Showing posts with label సా మాజికన్యాయం. Show all posts
Showing posts with label సా మాజికన్యాయం. Show all posts

Monday, July 9, 2012

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?----డి మార్కండేయ


పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస్టు తుషా మిట్టల్‌తో కలిసి గత ఏప్రిల్‌లో శెహ్రావత్ మాడ్ కొండల పైకి వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగి అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకుని బయటకు వచ్చారు. మాడ్ వాసుల జీవన పరిస్థితులు, మావోయిస్టుల నేతృత్వంలో ఏర్పడిన జనతన సర్కార్లు, వారికి పోలీ సు బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధం, తదితర అంశాలకు సంబంధించిన విలువైన సమాచారం మోసుకువచ్చారు. అయితే, శతాబ్దాలుగా మాడ్ గోండులను పట్టిపీడిస్తున్న మలేరియా మహమ్మారి వారిని వెన్నంటి వచ్చింది. ఇద్దరూ మంచం పట్టారు. ఆధునిక వైద్యం శెహ్రావత్‌ను కాపాడలేకపోయింది. మే 15న ఆ కెమెరా యోధుడు అంతిమశ్వాస విడిచాడు. కాగా, తుషా మిట్టల్ ఆస్పత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాటం సాగిస్తున్నది. అబూజ్‌మాడ్‌లో జరుగుతున్నదేమిటో, అక్కడి ప్రజల కష్టాలేమిటో లోకానికి తెలియజెప్పిన ఈ ఇద్దరు జర్నలిస్టుల సాహసాన్ని పత్రికా ప్రపంచం కొనియాడింది. మావోయిస్టు పార్టీ సైతం వీరిని ఆదివాసుల మిత్రులుగా పేర్కొంటూ శెహ్రావత్ కుటుంబానికి సంతాపం తెలిపింది. తుషా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

ఒకప్పుడు దుర్భేద్యమైన, సర్వే జరగని ప్రాంతంగా వినుతికెక్కిన అబూజ్‌మాడ్‌కు ఇటీవలికాలంలో సందర్శకులు పెరిగారు. 2009 ఆగస్టు నుంచి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరిట వేలాది పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించి మావోయిస్ట్లులపై అప్రకటిత యుద్ధాన్ని ఆరంభించిన నేపథ్యంలో అందరి దృష్టి బస్తర్‌పై పడింది. మనుగడ కోసం ఒకరు, ఆధిపత్యం కోసం మరొకరన్నట్లు పరస్పరం భారీ దాడులకు పూనుకుంటుండడం, ప్రాణనష్టాలు పెరగడంతో మీడియా కూడా ఈ ప్రాంత పరిణామాలపై కేంద్రీకరించింది. మావోయిస్టు ఉద్యమ ప్రాబల్యం అధికంగా ఉన్న దంతేవాడ, బీజాపూర్, నారాయణ్‌పూర్ జిల్లాలకు జర్నలిస్టుల రాకపోకలు పెరిగా యి. ఈ సందర్భంగా మావోయిస్టులకు తిరుగులేని కోటగా, ప్రధాన స్థావరంగా ఉన్న అబూజ్‌మాడ్ సహజంగానే అందరినీ ఆకర్షించింది. గౌతం నవలఖా, రాహుల్ పండిత, సత్నామ్‌సింగ్ మొదలు తెహెల్కా బృందం వరకు ఎందరో జర్నలిస్టులు అబూజ్‌మాడ్ ను సందర్శించారు. ఎన్నో ఆసక్తికరమైన కథనాలను అందించారు.

అబూజ్‌మాడ్ చరిత్ర ఏమిటి? అబూజ్‌మాడియాల జీవన విధానం ఎలా ఉంటుంది? సంస్కృతీ సంప్రదాయాల మాటేమిటి? మావోయిస్టులు అక్కడ పాగా ఎలా వేయగలిగారు? ప్రభుత్వ బలగాలు అక్కడికి ఎందుకు చేరుకోలేకపోతున్నాయి? పన్నెండేళ్ల కిందట కొత్తగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ అతిముఖ్యమైనది. పూర్తిగా ఆదివాసులు నివసించే ప్రాంతం. అడవులు, నదులు, ఖనిజవనరులు దండిగా ఉన్న ప్రాంతం. ఒకప్పుడు ఒకే జిల్లాగా ఉన్న బస్తర్‌ను ఇప్పుడు ఏడు జిల్లాలుగా విభజించారు. ఈ ఏడు జిల్లాల్లో ఒకటైన నారాయణపూర్‌తో పాటు మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లా భామ్రాగడ్ తాలూకాలో అబూజ్‌మాడ్ కొండలు విస్తరించివున్నాయి. ఉత్తరం నుంచి దక్షిణానికి 80 కి.మీ. లు, పడమటి నుంచి తూర్పునకు 50 కి.మీ.ల మేర వ్యాపించిన మాడ్ ప్రాంతం విస్తీర్ణం 4వేల చదరపు కిలోమీటర్లు. ఇక్కడున్న చిన్నా పెద్ద పల్లెలు 237 కాగా, జనాభా సుమారు 35వేలు. ఒకే ఒక ఇల్లున్న జనావా సం కూడా ఇక్కడ గ్రామం కిందికే వస్తుంది. వంద ఇండ్లుంటే అది పెద్ద గ్రామం.

ఇక్కడ నివసించే ఆదిమ తెగ పేరు మాడియా గోండు లు. వీరి జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయాలు విభిన్నమైనవి. వైవిధ్యంతో కూడుకున్నవి. ప్రకృతితో విడదీయరాని సంబంధం కలిగినట్టివి. పోడు వ్యవసాయం, జంతువుల, చేపల వేట, ఆకులు అలములు, పండ్లు ఫలాల సేకరణ వీరి ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు. మొన్నమొన్నటి వరకూ వీళ్లు కేవలం ఉప్పు, బాణాలకు వాడే ఇనుపభాగాలు, పంచెల కోసం మాత్రమే గుట్టలు దిగి నారాయణపూర్ అంగడికి వెళ్లేవారు. ఇక వీరి (పోడు)వ్యవసాయం విచివూతంగా సాగుతుంది. కొండవాలు ను ఎంచుకుని అక్కడున్న చెట్లను నరికి తగులబెట్టి వానలు పడగానే కొహ్‌లా అనే ధాన్య పు గింజలను చల్లుతారు. అటుపైన ఎలాంటి మానవక్షిశమ లేకుండానే చేతికి వచ్చిన పంట ను దంచి అన్నంలా వండుకుంటారు. నాగలి దున్నడం వీరికి తెలియదు. బియ్యపన్నంతో పోల్చితే సగం కూడా పోషకవిలువలు లేని కొహ్‌లాను గట్కలా వండుకుంటారు.

కూరగా పచ్చి లేదా ఎండిన మాంసం, చేపలు, అడవిలో విస్తృతంగా దొరికే బొప్పాయి, గోంగూర, ఇతర ఆకుకూరలను ఉపయోగిస్తారు. నూనె వాడకం చాలా తక్కువ. నివాసాలు ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి. ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ సమీపంలోనే అన్ని కాలాల్లో ప్రవహించే చిన్నచిన్న సెలయేళ్లు ఉంటాయి. అడవిలో దొరికే వెదురుబొంగులు,కలప, నదీతీరంలో పెరిగే ఒకరకం గడ్డితో ఇళ్లు నిర్మించుకుంటారు. ఇళ్లు సాధారణంగా చిన్నవిగా ఉండి ఒక జంట నివసించడానికి అనువుగా ఉంటాయి. పెళ్లయిన ప్రతి జంటకూ ఓ ఇంటిని నిర్మించి ఇవ్వడం అక్కడ ఆనవాయితీ.

పెళ్లికాని యువతీయువకులు నిద్రించడానికి ఉద్దేశించిన గోటుల్ ఈ తెగలోని మరో ప్రత్యేకత. ప్రతి పల్లెలోనూ గోటుల్ ఉంటుంది. పాలు మరిచిన పిల్లల నుంచి యుక్తవయస్సు అమ్మాయిలు, అబ్బాయిల వరకు గోటుల్‌లో సభ్యులుగా ఉంటారు. సీనియర్ సభ్యుడొకరు గోటుల్ పెద్దగా ఉంటూ ఇక్కడ జరిగే కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటాడు. పగలంతా తల్లిదంవూడులతో పాటు రకరకాల పనులు చేసే పిల్లలు సాయంత్రం కాగానే గోటుల్ వద్దకు చేరతారు. ఆటపాటల్లో నిమగ్నమవుతారు. గానాబజానా, డ్యాన్సులు మొదలవుతాయి. చివరకు అలసిపోయి ఏ రాత్రికో నిద్రిస్తారు. ఈ ఆటపాటల క్రమంలో యువతీ యువకుల మధ్య ప్రేమ ఏర్పడడం, సన్నిహితం కావడం సహజంగానే జరుగుతుంది. అలా పరస్పరం ఇష్టపడినవారి మధ్య లైంగిక సంబంధాలు వీరి సమాజంలో తప్పు కాదు. ఇలాంటి జంటలు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెడతాయి.

పెళ్లయిన మరుక్షణం వీరు గోటుల్ సభ్యత్వం కోల్పోతారు. మాడ్ గుట్టల కింద మైదాన అటవీవూపాంతాల్లో నివసించే మాడియాల్లో కూడా గోటుల్ ఆచారం ఉన్నా రాత్రిపూట ఆటపాటల తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లి నిద్రించడంగా పరిణామం చెందింది. వస్త్రధారణ విషయానికి వస్తే, మావోయిస్టులు ప్రవేశించేవరకూ ఇక్కడి స్త్రీలు పంచె లాంటి వస్త్రాన్ని నడుముకు చుట్టుకునేవారు. ఛాతీపైన ఎలాంటి ఆచ్ఛాదనా ఉండేది కాదు. ప్రస్తు తం పెళ్లికాని అమ్మాయిలు బ్లౌజులు ధరిస్తున్నారు. పురుషులు బుడ్డగోచీ పెట్టుకుంటారు. వెనుకబడిన ఆర్థిక విధానం, పురాతన సంస్కృతితో పాటు కనీస సౌకర్యాలు లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆస్పవూతులు, రోడ్లు,కరెంటు,పాఠశాలలు లేవు. అన్నింటికంటే ముఖ్యంగా మార్కెట్ లేదు. దోపిడీ లేదు. ప్రపంచీకరణ వాసనలు లేవు. దోపిడీ దారులు లేరు. కారల్ మార్క్స్ చెప్పిన ఆదిమ కమ్యూనిస్టు సమాజం తరహాలో జీవించేవారు.

1947 తర్వాత అబూజ్‌మాడ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ప్రభుత్వ ప్రతినిధులుగా అటవీ, పోలీసు సిబ్బంది ఇక్కడి పల్లెల్లోకి రావడం ప్రారంభమైంది. తుపాకులతో వచ్చి, ఆదివాసులు సేకరించుకున్న ఇప్పపువ్వు తదితర అటవీ ఉత్పత్తుల ను,కోళ్లను ఎత్తుకెళ్లడం జరిగేది. 1970లలో అబూజ్‌మాడ్ గుట్టల అంచున ఉత్తరాన దల్లీ-రాజ్హరా ప్రాంతంలో ఇనుప గనుల తవ్వకం మొదలైంది. 80లలో కుతుల్ లాంటి చోట్ల రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఆశ్రమపా స్థాపించారు. సోన్‌పూర్, ఛోటాఢోంగర్ వంటి పెద్దక్షిగామాలకు మట్టిరోడ్లను నిర్మించారు. ఈ క్రమంలో 1985లో మాడ్ కొండల పైకి మొదటిసారిగా మావోయిస్టులు అడుగుపెట్టారు. అప్పటినుంచి పీపుల్స్‌వార్ పేరు తో ఉన్న ఆ పార్టీ నాయకత్వంలో గడ్‌చిరోలిలోనూ,బస్తర్‌లోనూ బలమైన విప్లవోద్యమం కొనసాగుతోంది. ప్రజాసంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఈ నిర్మాణాలే గెరిల్లా దళాలుగా అభివృద్ధిచెందాయి. మనుగడ కోసం ప్రకృతితో పోరాడుతున్న అబూజ్‌మాడియాలకు అండగా నిలి చి వారిని వేధిస్తున్న అటవీ సిబ్బందిని తరిమికొట్టాయి. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయ డం ఎలాగో చూపాయి. కూరగాయలు పండించడం నేర్పాయి. గోటుల్ వ్యవస్థలో మహిళకు జరుగుతున్న ఆన్యాయాన్ని అర్థం చేయించాయి. బ్లౌజులు ధరించడాన్ని కేంపెయిన్‌గా కొనసాగించి మహిళల గౌరవాన్ని నిలబెట్టాయి. వారి ఆటల్లో ఆటగా, పాటల్లో పాటగా నిలు స్తూ అభిమానాన్ని చూరగొన్నాయి.

ఈ ఆత్మీయతలే ప్రాతిపదికగా ఇక్కడ మావోయిస్టులు బలపడ్డారు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలతో స్థానికుల అండ లేకుండా అపరిచితుపూవ్వరూ ప్రవేశించ వీలుగాని ఈ ప్రాంతాన్ని సైనిక శిక్షణకు, విశ్రాంతికి, బలగాల సమీకరణకు, నాయకత్వం తలదాచుకోవడానికి మావో యిస్టులు విస్తృతంగా ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని 1995 నాటికి గాని పోలీసులు పసిగట్టలేదు. ఆ వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబూజ్‌మాడ్‌పై దృష్టి కేంద్రీకరించాయి. అభివృద్ధి పథకాలు, వ్యవసాయ శిక్షణ పేరుతో, హోంగార్డు ఉద్యోగాల ఎరతో కొంతమంది స్థానిక యువకులను ఇన్ఫార్లర్లుగా మార్చుకోవడానికి ప్రయత్నించాయి. అప్పుడప్పుడు గుట్టల అంచుల్లో ఉన్న గ్రామాలకు పోలీసులు వెళ్లి దాడులు చేయడం, గిరిజనులను నిర్బంధించడం, దళాల గురించి తెలుసుకుని కాల్పులకు దిగడం చేశాయి.

1996లో వేయి మంది బలగాలకు నాయకత్వం వహించిన అప్పటి బస్తర్ ఎస్‌పీ 15రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి మొట్టమొదటిసారిగా మాడ్ లోతట్టుకు ప్రవేశించిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కాగా, శత్రు ఎత్తుగడల్లో మార్పును గమనించిన మావోయిస్టులు తర్వాతికాలంలో తమ ఎత్తుగడలనూ మార్చుకున్నారు. అప్పటిదాకా షెల్టర్ జోన్‌గా ఉన్న మాడ్‌ను సంఘటితం చేశారు. గ్రామక్షిగామాన పార్టీ, ప్రజాసంఘాల నిర్మాణంపై కేంద్రీకరించారు. రాజ్యాధికార అంగాలైన జనతన సర్కార్లను ఏర్పరచారు. స్థానిక యువతీయువకులను పెద్దయెత్తున దళాల్లో చేర్చుకున్నారు. పీఎల్‌జీఏ దళాలను ప్లాటూన్లుగా, కంపెనీలుగా ఏర్పాటు చేసి అడవిలోకి చొచ్చుకురావడానికి యత్నించిన పోలీసుబలగాలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ వచ్చారు. ఇలా 2008 నాటికి అబూజ్‌మాడ్‌ను శవూతువు ప్రవేశించ వీలుగాని గెరిల్లా స్థావరంగా అభివృద్ధి చేశారు.
-డి మార్కండేయ
dmknamaste@gmail.com
(అబూజ్‌మాడియాలకు ముప్పు గురువారం సంచికలో).
Namasete Telangana News Paper Dated : 10/07/2012 

వాస్తవాల వెలుగులో భూ సమస్యలు - పి.యస్.అజయ్ కుమార్

భూమి సమస్య అంటే ఏమిటి? భూ సమస్య పరిష్కారం కోసం ఎంతో రక్తం పారిన ఈ గడ్డ మీద ఈ ప్రశ్న కొత్తగా అడగాలా? అడగాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంపై కమ్యూనిస్టులు తమ ప్రభావాన్ని చాలా కాలం క్రిందటే కోల్పోయినప్పటికీ బౌద్ధిక రంగంలో మాత్రం వారి ప్రభావం చాలా బలంగా ఉంది. మర్రి చెట్టు క్రింద ఇతర మొక్కలు మొలవనట్లుగా కొత్త, ఇతర భావాలను అది ఎదగనియ్యదు.

ఒక తీవ్ర వామపక్ష పార్టీ వారి అనుబంధ విద్యార్థి సంఘం సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్‌ను వివరించే సందర్భంలో కె. బాలగోపాల్ ఇలా అన్నారు: 'వర్గ పోరాటాల నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధాంతాలు మాత్రమే అలవాటు కావడం వల్ల భిన్నమైన సిద్ధాంతాలను గౌరవించడం మనమింకా నేర్చుకోలేదు'. వామపక్ష భావజాల ప్రభావం కారణంగా సామాజిక శాస్త్ర రంగాలలో కొన్ని పదాలకు కొన్ని అర్థాలు స్థిరపడిపోయాయి.

'భూమి సమస్య' అంటే దున్నేవానికే భూమి, భూముల స్వాధీనం, జెండాలు పాతడం. విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం వీరభద్ర పేట గ్రామంలో (ఈ గ్రామం షెడ్యూల్డ్ ప్రాంతం కాదు) సింగారపు పోలయ్య అనే ఆదివాసీ, తన ఇద్దరి కుమారులతో కలిసి 22 ఎకరాల మెట్ట భూమిని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. కాని ఆ గ్రామం సెటిల్‌మెంట్ భూమి రికార్డులో పట్టాదార్లుగా అతని పేరుతో బాటు మరో ఇద్దరు ఆదివాసేతరుల పేర్లు కూడా వున్నాయి. అవి ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో పోలయ్యకు తెలీదు. ఈ ఆదివాసేతరుల వారసుల నుంచి ప్రమాదం పొంచి వుండడంతో పాటు 22 ఎకరాలపై పోలయ్య కుటుంబానికి స్థిరమైన యాజమాన్య హక్కులు లభించలేదు.

సెగ్గె రాజులమ్మది మరో చిత్రమైన సమస్య. ఆమెకు పట్టా వుంది. పట్టాదారు పాసు పుస్తకం కూడా వుంది. కాని ఆ రెండిటిలో 'పెగె'్గ రాజులమ్మ అని పడింది. 'సె' కాస్త 'పె'గా మారడంతో ఈ రికార్డు ఆమెకు ఎలాంటి రుణ సదుపాయాన్ని కల్పించడం లేదు. ఇద్దరు దళితులు ప్రభుత్వం తమకు ఇచ్చిన బంజరు భూమిని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకొని కొంత పరిహారం ఇచ్చేందుకు ముందుకు రాగా సమస్య వచ్చింది. ఒకరికి కేటాయించిన సర్వే నెంబరులో మరొకరున్నారు. ఆ కారణంగా వారికి పరిహారం చెల్లింపు ఆగిపోయింది. భూమి పోయింది పరిహారం రాలేదు. భూస్వాముల నుంచి భూములు స్వాధీనం చేసుకొని భూమిలేని వారికి పంపిణీ చేయడం వర్గ పోరాటాన్ని సూటిగా తాకుతుంది.

కనుక వామపక్ష శక్తులకు అదెంతో ప్రీతిపాత్రమైన కార్యక్రమం. ముందు ప్రస్తావించుకున్న సమస్యలకు అటువంటి ప్రతిపత్తి, ఆకర్షణ వుండదు. కాని ఆ సమస్యల వలయంలో చిక్కుకుపోయిన వారు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతుంటారు. వారిని సంఘటితపర్చి సహాయం అందించే వారెవరూ కన్పించరు. 'భూమి సమస్య'ను సాంప్రదాయ అర్థ చట్రం నుంచి కాస్త పక్కకు జరిగి చూడగలిగితే -భూస్వాములు, భూమిలేని కూలీలు అనే వర్గ విభజన కన్పించని గ్రామాలతో సహా - అనేక గ్రామాలలో ఇలాంటి సమస్యలు కొల్లలుగా కన్పిస్తాయి. భూమి హక్కులకు సంబంధించిన అతి చిన్న (పైకి అలా కన్పిస్తుంది) సమస్య సహితం పేదలను అతిపేదలుగా మార్చగలదు. అదే విధంగా ఆ సమస్య పరిష్కారం వారిని అనేక ఒత్తిళ్ళ నుంచి విముక్తి చేసి ఒక మెట్టు ఎదిగేందుకు సహాయపడనూ గలదు.

భూమి సమస్యను మూడు రకాలుగా విభజించవచ్చును. మొదటిది రాజకీయ భూమి సమస్య. ముందు చెప్పినట్లుగా ఇది వర్గ పోరాటాన్ని సూటిగా తాకుతుంది. రెండవది పాలన భూమి సమస్య. భూ పాలన పద్ధతులు, వాటి లోపాలు, భూ పాలన యంత్రాంగం, దాని అవినీతి, వివక్ష కారణంగా పరిష్కరించదగినవైనప్పటికీ పరిష్కారం కాని భూమి సమస్యలను ఈ వర్గీకరణ క్రిందకు తీసుకురావచ్చును. నిజానికి తరచి చూస్తే ఇది కూడా వర్గ పోరాటంలో భాగమేనని మరో రూపంలో అది సాగుతున్నదని సులువుగానే గ్రహించవచ్చును. మూడవది భూమి అభివృద్ధి సమస్య.

దళిత, ఆదివాసీ పేదలు ఎదుర్కొంటున్న పాలన భూ సమస్యలు ఏమిటి, ఎన్ని, వాటిపై పనిచేయడానికి, పరిష్కరించడానికి కావలసిన అవగాహన, జ్ఞాన నైపుణ్యాలేమిటి? వీటితో పనిచేసే క్రమంలో వ్యక్తిగత లబ్ధి, వ్యక్తిగత పని విధానంలోకి జారిపోకుండా సమష్టి చైతన్యాన్ని ఎలా నిర్మించాలి? తమ సమస్య పరిష్కారం కాగానే బాధితులు 'సంఘం' పట్ల ఆసక్తిని కోల్పోతుంటారు. పాలన భూ సమస్యలను అంతిమంగా రాజకీయ భూ సమస్యకు ఎలా అనుసంధానం చేయాలన్నది ప్రజాతంత్ర, వామపక్ష శక్తుల ముందున్న సవాల్.

ప్రపంచ బ్యాంక్ నిధులతో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ట్ఛటఞ. దీనిని చంద్రబాబు హయాంలో 'వెలుగు' అని, వైఎస్ పరిపాలన నాటి నుంచీ 'ఇందిరా క్రాంతి పథం' అని వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థకు చెందిన భూమి విభాగం 2010 జూలై నుంచి 2011 మార్చి మధ్య రాష్ట్రంలోని 23 జిల్లాలు, 956 మండలాలు, 22,548 రెవిన్యూ గ్రామాలలో 14 లక్షల దళిత, ఆదివాసీ కుటుంబాల భూములను ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టింది. 50 వేల మంది దళిత ఆదివాసీ యువకులకు శిక్షణ ఇచ్చి, వారికి ప్రాథమిక రెవిన్యూ రికార్డులను అందజేసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్య్రం ముందుగానీ, ఆ తర్వాత గానీ దళిత, ఆదివాసీ భూములను భౌతికంగా పరిశీలించే ఇటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో జరగలేదు. ఈ పరిశీలన ఫలితాలు విస్తు గొలిపేవిగా ఉన్నాయి.

దళిత, ఆదివాసీల స్వాధీన అనుభవంలో ఉన్న 40 లక్షల ఎకరాలను పరిశీలించగా అందులో 25 లక్షల 92వేల ఎకరాలకు సంబంధించిన 22 లక్షల 12 వేల సమస్యలు వున్నట్లు (ప్రతి బాధితుని సమస్యను ఒక యూనిట్‌గా) గుర్తించారు. అంటే పరిశీలించిన 40 లక్షలలో సగం భూములు ఏదో ఒక సమస్యలో చిక్కుకొని వున్నాయి. దీంతో బాటు 12 లక్షల భూమిలేని దళిత, ఆదివాసీ కుటుంబాల వివరాలను సహితం ఈ సర్వేలో అదనంగా సేకరించడం విశేషం. ఈ 22 లక్షల సమస్యలను 71 రకాలుగా విభజించారు. ఈ బృహత్తర ప్రక్రియ ఒక ఎత్తయితే, మొత్తం సమాచారాన్ని ట్ఛటఞ.్చఞ.జౌఠి. వెబ్‌సైట్ ద్వారా పౌర సమాజానికి అందుబాటులో వుంచడం మరొక ఎత్తు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఒక్క మౌస్ క్లిక్‌తో ఈ సమాచారాన్ని ఇప్పుడు పొందవచ్చును.

71 రకాల భూమి సమస్యలలో నాలుగు రకాల సమస్యలు సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. అవి: (అ) రెవిన్యూ రికార్డులలో తేడాలు (8 లక్షలు); (ఆ) రికార్డ్ ఆఫ్ రైట్స్ 1 బి రిజిస్టరులో నమోదుగాక పోవడం (4 లక్షలు); (ఇ) పట్టాదారు, అనుభవదార్లలో తేడాలు (3 లక్షల 36 వేలు); (ఈ) పహాణి/ అడంగల్‌లో పేర్ల నమోదులో తేడాలు (3 లక్షల 22 వేలు). నిజానికి ఈ సమస్యలను కొద్దిపాటి అవగాహన, కొంత ఒత్తిడితో సులువుగా పరిష్కరించవచ్చు.

'భూమి అభివృద్ధి సమస్య' విస్తృత చర్చను లేవదీసే పద ప్రయోగం. 'అభివృద్ధి' అంటే ఏమిటన్నది నేడు తీవ్రంగా జరుగుతున్న చర్చ. సన్న, చిన్నకారు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేయడమే నేటి వ్యవసాయ విధానంగా వుంది. ఈ సందర్భంలో చాలా పరిమిత అర్థాన్నే తీసుకోవడం జరుగుతుంది. చీమల పాడు అనే గ్రామంలో 40కుటుంబాల రైతులకు మెట్ట భూములున్నాయి. కానీ వారు సాగుచేయడం లేదు. ఎందుకంటే వారికి దుక్కిటెడ్లు లేవు. కూలికి దుక్కిటెడ్లు లేదా బాడుగకు ట్రాక్టరు పెట్టి దున్నించుకునే పరిస్థితి లేదు. 25 నుంచి 35వేల పెట్టుబడితో ఒక మాదిరి ఎడ్లను సంపాదించుకోవచ్చు.

కానీ వారికి దుక్కిటెడ్లకు రుణం ఇచ్చే ప్రభుత్వ పథ కం, సంస్థ ఏదీ లేదు. ఉన్న పథకాలలో లబ్ధిదారునిగా ఉండాలంటే స్పష్టమైన యాజమాన్య హక్కు పత్రాలు ఉండాలి. హక్కు పత్రాలు ఉన్న తరువాత అవసరమైన సహాయం అందించే ఏర్పాటు ఉండాలి. ముందు ప్రస్తావించిన 'సెర్పు' సర్వే ద్వారా బయటకు వచ్చిన సమస్యలు లేని భూములతో కలుపుకొని 9000 కోట్లు వ్యయంతో 30.14 లక్షల ఎకరాలలో 18.39 లక్షల భూమి అభివృద్ధి పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి పేద వర్గాల భూమి అభివృద్ధికి రూపొందించిన ఈ అతిపెద్ద కార్యక్రమంలో వారు పూర్తి స్థాయిలో పాల్గొని లబ్ధి పొందడం 'భూమి అభివృద్ధి సమస్య'లో భాగంగా గుర్తించవచ్చు.

చివరగా కార్యాచరణ కోణం ఏమిటో చూద్దాం. భావ సారూప్యత గల ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఒక వేదికగా ఏర్పడి 'సెర్పు' వదిలేసిన గ్రామాలలో సర్వే నిర్వహించవచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని వాడుకొని సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం రూపొందించుకోవచ్చు. ఈ సమస్యలలో ఫలితాలు సాధించడం సాపేక్షికంగా సులువు. చిన్నచిన్న విజయాలు పేదలను సామాజిక కార్యకర్తలను, ఉద్యమకారులను ఉత్సాహపరుస్తాయి. పెద్ద లక్ష్యాల సాధనకు వారిని పురికొల్పుతాయని మనం మర్చిపోకూడదు. భూమి సమస్యకు గల సాంప్రదాయ అర్థ నిర్వచనాన్ని విస్తృతపరచడం ద్వారా మాత్రమే దళిత, ఆదివాసీ, పేదవర్గాలకు చేరువ కాగలము.

- పి.యస్.అజయ్ కుమార్
రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ 
Andhra Jyothi News Paper Dated : 10/07/2012 

Saturday, April 28, 2012


వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలె
ఆధునిక ప్రాజెక్టులులేని కాలంలో దేశ వ్యాప్తంగా బావులు, చెరువులు, కాలువలు తవ్వడంలో వడ్డెరలు కీలకపాత్ర పోషించారు. బావుల త్రవ్వకం, వాస్తుశాస్తం, నిర్మాణపరమైన సాంకేతిక నైపుణ్యాలు మొత్తం వడ్డెర కులస్థులకే సొంతం. మట్టికి సంబంధించిన పనుల్లో వడ్డెరల శక్తియుక్తి అంతులేనిది. దేశమంతటా వ్యాపించిన కులాల్లో వడ్డెర కులం కూడా ఒకటి. రాతిపని, మట్టిపని ప్రధాన జీవన వృత్తిగా వడ్డెరలు మన రాష్ట్రం లో లక్షలాదిగా ఉన్నారు. పేదరికం, నిరాక్షరాస్యతతో సంఘం లో అస్పృశ్యులుగా చూడబడుతున్నారు. 

బ్రిటిష్ ఇండియాలో ప్రాజెక్టుల నిర్మాణం మొదలైన తర్వాత మొట్టమొదటగా సంచార కార్మికులుగా మారిన వారు వడ్డెరలే. కాలువల ద్వారా వ్యవసాయం సాగులోకి వచ్చేటప్పటికి బావు లు,చెరువులు తగ్గిపోయాయి. వీటి ప్రాముఖ్యం కూడా తగ్గిపో యింది. దీనికి పర్యావరణ సమస్యలు కూడా వడ్డెరల జీవన విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో వడ్డెరలు తమ కుల వృత్తిలో భాగమైన బావులు, చెరువులు తవ్వడం, మట్టి పని, రాతి పనులను కోల్పోయారు.

ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని బీదర్, బీజాపూర్, రాయచూర్‌లను గుల్బర్గా జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలోని బల్లారి జిల్లాలు కర్ణాటక రాష్ట్రంలో చేర్చడం జరిగింది. ఈ జిల్లాలోని వడ్డెరలను ఆ రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో చేర్చారు. ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిపోయిన వారు మాత్రం బీసీ లుగా ఉండిపోయారు. జీవో 1973, విద్యాశాఖ 23-9-1970 అనుసరించి ఆదిమ జాతులు, విముక్తి జాతులు, సంచార జాతులను మిగిలిన వెనుకబడిన కులాలను అన్నింటిని బీసీలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణలో వడ్డెర కులాన్ని ‘ఎ’గ్రూప్‌లో చేర్చారు. అయితే గతంలో విముక్తి జాతులుగా ఉన్న లంబాడీ, ఎరుకల, యానాదులను 1976లో ఎస్సీ,ఎస్టీ అమెండ్‌మెంట్ యాక్టు ద్వారా షెడ్యూల్డ్ జాతులల్లో చేర్చారు. 

వారితోపాటు సమాన ప్రతిపత్తి కలిగిన వడ్డెర, దొమ్మర, తదితర జాతుల గురించి ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదు.ఎన్‌డీఏ ప్రభుత్వం సమాజంలో అత్యంత వెనుకబడిన 92 కులాల జాబితాను తయారు చేసి ఎస్సీలో చేర్చాలని నిర్ణయించింది. ఈజాబితాలో వడ్డెరలను చేర్చలేదు. దీనికి ఏ అంశాన్ని ప్రాతిపది కగా తీసుకున్నారో అర్థంకాదు. ఆ జాబితాలో వడ్డెరలను చేర్చకపోవడం చాలా అన్యాయంయకమంగా చేతి వృత్తుల వారిని నిర్మూలించడమే ప్రభుత్వాల లక్ష్యంగా అర్థం చేసుకోవాల్సి వస్తున్నది. బ్రిటిష్ కాలం నుంచి నేటి దాకా వడ్డెరలు క్వారీల లో, రైల్వే పనులలో, చెట్టు పుట్టలల్లో ఏ రక్షణ లేని బానిసలుగా,కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం వడ్డెరల పాలిట శాపంగా మారింది.

బోరింగులు, రిగ్‌లు, క్రషర్‌లు వచ్చి వడ్డెరల కులం నడ్డివిరిచాయి. సంప్రదాయ సిద్ధమైన బావి, చెరువులు, తవ్వడం నిలిచిపోయినపుడు వడ్డెరలు తమ కుల వృత్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆధునిక, సాంకేతిక రంగాలలో భాగమైన బోర్లు, రిగ్‌లు, క్రషర్‌ల యాజమానులుగా వడ్డెరలు మారలేదు. నాటి నుంచీ నేటి దాకా కాయ కష్టం మీదనే, దినకూలీలుగా, సంచార జీవులుగా, కాంట్రాక్టు కార్మికులుగానే మిగిలిపోయారు. 

బ్రిటిష్ పాలనానంతరం భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దుర్మార్గమైన చట్టాల వల్ల అనేక కులాలు, తెగలు, సంచార జీవితాల్ని గడపాల్సిన దుస్థితి వచ్చింది. ఈ ప్రజల్ని నిర్బంధించి ‘సెటిప్మూంట్స్’ ప్రాంతాలు అని ఏర్పాటుచేసి అనేక చిత్రహింసలకు గురిచేశారు. కొన్ని జాతులను దొంగలుగా ముద్రవేశారు. ఆస్తికి, అధికారానికి, విద్యకు దూరం చేశారు. పిల్లలు, వృద్ధులు అని తేడా లేకుండా హత్య చేశారు. ఈ దమనకాండలో వడ్డెరలు బలై ఎంతోమంది అంగవైకల్యానికి గురయ్యారు. అక్రమంగా జైళ్లలో నిర్బంధించబడ్డారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వాపు కార్యదర్శి క్రిమినల్ ట్రైబ్స్ (సీటీ యాక్టుపతిపాదకుడు జేఎం స్టీఫెన్ 1924లో సృష్టించిన సీటీ యాక్ట్ చట్టాలకు వ్యతరేకంగా ఎరుకల, లంబాడీ, యానాది తదితర తెగలతో కలిసి వడ్డెరలు అనేక పోరాటాలు చేశారు. బ్రిటిష్‌వారితో తలపడిన వడ్డెర ప్రజలకు స్వేచ్ఛ లభించలేదు. ముప్ఫై సంవత్సరాల అనంతరం దేశ వ్యాప్తంగా సీటీ యాక్టును లంబాడీ,ఎరుకల తెగలపై ఎత్తివేసినా వడ్డెరలపై అలాగే కొనసాగిస్తున్నారు.

1956 సెప్టెంబర్ 26న కేంద్ర ప్రభుత్వం ఎరుకల, లంబాడీ, యానాది తెగలను ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎస్టీలుగా గుర్తించింది. వడ్డెరలను డీఎన్‌టీ (డీ నోటిఫైడ్ ట్రైబ్స్)గానే ఉంచారు. ఒకే తెగను కొన్ని జిల్లాల్లో ఎస్టీ జాబితాలో,మరికొన్ని ప్రాంతాల్లో డీఎన్‌టీ జాబితాలో చేర్చి విడదీసి అణగదొక్కిన చరిత్ర ఆంధ్రవూపదేశ్ అగ్ర కుల పాలకులదే. అయితే 1956 నుంచి 1976 వరకు ఆంధ్రప్రదే శ్‌లోని మొత్తం వడ్డెరలను, తెలంగాణలోని ఎరుకల, లంబా డీ, యానాది తెగలను డీఎన్‌టీ బీసీ(ఎ)లోనే ఉంచి ఎస్సీ జాబితాలో చేర్చలేదు. ఎస్సీ జాబితాలో చేర్చడానికి తెలంగాణలోని డీఎన్‌టీ తెగలతో వడ్డెరలు కలిసి పోరాటాలు చేస్తే అక్కడ కూడా వడ్డెరలకు తీరని అన్యాయం జరిగింది. ఎస్టీ జాబితాలో వడ్డెరలను చేర్చకుండా బీసీ (ఎ) గ్రూప్‌లో ఉంచి డీఎన్‌టీకు ఇచ్చే అన్ని హక్కులను రాయితీలను రద్దు చేశారు. 

1924నుంచి 192 వరకు సీటీ యాక్టుకు వ్యతిరేకంగా వడ్డెర, ఎరుకల, లంబాడీ, యానాది జాతులు కలిసి పోరాటాలు చేశాయి. 1952 నుంచి 1956 వరకు రిజర్వేషన్ కోసం గిరిజన జాబితాలో చేర్చడం కోసం వడ్డెరలకు మిత్రులైన ఎరుకల, లంబాడీ, యానాదులతో కలిసి అనేక పోరాటాలు చేశా రు. ఈ తెగలకు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు దక్కినా వడ్డెరలకు దక్కలేదు. కర్ణాటకలో వడ్డెరలు ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నారు. కనుక మన రాష్ట్రంలోని వడ్డెరలను ఎస్సీ రిజర్వేషన్ జాబితాలో చేర్చాలనీ డిమాండ్ చేస్తూ బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. అగ్రకుల ప్రభుత్వాలు అనుసరించిన లోపభూష్టమైన విధానాల వల్ల వడ్డెరలు తీవ్రంగా నష్టపోయారు. ఈ కోల్పోయిన హక్కులను ఐక్యంగా ఉద్యమించి సాధించుకోవాలి.

-పాపని నాగరాజు
సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కో- కన్వీన

Namasete Telangana News Paper Dated : 29/04/2012 

Monday, March 19, 2012

మహద్‌’పోరాటం



amb-tank
దళితులు విప్లవానికి శంఖారావం పూరించిన దినం 1927 మార్చి 20 వ తేదీ. భారతదేశపు జాతీయ జీవితంలోనూ, సాంఘిక జీవితంలోనూ ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన దినం. దళిత సమాజం మొట్టమొదటి సారిగా వాస్తవమైన ఆందోళనలో పాల్గొన్న దినం. ఒక అస్పృశ్యుడి నాయకత్వంలో తరతరాలుగా తమను అంటరానివారిగా చూస్తూ, సాటి మానవుని కంటే హీనంగా చూస్తున్న మనువాద సమాజానికి సమాధి కట్టేందుకు అంకురార్పణ చేపట్టిన దినం. అదే తొలి దళిత విప్లవ పోరాటానికి నాంది. ‘చవదార్‌ చెరవులో’ (మహాద్‌ చెరువు) నీళ్ళు తాగి తతిమ్మా జనం లాగే దళితులు మనుషూలే అని చాటి చెబుతూ డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ నాయకత్వాన సమానత్వానికై జరిగిన పోరాటానికి ప్రారంభ సూచిక అయిన చవ్‌దార్గ చెరువు ఘటన జరిగి మార్చి 20 నాటికి 85 సంవత్సరాలు గడుస్తూంది. 

డాబి.ఆర్‌.అంబేడ్కర్‌ అప్పటి వరకు అస్పృశ్య సమాజంలో ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని మేలుకొల్ప డానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. దళిత సమాజంతో ఆత్మగౌరవం కలిగేటట్టు చూశాడు. మానసికంగా అస్పృశ్య సమాజం ఎంత ముందుకు వెళ్ళిందో అంచనా వేసుకున్నాడు. అస్పృశ్యుల గుండెల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని అయితే నాటగలిగాడు కాని వస్తాదుకు పోటిలో దిగేంతవరకూ తన శక్తి మీద తనకు నమ్మకం కుదరదు, తన బలాన్ని శత్రు సైనిక బలంతో పోల్చి అంచనా వేయడం కుదరదు. అట్లాగే ప్రయత్న పూర్వకంగా పోరాటంలోకి దిగిన తర్వాతే అస్పృ శ్య సమాజానికి ఉన్న శక్తి ఎంత అనేది పరీక్షిం చడానికి వీలు కలుగుతుంది. అంబేడ్కర్‌కు కూడా ఇదే భావం కలిగింది. అస్పృశ్య సమాజం తన శక్తి సామార్థ్యాలను నిరుపించుకునేందుకు సమయం ఆసన్నమైంది, దానికి మూహుర్తాన్ని మార్చి 20న నిర్ణయించారు.

నిచ్చనమెట్ల కుల సమాజంలో మూడువేల సంవత్సరాలుగా పంచమ కులంగా అగ్రవర్ణ సమాజంచే చీదరించబడుతూ, మంచి నీటి చెరువులకు, నదులకు, విద్యాసంస్థలకు, కోర్టులకు, దేవాలయాలవంటి సార్వజనిన స్థలాలన్నింటికి దూరంగా ఉంచిన మనుధర్మాన్ని ధిక్కరించడానికి పూనుకున్నాడు. దీనికి వేదికగా మహాదను ఎన్నుకున్నాడు. దీనికి కారణం మహాద ఆయనకు బాగా తెలిసిన ప్రాంతం. సైనిక ఉద్యోగాల నుంచి పెన్షన్‌ పుచ్చుకున్న మహార్‌ జాతికి చెందిన జనం మహాదలోనే నివాసాలు ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా అక్కడ నివశిస్తున్న వారిలో చాలామందికి సాంఘీక కార్యకలాపాల గురించి అవగాహన ఉంది. వీళ్ళందరూ అవసరం వచ్చినపడు జాతికోసం తమ ప్రాణాలని సైతం ఫణంగా పెట్టడానికి సిద్దపడతారనే నమ్మకం బాబాసాహెబ్‌కు ఉంది. 

అనుకున్నట్టుగానే మార్చి 19న మహాదలో పరిషత్‌ను ప్రారంభించడానికి నిర్ణయించారు. దీనిలో పాల్గొనడానికి గుజరాత్‌, మహారాష్ర్టకి చెందిన పల్లెలనుండి సుమారు ఐదువేల మంది జనం వచ్చారు. సాయంత్రం పరిషత్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేయబోయే కార్యాన్ని గురించి బాబసాహెబ్‌ ప్రారం భసూచకంగా ప్రసంగాన్ని ఇచ్చాడు. 1. చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడం మానెయ్యండి. 2. ఎంగి లి భోజనాన్ని స్వీకరించకండి. 3. పెద్దా, చిన్నా అన్న ఊహని మనస్సులోంచి తీసేసి ఉన్నత వర్గాల జీవన విధానాలని స్వీకరించండి. అస్పృశ్య వర్గం వ్యవసాయాన్ని కూడా వృత్తిగా చేపట్టండి అని సలహా ఇచ్చాడు. దళితుల ఆత్మగౌరవాన్ని మేలుకొలిపేటట్లు ఆయన ఉపన్యసించాడు.ఈ ఉపన్యాసం ఆయన కోరు కున్న ప్రభావాన్ని జనంలో కలిగించింది. మహాద చెరువు విషయంలో ఆ సమయంలోనే మహాద్‌ మున్సిపాలిటీ ఒక తీర్మానం చేసింది. ‘ఈ చెరువు సార్వజనికమైనదని దీని నీటిని అస్పృశ్యులతో పాటు జనం యావన్మందీ వాడుకోవచ్చు’అని ఈ తీర్మానం సారాంశం. 

devid
ఈ తీర్మానం బాబాసాహెబ్‌కు పోరాటానికి మార్గాన్ని సులభతరం చేసినట్టయింది. రెండవరోజు మార్చి 20న ఉదయం తొమ్మిది గంటలకు సమావేశం మొదలయ్యింది. ముందస్తుగా మహాద మున్సిపాలిటి చేసిన తీర్మానాన్ని అమోదించారు. ఈ తీర్మానాన్ని వెంటనే అమలు పెట్టాలని లక్ష్యంతో బాబాసాహెబు ముందు నడవగా ఐదువేల మంది దళిత సమాజం ఊరేగింపుగా, ఉత్సాహాంగా పాటలు పాడుతూ చవ్‌దార్‌ చెరువు గట్టుకు చేరుకున్నారు. బాబాసాహెబ్‌, ఆ తర్వాత దళిత సమాజం అంతా తరతరాలుగా తమ జాతికి దూరంగా ఉంచబడిన మంచి నీటిని దోసిట్లోకి తీసుకుని తాగి మనుధర్మాన్ని ధిక్కరించారు. ఈ తొలి దళిత విప్లవ పోరాటానికి నాంది అయిన సంఘటన జరిగి నేటికి 86 సంవత్సరాలు గడిచిపోయింది. స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కులవివక్షత, అంటరాతనం వివిధ రూపాల్లో నేటికి కొనసాగుతోంది. 

1927 మార్చి20మహద్‌చెరువుపోరాటంజరిగిరోజు
Surya News Paper Dated : 20/03/2012  

Friday, March 16, 2012

జనాభా లెక్కల్లో దాగిన నిజాలు



village
తొలిదశ 2011 జనాభా వివరాలను 2012 మార్చి 12న కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసింది. జనాభా వివరాలను- ఘనత వహించిన భారత ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రసాదిం చిన సౌకర్యాలను గమనిద్దాం.

నేటికీ దేశంలో దాదాపు 50 శాతం మంది స్ర్తీ, పురుషులు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అంటే దేశంలో సగం మందికి మరుగు దొడ్ల సౌకర్యం లేదు. మనని మనం పరిపాలించుకోవడం ప్రారం భించి ఆరున్నర దశబ్దాల య్యింది. ఇప్పటికీ దేశ జనాభా అంతటికీ కనీస సౌకర్యాలు కల్పించుకోలేకపోయాం అన్నది వాస్తవం. 4.7 శాతంమంది కార్లలో విహరిస్తూ సర్వసౌకర్యాలు అనుభవిస్తున్నారని కూడా ఆ నివేదిక తెలిపింది. అంటే, 95.3 శాతం మందికి పంచాల్సిన సంపదను 4.7 శాతంమంది దక్కించు కుంటున్నారు. కడుపు నిండా తిండి, కంటినిండా నిద్ర, మరుగు దొడ్లు లేకున్నా- విచిత్రంగా దేశంలో 53.2 శాతం మంది మాత్రం మొబైల్‌ టెలిఫోన్‌ వినియోగిస్తున్నారు. మొత్తం మీద 63.2 శాతం మంది ఇండ్లకు టెలిఫోన్‌ సౌకర్యం ఉందని సెన్సస్‌ నివేదిక వెల్లడించింది.
మరుగుదొడ్లు లేని జనాభా (దాదాపు 50 శాతం) 49.8 శాతం. కట్టెలు, పిడకల పొయ్యి వాడేవారు 49.00 శాతం. డ్రయినేజి సౌకర్యం లేని ఇండ్లు ఉన్న కుటుంబాలు 48.9 శాతం. కారు ఉన్న కుటుంబాలు 4.7శాతం సైకిల్‌ ఉన్న కుటుంబాలు 44.8 శాతం. స్కూటర్‌ ఉన్న కుటుంబాలు 21.0 శాతం. మొబైల్‌ ఫోన్‌ కలిగినవారు 53.2 శాతం. గ్యాస్‌ స్టౌ ఉన్న కుటుంబాలు 28.6 శాతం. స్వంత టెలిఫోన్‌గలవారు 63.2 శాతం. ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ ఉన్నవారు 3.1 శాతం. కంప్యూటర్‌ కలిగిన కుటుంబాలు 6.3 శాతం. ఒక గది ఇల్లు కలవారు 37.1 శాతం. రెండు గదుల ఇల్లు కలవారు 31.7 శాతం. మూడు గదుల ఇల్లు కలవారు 14.5 శాతం.రేడియో ఉన్న కుటుంబాలు 19.9 శాతం. ఒపెన్‌ డ్రయినేజి సౌకర్యం ఉన్న ఇండ్లు 33.00 శాతం.

స్వంత ఇండ్లలో నివసించేవారు 8.66 శాతం. ఒక జంట ఉండే ఇండ్లు 70.1 శాతం. రెండు జంటలు ఉండే ఇండ్లు 14.1 శాతం. బ్రహ్మచారులున్న ఇండ్లు 11.6 శాతం. పబ్లిక్‌ టాయిలెట్లు వాడేవారు 3.2 శాతం. టాయిలెట్‌ సౌకర్యం ఉన్న ఇండ్లు 24.66 శాతం. 
జనాభా లెక్కల్ని ఎంత శాస్త్రీయంగా సేకరించినా కింది స్థాయిలో మామూలు ఉద్యోగుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల, విధానపరమైన లోపాలవల్ల కొంత ఖచ్చితత్వం తగ్గినా ఉన్నంతలో ఆధారపడిదగిన లెక్కలు ఇవే. జనాభా లెక్కల సేకరణలో కొన్ని రాజకీయాలు, చాణక్యాలు ఉన్నా మొత్తం వాటి ప్రభావం తక్కువే. ఉదాహరణకు స్వాతంత్య్రం రాకముందు (1941) బ్రిటిష్‌ ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించింది. ఆ లెక్కల్లో కులాలు, మతాల వారీగా జనాభా వివరాలను సేకరించింది. స్వతంత్య్ర దేశంగా కొనసాగిన నైజాం రాజ్యంలో కూడా బ్రిటిష్‌ వారి పద్ధతిలో జనాభా లెక్కలను కులాల వారీగా సేకరించారు. బ్రాహ్మణీయ- హిందుత్వ భావజాలంలో ఉన్న స్వాతంత్య్రానంతర పాలకులు జనాభా లెక్కలను కులాల వారీగా సేకరించడానికి ఇచ్చగించలేదు. పైగా దానిని తీవ్రంగా అడ్డుకొన్నారు. 
ఎవరు అవునన్నా కాదన్నా భారతదేశంలో కులం ప్రధాన అంశం. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ రకంగా చూసినా కులం అత్యంత ప్రభావపూరితమైన అంశం. మాతృగర్భంలో ఉన్నప్పట్టినుండి యవ్వనప్రాయులు అయ్యేవరకు పిల్లలందరూ కుల కట్టుబడిలో, కుల ఆచారాల మధ్య పెరిగి పెద్దవారవుతారు. వారి సంస్కారం, విద్య, అవగాహనలను కులం ప్రభావితం చేస్తుంది. పుట్టుకనుండి చావు వరకు ప్రతిదినం ప్రతి అంశంలో కులం తానున్నానంటుంది. ప్రభుత్వం వారు, పాలకకులాల వారు, పార్టీల పెద్దలు మాత్రం- కులం గురించి మాట్లాడడం ఏమిటి, అది కుసంస్కారం- అని కులం విషయమై మాట్లాడకుండా జనసామాన్యాన్ని కట్టడి చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు కులం గురించి మాట్లాడటాన్ని నిషేధించినంత పనిచేశాయి. తద్వారా ఆరున్నర దశబ్దాలు వారు అప్రతిహతంగా విశాల భారత దేశాన్ని పాలించగలిగారు. తమ కులస్థులను పైకి తెచ్చుకోగలిగారు.

వారే 4.7 శాతం మంది కార్లు కలిగి ఉన్నారు. బీసీ, ఎస్సీ కులాల వారు కొందరు కార్లు, వాహనాలు కలిగి ఉన్నారు. వారు పుట్టుకతో బీసీ, ఎస్సీలే కానీ స్వభావరీత్యా అగ్రకుల పాలకవర్గ స్వభావాన్ని లేదా, దళారి స్వభావాన్ని సంతరించుకున్న వారు మాత్రమే. కులానికి సంబంధించిన అస్తిత్వ లక్షణాలున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ్యక్తి నేటి దేశకాల పరిస్థితుల్లో కారు కొనగలగటం దాదాపు అసాధ్యం.
‘కులం లేదు లేదు’ అని పాలకవర్గాలు కింది వారిని మాయ చేస్తూ తాము మాత్రం తమ ఇంటి కోడళ్ళుగా తమ కులం వారినే తెచ్చుకున్నారు. కులాన్ని పాటించని వెర్రినాయకులు ఆయా పార్టీలో అతిస్వల్పంగా ఉంటారు. వృత్తి విద్యలు వర్ధిల్లి ప్రపంచానికి కన్ను కుట్టించిన అద్భుతమైన నైపుణ్యాలు సంతరించుకున్న, అంతులేని సంపదను సృష్టించిన భారతదేశం స్వాతంత్య్రానికి ముందు తెల్లదొరలవల్ల, స్వాతంత్య్రానంతరం బ్రాహ్మణీయ హిందుత్వ పాలక కులాల స్వార్థంవల్ల- నూటికి యాభై మంది దరిద్ర నారాయణులను తయారు చేసింది. 4.7 శాతం మంది సంపన్నులను తయారు చేసింది. 

దేశంలో దాదాపు 21 శాతం మందికి స్కూటర్‌/ సైకిల్‌ మోటార్‌ యోగం పట్టిందట. అనగా దేశంలో 21 శాతం మంది మధ్య తరగతి వారున్నట్లు భావించవచ్చు. ఉద్దేశం ఏదయినా కానీ ప్రభుత్వం వెల్లడించిన ఈ జనాభా వివరాల్లో అనేక వాస్తవాలు బహిర్గతం అయ్యాయి. ఎంత దాచినా, లెక్కలను మసిపూసి మారేడుకాయచేసినా కొన్ని వాస్తవాలు వెల్లడికాక తప్పలేదు. 44.8 శాతం మందికి సైకిల్‌ సౌకర్యం ఉందట. వీరిని సమాజంలో ఉన్న కింది మధ్యతరగతి వారిగా భావించవచ్చు.వీరిలో కొందరు స్కూటరు కొనుక్కొని మధ్యతరగతి వారిగా ఎదగడానికి ప్రయత్నించే వ్యక్తులుగా భావించవచ్చు. 
దేశంలో 49 శాతం మంది ఇంకా కట్టెలు, పిడకల పొయ్యి మీదనే వంట చేసుకుంటున్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిననాటి సామాజికస్థితిలో ఉన్న జనాభాగా వీరిని పరిగణించవచ్చు. ఏ రాజకీయాలు, ఏ సంక్షేమ పథకాలు వీరి దరి చేరవు. వీరిని పశుప్రాయలకన్నా కొంచెం మెరుగైన జీవనశైలిలో బతికే వారుగా పరిగణించవచ్చు. వీరిని యధాతథ స్థితిలో ఉంచడానికే పాలకవర్గాలు సదా ప్రయత్నిస్తాయి. ఎందుకంటే వీరే వారికి ఓట్ల పంటను పండించేది. వీరి అజ్ఞానం అచైతన్యమే వారికి శ్రీరామరక్ష. జనాభాలో తొంభై శాతం. మందికి కనీస నాణ్యతగల విద్య, వైద్య సౌకర్యాలు అందడం లేదు. నూటికి నలుగురు తల్లులు ప్రసవ సమయంలో మరణిస్తున్నారు. పుట్టిన వందమంది శిశువుల్లో పదిమంది ఏడాది దాటకుండా కన్ను మూస్తున్నారు. 

durgam-ravinder
బతికి బట్టకట్టిన పిల్లల్లో కేవలం ఐదు శాతం మందే ఆరోగ్య వంతమైన వాతావరణంలో పెరుగుతుంది. ఈ పరిస్థితి మారడానికి రెండవ స్వతంత్ర ఉద్యమం రావాలో ఏమో! గాంధీలవల్ల ఇప్పుడు లాభం ఉంటుందో ఉండదో? ఆయన తెచ్చిన స్వాతంత్య్ర ఫలితమే వికటించి నేటికీ యాభై శాతం మంది భారతీయులను అజ్ఞానంలో, అంధకారంలో ఉంచింది కదా !


Surya News paper Dated : 16/03/2012

Wednesday, March 14, 2012

సచార్‌ నివేదిక వచ్చి ఐదేళ్ళయినా...ముస్లింల జీవితాల్లో తొలగని చీకట్లు---మొయినుల్‌ హసన్‌



ముస్లింలు సమస్యలు ఎదుర్కొంటున్న ముఖ్య రంగాల్లో ఉపాధి రంగం ఒకటని సచార్‌ కమిటీ గుర్తించింది. ముస్లింలలో జనాభా-కార్మికుల నిష్పత్తి బాగా తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితి గ్రామ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ముస్లింలకు పట్టణాల్లో స్వయం ఉపాధి పథకాల్లో తగిన స్థాయిలో భాగస్వామ్యం కల్పించడం లేదు. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో మహిళలు ఇంటివద్దనే పనులు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఆస్తులు, నైపుణ్యం విషయంలో ముస్లింలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని కమిటీ పేర్కొంది.
ప్రభుత్వానికి అధికారికంగా ఎటువంటి మతం లేదు. తనకిష్టమైన ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు, అందులోని సిద్ధాంతాలను ఆచరించే హక్కు, బోధించే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికీ ఉందని భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. భారత రాజ్యాంగం లౌకికతత్వానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు. పశ్చిమ దేశాలు ఈ పదాన్ని తమ రాజ్యాంగాల్లో పేర్కొన్నాయి. ఆ దేశాల్లో లౌకికతత్వం చర్చికీ, ప్రభుత్వానికీ మధ్య స్పష్టమైన విభజన తీసుకొచ్చింది. మన దేశంలో సెక్యులరిజం బీజాలను దేశ విభజనకు ముందే వేసినప్పటికీ భారత రాజ్యాంగంలో లౌకికతత్వం అనే పదాన్ని ఏ లక్ష్యంతోనైతే చేర్చారో అది నెరవేరలేదు. మన దేశంలో మైనారిటీలు దీర్ఘకాలంగా దయనీయ స్థితిలో ఉన్నారు. స్వాతంత్రం వచ్చి సుమారు ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ వారి పరిస్థితిలో మార్పు రాలేదు.
భారతదేశ మొత్తం జనాభాలో మైనారిటీ మతస్థులు 18.4 శాతం ఉన్నారు. 2001 జనగణన ప్రకారం వారి సంఖ్య 18.95 కోట్లు. వీరిలో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీలే. వీరు మైనారిటీ జనాభాలో 72.8 శాతం ఉన్నారు. భారతదేశ మొత్తం జనాభాలో ముస్లింల సంఖ్య 13.4 శాతం, అంటే సుమారు 14 కోట్లు.
ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు 2005లో జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయీ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఏర్పాటు ఆహ్వానించతగ్గ పరిణామమే. అయితే దురదృష్టవశాత్తు ఆ కమిటీ సిఫార్సులను అమలు చేయడంలో ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం, సాహసం కొరవడ్డాయి. ప్రభుత్వానికి శాసనపరమైన, విధానపరమైన సూచనలు చేసేందుకు, ముఖ్యంగా నిర్లక్ష్యానికి గురవుతున్న మైనారిటీ గ్రూపుల హక్కులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 2004లో జాతీయ సలహా మండలిని ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
మైనారిటీల దుస్థితి
విద్యారంగంలో, జీవనోపాధి, ప్రజాసేవల అందుబాటు విషయంలో మెజారిటీ ముస్లింలు వెనకబడి ఉన్న విషయాన్ని సచార్‌ కమిటీ దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చింది. పాఠశాలలో చేరే ముస్లిం విద్యార్థుల సంఖ్య బాగా తక్కువగా ఉందని, మధ్యలో మానివేసే వారి సంఖ్య (డ్రాపౌట్లలో) ఎక్కువగా ఉందని మరీ ముఖ్యంగా మహిళల కంటే పురుషుల విషయంలో ఇది ఎక్కువగా ఉందని కమిటీ తెలిపింది. విద్యారంగంలో ముస్లింలు అభివృద్ధి చెందడంలో పేదరికం ప్రధాన అడ్డంకిగా ఉంది. కుటుంబంలోని పిల్లలు తమ కుటుంబాలకు సహాయపడాల్సి రావడంతో వారు పాఠశాలకు వెళ్లడానికి సహజంగానే ద్వితీయ ప్రాధాన్యత లభిస్తోంది.
ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో మంచి నాణ్యతాప్రమాణాలు గల పాఠశాలలు, రెసిడెన్షియల్‌ హాస్టళ్లు, బాలికల పాఠశాలలు తక్కువ సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటం వంటి ఇతర సమస్యలున్నాయి. ముస్లింలలో అక్షరాస్యతా శాతం 59 ఉంది. వీరిలో నాలుగు శాతం మందికి మాత్రమే ఉన్నత విద్య అందుబాటులో ఉంది. ఈ విషయంలో జాతీయ సగటు ఏడు శాతం ఉంది. ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న సుమారు 40 శాతం గ్రామాల్లో ఎటువంటి వైద్య సదుపాయాలు లేవు. జనాభాలో కార్మికుల సంఖ్య మరి ఏ ఇతర సెక్షన్ల కంటే ముస్లింలలో తక్కువగా ఉంది. ముస్లింలలో అత్యధికులు స్వయం ఉపాధిలో ఉన్నారు.
ఇటీవల ఆర్థిక సంస్కరణలు చేనేత, మరమగ్గాలు, పట్టు పరిశ్రమ వంటి సంప్రదాయ ముస్లిం వృత్తుల పాలిట మరణశాసనంగా మారాయి. ముస్లిం మహిళలకు తక్కువే అయినప్పటికీ నిలకడగా ఆదాయం కల్పించిన కుట్లు, అల్లికలు, జరీ వంటి కుటీర పరిశ్రమలు నేడు ఉనికిని కాపాడుకోవడానికి తంటాలుపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో ముస్లింల వాటా వరుసగా 23 శాతం, 6.5 శాతంగా ఉన్నాయి. ఇవి షెడ్యూల్డ్‌ కులాలు(39 శాతం), షెడ్యూల్డ్‌ తెగలు (9.5 శాతం) కంటే కూడా బాగా తక్కువగా ఉన్నాయి. ముస్లింల సగటు జీతం కూడా బాగా తక్కువగా ఉంది. బ్యాంకు రుణాలు కూడా ముస్లింలకు అందుబాటులో ఉండేది చాలా తక్కువ.
పన్నెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో మైనారిటీల అభివృద్ధికి తగిన మొత్తంలో నిధులు కేటాయించాలని పార్లమెంటు సభ్యుల బృందం ఇటీవల ప్రధానిని కలసి డిమాండ్‌ చేసింది. నిధుల కొరత ఉండబోదని ప్రధాని వారికి హామీ ఇచ్చారు. మైనారిటీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను నివారించి వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు జాతీయ సలహా మండలి (ఎన్‌ఎసి) 2011 నవంబర్‌లో కొన్ని సిఫార్సులు చేసింది. మైనారిటీల సంక్షేమానికి ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం, సర్వతో ముఖాభివృద్ధి వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను మెరుగుపరిచేందుకు కమిటీ సిఫార్సులు చేసింది.
ఎందుకూ కొరగాని జోక్యాలు
జస్టిస్‌ సచార్‌ కమిటీ నివేదిక సమర్పించి ఐదు సంవత్సరాలు గడిచాయి. ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం దాదాపు నిలిచిపోయింది. మైనారిటీల జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ముస్లింల పట్ల ప్రభుత్వం ఇప్పటికీ మొండిచేయి చూపుతూనే ఉంది. మైనారిటీల సంక్షేమానికి ఉద్దేశించిన కార్యక్రమాల్లో సృజనాత్మకత, స్పష్టత కొరవడుతోంది. విద్య, ఆర్థిక రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముస్లిం ప్రజలకు ఎదురవుతున్న ప్రతిబంధకాలను గుర్తించి, పరిష్కరించేవిగా ఎంతమాత్రం లేవు. ప్రజాసేవల అందుబాటులో ఎదురవుతున్న ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేవిగా ఈ సంక్షేమ పథకాలు లేవు. కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ నుండి ఈ పథకాలను అమలుచేసే జిల్లాస్థాయీ అధికారుల వరకు వ్యవస్థాగత యంత్రాంగంలోనూ స్పష్టత కొరవడింది. సామాజిక- ఆర్థిక వివక్షతలపై నేరుగా పోరాటం చేసే విషయంలో కూడా స్పష్టమైన పథనిర్దేశం కొరవడింది. నిరాదరణకు గురవుతున్న సెక్షన్ల సామాజిక- ఆర్థిక వివక్షతలను అంతమొందించగలిగినట్లు చెప్పుకుంటున్నప్పటికీ ముస్లిం సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్‌ కేటాయింపులు దారుణమైన స్థాయిలో అత్యంత తక్కువగా ఉన్నాయి. 2010-11 బడ్జెట్‌లో తలసరి వనరుల కేటాయింపు రు.797 మాత్రమే. ఎస్‌టిలు(రు1,521), ఎస్‌సిలు(రు.1,228) కంటే బాగా తక్కువగా ఉంది.
దేశ జనాభాలో ముస్లింలతోసహా ముస్లిం మతస్థుల వాటా 18.4 శాతం ఉన్నప్పటికీ వారికి ఉద్దేశించిన పథకాలకు చేస్తున్న కేటాయింపులు మొత్తం ప్రణాళికా కేటాయింపులో ఐదు శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న మైనారిటీ వ్యవహారాల శాఖకు 2010-11లో రు. 2,600 కోట్లు కేటాయించారు. బహుళ రంగ అభివృద్ధి కార్యక్రమానికి (ఎంఎస్‌డిపి) చేసిన కేటాయింపులు కూడా ఇందులో ఉన్నాయి. ముస్లిం జనాభా అధికంగా నివసించే జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. ఈ కేటాయించిన నిధుల్లో కూడా అధికమొత్తం వినియోగానికి నోచుకోవడం లేదు. 2010-11లో కేటాయించిన మొత్తంలో 22 శాతం మొత్తాన్ని మాత్రమే మూడవ త్రైమాసికం మధ్యవరకు వినియోగించారు. కార్యక్రమాల రూపకల్పన సజావుగా లేకపోవడం, అమలు చేసే యంత్రాంగం బలహీనంగా ఉండటం ఇందుకు కారణం. సచార్‌ కమిటీ వెల్లడించిన అంశాలకు ప్రతిస్పందనగా మొత్తం జనాభాలో ముస్లింల సంఖ్య 25, అంతకంటే అధిక శాతం ఉన్న 90 జిల్లాలను ఎంఎస్‌డిపి గుర్తించింది. ఆయా ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని ఈ జిల్లాల్లోని అధికారులను ఆదేశించారు. అయితే ఇందులోనూ తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. ముస్లింలు అధిక సంఖ్యలో గల గ్రామాలు, శివారు ప్రాంతాలు లేదా సెటిల్మెంట్‌ స్థావరాలుగానే ఉంటున్నాయి. స్వల్ప మొత్తంలో మాత్రమే నిధులు కేటాయించడం సంగతి అటుంచి ఎంపిక చేసిన కార్యక్రమాలు ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అమలు కావడం లేదు. ముస్లింలకు ఇందువల్ల ఒనగూరుతున్న ప్రయోజనం కూడా ఏమీ ఉండటం లేదు.
ఉపాధి, విద్య
ముస్లింలు సమస్యలు ఎదుర్కొంటున్న ముఖ్య రంగాల్లో ఉపాధి రంగం ఒకటని సచార్‌ కమిటీ గుర్తించింది. ముస్లింలలో జనాభా-కార్మికుల నిష్పత్తి బాగా తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితి గ్రామ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ముస్లింలకు పట్టణాల్లో స్వయం ఉపాధి పథకాల్లో తగిన స్థాయిలో భాగస్వామ్యం కల్పించడం లేదు. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో మహిళలు ఇంటివద్దనే పనులు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఆస్తులు, నైపుణ్యం విషయంలో ముస్లింలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని కమిటీ పేర్కొంది. వారికి ఉపాధి, రుణ సదుపాయాలు సక్రమంగా లభించడం లేదని తెలిపింది. ఉపాధి అవకాశాలు మెరుగుపరచి ఉద్యోగాలు కల్పించడం పదిహేను పాయింట్ల కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంది. వారికి రుణ సదుపాయాలను అధికం చేయడం, ముస్లిం యువకులకు నైపుణ్యం పెంపొందించుకునే అవకాశాలు మెరుగుపరచడం మరో ముఖ్యాంశం. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్‌గార్‌ యోజన కింద దక్షిణ 24 పరగణాలు (పశ్చిమ బెంగాల్‌), దర్భాంగ (బీహార్‌) జిల్లాలకు చేసిన కేటాయింపులు వరుసగా రెండు, నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే. ఈ జిల్లాల్లో బిపిఎల్‌ కుటుంబాలు వరుసగా సుమారు లక్షన్నర, ఎనభై వేలు ఉన్నాయి. ఉదాహరణకు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద మైనార్టీలకు 10,110 మందికి మాత్రమే ఉపాధి కల్పించారు. జిల్లాలో ఉన్న మైనారిటీ జాబ్‌ కార్డులు గలవారి సంఖ్య 2.2 లక్షలు. కాగా, ఈ పథకం కింద ఎస్‌సిలు, ఎస్‌టిలకు మొత్తం ఉపాధి అవకాశాల్లో 50 శాతం కల్పిస్తున్నారు. బిపిఎల్‌ జనాభాను పరిగణనలోకి తీసుకోకుండానే ఈ అవకాశం కల్పిస్తున్నారు. నిధుల కేటాయింపు పేలవంగా ఉండటం, నిధుల వినియోగంలో లోపాలు, పథకాల రూపకల్పనలో లోపాలు, ముస్లింల అవసరాలను తీర్చేలా లేని కార్యక్రమాలు రూపొందించడం ముస్లింల సమస్యలు అపరిష్కృతంగా మిగలడానికి కారణాలుగా భావిస్తున్నారు. వీటితోపాటు కార్యక్రమాలను, పథకాలను అమలు చేసే యంత్రాంగాలు కూడా బలహీనంగా, లోపభూయిష్టంగా ఉండటం కూడా ఇందుకు కారణం. 2011లో ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ) అనే ప్రాథమిక విద్యా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం దేశంలో ప్రాథమిక విద్య గణనీయంగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేసింది. పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా 89 శాతానికి పెరిగింది. అయితే ముస్లింలు ఈ పాఠశాలల్లో చేరేది చాలా తక్కువ. ముస్లింలలో అక్షరాస్యతా శాతం ఎస్‌సి, ఎస్‌టి మినహా ఇతర నిరాదరణకు గురవుతున్న వారితో పోల్చితే పదకొండు శాతం తక్కువగా ఉందని సచార్‌ కమిటీ అంచనా వేసింది. ముస్లింలలో అక్షరాస్యతా శాతం పెంచే కార్యక్రమం ఇతర గ్రూపులతో సమాన వేగంగా అమలు కావడం లేదు. పాఠశాలలకు అసలు వెళ్లని లేదా మధ్యలో మానివేసే ముస్లింల శాతం ఇతర సెక్షన్లవారిలో కంటే అధికంగా ఉంటోంది. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలల సంఖ్య కూడా బాగా తక్కువ. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాల సైతం లేని గ్రామాల సంఖ్య వెయ్యికి పైనే ఉందని సచార్‌ కమిటీ పేర్కొంది.


-మొయినుల్‌ హసన్‌
Prajashakti News Paper Dated 13/03/2012 

Monday, March 12, 2012

సామాజిక న్యాయానికే యూపీ ఓటు--Y K



Mayawati--latest
ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు దేశ ప్రజలకిస్తున్న సందేశం ఏమిటి? కుల వ్యవస్థ పాతుకుపోయి సామాజిక అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు చెందిన రెండు పార్టీలే ప్రధాన పోటీదారులుగా రంగంలో నిలవడం అర్థం చేసుకోవలసిన పరిణామమే. గత 2007 ఎన్నికల్లో గూడా ఇదే తరహా పరిణామం చోటు చేసుకొని ఉండడం అదేదో యాదృచ్ఛికమైనదికాదని స్పష్టమౌతోంది.ఎస్సీ మహిళ మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ గతసారి 206 సీట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, బీసీ నాయకుడు ములాయంసింగ్‌ సారథ్యంలోని ఎస్పీ గతసారి 97 స్థానాలతో ముగిసిపోవడం గమనార్హం. అయితే, గతసారి గానీ, ఈసారి గానీ కాంగ్రెస్‌, బీజేపీల స్థానాల్లో మాత్రం మార్పు లేదు. 
మాయవతి విశ్లేషణని బట్టిగానీ, స్వతంత్ర పరిశీలననిబట్టిగానీ బీఎస్పీకి దళిత ఓట్లు చెక్కు చెదరకుండా ఉన్నట్టు ద్యోతకమౌతోంది. మొత్తం ఓట్లలో 23 శాతానికి పైగా బీఎస్పీ సంపాదించింది. ఎస్పీకి బీసీలతో పాటు ముస్లిం మైనారిటీలు గట్టిగా అండదండలిచ్చినట్లు స్పష్టపడుతోంది. ఓబీసీల కోటా 27 నుండి 4.5 శాతం ఉపకోటాని ముస్లిం మైనారిటీలకు కేటాయిస్తామంటూ ఎన్నికలముందు కాంగ్రెస్‌ చేసిన కుయుక్తిని యూపీలో అందరికన్నా ముస్లిం ప్రజలే బాగా అర్థం చేసుకున్నారు. 

కాంగ్రెస్‌ కుట్రని ఓటింగు ద్వారా తిప్పికొట్టారు. ‘మౌలానా’గా పేర్గాంచిన ములాయం పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తాము కోరుకొంటోన్నది రంగనాథ మిశ్రా కమిటి సిఫార్సుల ప్రకారం 10 శాతం రిజర్వేషన్లను తమదైన ప్రత్యేక కోటాగా కల్పించాలన్నదే తప్ప, 54 శాతం జనాభా ఉన్న ఓబీసీ లకు అసలే సగానికిసగమే- అంటే 27 శాతమే కల్పిస్తోన్న రిజర్వేషన్లలో కోతపెట్టి, అవి తమకు పంచాలని కాదని ముస్లిం ప్రజలు ఘంటాపథంగా చాటి చెప్పారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల ఓటర్లు తమవైన ఎస్పీ, బీఎస్పీలకు మాత్రమే ఓటు వేశారు. ఆధిపత్య కులాల పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలను తిరస్కరించారు.ఆవిధంగా 100కి 80 శాతంగా ఉన్న ప్రజలు అద్భుతమైన సామాజిక న్యాయ చైతన్యాన్ని ఈ ఎన్నికల్లో ప్రదర్శించారు. 
బీహార్‌లో గూడా 80 శాతంగా ఉన్న ప్రజలు ఇదే తరహా చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారని గమనించాలి. అంటే, సమయం, సందర్భం, పరిస్థితులు ఒనగూడితే, యావత్‌ దేశంలోని 80 శాతం బలహీనవర్గాల ప్రజలు యూపీలోలాగానే సామాజిక న్యాయచైతన్యాన్ని ప్రదర్శించ గలరని అర్థంచేసుకోవాలి. బలమైన సామాజిక ప్రత్యామ్నాయం లేనికారణంచేతనే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలను మార్చుకొని మార్చుకొని అధికారంలోకి పంపిన చరిత్ర ముందుకొచ్చింది. సామాజిక న్యాయం నినాదంతో (మోసపూరితంగా నైనా) ముందుకొచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి 70 లక్షలకు పైగా ఓట్లు వేశారంటే, ఏ మోతాదులో ప్రజలు సామాజిక న్యాయాన్ని కోరుకొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. నూటికి 80 శాతంగా గల బలహీనవర్గాలకు తమదైన పార్టీ ఏర్పడి, నిలబడి నమ్మకం కలిగించ గలిగితే, మన రాష్ట్రంలో గూడా తాజాగా ఊరేగుతోన్న మూడు పార్టీలకూ యూపీలో కాంగ్రెస్‌, బీజేపీలకు పట్టినగతే పట్టిస్తారనడంలో సందేహంలేదు. బీఎస్పీ ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీలు ఎంత కలవరపడ్డాయో ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకుంటే సరిపోతుంది.

అయితే, రెండు పార్టీలకు యూపీ బడుగు బలహీనవర్గాలు సామాజిక న్యాయ దృక్పథంతోనే ఓట్లు వేస్తోంటే-ఎస్పీ, బీఎస్పీలు ఎందుచేత పరస్పరం ఘర్షణ పడుతున్నాయి? ఓటర్లు ఒకసారి ఒక పార్టీని, మరోసారి మరో పార్టీనీ ఎందుకు అందలమెక్కిస్తున్నారు? పార్టీల నిర్మాణాన్నీ, నాయకత్వాన్నీ, విధాన ప్రకటనలనీ ప్రజలు అర్థంచేసుకుంటోన్న విధంగానే ఆ పార్టీలు ఆచరణలో వ్యవహరించకపోవచ్చు. సామాజికన్యాయం తన లక్ష్యంగా బీఎస్పీ స్పష్టంగా ప్రకటించిన మాట నిజమే. కానీ బీజేపీతో అధికారం కోసం జత కట్టటానికి ఆ పార్టీ వెనుకాడలేదు. ఆ సఖ్యతలో భాగంగానే గుజరాత్‌లో 2 వేలమంది ముస్లిం ప్రజలను మూకుమ్మడి హత్యలకు బాధ్యుడైన నరేంద్ర మోడి గెలుపు కోసం యూపీ ముఖ్యమంత్రి హోదాలో మాయావతి ఎన్నికల ప్రచారం చెయ్యవలసి వచ్చింది. అది బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన పాప ఫలితమే గదా! ముస్లిం ప్రజలు నిన్నటి ఎన్నికల్లో మాయావతి బీఎస్పీని కాదని ‘మౌలానా’ ములాయం సన్నిధికి చేరడంలో ఆశ్చర్యమేముంది?

బహుజనుల హితం కోరి, బహుజనులతో ఏర్పడిన పార్టీ రంగు మార్చకుండానే దిక్కు మార్చి, ఎన్నికల గెలుపు ఎత్తుగడల పేరుతో గత 2007 ఎన్నికల్లో మనువాద, కులాధిపత్య, రాచరికపు శక్తులకు పెద్దపీటవేసి తాత్కాలిక ఫలితాలు పొందినప్పటికీ- నాడు గెలిపించిన శక్తులే నేడు కిందకు పడదోసిన వాస్తవం కళ్ళకు కనపడుతోంది. సామాజిక న్యాయ సాధనని దీర్ఘకాల సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పోరాట లక్ష్యంగా గాక, తాత్కాలిక ఎన్నికల విజయానికి కుదించి, శత్రు వర్గాలతో చేతులు కలిపిన దుష్ఫలితం బీఎస్పీ తాజా ఎన్నికల్లో అనుభవించింది. సరిగ్గా ఇలాంటి తాత్కాలిక ప్రయోజనం కోసమే శత్రు వర్గాలతో చేతులు కలిపి పతనమౌతున్న సీపీఐ, సీపీఎంల వర్గ సంకర విధానంతో సరిపోల్చదగిన వర్ణ సంకర విధానాన్ని చేపట్టి, కొనసాగిస్తే ఆ రెండు పార్టీలకు పట్టిన దుర్గతే బీఎస్పీకీ పడుతుందనడంలో సందేహం లేదు.

akhilesh-yadav
బీసీల సంఖ్యా బలంతో, బీసీల నాయకత్వంలో కొనసాగుతున్న సమాజ్‌వాది పార్టీ సామాజిక న్యాయం తనలక్ష్యంగా అసలు ప్రకటించకపోవడమే చిత్రాల్లోకెల్ల విచిత్రం. అది ప్రధానంగా యాదవ సామాజికవర్గ పార్టీ. ఇతర బీసీ వర్గాలు ఆ పార్టీని బలపరుస్తుండవచ్చు. కానీ, పార్టీలో నిర్ణాయక శక్తి యాదవులదే. అదీ, ములాయం కుటుంబానిదే. అఖిలేశ్‌ యాదవ్‌ సమర్థుడైన, విజ్ఞతగల నాయకుడే కావచ్చు. కానీ, అతను ఆ స్థానానికి ఎగబాకడానికి ములాయం సింగ్‌ కుమారుడైనందువల్లే అనే కఠోరసత్యం చేదుగా ఉన్నా అంగీకరించక తప్పదు. అంతర్గత ప్రజాస్వామ్యానికీ, సమష్ఠి పని విధానానికీ ఇది విరుద్ధం. సంఖ్యాబలం హెచ్చుగా ఉన్న యాదవ సామాజిక వర్గంలోని కొన్ని అసాంఘిక శక్తులు గతంలో ములాయం సింగ్‌ అధికారంలో ఉన్న కాలంలో ‘గుండాయిజం’ విమర్శని ఎస్పీకి కట్టబెట్టాయి. ఈ ‘గుండాయిజం’ మాట చివరికి ములాయం పార్టీ అధికారాన్ని కోల్పోవటానికి ప్రధాన కారణమైంది. అధికారంలో ఉన్న కాలంలో తండ్రి చేసిన తప్పుల్ని ఈ సారి అధికారం కోసం కుమారుడు సరిదిద్దినట్లు చెబుతోన్నారు.

మంచిదే. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడీ, వెలువడక ముందే ఆ పార్టీ ‘కార్యకర్తలు’ కొందరు ‘వెనుకటి గుణాన్ని’ తిరగబెట్టారు. యువ నాయకుడు అఖిలేష్‌ మళ్లీ ఇల్లు చక్కబెట్టుకోవలసిన దురవస్థలో పడిపోతున్నారు. దీని కంతటికీ పార్టీ శ్రేణుల్లో సాంఘిక, సాంస్కృతిక, తాత్త్విక దృక్పథం లేకపోవడమే కారణం. డా రామ్‌ మనోహర్‌ లోహియా వంటి సోషలిస్టు నాయకుల స్ఫూర్తితో అలనాడు ‘సమాజ్‌వాది’ (సోషలిస్టు)గా నామకరణం చేసుకొన్నప్పటికీ, తమది- మహోన్నతమైన మానవ సమాజాన్ని, సోషలిజాన్ని నిర్మించవలసిన పార్టీగా- ఆ పార్టీ శ్రేణులకు ఇప్పుడు స్పృహలోనే లేదనడం అతిశయోక్తి కాదు. సోషలిజం గురించి ఆ పార్టీ శ్రేణుల్లో అత్యధిక భాగానికి అసలేం తెలియదని చెప్పినా చెయ్యరాని పాపం చేసినట్లేమీ కాదు. బీసీల నాయకత్వమే లేకపోతే, అదొక ప్రాంతీయ బూర్జువా పార్టీ అని చెప్పినా తప్పు కాదు. దేశంలోని అత్యంత ధనాఢ్యవర్గాలైన కార్పొరేట్‌ శక్తులతో ఆ పార్టీకున్న సన్నిహిత సంబంధాలు రహస్యమేమీకాదు. ప్రస్తుతం కూడా కాంగ్రెస్‌ నాయకత్వానగల యూపీఏ ప్రభుత్వానికి వెలుపలనుండి మద్దతు అందచేస్తోన్న పార్టీగానే అది కొనసాగుతోంది. 

ఒక వైపు ప్రాంతీయ పార్టీల ఫెడరల్‌ కూమి ఏర్పాటు గురించి చంద్రబాబు, మమతా బెనర్జీ, నవీన్‌పట్నాయక్‌ వంటి నాయకులూ, మరోవైపు వామపక్షాలతోసహా ఎస్పీని కలుపుకొని లౌకిక కూటమి ఏర్పాటుగురించి కాంగ్రెస్‌ నాయకులూ ఆలోచిస్తున్న నేపథ్యంలో రెండు కూటములూ ములాయంని కలుపుకోవాలని చూస్తున్నాయంటే, ఇంతకీ ఈయన ఏకోవకు చెందినవాడైనట్లు? తన తండ్రికి చంద్రబాబు నాయుడుతోనూ, తనకి జగన్‌ మోహనరెడ్డితోనూ మంచి సాన్నిహిత్యం ఉందని అఖిలేష్‌ చాలా ఘనంగా చెప్పుకొన్నారు. ఇంతకీ సారాంశం ఏమిటంటే, ఎస్పీకి బీసీగా సంపూర్ణ సామాజిక న్యాయమూ లేదు, ‘సమాజ్‌వాది’గా సంపూర్ణ సోషలిజమూ లేదు. ఎన్నికల ప్రచారంలో గూడా ఈ రెంటి ఊసే కనపడలేదు. సమైక్యవాదిగా పేరున్నప్పటికీ, ఆ అంశాన్ని తాజా ఎన్నికల్లో ప్రచార చెయ్యకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ మాటకొస్తే మాయావతి గూడా చిన్నరాష్ట్రాల అంశాన్ని ఎన్నికల గంపకింద మూసిపెట్టే ఉంచింది.

ఒక పార్టీ సమాజ్‌వాది (సోషలిజం) పేరు పెట్టుకొన్నా, మరొక పార్టీ సామాజిక న్యాయం లక్ష్యమని ప్రకటించినా, ఈ రెండు పార్టీలకూ శ్రామిక వర్గ దృక్పథం లేకపోవడం ఆ పార్టీల మధ్యగల భావ సారూప్యతగా చెప్పుకోవచ్చు. పైగా ఆధిపత్య కులాల రాజకీయ పార్టీల పోకడలనే అందుకోవాలని ఈ పార్టీలు ఉబలాటపడడం గమనిస్తాం. ఇండియాలో కుల వ్యవస్థని గుర్తించకుండా, తదనుగుణంగా కార్యాచరణని రూపొందించుకొనకుండా, రెండు కమ్యూనిస్టుపార్టీలు చేస్తోన్న చారిత్రక తప్పిదం వంటి దాన్నే ఎస్పీ, బీఎస్పీలు- ఇండియాలో ఉన్నది కుల వ్యవస్థ మాత్రమే కాదు, వర్గ సమాజం కూడా- అని గుర్తించకుండా, తదనుగుణ్యమైన కార్యాచరణ రూపొందించుకొనకుండా మరో తప్పుదారిన నడుస్తోన్నాయి.

yks
ఈ తప్పుల్ని సవరించుకొనవలసిన అవసరం ఆ పార్టీలకున్నది. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో సోదెలోకి గూడా రాకుండా పోయిన రెండు కమ్యూనిస్టు పార్టీలకు పట్టిన దుర్గతి మరెవరికీ పట్టగూడదు గదా! అయితే ఎస్పీ, బీఎస్పీలు తమ దృక్పథాలను, కార్యాచరణలనూ సరిదిద్దుకొనేదాకా సామాజిక న్యాయశక్తులు వేచి చూడనవసరం లేదు. ఆ రెండు పార్టీలతో మిత్ర సంబంధాలు కొనసాగిస్తూనే వర్గ- కుల దృక్పథంతో సామాజిక న్యాయ సాధనకై బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ తదితర పేద వర్గాలు తమదైన మరో రాజకీయ పార్టీ నిర్మాణానికి తక్షణమే నడుం బిగించవలసిందే. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో నేటి పరిస్థితులు అందుకు పరిపక్వంగా ఉన్నాయి. ఆధిపత్య కులాల పార్టీల మధ్య చెలరేగిన కాట్లాట ఈ సానుకూల పరిస్థితుల్ని వేగిర పరుస్తున్నాయి.

Surya News Paper Dated : 13/03/2012 

Friday, March 9, 2012

కార్పొరేట్‌ను ఢ కొట్టే సామాజిక శక్తులు---చుక్కా రామయ్య



కూకట్‌పల్లిలో ప్రగతి స్కూలు నడుపుతున్న దయాకర్‌, తెనాలిలో తులసి ప్రసాద్‌లాంటి వాళ్లను చూస్తే కార్పొరేట్‌ రంగానికి దీటుగా పనిచేసే సామాజిక శక్తులు బలంగా ఉన్నాయన్న కొండంత ధైర్యం కలుగుతుంది. ఈ విద్యా సంస్థల విజన్‌ను అమలుపరచటానికై దీక్షా కంకణబద్ధులైన ఉపాధ్యాయవర్గం వాళ్లకు దొరకటం అదృష్టం. ఇలాంటి నిస్వార్థపరులైన ఉపాధ్యాయుల సేవలను శ్లాఘిస్తున్న వాక్యాలు మనం రాయగలిగితే సామాన్యునికి నాణ్యమైన చదువు అందించగలిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం విద్యారంగాన్ని మార్కెట్‌కు అప్పగించేసి చేతులు దులిపేసుకొనే దానికన్నా, ఇలాంటి స్కూళ్లకు ఏమాత్రం చేయూతనిచ్చినా అవి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
కార్పొరేట్‌ రంగం అందించే చదువే చదువన్న భావనను మార్కెట్‌ శక్తులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం ఏస్థాయి దాకా వెళ్లిందంటే కార్పొరేట్‌ రంగం లేకుంటే నాణ్యమైన విద్య దొరికేదే కాదని తల్లిదండ్రులు భావించేంతదాకా వెళ్లింది. అందుకే ఆస్తిపాస్థులమ్ముకొనైనా సరే తమ పిల్లల్ని కార్పొరేట్‌ రంగానికి అప్పగిస్తున్నారు. ఏ.సి. రూములు, ఏ.సి. బస్సులలో ఫైవ్‌స్టార్‌ హౌటళ్లను తలపించే రీతిలో స్కూళ్లుపెట్టి విద్యార్థికి సకల భోగభాగ్యాలు కలిగిస్తేనే చదువు సమర్థవంతంగా ఉంటుందన్న భావనను ప్రచారం చేస్తున్న కాలమిది. విద్య వ్యాపారమయమైన ప్రపంచమిది. కొంతకాలం ప్రజాజీవితాలలో తమ జీవిత ప్రధానభాగం గడిపిన కార్యకర్తలు సామాజిక స్పృహతో చక్కటి చదువును పిల్లలకు అందిస్తూ, ఏ విధమైన ప్రచార ఆర్భాటాలు లేకుండా నిర్వహిస్తున్న కొన్ని ఉత్తమ స్కూళ్లను చూశాను. ఇలాంటి స్కూళ్లల్లో హైద్రాబాద్‌లోని కూకట్‌పల్లి సమీపానగల ప్రగతి నగర్‌లో ఉన్న ''ప్రగతి'' స్కూల్‌ను చూడగలిగాను. ఇదొక్కటే కాదు. ఖమ్మం, గుంటూరు, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, కాకినాడ, విశాఖ...ఇలా రాష్ట్రంలోని ఎన్నో ప్రదేశాలలో ఎంతోమంది కార్యకర్తలు తదేక దీక్షతో ఇలాంటి స్కూళ్లను నడిపిస్తున్నారు. అట్లాంటి వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది. కార్పొరేట్‌ కబంధ హస్తాల్లో చితికిపోతున్న విద్యావ్యవస్థను కాపాడటం కోసం సామాజిక స్పృహ ఉన్నవాళ్లు కృషి చేస్తున్నారు. విద్యార్థి అంటే వినియోగదారుడు కాదని విద్యార్థిలో చైతన్యం కలిగించి జ్ఞాన ఆసక్తిని పెంచి నైపుణ్యం గల విద్యార్థులను సమాజానికి అందిస్తున్నారు.
ఇటీవల కూకట్‌పల్లి సమీపంలోని ''ప్రగతి'' స్కూలుకు వెళ్లాను. ఆ పిల్లల సమాధానాలు వింటుంటే నాకే ఆశ్చర్యం వేసింది. ప్రతి చిన్న విషయానికి కారణాలను విశ్లేషించి చెబుతున్న తీరు నన్ను అబ్బురపరచింది. ప్రగతి స్కూల్‌ పేరుకు తగినట్లుగానే చక్కటి వసతులు, విద్యా ప్రమాణాలు, క్రమ శిక్షణతో పురోగమిస్తున్నది. మార్కెట్‌ విద్య ఎంత ఉన్నా కానీ, ప్రగతి స్కూల్‌కు ఉన్న ప్రతిష్ట చెక్కుచెదరనిది.
అదే మాదిరిగా నేను ఖమ్మం వెళ్లాను. ఒకవైపున పిల్లలు నాలుగు వాక్యాలు కూడా చదవలేకపోతున్నారని ప్రభుత్వ నివేదికలొస్తున్నాయి. కానీ, కొన్ని స్కూళ్లల్లో నాలుగు వాక్యాలేం ఖర్మ పేరాలకు పేరాలు, పేజీలకు పేజీలు ఇంగ్లీషు, తెలుగులో గడగడా చదివేస్తున్నారు. ప్రతిరోజు పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలపై వాక్యాలు రాస్తున్నారు. వ్యాఖ్యానాలు చేయగలుగుతున్నారు. వీరందరికీ 594 మార్కులు పరీక్షల్లో రాకపోవచ్చును. వీళ్లు ర్యాంకు హోల్డర్లు కాకపోవచ్చును. వీళ్ల స్కూళ్లను టి.వి. తెరల మీద హంగూ ఆర్భాటాలతో చూపించకపోవచ్చును. కాని మధ్య తరగతి పిల్లలకు చదువులు చెపుతూ సామాజిక స్పృహతో ముందుకు సాగుతున్న ఈ స్కూళ్లు నిశ్శబ్ద మార్పుకు కారణభూతమౌతున్నాయి.అవగాహనతో చదవటం, అవగాహనతో రాయటం, పాఠ్యేతర పుస్తకాలను అధ్యయనం చేయడం, ఆ స్కూళ్లల్లో జరుగుతున్నటువంటి రొటీిన్‌ కార్యక్రమం. ఈ పిల్లలంతా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారు, ఏ చిన్న క్లర్కులో, చిన్న చిన్న ఉద్యోగాలో, చిన్న చిన్న కుటీర పరిశ్రమలో, చేతివృత్తులు చేసుకుంటున్న మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలే వీళ్లంతా. ఇళ్ళల్లో ఇంగ్లీషు మాట్లాడే వాతావరణం ఏమీ లేదు. ప్రతి రోజు ఎలా అభ్యాసం చేయాలో చెప్పే తల్లిదండ్రులు కూడా తక్కువగా వున్నారు. కానీ, ఏ పబ్లిక్‌ స్కూల్‌కు తీసిపోకుండా ఈ స్కూళ్లల్లో పిల్లలు, చక్కటి ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. అడుగుతున్న ప్రశ్నలకు ఎంతో సమయస్ఫూర్తితో చురుకుగా సమాధానాలు చెపుతున్నారు. ఏ ప్రశ్న అడిగినా దాన్ని అర్థం చేసుకొని సమాధానం చెప్పగలుగుతున్నారు.
ఈ సామాజిక సోయితో నడిచే బళ్లల్లో ఫీజుల విధానం మధ్యతరగతి కుటుంబీకులు మోయగలిగే విధంగా ఉంది. ఇంత తక్కువ ఫీజులతో పిల్లలకు ఇన్ని వసతులు ఎలా కలిగించారని ప్రగతి స్కూల్‌ సెక్రటరీ దయాకర్‌ను అడిగాను. పిల్లలిచ్చిన ఫీజుతోనే ఈ స్కూల్‌ నిర్మాణాలు జరిగాయని చెప్పాడు. దినదినం విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి వాళ్లకు వసతులు కల్పించే అవకాశం కూడా కలిగింది.
విశాలమైన ఆట స్థలాలు, ఆటలు, పాటలతో ఆ ప్రాంగణాలు కళకళలాడుతున్నాయి. ఇవన్నీ పిల్లలమీద చదువు ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. వ్యాసరచనలు, వక్తృత్వ పోటీలు, సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు. తెనాలిలో శ్రీరామ రూరల్‌ విద్యాసంస్థలు చేస్తున్న కృషి మరువలేనిది. 'మా దినచర్యలో భాగంగా బడిని చూస్తున్నాం. అందుకే ఈ పిల్లలు రాణించగలుగుతున్నారని' శ్రీరామ రూరల్‌ విద్యాసంస్థల నిర్వాహకుడు తులసీ ప్రసాద్‌ నాకు చెప్పాడు. బాలోత్సవాలు నిర్వహించటం వల్ల దీని ప్రభావంతో అన్ని స్కూళ్లలో కూడా ఇలా జరగాలన్నదే తమ ధ్యేయమని తులసీప్రసాద్‌ చెప్పాడు. తులసీ ప్రసాద్‌ నిర్వహిస్తున్న స్కూలు లాభాపేక్షతో లక్షలు ఆర్జించాలని పెట్టింది కాదు. తులసీ ప్రసాద్‌ వాళ్ల పూర్వీకులు రెండు తరాల వాళ్లు స్వాతంత్య్రం రాకపూర్వమే ఈ స్కూలుని ప్రారంభించారు. తన పూర్వీకులు సృష్టించిన ఒరవడిలోనే తులసీప్రసాద్‌ ఈ స్కూలును కొనసాగిస్తున్నాడు. తులసి తాత, వాళ్ల నాన్న ఈ బడిని డెబ్బై ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ ప్రాంతంలోని, అలాగే చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన ఎందరో పేద విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. తులసి ప్రసాద్‌ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే కూకట్‌పల్లిలో ప్రగతి స్కూలు నడుపుతున్న దయాకర్‌, తెనాలిలో తులసి ప్రసాద్‌లాంటి వాళ్లను చూస్తే కార్పొరేట్‌ రంగానికి దీటుగా పనిచేసే సామాజిక శక్తులు బలంగా ఉన్నాయన్న కొండంత ధైర్యం కలుగుతుంది.
ఈ విద్యా సంస్థల విజన్‌ను అమలుపరచటానికై దీక్షా కంకణబద్ధులైన ఉపాధ్యాయవర్గం వాళ్లకు దొరకటం అదృష్టం. ఇలాంటి కమిట్‌మెంట్‌ ఉన్నవాళ్లు ఎలా దొరికారని అడిగాను. ప్రతిరోజు పత్రికల్లో ఉపాధ్యాయ వర్గాన్ని విమర్శిస్తూ వార్తలు వస్తుంటే, ఇంత పవిత్రమైన వృత్తి ఎంతో అపఖ్యాతి పాలవుతుందని అనేకసార్లు బాధపడ్డాను. ఈ స్కూళ్లల్లో పనిచేసే టీచర్లను చూస్తుంటే నాకు భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. కార్పొరేట్‌ రంగాన్ని ఢ కొట్టే శక్తి సామర్థ్యాలు ఈ బళ్లకు ఉన్నాయన్న నమ్మకం కలిగింది. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఈ మార్కెట్‌యుగంలో ఎందరెందరో ఉన్నారని ఈ స్కూళ్లను చూస్తే తెలుస్తుంది. వారికి సమస్యలు లేకేం కాదు, కానీ యాజమాన్యం అంకితభావం దానికి స్ఫూర్తి కలిగించింది. నాయకత్వం వహించేవారు నిజాయితీపరుడైతే సిబ్బంది కూడా స్ఫూర్తి చెందుతారు. దురదృష్టవశాత్తు ఈ లోకంలో చెడునే చూపిస్తారు. చెడునే ప్రచారం చేస్తారు. ఇలాంటి నిస్వార్థపరులైన ఉపాధ్యాయుల సేవలను శ్లాఘిస్తున్న వాక్యాలు మనం రాయగలిగితే సామాన్యునికి నాణ్యమైన చదువు అందించగలిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం విద్యారంగాన్ని మార్కెట్‌కు అప్పగించేసి చేతులు దులిపేసుకొనే దానికన్నా, ఇలాంటి స్కూళ్లకు ఏమాత్రం చేయూతనిచ్చినా అవి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఇతర దేశాల్లో పాఠశాల విద్య ప్రభుత్వపరంగానే ఉంటుంది. స్వచ్ఛమైన గాలిని, నీటిని, వైద్యాన్ని అందించటం ఎంత ప్రధానమో కల్తీలేని చదువును అందించటం కూడా అంతే ముఖ్యమని కొన్ని దేశాలు భావించి పనిచేస్తున్నాయి. ఇలాంటి లోటును కొద్దో గొప్పో పూర్తి చేయటానికి తమ బాధ్యతగా విలువలతో స్కూళ్లను నిర్వహిస్తున్న, సేవాతత్పరతతో ఉన్న యాజమాన్యాలకు, కార్యకర్తలకు తోడ్పడాలి.
(రచయిత ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు) 
-చుక్కా రామయ్య 
ప్రజాశక్తి  న్యూస్  పేపర్  : Dated  10 /03 /2012 

కుడంకలం కలకలం--ఆదిమూలం శేఖర్‌



కుడంకులం - ఈ పేరు ఇప్పుడు తమిళనాట కలకలం రేపుతోంది. బంగాళాఖాత సముద్ర తీరంలో నిర్మిస్తున్న అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా కొన్ని నెలలుగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమం ముందు, సముద్ర కెరటాలే చిన్నబోతున్నాయి. ఎప్పుడూ సముద్రంలో ఉంటూ చేపలు పట్టుకుని బతికే మత్స్యకారుల్లో ఇంతటి చైతన్యమేమిటా అని అందరూ ఆశ్చర్యపోతుంటే, ఈ చైతన్య ప్రభలను తట్టుకోలేక ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. ఉద్యమాన్ని అణచివేసేందుకు రకరకాల కుతంత్రాలు పన్నుతున్నాయి.

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కుడంకులంలో నిర్మిస్తున్న అణు విద్యుత్‌ కేంద్రం తీవ్ర వివాదాస్పదమయింది. కేంద్ర ప్రభుత్వానికే సవాలు విసురుతున్న ఈ ఉద్యమం ఐదారు నెలల నుంచి సాగుతున్నట్లు కనిపిస్తున్నా, వాస్తవంగా దీనికి 25 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఉద్యమానికి 1988లోనే బీజం పడింది.
భారత్‌ తన అణు కార్యక్రమంలో భాగంగా 1988లో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పంద ఫలితమే కుడంకులం అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణం. ఆ ఏడాది నవంబర్‌ 20న అప్పటి భారత ప్రధాని రాజీవ్‌ గాంధీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం రష్యాలో చోటు చేసుకున్న రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు మూలనపడిపోయింది. అణు సరఫరా దేశాల నిబంధనలను భారత్‌ అంగీకరించలేదన్న నెపంతో అమెరికా ఈ ప్రాజెక్టుకు మోకాలడ్డింది. ఆటంకాలన్నీ తొలగిపోయి అణు కేంద్ర నిర్మాణ పనులు ప్రారంభమయ్యేనాటికి అంటే 2001 నాటికి దీని అంచనా వ్యయం రూ.13 వేల కోట్లకు పెరిగింది. ఒక్కోటి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంగల రెండు రియాక్టర్లు (వీవీఈఆర్‌ 1000)ను కుడంకులంలో నెలకొల్పారు. ఇందులో మొదటి దశను 2011 జూన్‌, రెండో దశను 2012 మార్చి నాటికి పూర్తి చేసి మొత్తం 2 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని భావించారు. దాదాపు రెండు దశలూ పూర్తయ్యాయి. 2008లో రష్యా, భారత్‌ మధ్య కుదిరిన మరో ఒప్పందం ప్రకారం ఇంకో నాలుగు రియాక్టర్లను ఈ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సివుంది. కుడంకులం భాగంగా రష్యా తన మూడో తరం అణు రియాక్టర్లు (వీవీఈఆర్‌ 1200) నాలుగింటిని భారత్‌కు సరఫరా చేయాల్సివుంది. మొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాల్సిన తరుణంలో ఉద్యమం ఉధృతమైంది.
కుడంకులంలో ప్రభుత్వ కుట్రలు
కుడంకులం అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానికులు అలుపెరగని పోరాటమే సాగిస్తున్నారు. రాస్తారోకోలు, దీక్షలు, నల్లజెండాతో ప్రదర్శనలు, అణు కేంద్రం ముట్టడి వంటి రూపాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. మరోఒకటి రెండు మాసాల్లో ఉత్పత్తి ప్రారంభించాల్సిన స్థితిలో కుడంకులం కేంద్రాన్ని మూసేయాలంటూ ఉద్యమించడమేంటని ప్రధాని సహా మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే నిరసనకారులపై నిందలు మోపుతున్నారు. అమెరికా, యూరపు దేశాల నుంచి నిధులందుకుంటున్న స్వచ్ఛంద సంస్థలే (ఎన్‌జివోలు) కుడంకులంలో నిరసనలను ఎగదోస్తున్నాయని ప్రధానే స్వయంగా వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యలు అక్కడి వాస్తవ పరిస్థితిని ఏమాత్రం ప్రతిబింబించేవిగా లేవు. రష్యాలోని చెర్నోబిల్‌, జపాన్‌లోని ఫుకుషిమా అణు కేంద్రాల్లో జరిగిన ప్రమాదాలను చూశాక కుడంకులం అణుకేంద్ర భద్రతపై స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కుడంకులం చుట్టూ ఉన్నవి మత్స్యకారుల గ్రామాలే. ఈ కేంద్రం ప్రారంభమైతే కాలుష్యం వల్ల సముద్రంలో చేపలు దొరకవని, జీవనోపాధి కోల్పోతామని వారు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే తమ మనుగడకే ప్రమాదమని ఈ అణు కేంద్ర ప్రమాద జోన్‌లోకి వచ్చే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల రైతులు, మత్స్యకారులు భయాందోళనలు చెందుతున్నారు. దక్షిణ ద్వీపకల్పంగా పిలవబడే ఈ ప్రాంతం మిరియాలు, కొబ్బరి, జీడిపప్పు, కాఫీ, టీ, పసుపు,వనమూలికలు, సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. కుడంకులం అణు కేంద్ర ప్రమాద జోన్‌ పరిధిలో మొత్తం 15 కోట్లమంది జనం నివసిస్తున్నారు. జపాన్‌లోని ఫుకుషిమా (రెండున్నర కోట్లమంది) తో పోల్చితే ఇక్కడ జనాభా ఆరు రెట్లు ఎక్కువ. అదీగాక ప్రమాదం వల్ల సముద్ర జలాలు విషపూరితమైతే అపారమైన మత్స్య సంపద, ఇతర జీవరాశులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముంది. పర్యావరణంపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కుడంకులం భద్రతపై స్థానికులు ఇంతగా ఆందోళన చెందుతుండడానికి కారణమిదే. ఎంతో కీలకమైన ఈ అంశాన్ని ప్రభుత్వం విడిచిపెట్టి కేవలం ఎన్‌జీవోల కుట్రల గురించి మాట్లాడుతున్నది. ప్రభుత్వ వాదనలు సమస్యను పక్కదారి పటించడానికి తప్ప మరి దేనికీ ఉపయోగపడవు. దేశంలోని స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి నిధులు రావడం కొత్తేమీ కాదు. ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్న తతంగం అంతకన్నా కాదు. కేరళ, బెంగాల్‌లాంటి చోట్ల స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొన్ని శక్తులు వామపక్ష ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసినపుడు కేంద్రానికి ఈవిషయం గుర్తుకు రాలేదు. అణు కేంద్రాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించే సరికి ఇది గుర్తుకొచ్చింది. ఉద్యమాన్ని అణచివేయడానికే ప్రభుత్వం నిశ్చయించుకున్నది. అందుకే ఈ నాటకమాడుతున్నది. నిఘా సంస్థలు తిరునల్వేలి, తూత్తుకుడి, నాగర్‌కోయిల్‌ తదితర జిల్లాల్లోని స్వచ్ఛంద సంస్థలపై ఆరా తీశాయి. సీబీఐ దాడులు నిర్వహించింది. టూరిస్టు వీసాపై నాగర్‌కోయిల్‌లో పర్యటిస్తున్న ఓ జపాన్‌ పౌరుడిని బలవంతంగా వెనక్కు పంపింది.
ప్రభుత్వం అణచివేయాలనుకునే కొద్దీ ఉద్యమం ఉధృతమవుతోంది. ఒకప్పుడు కుడంకులం పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఉద్యమం. ఇప్పుడు చెన్నై నగరానికీ విస్తరించింది. ఇటీవలే చెన్నైలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. ఈ ఉద్యమానికి రానురానూ మేధావులు, ప్రజాసంఘాల మద్దతు పెరుగుతోంది.
ఆందోళనకారుల అభ్యంతరాలు
కుడంకులం అణు విద్యుత్‌ కేంద్ర భద్రత, పర్యావరణ సమస్యలతో పాటు అసలు ఈ అణు కేంద్ర నిర్మాణానికి సంబంధించి జరగాల్సిన ప్రజాస్వామిక ప్రక్రియ ఏదీ అసలు జరగనేలేదని ఉద్యమకారులు వాదిస్తున్నారు. ఈ కేంద్రం నిర్మించడానికి ముందు స్థానిక సంస్థల్లో తీర్మానాలు చేయడం కానీ, బహిరంగ విచారణ నిర్వహించడం కానీ చేయలేదు. జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే ఉన్న అణు విద్యుత్‌ కేంద్రాలను మూసేస్తుంటే, అలాంటి అణు కేంద్రాలు మనకెందుకు? అనడిగితే దానికి సమాధానమివ్వని కేంద్రం టెక్నాలజీ గొప్పతనాన్ని గురించి పదేపదే వల్లె వేస్తోంది. దీనిపై నిపుణుల కమిటీ పేరుతో ఒక తంతు నడిపింది. అది ఫ్లాప్‌కావడంతో మాజీ రాష్ట్రపతి, అణు శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంను రంగంలోకి దింపింది. కుడంకులం కేంద్రం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారని, దీనివల్ల స్థానికులకు ఎలాంటి ముప్పూ ఉండబోదని కలాం చెప్పారు. కుడంకులం అణు కేంద్రం, భూకంప కేంద్రానికి 1,300 కిలోమీటర్ల దూరంలోనూ, సముద్ర మట్టానికి 13.5 ఎత్తులో ఉన్నందున సునామీ, భూకంపం వంటి విపత్తుల నుంచి ముప్పు ఉండబోదని వివరించారు. అయితే ఈ వ్యవస్థలనూ దెబ్బతీసే విపత్తులు రావన్న గ్యారంటీ ఏమిటన్నది ఉద్యమకారుల ప్రశ్న. దీనికి సమాధానం లేదు. అందుకే తమిళంలో మాట్లాడిన కలాం మాటలనూ ఉద్యమకారులు విశ్వసించలేదు.
అనవసర ప్రతిష్టకు పోతున్న కేంద్రం
కుడంకులం విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గినా దేశంలో అణు కార్యక్రమమే సందిగ్ధంలో పడుతుందని కేంద్ర ప్రభుత్వ భావన కాబోలు! కుడంకులంతో పాటు మహారాష్ట్రలోని జైతాపూర్‌, మన రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ, మరో ఆరు అణు విద్యుత్‌ కేంద్రాలు నిర్మించాలనుకుంటోంది. కుడంకులం ఆగిపోతే మిగిలినవీ ప్రశ్నార్థకమవుతాయి. ఇప్పటికే కొవ్వాడ (రణస్థలం) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అంతేకాదు అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి ప్రతిగా ఆ దేశం నుంచి 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల అణు రియాక్టర్లను భారత్‌ దిగుమతి చేసుకోవాల్సివుంది. ఫ్రాన్స్‌ నుంచి అతి ఖరీదైన రియాక్టర్లను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. కుడంకులంలో ఆగిపోతే వీటన్నింటినీ ఆపేయాల్సివుంటుంది. దీనివల్లే కేంద్ర ప్రభుత్వం కుడంకులం ఉద్యమకారులపై నిప్పులు కక్కుతోంది. అందుకే తరచూ ప్రధానమంత్రే స్వయంగా అణు కేంద్రాలపై స్పందిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో రష్యాకు వెళ్లిన ప్రధాని...దేశంలో జరుగుతున్న ఆందోళనల గురించి పట్టించుకోకుండా, కుడంకులం మొదటి యూనిట్లో కొన్ని వారాల్లోనే విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని ప్రకటించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కుడంకులం కేంద్రంపై రూ.14 వేల కోట్లు ఖర్చు చేశామని, వృథాగా వదిలేయబోమనీ ప్రధాని చెప్తున్నారు. ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం.
మారిన జయ ప్రభుత్వ వైఖరి
మొదట్లో కుడంకులం అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రధానికి లేఖ రాసిన తమిళనాడు ప్రభుత్వం ఆ తర్వాత వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. కుడంకులంలో భారీ ఎత్తున ఉద్యమం జరుగుతున్నా, ఇప్పటికే వందలాది కేసులు నమోదైనా రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ ఇప్పటిదాకా అరెస్టు చేయలేదు. అయితే విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సహకరించాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడం, ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌లో సగ భాగం అంటే వెయ్యి మెగావాట్లు తమిళనాడుకు ఇస్తామని ఆశజూపడం, తమిళనాడులో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తడం తదితర పరిణామాల నేపథ్యంలో జయలలిత ఒక నిపుణుల బృందాన్ని వేసి, కుడంకులం కేంద్రానికి అనుకూలంగా నివేదిక వచ్చేలా చూసుకున్నారు. ఆ నివేదికను ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఉద్యమాన్ని అణచివేసే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. నిన్నమొన్నటి దాకా అధికారంలో ఉన్న డిఎంకె కూడా కుడంకులం కేంద్రానికి అనుకూలంగా ఉంది. సహజంగానే కాంగ్రెస్‌, బిజెపిలు అణు కేంద్రానికి వత్తాసు పలుకుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభాన్ని బూచిగా చూపుతూ, కుడంకులం అణు కేంద్రం ప్రారంభించడమే విద్యుత్‌ సమస్యకు పరిష్కారమని చెబుతున్నాయి. వామపక్షాలు, వైగో నేతృత్వంలోని ఎండీఎంకే వంటి పార్టీలు, పలు ప్రజాసంఘాలు ఉద్యమకారులకు అండగా ఉన్నాయి. మేధావులు ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కుడంకులం వ్యతిరేక ఉద్యమాలు నడుస్తున్నాయి. విస్తృతమైన ప్రజా మద్దతు కలిగిన ఈ ఉద్యమాన్ని అణచడం ఈంత తేలికేమీ కాదని కాంగ్రెస్‌ పెద్దలకు ఈపాటికే అర్థమై ఉండాలి.
- ఆదిమూలం శేఖర్‌ 

Prajashakti News Paper Dated : 10/03/2012