతర కులస్తులు తక్కిన కులాలపై చూస్తున్న చూపు, స్త్రీలపై పురుషుడి చూపు ఆయా స్థాయిని బట్టి సందర్భాన్ని బట్టి అజమాయిషిగానో లేక సానుభూతిగానో వ్యక్తపరుస్తున్న మాట నిజం. అయితే సమాజంలో అందరికంటే చిన్న చూపుగా చూడబడుతున్న వికలాంగులపై మాత్రమే సానుభూతి చూపించడానికి సమాజం సిద్ధపడుతుంది. మనిషిని మనిషిగా కాకుండా కులంగా, మతంగా, వర్గంగా చూడటం మనం చూస్తున్నాం. కానీ ఒక మనిషి కులం, మతం, వర్గం తెలి యక ముందు అతన్ని మనిషిగానే గుర్తిస్తుంది సమాజం. కానీ ఒక్క వికలాంగుడిని మాత్రమే మనిషిగా గుర్తించదు. అవయవాల లోపాల్ని ఎత్తిచూపుతూ పేర్లు పెడుతుంది. ఇది సదరు వికలాంగుడిని ఇంకా కృంగదీస్తుంది తప్పితే సహజమైన స్థితిలో ఉండనివ్వదు. వికలాంగులకు మౌలిక అవసరాలు - హక్కులు - సౌకర్యాలు ఉంటాయా; అసలు ఉన్నా యా... ఒక సాధారణ మనిషి అవసరాల్ని ప్రభుత్వం, సమా జం కానీ తీర్చే ప్రయత్నం చేస్తుంది. కానీ వికలాంగుల మౌలిక అవసరాల్ని కనీసం గుర్తించడం లేదు.
    ప్రాథమిక హక్కుల్ని ప్రజాస్వామిక హక్కుగా వాడుకునే హక్కు వికలాంగులకు ఉందా? స్వాతంత్రపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, సమానత్వపు హక్కు, భావప్రకటనా స్వేచ్ఛా హక్కు వంటివి ఏ పౌరునికి అయితే అందుతాయో ఆ పౌరుడు స్వతంత్రంగా మెలగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం వికలాంగులకు ప్రభుత్వంతోపాటు, సామాజిక సంఘాలు, ప్రైవేటు వ్యవస్థలు గుర్తిస్తున్నాయా? అన్నీ సామాజిక ఉద్యమాలకు సాహిత్యమే ఊపిరైతే నడుస్తున్న వికలాంగ ఉద్యమానికి ప్రజాకవులు, కళాకారులు ఏ మేరకు ఉద్యమానికి ఊపిరిని అందిస్తున్నారు?... ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగ కల్పనలో 3శాతం రిజర్వేషన్ కలిగిన వికలాంగులు ఏమేరకు ఉద్యోగ అవకాశాలను దక్కించుకుంటున్నారు? వికలాంగుల హక్కులను సంరక్షించడానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను నియమించలేని ప్రభుత్వాలను చూస్తే వారి పట్ల ఎంతటి సానుకూల దక్పథం ఉందో చెప్పవచ్చు.వ్యవస్థలో తప్పు ఎక్కడ ఉందో అక్కడే సరిదిద్దే ప్రయత్నం ప్రభుత్వాలు ఎప్పుడూ చేయవు... దేనికైనా సమాజం నుంచి తిరుగుబాటు వస్తేనే హడావిడి చేస్తారు. వికలాంగుల హక్కుల్ని, అవసరాల్ని తీర్చడం రాజ్యాంగబద్దం చేస్తేనే దానికి విలువ. వికలాంగులు ఓటు వేసేందుకు తప్పితే ఓట్లు వేయించుకోడానికి అర్హతలేనివారిగా రాజ్యాంగం పరిగణిస్తోంది. విద్య, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ ఉన్నట్లే ఎన్నికల్లోనూ ఈ రిజర్వేషన్ పెట్టగలదా? ఏ పార్టీ అయినా వికలాంగులకు సీటు కేటాయించగలదా? వికలాంగులనూ వర్గీకరించాలి.
    ధనిక, పేద వికలాంగులను విడివిడిగా గుర్తించాలి? పేద వికలాంగులకే రిజర్వేషన్ వర్తింపజేయాలి. వికలాంగుల కోసం ప్రభుత్వం ఎలాంటి చట్టాల్ని చేసింది? ఎంతవరకు అవి అమలుకు నోచుకుంటున్నాయి? సానుభూతి సహకారం కంటే కూడా వికలాంగుల హక్కుల అమలు మాత్రమే పరిష్కారం అని గుర్తుపెట్టుకోవాలి. పరిష్కారం లభించకుండా ప్రజా పోరాటాలు ముగిసినట్లు చరిత్రలో దృష్టాంతాలు లేవు. ఫూలే నుంచి మొదలుకొని కృష్ణ మాదిగ వరకు సమన్యాయ పోరాటానికే వారి జీవితాలను ఇచ్చినమాట, ఇస్తున్న మాట వాస్తవం. రానున్న తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలలో వికలాంగుల రాజకీయ వాటాను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది.
    - చిక్క హరీష్‌కుమార్
    హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం

    -
    Andhra Jyothi Telugu News Paper Dated: 03/12/2013

    Thursday, November 14, 2013

    The differently abled face another challenge By M. SAI GOPAL

    The differently abled face another challenge

    M. SAI GOPAL
    SHARE  ·   COMMENT   ·   PRINT   ·   T+  

    State government plans to include persons with less than 40 per cent disability in the pension net

    The government’s proposal to include persons with less than 40 per cent disability in the pension net has put the existing beneficiaries under a lot of stress. The disability rights activists have termed this decision as ‘populist’ and point out that very little has been done to make the existing scheme effective for the deserving ones.
    According to Persons with Disabilities Act, 1995, blindness, low vision, hearing impairment, loco-motor disability, mental retardation, illness and cure from leprosy qualify persons to avail benefits from State-run schemes, provided they suffer from not less than 40 per cent of any of the above disabilities.
    Authorities have now proposed to provide pensions even to persons who have disability below 40 per cent during the upcoming ‘Rachabanda’ programme.
    “The government gives Rs. 500 as pension to the disabled persons. Severely disabled persons and children, who can’t move out of homes, are struggling because of the paltry amount. Instead of increasing the pension limit, they are increasing the numbers, which will only lead to more competition,” fears in-charge, National Disability Network, AP chapter, M. Srinivasulu.

    MORE NUMBERS

    Experts have also questioned the move of the authorities to go against the Disabilities Act.
    “The Act clearly is meant for persons with more than 40 per cent disability. Authorities are simply adding more numbers, without doing justice to existing beneficiaries, especially the severely handicapped,” says P. Srinivas Reddy, a senior activist working for the disabled.
    Many felt that the priorities of authorities were not right.
    “There is no factual figure of the number of disabled persons in A.P. The process of issuing disability certificate is yet to be streamlined due to which there is a surfeit of fake certificates. In Pondicherry, the disabled pension is Rs. 1,500 and in Tamil Nadu, it is Rs. 1,000. In this day and age, how can disabled persons survive on a paltry Rs. 500? Nobody is addressing these vital issues,” feels CEO, Swadhikar Centre for Disabilities, M. Pavan Kumar.
    Some have questioned the government’s stand on providing reservations to such persons in education and jobs.
    “If they provide pensions to persons with less than 40 per cent disability, then what happens to reservations in education and government jobs? The government has utterly failed to increase the pension amount to Rs. 1,000,” says president, Vikalungula Hakkula Porata Samithi A. Rambabu.

    The Hindu English News Paper Article : 13/11/2013 

    Thursday, November 7, 2013

    Enabling cyber space for the disabled By Dorodi Sharma

    India is home to 70-100 million people with disabilities. Keeping them away from opportunities that are available to other citizens of the country is not just discrimination but also a violation of their human rights.

    Though the social sector and the country in general welcomed, and celebrated, the Supreme Court’s judgment directing the Centre and states to implement within three months three per cent reservation for people with disabilities, an equally significant development has gone unnoticed. On October 3, the Cabinet approved the National Policy on Universal Electronic Accessibility that will pave the way for the whole gamut of hardware and software to become accessible to people with disabilities in the country. This is a paradigm changing policy and stands to change accessibility the way we know it. This policy is also an example of how the government, the civil society and industry can work cohesively towards a common goal.
    It was in 2008 that National Centre for Promotion of Employment for Disabled People (NCPEDP) and allied organisations such as BarrierBreak realised that India did not have any policy on Web accessibility. While India, touted as an information technology supergiant, was creating websites day in and day out, none of them were accessible to people with disabilities. The concept of World Wide Web Consortium’s (W3C) Web Content Accessibility Guidelines, or WCAG, was unknown, and not just to the policymakers, but even the disability movement seemed to be unaware. Websites have to conform to WCAG in order to be accessible to people with disabilities. Accessibility in simple terms mean the ease with which one can access any text, image, line, tables and other content irrespective of their disability, type of device or assistive technology.
    For instance, a person with visual impairment using a screen reader will be able to access a website only when it is built in accordance with WCAG. Similarly, other facets like larger texts, captioning for deaf, all fall under the W3C’s guidelines. So while we take simple tasks as booking railway/air tickets online, filing income-tax returns, applying for a passport, watching a video etc. for granted, most, if not all of them, remain inaccessible for people with disabilities. National Centre for Promotion of Employment for Disabled People (NCPEDP) had 50 websites, including Indian Railways, tested for WCAG compliance and they all failed miserably.
    It was then that advocacy led to the Guidelines for Indian Government Websites in 2009. The guidelines mandated that all government websites have to be made WCAG 2.0 compliant. It is another story, however, that out of those 50 less than 10 would make the cut even today.
    It was from this policy that the National Policy on Universal Accessibility took off. While the earlier policy only covered websites, there is a vast range of software and hardware that remained inaccessible to people with disabilities. Take, for instance, the set-top boxes for television sets. All their instructions are either visual or audio. So does it mean that people with disabilities who have difficulty manoeuvring visual and audio signages do not watch TV? Also consider things in our everyday lives such as the phone handsets, remotes of air conditioners, washing machines, microwaves, refrigerators, alarm clocks, music systems etc.

    It is not that the concept of universally accessible technology does not exist in the world. Countries that have strict anti-discrimination laws have already cracked this. Therefore, in such a country when a company comes out with any technology, it ensures that it is accessible to everyone. If it is a product, it ensures that accessible versions of it are also made available. And the manufacturing does not entail huge additional costs or burden on the producer. It merely entails a change in outlook and the idea of non-discrimination that is inherent not only to a democracy but also to our very own Constitution and the Convention on the Rights of Persons with Disabilities (CRPD) that our nation has ratified.
    What is ironic is that Indian companies which provide technological services outside India, in countries with strict regulations, follow universal accessibility. But when it comes to their own country, they prefer to look the other way.
    National Policy on Universal Accessibility, drafted by a team of government, the civil society and industry representatives, envisions to bringing this concept of equal rights to India. It covers the whole gamut of electronics. Not only this, it also covers procurement, meaning that when tenders are floated for procurement of products by the government, they will have a clause mandating that these products will have to be accessible.
    Other aspects that this policy covers include creating awareness, research and development, training and capacity building on universal accessibility.
    It may be too soon to celebrate given that it is merely a policy and there are no punitive measures for non-compliance. The poor implementation of the Guidelines for Government Websites on WCAG 2.0 compliance is an indication of how low disability is on the agenda of political bosses and decision-makers. However, all it needs for better implementation is a vigilant civil society.
    India is home to 70-100 million people with disabilities. Keeping them away from opportunities that are available to other citizens of the country is not just discrimination but also a violation of their human rights. This policy is, therefore, a step in the right direction, provided we are able to walk the talk.

    The writer is programme manager with National Centre for Promotion of Employment for Disabled People, which was part of the drafting team of this policy

    The Deccan Chronicle English News Paper Dated: 08/11/2013 

    Wednesday, October 9, 2013

    అసలు వైకల్యం ఎవరిది? By Sakshi Sampadakiyam


    అంతర్‌దృష్టి లేకపోవడం అంధత్వం కంటే అధమమైనదని విఖ్యాత రచయిత్రి హెలెన్ కెల్లర్ అంటారు. మన పాలకులకు అలాంటి లోచూపు లోపించింది కనుకనే వికలాంగులకు ప్రభుత్వోద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్లు కల్పించే పద్దెనిమిదేళ్ల నాటి చట్టాన్ని ప్రభుత్వాలన్నీ అమలు చేసి తీరాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. ఉద్యోగాల్లో ఇచ్చే కోటా 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టే ఆదేశించింది గనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అమలుచేయడం సాధ్యంకాదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అలాగే, గుర్తించిన కొన్ని పోస్టుల్ని మాత్రమే వికలాంగులకు కేటాయించాలని 2005లో కేంద్ర ప్రభుత్వం ఒక మెమో ద్వారా చేసిన సూచనను కూడా న్యాయమూర్తులు తిరస్కరించారు. గ్రూప్ ఏ, గ్రూప్ బీ పోస్టులకు కూడా వికలాంగ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని వారు తెలిపారు.
     
     ఖాళీ అయిన మొత్తం పోస్టుల సంఖ్యలో 3 శాతం వికలాంగులకు కేటాయించాలితప్ప, ఎంపికచేసిన కొన్నింటిని మాత్రమే వారికి ఇస్తామనడం న్యాయబద్ధం కాదని స్పష్టంచేశారు. సాంకేతిక అభివృద్ధి పర్యవసానంగా వైకల్యం ఉన్నవారు సైతం ఇతరులతో సమానంగా అన్ని పనులనూ చేయగలిగే పరిస్థితులు వచ్చాయని... ఇలాంటి పరిస్థితుల్లో వారికి పరిమితులు విధించాలని చూడటం సరైన విధానం కాబోదని వారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కారణంగా కంటిచూపు కరువైనవారికి లేదా పాక్షికంగా చూపుదెబ్బతిన్నవారికి... వినికిడిలోపం ఉన్నవారికి... సెరిబ్రల్ పాల్సీ వ్యాధిగ్రస్తులకు ఇకపై ఒక్కోశాతం చొప్పున ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ... ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ అలాంటివారికి ఇకపై ఉద్యోగావకాశాల్లో కోటా ఉంటుంది.
     
     దేశ జనాభాలో వివిధ రకాల వైకల్యంతో బాధపడుతున్నవారి సంఖ్య 2.1 శాతం ఉంటుందని 2001 జనాభా లెక్కలు చెబుతున్నాయి. 2011 జనాభా గణాంకాల్లో వికలాంగులకు సంబంధించిన వివరాలు ఇప్పటికింకా లభ్యంకాలేదు గానీ వారి శాతం జనాభాలో 5నుంచి 6 శాతం ఉండొచ్చని ఒక అంచనా. మన ప్రణాళికా సంఘం, ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగాల లెక్క ప్రకారం ఇది 10 శాతం వరకూ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ ఎంతవరకూ సరైనవో చెప్పలేం. ఎందుకంటే... జనాభా లెక్కలు సేకరించేవారికి, ఇతరత్రా సర్వేలు చేసేవారికి వైకల్యానికి సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పించకపోతే సరైన గణాంకాలు లభ్యంకావు. కనుక మన జనాభా లెక్కలు వెల్లడించే సంఖ్యను మించి వికలాంగులు ఉండే అవకాశం లేకపోలేదు.
     
     అధికారిక గణాంకాలను గమనించినా మన దేశంలో వికలాంగుల సంఖ్య కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ! వికలాంగుల్లో అధికశాతంమంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారూ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నవారే. బిడ్డ కడుపులో ఉండగా తల్లికి సరైన పోషకాహారం అందకపోవడంవల్లా... తల్లిదండ్రులకు ఆరోగ్యంపై అవగాహన కొరవడటంవల్లా, పోలియో, మశూచి వగైరా అంటువ్యాధులవల్లా, రకరకాల ప్రమాదాలవల్లా వైకల్యం సంభవిస్తుంది.  సమాజానికి చోదకశక్తిగా ఉండవలసిన ప్రభుత్వాలు ఇలాంటివారి బాధ్యతను స్వీకరించి ఆదుకోవాల్సి ఉంటుంది. అది వాటి బాధ్యత. కానీ, ఏవో పైపై చర్యలు తప్ప ప్రభుత్వాలేవీ వికలాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేయడంలేదు. వికలాంగుల సంక్షేమానికి సంబంధించిన చేపట్టే పథకాల్లో కూడా ఏకరూపత లేదు. ఒకచోట ఉండే సంక్షేమ పథకం మరో రాష్ట్రంలో లభించదు.
     
     దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వికలాంగుల సంక్షేమానికి సంబంధించి ఎన్నో చర్యలు తీసుకున్నారు. వికలాంగులకు అంతక్రితం నెలకు రూ.75 మాత్రమే పింఛనుగా ఇవ్వగా, అధికారంలోకి వచ్చినవెంటనే దాన్ని ఆయన రూ. 200కు పెంచారు. 2007లో దాన్ని రూ. 500 చేశారు. వైకల్యాన్ని బట్టి దీన్ని పెంచే ఏర్పాటుకూడా చేశారు. వికలాంగుల సంక్షేమం కోసమని ప్రత్యేక నిధిని ఏర్పర్చడం, వేర్వేరు గృహ పథకాల్లో వారికి ప్రాధాన్యతనివ్వడం, ఉన్నత చదువులు చదివే వికలాంగులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించడం... బధిర, మూగ పిల్లలకు లక్షల రూపాయలు ఖర్చయ్యే కాక్లియర్ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీద్వారా ఉచితంగా చేయించడంవంటి ఎన్నో చర్యలకు ఆయన శ్రీకారం చుట్టారు. కానీ, ఆయన కనుమరుగయ్యాక అలాంటి సంక్షేమ కార్యక్రమాలు మందగించాయి. పింఛన్ల పంపిణీ సక్రమంగా లేకపోవడంవల్ల ప్రతి నెలా వికలాంగులకు అగచాట్లు తప్పడంలేదు. వైకల్యం శాతాన్ని తగ్గించి చూపి పింఛన్లు తొలగించడమూ మొదలైంది. దాదాపు 2 లక్షలమంది ఈరకంగా అనర్హులయ్యారు.
     
     ప్రభుత్వాలు ఇలా వికలాంగుల సంక్షేమానికి క్రమేపీ తూట్లు పొడుస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు ఆశావహమైనది. రాజ్యాంగంకిందగానీ, మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగానీ వికలాంగుల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండగా... ఎన్నడో 1995లో రూపొందించిన వికలాంగుల చట్టం ఇంతవరకూ అమల్లోకి రాకపోవడం సిగ్గుచేటైన విషయం.
     
     ఉద్యోగమనేది నిజంగా ఒక యోగం. అందునా వికలాంగులకు అది అందరికన్నా మించిన జీవితావసరం. ఒకరిపై ఆధారపడే స్థితిని తప్పించే ముఖ్యావసరం. కానీ, ప్రభుత్వాలు తమ అచేతనత్వంతో అలాంటివారందరికీ 18 ఏళ్లపాటు ఆ యోగాన్ని దక్కకుండా చేశాయి. ప్రజల ద్వారా అధికారంలోకొచ్చే ప్రభుత్వాలు నిజానికి తమంతతామే ఇలాంటి సమస్యలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా... అందుకు భిన్నంగా సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని చెప్పాల్సివచ్చింది. ఇకనైనా పాలకులు తాము ఎంతగా మొద్దుబారుతున్నామో, బండబారుతున్నామో తెలుసుకోవాలి. ఎలాంటి వైకల్యం తమను ఇలా మార్చిందో గుర్తెరగాలి. గుర్తించి సరిదిద్దుకోవాలి.
     

    Friday, May 31, 2013

    వికలాంగుల హక్కుల గొంతుక హెలెన్‌ కెల్లర్‌ --- పి రాజశేఖర్‌

       Sat, 1 Jun 2013, IST  

    • నేడు హెలెన్‌ కెల్లర్‌ 25వ వర్ధంతి
    జీవితం నిత్యం సమ స్యలతో స్వా గతం పలు కుతున్నా, అంధత్వం అడ్డుతగిలినా, మూగ, చెవిటితనంతో కృంగిపోలేదు. అధైర్యపడకుండా, నిరాశ చెందకుండా అవరోధాలను అధిగ మించారు. లక్ష్యాలను సాధించి చిమ్మ చీకటిలో సైతం వెలుగును చూడగలిగే ధైర్యం, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం మనిషి ఉన్నతికి స్ఫూర్తి అని ప్రపంచానికి చాటి చెప్పారు హెలెన్‌ కెల్లర్‌. ఆమె వికలాంగుల హక్కుల సాధనకు జీవితాన్ని అర్పించిన గొప్ప త్యాగశీలి. 'ఇన్‌ హర్‌ స్టోరీ'కి ఉత్తమ డాక్యుమెంటరీగా 1955లో అకాడమీ అవార్డు వచ్చింది. వైకల్యం శాపం కాదు. సవాల్‌గా తీసుకోవాలని వికలాంగులను వారి హక్కుల పట్ల చైతన్యపరచేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ప్రేరణ కల్పించేందుకు 39 దేశాలు పర్యటించారు. ప్రగతిశీల భావాలతో అమెరికన్‌ సోషలిస్టు పార్టీలో చేరి వికలాంగులతోపాటు బాలల, మహిళల, కార్మికవర్గం హక్కులు, సంక్షేమంపై ఉపన్యాసాలు, అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఆమె రాసిన 12 పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ముద్రించబడ్డాయి. వికలాంగుల హక్కుల పరిరక్షణకే పునరంకితమైన హెలెన్‌ కెల్లర్‌ అవివాహితగానే ఉండిపోయారు.
    హెలెన్‌ కిల్లర్‌ 1880 జూన్‌ 27న ఆర్థర్‌ హెచ్‌ కెల్లర్‌, కేథరీన్‌ ఆడమ్స్‌ కెల్లర్‌ దంపతులకు అమెరి కాలోని అలబామాలో తుస్కుంబియాలో జన్మించారు. 19 నెలల వయస్సులో విపరీతమైన అనారోగ్యం మూలంగా చూపును, వినికడిని కోల్పోయారు. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ సలహా మేరకు ఆమె పెర్కిన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది బ్లైండ్‌లో చేర్చారు. అక్కడ సల్లివాన్‌ అనే ఉపాధ్యాయురాలి వద్ద అనేక పదాలను తాకడం, వాసన ద్వారా నేర్చుకొని 1890 నాటికి చదవడం, రాయడం నేర్చుకున్నారు. 1900లో రాడ్‌క్లిఫ్‌ కళాశాలలో చేరి బ్యాచిలర్స్‌ డిగ్రీ పొందారు. 1902లో 'ది స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌' అనే పుస్తకాన్ని వ్రాశారు. టెంపుల్‌ యూనివర్శిటీ, హార్వర్డ్‌ యూనివర్శిటీ, స్కాట్లాండ్‌లోని గ్లాస్గో, జర్మనీలోని బెర్లిన్‌, భారత్‌లోని ఢిల్లీ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌ గౌరవ ఫెలోగా కూడా ఉన్నారు. ఉపాధ్యాయురాలైన సల్లివాన్‌ ఇంట్లోనే ఉంటూ అభ్యుదయ భావాలవైపు, సోషలిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. వికలాంగులతోపాటు మహిళల, కార్మిక ఉద్యమాలను నిర్మించారు. 1924లో అమెరికాను పౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అంధుల సంక్షేమం కోసం కోట్లాది డాలర్లు సేకరించారు. ది మిరాకల్‌ కంటిన్యూ అనే హాలీవుడ్‌ సినిమాలో నటించి హెలికాప్టర్‌, గుర్రం నడపడం తెలియ కపోయిన షూటింగ్‌ సమయంలో సాహసవంతంగా వాటిని నడిపి వచ్చిన డబ్బును అమెరికా పౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌కు ఇచ్చారు. 1933లో నేషనల్‌ లైబ్రరీ ఫర్‌ బ్లైండ్‌కు అధ్యక్షురాలిగా ఎంపికై అనేక పుస్తకాలు బ్రెయిలీ బాషలోకి ప్రింట్‌ చేయించారు. ఆమె రచించిన పుస్తకాలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. హెలెన్‌ కెల్లర్‌ 1903 నుంచి 1965 వరకూ ఉన్న అమెరికా అధ్యక్షులందరికీ అంధులు, వికలాంగులు, మహిళలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి లేఖలు వ్రాశారు. అమెరికా అధ్యక్షులందరూ సమా ధానాలు పంపేవారు. ఆమె చార్లీచాప్లిన్‌, మార్క్‌ ట్విన్‌, గ్రాహంబెల్‌, నెహ్రూ, డేవిడ్‌సన్‌, విలియం జేమ్స్‌, తదితర నాయకులతో స్నేహం చేశారు. వారితో వికలాంగులు, సోషలిజంపై చర్చించేవారు. 1964లో అమెరికా అధ్యక్షుడు జాన్సన్‌ తమ దేశ ముద్దుబిడ్డగా హెలెన్‌ కెల్లర్‌ను ప్రకటించి ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ప్రీడం అత్యున్నత పురస్కారం అందించారు. ఆమె ఇంకా అనేక అవార్డులు అందుకున్నారు. వికలాంగుల జీవితాల్లో వెలుగును ప్రసాదించడమే కాక ప్రపంచ మార్పు కోసం 80 సంవత్సరాల వయస్సులో కూడా రోజుకు 10 గంటలు సామాజికాంశాల్లో పాల్గొనేవారు. వికలాంగులకు చేసిన సేవకు గుర్తింపుగా ప్రపంచ దేశాలు విద్యాసంస్థలకు, ప్రాంతాలకు ఆమె పేరు పెట్టాయి. 1988 జూన్‌ 1న నిద్రలోనే ప్రపంచాన్ని వీడిన హెలెన్‌ అవరోధాలు ఎన్ని ఉన్నా వాటిని మించిన అవకాలుంటాయని చాటిచెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమమైన వాటిని కంటి చూపుతో ఆస్వాదించకపోయినా హృదయంలో వాటి అనుభూతులను పొందవచ్చునని నిరూపించారు. ఈ విశ్వం ఉన్నంత వరకూ వికలాంగులకే కాకుండా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. ఈ సమాజానికి ఒక గొప్ప రోల్‌ మాడల్‌. వికలాంగుల హక్కుల గొంతుక హెలెన్‌ కెల్లర్‌.
    -పి రాజశేఖర్‌
      
    Prajashakti Telugu News Paper Dated : 1/6/2013

    Tuesday, April 30, 2013

    The disconnect with disability By DORODI SHARMA



    Taking stock: It is important to hear the voices of a significant number of the disabled who live in the global South, a place where development has greater meaning and impact. Photo: The Hindu Photo Archives

    Taking stock: It is important to hear the voices of a significant number of the disabled who live in the global South, a place where development has greater meaning and impact. Photo: The Hindu Photo Archives
    Excluding one of the most vulnerable sections from the global development agenda is a mistake the world cannot afford to make a second time
    Friday, April 5, 2013, marked an important day in the global development agenda. From this day, there would only be a thousand days more to achieve the targets set by the Millennium Development Goals (MDG) to the extent possible. Although the performance of the MDGs has come under tremendous critique, it cannot be refuted that these goals have given the world a unified development agenda on poverty, education and gender issues.
    There are two parallel tracks of discussions currently ongoing: one that is more focused on the post-2015 agenda, and the other which urges caution in shifting the focus to post-2015, underlining the fact that it may be too soon to write-off the MDGs.
    This is a good time for people with disabilities to take stock of things.
    DiscriminationAlthough a substantial percentage of the world’s population is affected by disability, there is no mention of disability in the MDGs. This despite the well-established connection between disability and poverty, the fact that children with disabilities are the ones who have been left behind, and the fact that women with disabilities are even more marginalised and face multiple discrimination.
    In India, home to 70-100 million people with disabilities, a study in 2003 conducted by the National Centre for Promotion for Employment for Disabled People (NCPEDP) showed that only 0.51 per cent of students with disabilities were enrolled in mainstream schools. Likewise, a survey of the top 100 companies of India in 1999 showed an average rate of employment of 0.4 per cent for persons with disabilities. These figures haven’t improved over the years. A review done by NCPEDP recently shows that less than one per cent of students with disabilities are in top colleges and universities, and less than one per cent of people with disabilities are finding employment.
    Today, the World Health Organisation says that one billion people, or 15 per cent of the world’s population, live with disability. Of them, 800 million or 80 per cent live in the global South.
    People with disabilities comprise 20 per cent of the world’s poorest. In this scenario, it is not only imperative that disability is intrinsic to the processes for fulfilling the MDGs by 2015, but must also be a significant part of debate, discussions and outcomes of the post-2015 development agenda.
    Steps forwardTo do so, it is important for the global disability movement to take into account a number of factors.
    Looking South: if 800 million of the world’s one billion people with disabilities live in the global South where development has a far significant meaning and impact, it is essential that their voices are heard, and heard loud and clear.
    High-level meeting on disability and development: one of the most significant milestones in the disability movement is the upcoming U.N. High Level Meeting on Disability and Development in New York on September 23, 2013. This meeting will hopefully set the tone for inclusion of disability in the global development agenda. Advocacy is required to ensure that governments take this meeting with the seriousness it deserves. It is also important to connect this meeting with the opening of the General Assembly debate on September 24, 2013 and the special event on MDGs on September 25, 2013.
    Engaging with national governments: it is essential to garner the support of Member States for disability and for them to include it in their country’s priorities. Disability is a non-political issue and the chances of it being opposed are less. However, the probability of it not making to a majority of the countries’ list of priorities is much higher.
    Disability as a development issue: the fact that disability is a crosscutting issue has by and large been well-established. But the new argument put forward by disability rights advocates is that it is not just a human rights issue but also a development issue. Therefore, it needs to be looked from that point of view as well.
    Going to the grassroots: to reach that last person with disability in the remotest corner of our villages, it is essential that we focus on the grassroots. We need to adopt a sense of caution at the sudden, seemingly top down disability agenda and related advocacy.
    Leaving disability out of the development agenda is a mistake the world cannot afford a second time. It is time that all stakeholders are nudged into action to avoid doing so.
    (Dorodi Sharma is programme manager at the National Centre for Promotion of Employment for Disabled People and assistant to the chairperson, Disabled People’s International, the world’s only cross-disability disabled people’s organisation with membership in 130 countries.)Keywords: Millennium Development GoalsDisabilityDiscriminationNCPEDPDevelopment issues

    The Hindu English News Paper Dated : 30/4/2013 

    Saturday, April 6, 2013

    వికలాంగులపై వివక్ష! ---బిల్ల మహేందర్, బి. రాములు, డాక్టర్ లక్కిడ్డి సత్యం



    వికలాంగులు సమాజంలో,కుటుంబంలో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీలతోపాటు భవిష్యత్‌లో అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారికి అవకాశాలు రాజ్యాంగబద్ధంగా కల్పించాలనే సూచనలను పాలకులు పట్టించుకోవడంలేదు. దీంతో వికలాంగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైం ది. రాష్ట్రంలో వికలాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వీరి సమస్యలపై పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. వీరికి 500 రూపాయల పింఛను ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. కానీ వీరికి కల్పించాల్సిన మౌలిక సౌకర్యాలపై ఏ మాత్రం శ్రద్ధ చూపడంలేదు. 

    వికలాంగుల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం వికలాంగులకు 2000 పెన్షన్ నుంచి వైకల్య శాతాన్ని బట్టి 500 నుంచి 700 వరకు పెంచుతూ ప్రకటన చేసింది. కానీ అమలు విషయంలో 600,700 పెన్షన్ అటకెక్కింది. అర్హులైన 500 పెన్షన్‌దారులకు కూడా సదరన్ క్యాంపుల పేరుతో అనర్హత వేటు వేసి, లక్షలాదిమంది వికలాంగుల పెన్షన్లను రద్దు చేసింది. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వికలాంగులకు ఇస్తున్న 500 రూపాయలు ఏ మూలకు సరిపోవడం లేదు. 

    వికలాంగులు అందరితో సమానంగా జీవించడానికి, వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 చెబుతున్నది. దీనికనుగుణంగా ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ 500 నుంచి 1500 పెంచితే వారికి భరోసా లభిస్తుంది. అలాగే వివిధ ప్రభుత్వశాఖల్లో అనేక వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలను అర్హులైన వికలాంగులతో భర్తీ చేయాలి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వికలాంగుల హాస్టళ్లు చాలా దుర్భరంగా ఉన్నాయి. ఇప్పటికి చాలా హాస్టళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో హాస్టళ్లలో ఉంటున్న వికలాంగులు అనారోగ్యం పాలవుతున్నా రు. ముఖ్యంగా బాలికల హాస్టళ్లు మరి అధ్వాన్నంగా ఉన్నాయి. వీరికి సరైన రక్షణ లేకపోవడంతో విద్యార్థినిలు రోజూ భయంతో గడుపుతున్నారు. అధికారులు వారికి తగిన రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలి. 

    మహిళలపై అత్యాచారాలు, అవమానాలు జరుగుతున్న రోజులివి. ఇక వికలాంగ మహిళల పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. మహిళా వికలాంగులపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్టవేయడానికి కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉన్నది.దీంతోపాటు సాధారణ మహిళలకు ఇచ్చే ప్రసూతి ఖర్చులకన్నా వికలాంగుల మహిళ ప్రసూతి ఖర్చులు పెంచాలి. అదేవిధంగా వికలాంగుల మహిళలకు రిజర్వేషన్లలో ప్రథమ ప్రాధాన్యం కల్పించినట్లయితే వారి అభివృద్ధికి కృషి చేసినవారవుతారు. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి వారి అభివృద్ధికి పాటుపడాలి. జీవో 1095 ప్రకారం ప్రభుత్వ భూమి పంపిణీ చేస్తే, ప్రభుత్వ భూమి మిగిలిఉంటే వికలాంగులకే ఇవ్వాలని చెబుతున్నది. అర్హులైన వికలాంగులకు అసైన్డ్ భూమి ఇవ్వాలని గతంలో మంత్రి సునితా లకా్ష్మడ్డి ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ రాష్ట్రప్రభుత్వం దాన్ని మరిచిపోయింది. అలాగే బడ్జెట్‌లో వికలాంగుకులకు కేటాయించిన నిధుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిం ది.వికలాంగుల సంక్షేమం కోసం పెద్దఎత్తున కార్యక్షికమాలు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నది ప్రభుత్వం. కానీవారి సంక్షేమం కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లమవుతుంది. 

    రాష్ట్ర ప్రభుత్వం అంధులు, బధిరులు, అంగవికలురులతో కుష్టువ్యాధి క్షిగస్తులు, మరుగుజ్జులు, మానసిక వైకల్యం ఉన్న తదితరులను వికలాంగుల కేటగిరిలో చేర్చింది.దీంతో వికలాంగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరికిచ్చే మూడు శాతం రిజర్వేషన్లు సరిపోవడం లేదు. జనాభా ప్రాతిపదికన వీరి రిజర్వేషన్లు మూడు శాతంనుంచి ఏడు శాతానికి పెంచాలి. అప్పుడే వికలాంగులు లబ్ధిపొందే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు అర్హులైన వికలాంగుడికి ప్రభుత్వం ఉచిత గృహవసతి, విద్యుత్, రవాణా సౌకర్యాలు కల్పించాలి. వీటితోపాటు ప్రభుత్వ పూచికత్తుతో వికలాంగులకు ఒక లక్షరూపాయల నుంచి పది లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పించాలి. ఎన్నో అవమానాలు, అవహేళన మధ్య వికలాంగులు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. మిగతా వారితో ఉద్యోగాల్లో పోటీపడుతున్నారు. అయితే కొంతమంది లేని వైకల్యాలను సృష్టించి నకిలీ ధృవీకరణ పత్రాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉద్యోగాలు సంపాదిస్తూ, నిరుద్యోగ వికలాంగుల పొట్టుకొడుతున్నారు. దీన్ని ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం వల్ల అన్ని అర్హతలు ఉండి ఉద్యోగాలు సంపాదించలేక ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు. కాబట్టి ఈ నకిలీ వికలాంగుల ధృవీకరణ పత్రాల వ్యవహరాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి.అర్హులైన వారందరికి న్యాయం జరిగేలా చూడాలి. 

    ఆయా వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు వారి సంక్షేమం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగానే ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. వారికి రావలసిన నిధులపై ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కానీ అన్ని వర్గాల్లో ఉండే వికలాంగుల వెతల గురించి మాట్లాడే వారు లేకపోవడం దురదుష్టకరం.దీనికి కారణం చట్టసభల్లో వికలాంగులకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం. చట్టసభల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించినట్లయితే వారి సమస్యపై చట్టసభల్లో గొంతెత్తే అవకాశం లభిస్తుంది. ప్రభు త్వం చట్టసభల్లో వికలాంగుకులకు ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలి. వికలాంగుల సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు మద్దతు తెలపాలి. వారి సంక్షేమం పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి.వారి జీవన భద్రతకు ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలి.

    -బిల్ల మహేందర్, బి. రాములు, డాక్టర్ లక్కిడ్డి సత్యం
    (వికలాంగుల హక్కుల పోరాట సమితి

    Namasete Telangana Telugu News Paper Dated : 7/4/2013

    Thursday, March 21, 2013

    Disability rights is off the rails --JAVED ABIDI


    JAVED ABIDI
    SHARE  ·   COMMENT (3)   ·   PRINT   ·   T+  
    Like all other years, this year’s Railway budget did not bring any cheer for India’s 70-100 million people with disabilities, a large number of whom depend on the Railways for their basic mobility needs.
    The only difference was that for the first time, the new Railway Minister talked about the substantive issue of accessibility at the stations and in the coaches. However, the discrimination and indignity faced by millions of persons with disabilities trying to use the Railways cannot be addressed by mere pious statements of good intent. The barriers are deep-rooted and systemic.
    Let’s try and understand what it means for the average person with disability to travel with the Railways.
    To begin with, you can’t buy the tickets online. The website is not accessible as it does not conform to web content accessibility guidelines despite a Government of India policy mandating so. And even if you are not print-impaired, you ‘have to’ physically go to the booking counter with your disability certificate in hand to avail yourself of the discount and get a prized seat in that one single accessible coach per train.
    The booking counters are not accessible and that one ‘accessible’ counter for ‘special’ and ‘differently-abled’ people (pun intended) is not manned most of the time.
    To top it, by the government’s own admission, more than 50 per cent of the people with disabilities actually don’t have a disability certificate.
    Even if you are lucky to have a disability certificate, you are forced to purchase two tickets and to travel with an ‘attendant,’ never mind if you are totally independent and can actually travel alone.

    HURDLES IN STATIONS

    To get to the coach is another huge struggle. The way to the platforms is not at all accessible. India is still stuck with the concept of foot over-bridges with a thousand steep steps, and no ramps or lifts. You are therefore left with no choice but to use the same path as the luggage carts — littered with potholes and garbage.
    The concept of ‘accessibility’ for the Railways has remained limited to one accessible toilet for the entire station. God help you if you urgently need to use one but you are on Platform No. 2 and the ‘disabled-friendly’ toilet happens to be at the extreme end of the station, beyond Platform No. 7.
    It is the same story with all other public facilities such as the drinking water taps, the public telephone booths, and so on.
    The worst aspect of the Railways in the modern, 21st century India is the segregated coach for people with disabilities. This ‘special’ coach for ‘differently-abled’ people is attached now to almost every long-distance train either at the beginning, immediately after the engine, or towards the very end, right next to the guard. A person with disability doesn’t have the same choice as other passengers because all the other coaches are not accessible.
    We all know the story of Mahatma Gandhi having been thrown off a first-class carriage in South Africa because of the colour of his skin. I say Gandhiji was lucky. After all, he did manage to get into the coach. I, as a wheelchair user, can’t even get inside.
    What is needed is a holistic, time-bound action plan with a generous resource allocation. We are not asking for any miracles but there should be a serious start somewhere. I offer a simple three-point agenda to our new Railways Minister: Make the Railways website accessible. Make all A1 category stations fully accessible (stations are categorised by passenger traffic). Make at least one coach accessible in every class of every train. Fix a practical time frame, allocate a decent budget and for God’s sake, then just do it!
    (Javed Abidi is a very disgruntled disabled Indian citizen. He has been a wheelchair user for the last 33 years and yet, is not 'wheelchair-bound'. He keeps travelling around the world as the Global Chair of Disabled People's International (DPI). He is neither ‘invalid’ nor ‘special.’ And, he certainly is not ‘differently’ abled. He travels by train all the time, but only in America and in Europe. At home, in modern India, he cannot. He cannot even get inside them but he wants to. Hence, this piece, in the hope that things will change. He is Convener, Disabled Rights Group (DRG) and Chairperson, DPI.)

    The Hindu news Paper Dated : 2/3/2013