Showing posts with label కులం. Show all posts
Showing posts with label కులం. Show all posts

Thursday, May 1, 2014

ఓటు బ్యాంకుగా దళిత కార్మికులు By దొంత భద్రయ్య


అనుబంధ సంస్థలుగా కార్మిక సంఘాలు
అన్ని పార్టీలకూ ఉద్యోగ సంఘాలు 
బడుగులకు అగ్రకుల నాయకత్వం 
కుల కోణాన్ని గుర్తించని కామ్రేడ్లు 
ఫలితంగా పాలక కులాలకే సేవ 

భారతదేశం సర్వతోముఖాభివృద్ధికి పెట్టుబడిదారీ విధానం, కుల అణిచివేత (క్యాపిటలిజం, క్యాస్టిజం) ప్రధాన ఆటంకాలని రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్‌. అంబేడƒ్కర్‌ స్పష్టం చేశాడు. బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వంలోప్రొవె న్షియల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోయేముందు 1936లో ఆయన ఇండిపెండెంట్‌ లేబర్‌పార్టీని స్థాపించే సందర్భంలో ఈ విషయం చర్చించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆనాటికి అన్ని దేశాలలో పెరిగిపోతున్న పేదరికానికి పెట్టుబడిదారీ విధానం కారణంగా అనేకమంది తత్త్వవేత్తలు చెప్పారు. వారిలో ప్రముఖులు కార్‌‌ల మార్‌‌క్స. కానీ భారత దేశానికి క్యాపిటలిజం కంటే ప్రమాదకారి క్యాస్టిజం. అంబేడƒ్కర్‌ అప్పటికే అమెరికా, లండన్‌, జర్మనీలలో ఎకనామిక్‌‌స, న్యాయశాస్త్రం, రాజనీతిశాసా్తల్రలో మాస్టర్‌‌స డిగ్రీలు పొంది పి.హెచ్‌.డి. చేసి ప్రపంచ రాజకీయాలపై క్షుణ్ణంగా చర్చించే నైపుణ్యాన్ని సాధించాడు. 1937లో బొంబాయి ప్రావిన్‌‌సలో జరిగిన ఎన్నికల్లో అంబేడ్కర్‌ స్థాపించిన ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ ఎస్‌.సి.లకు రిజర్‌‌వ చేసిన 15 స్థానాలతోపాటు మరో రెండు జనరల్‌ సీట్లలో కూడా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 15 స్థానాలలో విజయం సాధించి, ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీ అవతరించింది. ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీని స్థాపించేటపుడు బొంబాయిలో ఉన్న కమ్యూని„స్టు నాయకులైన ఎమ్‌.ఎన్‌. రాయ్‌, డాంగే విమర్శించారు. ఈ దేశంలో కార్మికులు, కర్షకులు పెట్టుబడిదారి విధానాల వల్లనే కాకుండా కులతత్వం వల్లకూడా అణిచివేతకు గురవుతున్నారని కమ్యూని„స్టు పార్టీలు పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకిస్తున్నాయిగానీ, కుల వివక్షపై పోరాడడం లేదని, కాబట్టి ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీని స్థాపించా ల్సివచ్చిందని ప్రకటించాడు. 1936లో చెప్పిన ఈ అభిప్రాయం గురించి ఇప్పటి కమ్యూనిస్టు పార్టీలుకూడా ఆలోచించాలి.

ఈ దేశంలో కార్మికులు, రైతు కూలీలు, బాల కార్మికుల్లో దళిత ఆదివాసీలే మెజారిటీ. బలహీనవర్గాలవారు కొద్దిసంఖ్యలో ఉన్నారు. భారతదేశం మొత్తం కార్మికుల్లో 70 శాతం మంది గ్రామీణ వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. వీరంతా దళిత ఆదివాసీలే అనేది వాస్తవం. వీరికి భూమి ఉండదు. భూమి ఈనాటి వరకు కొన్ని కులాల చేతుల్లోనే కేంద్రీకృతం కావడానికి కారణం కుల ప్రభావమే. వేద ధర్మం పరిధిలోనే జీవితాలను కొనసాగించాలని, ఆ పరిధి దాటితే ఎవరైనా శిక్షార్హులౌతారని చెప్పడం జరిగింది. ఈ ధర్మనీతిని సవాలు చేస్తూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే, ప్రతి మనిషికి ఒకే విలువ. ఒకే ఓటు దానిని ఆచరణలో నిజం చేస్తుంది. కానీ ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేవారు పాత సామాజికవ్యవస్థ పునాదుల్లోనుండి వచ్చినవారు కావడంవల్ల గత సామాజిక కట్టుబాట్లు, విలువలనే ఎక్కువగా ఆచరణలో చూపడం వల్ల రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. 
42వ సవరణద్వారా రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదాన్ని చేర్చడం జరిగింది. ఈ దేశంలోని కార్మిక, కర్షకులకు వెలుగులు ప్రసాదించడానికి సామ్యవాద సూత్రీకరణలు ఉపయోగ పడతాయి. సామ్యవాదం విజయవంతం కావాలంటే దేశంలోని ప్రధానవనరుగా ఉన్న వ్యవసాయ భూమిని రైతు కూలీలైన దళిత ఆదివాసీలకు పంపిణీచేయాలి. 

ఇది ఇప్పటికీ రాజకీయ నినాదంగానే ఉంది. ఎన్ని భూమి పరిమితి చట్టాలు వచ్చినా, ఎన్ని కౌలుదారు చట్టాలు వచ్చినా భూమి ఈ వర్గాలకు చెందడంలేదు. భూమిని దళిత ఆదివాసీలకు పంపిణి చేసినట్టు చూపించి, అదే భూమిలో గతంలో యజమానులైన వారే కబ్జా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు తమ రికార్డుల్లో భూమిని దళిత ఆదివాసీలకు పంపిణీ చేశామని ప్రచారం చేసుకొంటున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు వ్యతిరేకంగా ఉంది. సామ్యవాద సూత్రీకరణ ప్రకారం పరిశ్రమలను జాతీయం చేయాలి. ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ, సరళీకరణ సంస్కరణలు వచ్చాయి. వీటివల్ల సామ్యవాద ఆశయానికి తీవ్ర గండి పడింది. ప్రభుత్వాలు ప్రైవేటీకరణ మోజులో సర్వరంగాలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రైవేటుపరం చేయడం అంటే దళిత ఆదివాసీలను నిరుద్యోగులుగా మార్చడమే. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత ప్రజాస్వామికంగా ఏర్పడిన ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ ప్రభుత్వాలు పెట్టుబడిదారి, వలసవాద, సామ్రాజ్యవాద కంపెనీలకు అన్ని రంగాలను ధారాదత్తం చేస్తున్నాయి. ప్రైవేటుపరం చేయడం వల్ల ప్రభుత్వాలు తమ బాధ్యతలనుండి తప్పుకున్నట్లు భావించాలి. ఈ ప్రభుత్వ పెట్టుబడిదారీ అనుకూల విధానాలను ప్రశ్నించాలంటే, అంబేడ్కర్‌ స్థాపించిన ఇండిపెండెంట్‌ లేబర్‌పార్టీ లాంటి రాజకీయ పార్టీలు రావాల్సిన అవసరం ఉంద

ఇ„ప్పుడు దాదాపు ప్రతిరాజకీయపార్టీ ఒక కార్మిక సంఘాన్ని అనుబంధంగా ఏర్పాటు చేసుకొని ఓటుబ్యాంకుగా ఉపయోగించుకొంటున్నాయి. ఇందులో ఒకటి రెండు కార్మిక సంఘాలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేƒ విధానాలపై పోరాటం చేస్తున్నప్పటికి ఈ పార్టీలు కులప్రభావానికి లోబడిఉన్నట్లుగానే అనిపిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీకి ఐ.ఎన్‌.టి.యు.సి., బిజెపికి ఎన్‌.ఎమ్‌.యు, సిపిఐకి ఎ.ఐ.టి.యు.సి, సిపియంకి సి.ఐ.టి.యు, తెలుగుదేశం పార్టీకి టి.ఎన్‌.టి.యు, టిఆర్‌ఎస్‌ పార్టీకి బొగ్గుగని కార్మిక సంఘం- ఆయా పార్టీల ప్రణాళికలను అమలు చేసుకోవడానికి లేదా ఆ పార్టీల విధానాలను ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. కార్మిక కర్షకుల్లో దళిత ఆదివాసి బలహీన వర్గాలు మెజారిటీగా ఉంటే, కొద్దిమంది కార్మికులుగా ఉన్న అగ్రకులాలవారు ఆ సంఘాలకు నాయకులుగా చెలామణి అవతున్నారు. ఏ పార్టీలైతే దళిత ఆదివాసి ప్రజల రాజ్యాంగపరమైన రక్షణలను, ప్రయోజనాలను రాపాడడంలో విఫలం అవుతున్నాయో, అవే రాజకీయ పార్టీలకు అండగా ఉన్న కార్మికసంఘాల్లో- ఈ కులాల కార్మికులు ఇతర కులాధిపత్య నాయకుల క్రింద పనిచేయడం విచారిం చదగిన పరిణామం. భూమి పంపిణీలో పాలకులు అనుసరిస్తున్న ఉదాసీన, నిర్లక్ష వైఖరులను ఎండగట్టడానికి, బాల కార్మికుల వెట్టిచారిపై, అందులో బాలికల అక్రమ రవాణాపై ఏ కార్మిక సంఘం స్పందించిన దాఖలాలులేవు. 

ఈ బాలకార్మికులు మెజారిటీగా దళిత ఆదివాసీలు కావడమే. అందువల్ల ఇతరుల నాయకత్వంకింద ఉన్న కార్మికసంఘాలు స్పందించడంలేదు. బాలకార్మిక అక్రమ రవాణా ప్రస్తుతం రాజకీయ పార్టీలకు మాఫియా రూపంలో అండగా కొనసాగుతోందని చె„ప్పవచ్చు. కార్మిక సంఘాలు తమ కంపెనీల్లో లేదా ఫ్యాక్టరీల్లో యాజమాన్య విధానాలపై ప్రశ్నించడంవరకే పరిమితమౌతున్నాయి. దళిత ఆదివాసీ ప్రజలకు రక్షణగా అంబేడ్కర్‌ సైద్ధాంతిక భావజాలాన్ని కొనసాగించేదిగా ఏర్పడిన బహుజనసమాజ్‌ పార్టీ- ఉద్యోగులను సమీకరించేందుకు- బాంసెఫ్‌-ను ఏర్పాటు చేసింది. కానీ ప్రత్యేకమైన ఒక కార్మిక సంఘాన్ని స్థాపించలేకపోతున్నది. సమాజ్‌వాది పార్టీ కూడా ఏ కార్మిక సంఘాన్ని స్థాపించలేదు. మెజారిటీ సంఖ్యలోఉన్న దళిత ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీలు కార్మిక సంఘాలను తక్షణమే స్థాపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, వేరే పార్టీలకు అండగాఉన్న కార్మిక సంఘాల్లో ఉన్న దళిత ఆదివాసీ బలహీన వర్గాలు ఆ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారుతున్నాయి.

Surya Telugu News Paper Dated: 2/5/2014 

Tuesday, November 5, 2013

కులవృత్తులకు ఆదరణ ఏదీ? By డి నరసింహ రెడ్డి

మంగళవారం , నవంబర్ 05 ,2013


ప్రపంచీకరణ విధానాల వల్ల చేతివృత్తులు చేతులిరిగాయి. కులవృత్తులు కూలిపోయాయి. మరణ మృ దంగం తాటిచెట్లపై ఆధారపడిన గీతకార్మికులు పది లక్షల మందికి పనిలేకుండాపోయింది. మద్యం వచ్చి గీతకార్మికులు తమ కులవృత్తికి దూరమయ్యారు. ప్రమాదవశాత్తు తాటి చెట్లు ఎక్కి పడి చనిపోయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవటంతో మన రాష్ట్రంలో పదివేల కుటుంబాలు జీవచ్ఛావాల్లా బ్రతుకు వెళ్లదీస్తున్నాయి.
మన రాష్ట్రంలో 80 లక్షల మంది రజక వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. వాషింగ్టన్‌ యంత్రాలు వచ్చి వారి కులవృత్తి కనుమరుగైపోయింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో తప్ప బట్టలు ఉతికే రజకులు ఎక్కడా కన్పించడం లేదు. కేవలం బట్టలు విస్త్రీ మాత్రం కొంతమందికయినా పొట్టనింపుతోంది.  బొగ్గు ధర పెంచడంతో రజకుడి రోజుకు వందరూపాయలు సంపాదించడం కష్టతరంగా మారింది. లెదర్‌ పార్సులు, హ్యాండ్‌ బ్యాగులు కేవలం బహుళజాతి సంస్థల కోసమేనా అనిపిస్తోంది. ఇవి చర్మ కారులకు ఏ విధంగా ఉపయోగపడ్తయాన్న అంశంపై ప్రభుత్వా నికి అవగాహన లేదు. చెప్పులు, డప్పులు తయారీకి చర్మాకా రులు దూరమయ్యారు. ప్లాస్టిక్‌ కుండలు వచ్చి కుమ్మరుల కుం డలకు కాలం చెల్లింది. చలివేంద్రాలకు విలువలేకుండా పోయింది. కుమ్మరి వాములలో తుమ్మ, సర్మారీ తుమ్మ చెట్లు మొలకెత్తుతున్నాయి.బుట్టలు,తట్టలు,గంపలు, అల్లే మెదరులకు వేదురు అవసరం వారికి సబ్సిడీలురావు. కాగితం పరిశ్రమకు సబ్సిడీలతో రవాణా చేస్తారు వెదురు కోసం అడవికిపోయిన వారిపై అటవీశాఖ అధికారులు కేసులు బనాయిస్తున్నారు. నీలి విప్లవం పేరుతో లక్షలాది మత్య్సకారుల జీవితాలు ఆగమ య్యాయి. వంశరాజులను సంచారజాతులు అంటారు వీరి కుల వృత్తి చాపలు అల్లడం సంచారిస్తుంటారు. రాష్ట్రంలో ఇరవై లక్షలమంది ఉంటారని అంచనా. రానురాను కనుమరుగైపోతున్నారు. సాలెలమగ్గంపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నారు.
వ్యవసాయరంగంతర్వాత రెండోది చేనేతరంగం. చేనేత కార్మి కులు ఆత్మహత్యలు ఆకలిచావులకు గురయ్యారు. అగ్గిపెట్టేలో చీరను, అల్లీ ప్రపంచానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన సరిసిల్లా చేనేత కార్మికుడు ఆత్మహత్య విషాదం. పవర్‌లాంలో తయారైన బట్టలను మార్కెట్‌లలో అమ్మడానికి ముడిసరుకుల ధరలు విచ్చల విడిగా పెంచడం బడ్జెట్‌లో కోత విధించడం బతుకులేక చేనేత కార్మికుఉ వలసలు సూరత్‌, దుబాయి, ప్రాంతాలలో దుర్భరంగా జీవిస్తున్నారు. క్షౌరవృత్తిదారులు సుమారు ఇరవై లక్షల మంది. క్షౌరవృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు. క్షౌర వృత్తిదారులను సెలూన్‌మసాజ్‌ సెంటరులు కూలీలుగా మార్చారు. అత్యాధునికమైన హంగులతో నిర్మించినపటికీ మా మూలుగా ఉన్నటువంటి క్షౌరవృత్తిదారులు మూతపడుతున్నారు. మాయదారి యంత్రాలు రావడంతో చేతివృత్తులకు స్వస్తీపలికి పనులు వెతుక్కుంటూ దూరప్రాంతాలకు వలసలు పోయారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు ఈ వృత్తులకు శాపంగా మారాయి.
1991లో ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాల మూలంగా చేనేత కార్మికులు 850 మంది, కల్లుగీత కార్మికులు 395 మంది శాలివాహనులు 319 మంది కమ్మరి కుమ్మరులు, 175 మంది దర్జీలు వెయ్యి మంది ఆత్మహత్యలు ఆకలిచావులతో మరణించారు. చేతివృత్తిదారుల పోరాట ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘాన్ని అధ్యయనం చేయకుండానే రద్దు చేసారు. కులవృత్తులు కూడుపెట్టలేవని అమెరికా ఆర్థికసంక్షోభం నిరూపించింది. కనుమరుగైపోయిన కులవృత్తులు చేతివృత్తులకు ప్రభుత్వం జీవంపోయాలి. సబ్సి డీపై ముడిసరుకులు అందించాలి. వృతికళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చేతివృత్తులు కులవృత్తుల దారులు సొం తంగా నిలబడేలాగా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. ప్రభు త్వం, బ్యాంకుల నుంచి రుణాలు అందించాలి. ప్రపంచీకరణ సరళీకరణలో అంతరించిపోతున్న కులవృత్తులు చేతివృత్తులకు ప్రభుత్వమే జీవం పోయాలి. పాలకుల నిర్లక్ష్యం విడనాడి చేతివృత్తులకు చేయూతనందించాలి. విదేశవస్తువులన్నీ బహిష్కరించి స్వదేశీవస్తువులని కాపాడుకోవాలి


Vaartha Telugu News Paper Dated: 05/11/2013 

Saturday, September 14, 2013

Upper caste ethics and spirit of Samaikyandhra By Dr Ram Bheenaveni

The commodified ethics of upper caste run both Telangana and Samaikyandra movements and become curse for weaker sections of both regions. Regional unrest is broadly articulated on the lines of nationalities and cultural and economic spaces
It may be strange to believe that upper caste ethics are coming in the way of creating Telangana statehood. In the movement, the subjects and connotations of Andhra and Telangana are entirely different in each and every sphere excluding the leadership. It is from upper castes both sides and this commonality breaks process formation of statehood and leading to counter movement.  

Interestingly, TSJAC or TRS under upper caste leadership announces a programme and a similar one is being adopted by the Andhra upper caste leaders like Lagadapati, Kavuri, Payyavula Keshav etc.  Chandrababu and Jagan also imitate this method to a certain manifest extend but full in latent functioning.  
Whatever the counter-strategy that is prepared by Seemandhra leaders is also being adopted by Telangana leaders.  A classic instance is resignations and bandhs. However, the counter-movement is being copied by the Andhra leaders and the counter-strategy is being adopted by the Telangana leaders and vice-versa. So, one can infer that some sort of strategic exchange is taking place between upper castes of both regions irrespective of political parties, though it appears negative to each other.   
When it comes to ideological struggle, only subalterns are always entitled towards smaller states.  Congress and TDP are maintaining duality in this regard.  BJP and YSRCP took new path to retain united Andhra Pradesh by invoking the counter-movement, although BJP is for separation but its prominent leader Venkaiah Naidu is reluctant as Jayaprakash Narayan.  The reason could be one that to protect the interest of their community and its businesses.  
In case of separation, the question who will dominate the Andhra state will be an issue. The clash among Rayalaseema Reddys, Andhra Kammas and Kapus is obvious.  A serious caste war will be inevitable to control and hold hegemony over political economy. 
In case of status quo, the dominated survive as a ‘falsified historic bloc’ against the real historic bloc of Dalit and Bahujans.  Nevertheless, it is not taking place. The parochialism of regional identity gradually swallows generic identity and struggle of downtrodden and region will be opium for all sufferings, which never cure real sickness but acts as energizer to the upper castes.  
Thus, the commodified ethics of upper caste run both Telangana and Samaikyandra movements and become curse for weaker sections of both regions. Regional unrest is broadly articulated on the lines of nationalities and cultural and economic spaces.  The cultural differences and regional imbalances are further accentuated by the alliances among the upper castes.  
The multi-faced uneven development is both historically determined and political enforced process.  It is exclusively interrelated to the logic of capitalism of upper castes.  Large linguistic states, as the experience of five decades shows, have strengthened the grip of dominant castes/classes of the advanced regions over economy, society and politics of the states. Hence, it is inevitable to form Telangana.  
Andhra leaders claim that Telangana is already developed by them. If it is so, regionalism cannot be opiate unless there are unsatisfied longings which are not all on the material plane.  Good food, soft cushion and fine raiment are not enough to satisfy the people.  Unhappiness and discontent spring not only from poverty but sometimes also from development.  
Andhra leaders always try to exert a powerful attraction, exalts to be united and expound a philosophy of capitalism.  As a consequence, many of selfish and visionless leaders are lured into the trap of Samaikyandhra, majority are upper castes among them. Thus, upper castes ethics both in Andhra and Telangana regions make hindrances to formation of a long cherished dream of Telangana statehood.    

(The writer is Assistant Professor, Department of Sociology, Osmania University, Hyderabad)

The Hans India English News Paper Dated : 14/09/2013 

Monday, July 15, 2013

ఎక్కడి ఎస్సీలు అక్కడే ---Bollimunta Hanmanth Rao


రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గురించి చేశామంటూ చెప్పే మాటల డొల్లతనాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్‌) నిర్వహించిన సర్వే బట్టబయలు చేసింది. రాష్ట్రం మొత్తంలో 2,10,22,588 కుటుంబాలు ఉండగా, వాటిలో 38,71,634 (15 శాతం) ఎస్సీ, 15,60,035 (6.6 శాతం) ఎస్టీ కుటుంబాలు న్నాయి. సెర్స్‌ 22 జిల్లాల్లోని 619 మండలాల్లో, 5989 గ్రామాల్లో 9.8 లక్షల ఎస్సీ, ఎస్టీ ఇండ్లను పరిశీలించి నివేదిక తయారుచేసింది. ఈ నివేదికలో 4,45,954 (65శాతం) ఎస్సీ, 1,77,263(55శాతం) ఎస్టీ కుటుంబాలకు సెంటు భూమిలేదని పేర్కొంది. ప్రభుత్వ ప్రచారం ప్రకారం 50 లక్షల ఎకరాల పంపిణీ జరిగి ఉంటే, భూమిలేని ఎస్సీ, ఎస్టీలు ఇంత సంఖ్యలో ఉండేవారు కాదు. భూపంపకం ద్వారా పంచామని చెపకొంటున్న భూముల్లో 80శాతం పేదలు సాగుచేసుకొంటున్న భూములే. పేదలకు యిచ్చామని చెప్పుకొంటున్న 25 లక్షల అసైన్డ్‌ భూములు భూస్వాముల, సంపన్నవర్గాల చేతుల్లోకి వెళ్లాయని కోనేరు రంగారావు భూ కమిషన్‌ తెలియచేసింది. 


ఈ భూములపై భూస్వాములకు చట్టబద్ధహక్కు కల్పించేందుకు ప్రభుత్వం 9/77 అసైన్డ్‌ చట్టాన్ని చేసిందంటే, ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలను కాపాడుతుందో అర్థమౌతుంది. కోనేరు రంగారావు భూకమిషన్‌ వివిధ రూపాల్లో పంపిణీయోగ్యమైన 60 లక్షల ఎకరాల భూములను దళితులకు, ఇతర పేదలకు పంపిణీ చేయాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వం అందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఎస్సీల్లో 1,35,978(21శాతం) ఎస్టీల్లో 91,247 (28.3శాతం) కుటుంబాలు గుడిసెల్లో నివసిస్తున్నాయని, ఇందిరమ్మ పథకంక్రింద అర్హతఉండికూడా ఎస్సీల్లో 2,98,774 (45శాతం) ఎస్టీల్లో 1,44,843 (45శాతం) కుటుంబాలకు ఇళ్ళు మంజూరు కాలేదని నివేదిక వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీల ఇండ్లనిర్మాణానికి రూ. 72 వేలు ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులు పునాదులు నిర్మించినప్పుడే విడతల వారీగా బ్యాంక్‌నుండి డబ్బు, సిమెంట్‌ తీసుకోవాలి. స్లాబ్‌వేసిన ఇంటికే ఈ కేటాయింపు కాగా, రేకుల ఇళ్ళు వేసుకోవటానికి ఒప్పుకోరు. ఒక్కగది ఇంటికి స్లాబ్‌ పోయాలన్నా కనీసం రెండు లక్షలకు పైగా అవుతుంది. అందుకే లక్షలాది ఇళ్ళ నిర్మాణాలు సగంలో ఆగిపోతున్నాయి. అప్పులు మాత్రం వారికి మిగులుతున్నాయి. చివరికి అవి ఇతరుల పరమౌతున్నాయి. 



నివేదికలోని మరో ముఖ్యమైన అంశం గ్రామీణ ఉపాధి హామీ పథకం. వందరోజులు పని దొరికిన కుటుంబాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. సగటున 28 రోజులకు మించి ఉపాధి పనులను కల్పించలేక పోయారు. అర్హులైన లక్షలాదిమంది పేదలకు జాబ్‌ కార్డులే ఇవ్వలేదు. వారికి లభించే కూలి కూడా చాలా తక్కువగా వుంది. ఈ వాస్తవాన్ని ఈ నివేదిక కూడా పేర్కొంది. నివేదికలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రంలో 2,57,539 (39శాతం) ఎస్సీ, 1,23,993 (38శాతం) ఎస్టీ కుటుంబాల వారికి గ్రామీణ ఉపాధి హామీ పథకంక్రింద జాబ్‌ కార్డులు రాలేదు. దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న పేదలందరికీ రేషన్‌కార్డులు ఇచ్చి కిలో రూపాయికే బియ్యం, చౌకగా ఇతర వస్తువులు ఇస్తున్నామని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నది. ఇప్పటికీ అర్హులైన లక్షలాది మంది పేదలు రేషన్‌ కార్డులు లేక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అంశాన్ని కూడా నివేదిక పొందుపరచింది. 



ఎస్సీల్లో 97,782 (15 శాతం), ఎస్టీల్లో 63,232 కుటుంబాలకు రాష్ట్రంలో రేషన్‌కార్డులు లభించలేదు. పల్లెల్లో పేదలు రోజుకి రూ. 17, పట్టణాల్లో రూ. 23 మాత్రమే ఖర్చుచేస్తున్నారని ఈ సర్వే తెలిపింది. ఎస్సీల్లో 3 శాతం, ఎస్టీల్లో 2 శాతం మంది మహిళలకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరుగుతున్నాయని ప్రైవేటు ఆసుపత్రులలో ఈ సంఖ్య ఇంకా తక్కువని, సిజేరియన్‌ ఆపరేషన్లు 2 శాతంలోపే చేయించుకొంటున్నారని సర్వే నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో విద్యుత్‌ సౌకర్యంలేని ఎస్సీ కుటుంబాలు 49,562, ఎస్టీ కుటుంబాలు 23,191 ఉన్నాయని; 10శాతం ఎస్సీ, 18 శాతం ఎస్టీ కుటుంబాలు కిరోసిన్‌ దీపంతోనే రాష్ట్రంలో గడుపుతున్నాయని నివేదిక వెల్లడించింది. వీరి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందటంలేదని, నాలుగు శాతం ఎస్సీలు, ఐదు శాతం ఎస్టీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు మధ్యలోనే చదువు మానివేస్తున్నారని, బడికి వెళ్లని పిల్లల సంఖ్య కూడా ఎక్కువగా వుందని, ఎస్సీల్లో 20 శాతం, ఎస్టీల్లో 12శాతం కుటుంబాలే వంటగ్యాస్‌ని ఉపయోగిస్తున్నాయని 79 శాతం ఎస్సీలకు, 85శాతం ఎస్టీల కుటుంబాలకు మరుగు దొడ్ల సౌకర్యం లేదని నివేదిక వెల్లడించింది.
Surya  Telugu News Paper Dated : 16/07/2013 

Saturday, February 9, 2013

పురాణ కథలు కుల తటస్థీకరణ --Kalluri



Editorial-Photo2
భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ముందు అందరూ సమానమే. అందులో కుల, మత, ధనిక, పేద తేడాలు లేవు. అయితే, ఈ నీతిని ఉల్లంఘించేవారు లేరా అంటే ఉన్నారు. అది వేరే చర్చ. మరి మహాభారత రాజ్యాంగం ప్రకారం కూడా చట్టం ముందు అందరూ సమానమేనా? కాదని ‘నాడీజంఘుడు అనే కొంగ-గౌతముడు’ అనే బ్రాహ్మణుని కథ చెబుతుంది. మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసంలో ఈ కథ ఉంది. 
సంగ్రహంగా కథ ఇదీ: గౌతముడు కులధర్మం వదిలేసి ఒక బోయను పెళ్లి చేసుకున్నాడు. ధనసంపాదన కోసం కొంతమంది వర్తకులతో కలసి దేశాంతరం బయలుదేరాడు. వారు ఒక కీకారణ్యంలోంచి వెడుతుండగా ఒక అడవి ఏనుగు వారిమీద పడింది. ప్రాణభయంతో తలోవైపుకీ చెదిరిపోయారు. గౌతముడు ఒంటరిగా ముందుకు సాగాడు. అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆగాడు. ఆ చెట్టు మీద నివసించే నాడిజంఘుడు అతనిని చూసి జాలిపడ్డాడు. ఆతిథ్యమిచ్చి అలసట తీరేలా సేవలు చేశాడు. నీకు కావలసినంత ధనమిస్తాడని చెప్పి తన మిత్రుడైన విరూపాక్షుడనే రాక్షసరాజు దగ్గరకు పంపించాడు.

రాక్షసరాజు అతనికి మోయలేనంత ధనమిచ్చి పంపించాడు. తిరిగి మర్రిచెట్టు దగ్గరకు వచ్చిన గౌతముని నాడీజంఘుడు యథాప్రకారం ఆదరించాడు. గౌతమునిలో ఒక దుర్మార్గపు ఆలోచన పుట్టింది. బాగా బలిసి ఉన్న ఈ కొంగ తనకు కడుపునిండా ఆహారమవుతుందనుకున్నాడు. నిద్రపోతున్న కొంగను కట్టెతో బాది చంపేశాడు. మాంసం వలిచి మూట కట్టుకుని డొక్కను అక్కడే వదిలేసి ప్రయాణమయ్యాడు. 
రోజూ తన దగ్గరకు వచ్చే నాడీజంఘుడు ఎంతకూ రాకపోయేసరికి విరూపాక్షుడు కీడు శంకించాడు. ఏంజరిగిందో తెలుసుకు రమ్మని భటులను పంపించాడు. కొంగ డొక్కను చూసిన భటులకు జరిగింది అర్థమైంది. గౌతముడే కొంగను చంపిఉంటాడని గ్రహించిన భటులు అతన్ని వెతికి పట్టుకుని బంధించి విరూపాక్షుని ముందు నిలబెట్టారు. ఈ కృతఘు్నని మీరే చంపి తినెయ్యకుండా నా ముందుకు ఎందుకు తీసుకొచ్చారని విరూపాక్షుడు అన్నాడు. మాకు మాత్రం నీతి లేదా? ఈ పాపాత్ముని శరీరాన్ని మేమెలా తింటామని భటులు అన్నారు. అతన్ని తీసుకెళ్లి నెత్తుటి గాయాలు అయ్యేలా ఒక ఎతె్తైన ప్రదేశం నుంచి కిందికి తోసేశారు. ఆకలితో నకనకలాడుతూ ఆ సమీపంలోనే తిరుగుతున్న కుక్కలు కూడా అతన్ని తినడానికి ఇష్టపడలేదు. 

మిత్రుని మరణానికి దుఃఖించిన విరూపాక్షుడు కొంగ డొక్కను తెప్పించి దహనసంస్కారాలు చేశాడు. అంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. నాడీజంఘుడు నీకే కాదు, బ్రహ్మకు కూడా మిత్రుడేననీ, అతడు తనను చూడడానికి ఈ రోజు రాకపోవడంతో ఆందోళన పడుతున్నాడనీ చెప్పాడు. నువ్వు నాడీజంఘునికి దహనసంస్కారంచేసి వెళ్ళిన తర్వాత దగ్గరలోనే ఒక ఆవు దూడ- తల్లిగోవు వద్ద పాలు తాగుతుండగా దాని మూతికి అంటిన పాలనురగ గాలికి ఎగిరివెళ్లి చితిమీద పడిందనీ, దాంతో నాడీజంఘుడు ప్రాణాలతో లేచికూర్చున్నాడనీ, ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాడనీ చెప్పాడు. 

నాడీజంఘుడు వచ్చాడు. తనవల్ల బ్రాహ్మణునికి ఇలాంటి దుర్దశ కలిగినందుకు నొచ్చుకు న్నాడు. అతన్ని విడిచి పెట్టేలా వరమిమ్మని ఇంద్రుని కోరాడు. బ్రహ్మ ఉద్దేశం కూడా అదేనని దివ్యదృష్టితో తెలుసుకున్న ఇంద్రుడు నాడీజంఘుని కోరిక తీర్చాడు. విరూపాక్షుడు భటులను పంపించి గౌతముని డబ్బుమూటలు తెప్పించి అతనికి ఇప్పించాడు. గౌతముడు వాటిని మోసుకుంటూ, తొట్రుపాటుతో మాటి మాటికీ వెనుదిరిగి చూస్తూ వెళ్లిపోయాడు.

కృతఘు్నని దేహాన్ని కుక్కలు కూడా తాకవని చెప్పడం ఈ కథలోని ప్రధాన ఉద్దేశం. దాంతోపాటే, పశుపక్షులలో కూడా దయ, క్షమ ఉంటాయనీ; మిత్రధర్మాన్ని, అతిథి మర్యాదను అవి కూడా పాటిస్తాయనీ చెబుతోంది. రాక్షసులను మనుషుల్ని తినే వారుగా చిత్రిస్తూనే వారికీ నీతి, మిత్రధర్మం ఉంటాయని అంటోంది. అలాగే ఒక వ్యక్తి భ్రష్ఠుడు, కృతఘు్నడు, హంతకుడు కావడానికి కులంతో సంబంధంలేదని కూడా చెబుతోంది. అంతవరకు బాగానే ఉంది. కానీ హత్యవంటి తీవ్ర నేరానికి పాల్పడిన గౌతముని శిక్షించకుండా విడిచి పెట్టడం, పైగా డబ్బుమూటలు ఇచ్చి మరీపంపించడం నేటి మన అవగాహన రీత్యా ఆశ్చర్యకరంగానే ఉంటుంది. చట్టంముందు అందరూ సమానులన్న సహజన్యాయాన్ని తలకిందులు చేసే ఇలాంటి కథలు మన పురాణ, ఇతిహాసాలలో చాలా ఉన్నాయి. 

అది ఆ కాలపు నీతి అనీ, ఇప్పుడు కుల, మత, లింగ వివక్షకు తావులేని కొత్త నీతిని తెచ్చుకున్నాం కనుక పాత కథలు తవ్వుకోనవసరం లేదనీ ఎవరైనా అనచ్చు. పైపైన చూస్తే ఇది సమంజసంగానే కనిపిస్తుంది. కానీ కాస్త లోతుకు వెడితే అలా అనిపించదు. ఇవి పాతకథలే అయినా ఇలాంటివి పొందుపరచిన భారత, భాగవత, రామాయణాదులు ఇప్పటికీ ప్రవచన, వ్యాఖ్యాన, కళారూపాలలో ప్రచారంలోనే ఉన్నాయి. కాకపోతే, నేటి సామాజిక, రాజకీయ వాతావరణంలో ఇబ్బందికరంగాతోచే విషయాలనుదాచి, పాక్షికంగా మాత్రమే వాటిని ప్రచారంలో ఉంచుతున్నారు. మరోవైపు, ఆ రచనలలోని కులాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పీడితసామాజిక వర్గాలు పోరాడుతున్నాయి. ఆ రచనల విశిష్ఠతను బోధించే సామాజికవర్గాలకూ, వీరికీ మధ్య అర్థవంతమైన సంభాషణ జరగడం లేదు. రెండూ పరస్పర శత్రుశిబిరాలుగా కొనసాగుతున్నాయి. పీడిత సామాజికవర్గాలు ఆ రచనలలోని చెడును ఎత్తి చూపుతుంటే, వాటి సమర్థకులు మంచిని మాత్రమే చూడమంటున్నారు. 

కుల, మత, ప్రాంత, లింగభేదాలకు అతీతంగా ఒక తటస్థ భూమికనుంచి ఆలోచింపజేసే నీతి, రాజనీతి, ధర్మం, మానవీయ విలువలకు సంబంధించిన అనేక మంచి విషయాలూ ఈ రచనల్లో ఉన్నమాట నిజమే. అయినాసరే, తమకు ప్రతికూ లమై న విషయాలు వాటిలో ఉన్నప్పుడు పీడిత సామాజికవర్గాలు ఉదారబుద్ధితో కేవలం మంచిని మాత్రమే చూడడం సాధ్యమేనా? అదీగాక, ఈ రచనలను మన దేశ సాంస్కృతిక, జ్ఞాన వారసత్వంలో భాగంగా గుర్తించి నప్పుడు ఈ వారసత్వానికి పాత/ కొత్త అన్న హద్దులు గీయడం తగనూ తగదు, సాధ్యమూ కాదు. వాటిని దేశవారసత్వంగా గుర్తించినప్పుడు నేటి ప్రజాస్వామిక యుగ లక్షణానికి అనుగుణంగా అన్ని సామాజికవర్గాలూ ఆ వారసత్వంపై హక్కుదారులే అవుతారు. ఇంకాస్త సూటిగా చెప్పాలంటే ఒక దళితుడు, లేదా మరో పీడితవర్గానికి చెందిన వ్యక్తి భారత, భాగవత, రామాయణాదులను సొంతఆస్తిగా భావించుకునే అవకాశం ఉండాలి. అంటే, వారికి ప్రతికూల మైన అంశాలను తొలగించి ఆ రచనలను కుల తటస్థంగా మార్చాలి. మొత్తం సాంస్కృతిక వారసత్వాన్నే ప్రజాస్వామికీకరించి దానిని ఉమ్మడి వారసత్వంగా మార్చాలి. 

అలా అనడం తేలికే, కానీ అందుకు ఏం చేయాలన్నదే అసలు ప్రశ్న. ప్రతికూల కథలను, ఘట్టాలను తొలగించడం ఒక మార్గమా? అలా అయితే, ఆ రచనలకు, అందులోని భావాలకూ గల చారిత్రకతకు నష్టం కలుగుతుంది. వాటిని అన్నిటినీ ఒకచోట పొందుపరచి అనుబంధంగా ఇస్తూనే వాటిని ఆమోదయోగ్యం కానివిగా ప్రకటించి కుల తటస్థ పాఠాన్ని రూపొందించడం మరో మార్గమా? మొదట ఉమ్మడి పాఠం అవసరాన్ని అందరూ గుర్తించగలిగితే, అది ఎలా చేయాలో మార్గాలు స్ఫురించకపోవు. 

Surya News Paper Dated : 10/2/2013

Monday, June 11, 2012

పొంతన లేని ఐలన్న దార్శనికత - డా.చెరుకు సుధాకర్



'నేను హిందువు నెట్లయిత?' అని ఐలన్న (కంచ ఐలయ్య) ప్రశ్నించినప్పుడు, అనేక మౌలిక అంశాలను ప్రశ్నిస్తున్న గొల్ల కుర్మ మేధావిని చూసి మురిసిముక్కయినోన్ని. ఎదురీతలో ఉసా, శివసాగర్, బిఎస్ రాములు, ఐలయ్య వ్యాసాలకు స్పందించి, సమాజాన్ని చూడడానికి అంబేడ్కర్ దార్శనికత అవసరమే అని రూఢీకి వచ్చి ఆ పనిలో కుల-వర్గ పోరాటాల జమిలికి జముకులు వేస్తున్న బిడ్డలకు ఊపిరి ఉన్నదాక సహాయ సహకారాలందించి సహానుభూతితో బతకాలనుకున్నవాణ్ని. ఐలన్న 'టిఆర్ఎస్‌కు కాంగ్రెస్ వరం' వ్యాసం (జూన్ 6, ఆంధ్రజ్యోతి), అంతకు ముందు కొన్ని వ్యాసాలు చదివినాక ఎందుకో ప్రజలకు, పరస్పర సంఘర్షణలకు, సంఘటనలకు అనేకానేక అంశాలను సంబంధం లేకుండానే ఏదంటే అది రాసే పొంతనలేని దార్శనికతను తారీఫ్ చేయాల్సిందే ననిపిస్తుంది. 

గత రెండున్నర సంవత్సరాలుగా ఆకులు - అలములు తినే స్థితికి ఉద్యమం పుణ్యమాని తెలంగాణ ప్రజలు వచ్చారని ఐలన్న అన్నారు. రెండున్నర సంవత్సరాల ముందు బంగారు పళ్లెంలో పంచభక్ష్య పరమాన్నాలు తిన్నరా ఐలన్న? విషపు గడ్డలు తిని అదిలాబాద్ రైతులు ఆకలి తీర్చుకున్నది గుర్తుకులేదా? గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు పెడితేనే కాదా పాలమూరు వలసకూలి ఆకలిచావుబారిన పడకుండా బతికి బయటపడింది? 

అర్ధాకలి పుణ్యమే కదా, మొగ్గం ఉరిపగ్గమయ్యింది? కాడి వల్లకాడయ్యింది. 'ఈ స్థితికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి' -మంచి మాట రాసిండ్రు ఇయ్యాల కాకపోతే రేపైనా తెలంగాణ బిడ్డల్ని ఆర్థికంగా, రాజకీయంగా సకల రంగాలలో, సకల రీతిలో ఏమార్చిన సోనియాగాంధీ ప్రభుత్వం ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. 2009 డిసెంబర్ 9 తరువాత ఉద్యమాలు విందు భోజనాలుగా మారినాయా? ఈ రెండున్నర ఏళ్లలో లష్కర్‌లో గాని, జనగామలోగాని ఏ జన సమూహంలో గాని ఎన్నడన్న జనం బంతిలో కూసొని బువ్వ తింటే చెయ్యి కడిగి ఉంటే జరుగుతున్న కార్యక్రమాలను ఒక చెయ్యేసి సహకరించి ఉంటే అవి విందు భోజనాలో 'సమిష్టి కృషితో ఉడికిన చెలిమి కుండలో వడ్లో అర్ధమయ్యి ఉండేది. అయినా అంటీ ముట్టనట్లు ఉండి మంట పెట్టే రాతలు రాసే అంటువ్యాధి ఎప్పటి నుండి సోకింది ఐలన్నా? 

కెసిఆర్‌ను తిడితివి, టిఆర్ఎస్‌ను తిడితివి, కోదండరాంను తిడితివి, జెఎసిని తిడితివి. ఒకలు వేములవాడ రాజన్న సన్నిధిలో ఉద్యమ సంపాదనతో మోకరిల్లిండ్రని అంటివి. ఇంకొక్కలు భద్రాచలంలో అంటివి. ఒకలు 'లక్ష్మి' ఏడ ఉంటే ఆడ వాలుతరంటివి. ఎవ్వల్ని మోస్తే, ఎవ్వరిపై కూస్తే తెలంగాణ వస్తదో చెప్పవ్ గాక చెప్పవ్. క్యాంపస్‌లో పోరగాల్లతో కలిసి లడాయిల షరీకయ్యితవేమో అనుకుంటే అకడమిక్ పని ఉందంటవ్. ఎట్ల చెయ్యాలో చెప్పు అంటే తిట్ల పురాణం ఇప్పుతవ్. 

ఇంత ఉద్యమంలో ఊగులాడేటోనికి ఇడుపుల పాయను ఎట్లా నిలువరించాలనో 'ముడుపులపాయ'ను ఎట్ల చిల్లగొట్టాలనో తెలియదా ఐలన్న. ముడుపులపాయకు అంత మహాత్యముంటే ఇడుపులపాయల చీఫ్‌కు పరకాలను ఎంతకు కొంటాడో చెప్పమనరాదు. వశమైతదా సూద్దాం- 'ఓట్లు ఎందుకు పంచాయితీ లెందుకు?' ఐలన్నా 'ఉద్యమ క్యాపిట్' యాభైవేల కోట్ల నుండి ఇంకా చాలా పైకి పోతది. 

కళ్లు మూసినా తెరిచినా వెయ్యిమంది పోరగాల్ల బలిదానాల గోసనే ప్రాణం అవిసేటట్లు చేస్తుంటే పిడికెడు మంది స్వార్థపరుల్ని 'భూతద్దంలో పెట్టి భూతదయ' చూపెట్టకు ఐలన్నా! చచ్చిన పోరడి చివరి కరస్పర్శతో పోస్టుమార్టమ్ వాసనతో ముక్కుపుటాలు రగిలిపోతుంటే శత్రువుతో కరచాలనం చేస్తున్నట్లు స్వరచాలనమ్ చాలుగాని ఐలన్న- చెప్పు- దొంగల్ని అవకాశవాదుల్ని కాదని నిఖార్సయిన ఉద్యమానికి ఎక్కడ ఎప్పుడు పునాది వేద్దామో- ఆ పునాది రాస్తాలో జీతంరాళ్లని కాదని వాటికి మించి వచ్చే ముడుపు జీతాలు కాదని ఐలన్న వెనుక నడవడానికి అన్ని క్యాంపులు, క్యాంపస్‌లు సిద్ధంగానే ఉన్నాయి. 

ఎందుకో ఐలన్నకు టిఆర్ఎస్ ఏది చేసినా కాంగ్రెస్ మ్యాండేట్ ఇచ్చినట్లు కనబడుతుంది. కాంగ్రెస్, టిఆర్ఎస్ హాట్‌లైన్ అంతా ట్యాప్ చేసినట్లు మాట్లాడుతాడు ఐలన్న. చిన్న జేఏసీలు పిలుపునిచ్చినా బంద్‌లెందుకు జయప్రదమవుతాయని ఓయు జేఏసీ, ఇతర సంఘాల జేఏసీలను చిన్న చేసి మాట్లాడుతావ్. కాంగ్రెస్- టిఆర్ఎస్‌తోపాటు అన్ని జేఏసీలను కొనివేసిందా? అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసానికి నిరసనగా విద్యార్థి జేఏసీ పిలుపునిస్తే అన్ని పార్టీలు ఫాలో కావల్సి వచ్చినందుకు దళిత, బహుజన మేధావిగా ఇంకా వాళ్లను అస్సెర్ట్ చేసుకొని మాట్లాడవలసిన ఐలన్న- చిన్నగా చేసి మాట్లాడటం ఎట్లా తగునో చెప్పు? 

మహబూబాబాద్‌లో అయినా, నకిరేకల్‌లో అయినా రాళ్ల వర్షం కురిపిస్తే టిఆర్ఎస్ ఖాతాలో పడిందని ఏది చేసినా ఆ ఖాతాలోనే జమ అవుతుందని బాధపడే ఐలన్న- ఎవ్వరి ఖాతాలో వెయ్యమంటారో చెప్పండి. తెలంగాణ రావటానికి ఆ ఖాతా పనికొస్తే నాపై పెట్టిన అమలులో లేని పిడియాక్ట్ తరువాత నాసాతో అనుభవించిన బాధనంతా వాళ్ల ఖాతాలోనే వేస్తాను. అకౌంట్ నెంబర్ చెప్పండి. మా దాంట్లో అందరూ సుద్దపూసలే అని మేము అనలేదు. మేమే తీస్‌మార్‌ఖాన్‌లమని అంటలేము. సరిచేయాలని ఉంటే వెన్నపూస మనసుతోని వెన్నుపూస సరిజెయ్యాల కాని కారంపూసతో కళ్లల్లో కంప దింపినట్లు, పగోడు సంబురపడేటట్లు ఎందుకే ఈ రాతలు- ఐలన్న! 

ఐలన్న మాట్లాడడానికి రాసుకోవడానికి ఎంత పరుశంగానైనా ముందుకు రావొచ్చు. ఒక ఉద్యమం యాభైఏండ్ల తండ్లాట తరువాత కొలిక్కి రావడానికి సానుకూల కార్యక్రమం ఏమిచేస్తే బాగుంటుందో అని ఆలోచించి, ఆచరణకు బాటలు వేస్తే సామాజిక ఉద్యమకారులుగా దార్శనికులుగా మనల్ని ప్రజలు అనుసరిస్తరు. గౌరవిస్తరు కాని శాపనార్ధాలు, విపరీత అర్ధాలు, అర్థ సత్యాలు, పూర్తి అసత్యాలు మన గౌరవాన్ని, మన తీవ్రమైన అంతరంగీక విశ్లేషణను ఉన్నతీకరించవని మీ చేయి పట్టుకొని నడిచిన చిన్నవాడుగా చెబుతున్నాను. 

పంజాబ్‌లో ఒలికిన రక్తానికి ఇంత మూల్యం ఎందుకంటే వాళ్లు ఒక దేశాన్నే అడిగారు కనుక అని సమర్ధించుకోవచ్చు. ఒకనాడు ఉన్న రాష్ట్రం, ఒకనాడు ఉన్న దేశం ప్రజలు గగ్గోలు పెడుతున్నా సమైక్యత పేరుమీద ఖబ్జాకు గురికాబడిన రాష్ట్రం- ఇప్పుడునా నేల, నా భౌగోళిక తెలంగాణ కావాలంటేనే ఇంత హింస అవసరమా? తెలంగాణకు పంజాబ్‌తో ఏమి పోలిక? వస్తుందన్న తెలంగాణ రాకపోతే ఉసిర్లలెక్క ఉసురులు రాల్చుకున్న తెలంగాణలో 'బింద్రన్‌వాలా'లు ఎందుకు పుడుతరు ఐలన్న? పురాణంలో తలనరికిన వానికి ఏనుగుతల పెడితే వినాయకుడైనాడేమో గాని, చర్వితచరణ వర్తమానంలో బతికి ఉండగా బింద్రన్‌వాలా తలకాయ అంటిస్తమంటే మేము ఒప్పుకోము. ఐలమ్మలు పుట్టిన గడ్డన కొనసాగుతున్న బలిదానాల బిడ్డలతోనే తల్లడిల్లిపోతున్నం. అర్‌కీస్ అయినా ముందు ముందు ఒక్కడు చావొద్దు. 

ఇప్పుడు మీరు బాధపడుతున్నంత వింత స్థితి ఏమీ లేదు. ఎవరు కొందామన్నా అమ్మకానికి అంత అగ్గువకు, సగ్గువకు ఎవరు లేరు. రాజ్యం కోసం మొరిగే లైసెన్స్‌డ్ తుపాకితో 369 మందిని, సైలెన్స్ తుపాకితో వెయ్యిమందిని పోగొట్టుకున్న తెలంగాణ స్పష్టంగానే 2014కు పోకముందే కాంగ్రెస్ మెడలు వంచి మెడపై కత్తిపెట్టి తెలంగాణ తెచ్చుకుంటుంది. వస్తే ఇట్లాంటి తెలంగాణనే రావాలే అని గుది గుచ్చుకోకుండా వచ్చే తెలంగాణలో ఎట్ల మనోళ్లకు మంచి చెయ్యాలని సోంచాయించాలని ఐలన్నను కోరుతున్నాను. 

- డా.చెరుకు సుధాకర్
టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు
Andhra Jyothi News Paper Dated : 12/06/2012 

కుల నిర్మూలన ఎలా? - డా.డి.ఎల్.విద్య



రంగనాయకమ్మ 'అస్తవ్యస్త సంస్కర్తల'కు ప్రతిస్పందిస్తూ డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు 'విప్లవవాదులు ఎవరు మరి?' అని ప్రశ్నించారు. ఆయన తన వ్యాసంలో 'నిచ్చెన మెట్ల వ్యవస్థ'లో అగ్రకులాల వారు 'దోపిడీ చేసేవారు' అనీ, 'నిమ్న కులాల వారు' దోపిడీకి గురయ్యే శ్రామికులు అని, ఇండియాలోని వర్గాలని విశదీకరించారు. అగ్రకులాలు అనుకునే వారిలో కూడ ఆర్థికంగా బాగా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే అటువంటి వాళ్ళు నిమ్న కులాల వారిలోనే అధికంగా ఉన్నారన్నది వాస్తవం. కాబట్టి ఈ విభజనని పెద్దగా వ్యతిరేకించనవసరం లేదు. 

రెండు వర్గాల్ని గుర్తించినప్పుడు వర్గ పోరాటమే జరగాలి కదా. ఆ వర్గ పోరాటం ఎలా జరగాలన్న అవగాహనలో ఉన్నారు డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు? 'రిజర్వేషన్ల' వల్ల, 'వర్ణాంతర వివాహాల' వల్ల కులాలు పోతాయన్నది సత్యమే కాని పాక్షిక సత్యం; కొంతే పరిధి ఉన్న సత్యం. ఇది కాక, ఇంకా ఏదైనా సిద్ధాంతం కాని, పోరాట నిర్మాణాలు కాని దళిత ఉద్యమానికి ఉంటే రచయిత వివరించాలి వ్యాస పరంపరల ద్వారా. న్యాయ పోరాటాల గురించి తెలుసుకోవడం ఓ విజ్ఞాన సముపార్జన, ఓ ఆనందం. 

కుల నిర్మూలనకి మాకు తెలిసిన మార్గాలు మూడు. అవి: రిజర్వేషన్లు; కులాంతర వివాహాలు; దోపిడీ రహిత సమాజం. 'కుల నిర్మూలనే అంతిమ లక్ష్యం' అంటున్నారు రచయిత. 'దళిత సమస్య పరిష్కారానికి అంబేద్కర్ మాత్రమే సరిపోతారు, అందుకు ఎవరి సిద్ధాంతాల కోసమో ఎదురు చూసి అడుక్కోవలసిన స్థితిలో లేదా భావ దారిద్య్రంలో దళితులు లేరు' అని అన్నారు. అంటే 'మార్క్సిస్టు సిద్ధాంతం అవసరం లేదు' అనడమే కదా! లేదా 'ఇక దోపిడీ రహిత సమాజం, శ్రమ సంబంధాల్ని పూర్తిగా మార్చెయ్యడం ప్రస్తుత దశ కానప్పుడు దాని గురించి చర్చ చెయ్యడం అనవసరం' అంటున్నారు కాబట్టి రిజర్వేషన్లు, 'వర్ణాంతర వివాహాల' ద్వారా కుల నిర్మూలన చేసేసి, అప్పుడు దోపిడీ రహిత సమాజం వైపు దృష్టి పెడతారన్న మాట. 

నిచ్చెన మెట్ల కులాలే వర్గాలన్నారు! 'కుల నిర్మూలనే' దోపిడీ నిర్మూలన అవదా? 'కుల నిర్మూలన' తర్వాత మళ్ళీ తర్వాత దశలో 'దోపిడీ రహిత సమాజం' గురించి చర్చ ఎందుకు? 'రిజర్వేషన్లు', 'వర్ణాంతర వివాహాల' ద్వారా ఎంత వరకూ 'కుల నిర్మూలన' సాధ్యమవుతుందో చూడవలసివుంది. 'కుల నిర్మూలన'కి ఇంకా ఏవైనా ఇతర మార్గాలు ఉంటే వివరించమని రచయితకి మనవి చేసుకొంటున్నాను. 

'రిజర్వేషన్ల' మార్గాన్ని పరిశీలిద్దాం. దళిత సమస్య పరిష్కారానికి 'బుద్ధుడు చాలడు! అంబేద్కర్ చాలడు! మార్క్సు కావాలి' అన్న రంగనాయకమ్మ పుస్తకం చదివితే దళిత సమస్య పరిష్కారానికి రిజర్వేషన్ల పరిధి ఏమిటి? అన్న ఆలోచన వస్తుంది. రంగనాయకమ్మ బుద్ధుడు చాలడు! అన్నారు; పనికి రాడు అనలేదు. హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పే వరకే బుద్ధుడి పరిధి. 'అంబేద్కర్ చాలడు!' అన్నారు, అంబేద్కర్ పనికిరాడు అనలేదు. 'సమానత్వానికి ఎంతో దూరంగా, ఒక దుస్థితిలో ఉన్న వాళ్ళకి, రక్షణ కోసం ఏర్పాటు చేసేవి ఈ రిజర్వేషన్లనేవి. అంబేద్కర్ ప్రవేశ పెట్టిన రిజర్వేషన్ల పద్ధతి దళిత-బహుజనులకి మహా ఉపకారం చేసింది. 

అది విస్మరించ లేని సత్యం. అదొక మైలురాయి. ఒక్క మైలురాయి దగ్గరే ఆగిపోతే గమ్యం చేరలేరు. దానికి తాత్కాలికమైన కొంత పరిధి మాత్రమే ఉంది. దళిత సమస్యని పరిష్కరించడానికి అది సంపూర్ణమైన పద్ధతి కాదు. రిజర్వేషన్లని ఇంకా విస్తృత పరిచేందుకు ఇంకో రెండు సంస్కరణలు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగాలకే పరిమితమై ఉన్న రిజర్వేషన్ విధానాన్ని 'ప్రైవేటు రంగాలకి కూడా విస్తరిస్తే దళిత-బహుజనులకి చదువుల్లో , పదవుల్లో , ఉపాధుల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. రెండో సంస్కరణ-ఒకసారో, రెండు సార్లో రిజర్వేషన్లని ఉపయోగించుకొని ఉన్నత స్థాయిని సాధించిన వారిని, ఇక తర్వాత రిజర్వేషన్లకి అనర్హుల్ని చెయ్యడం. 

ఆ అవకాశాలు ఎప్పుడూ రిజర్వేషన్ల సదుపాయాన్ని పొందని దళిత-బహుజనుల దరికి వస్తాయి. ఈ రెండు సంస్కరణల ద్వారా ఎక్కువ మంది 'దళిత బహుజనులు' విద్యావంతులు, ఉద్యోగస్తులూ, సాంఘిక స్థాయిని పెంచుకున్న వాళ్ళూ అవుతారు. 'దళిత -బహుజనులు' మొత్తం అందరూ ఆ స్థాయిని చేరుకోవడానికి ఈ 'బూర్జువా ఆర్థిక వ్యవస్థ' అడ్డుగా నిలుస్తుంది. ఉన్న ఉపాధులే తగ్గి పోతూ ఉంటే, రిజర్వేషన్ సంస్కరణలు దళిత -బహుజను లందరికీ ఉపాధులు కల్పించలేవు. అప్పుడు 'దళిత -బహుజనుల'లో కూడా సాంఘికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవర్గం, అధమంగా ఉన్న వర్గం అని రెండు వర్గాలు ఏర్పడక తప్పదు. 

వర్ణాంతర వివాహాల విషయాన్ని చూద్దాం. రిజర్వేషన్ల వల్ల ఆర్థికంగా, సాంఘికంగా ఉన్నతి సాధించిన దళిత-బహుజనులకు, ఆర్థికంగా, సాంఘికంగా ఉన్నతంగా ఉన్న అగ్రకులాల వారి కి మధ్య వర్ణాంతర వివాహాలు సాధ్యమవుతాయి. ఆర్థికంగా సాంఘికంగా తక్కువ స్థాయిలో ఉన్న అగ్రకులాలు, అలాగే ఆర్థికంగా సాంఘికంగా తక్కువగా ఉన్న దళిత-బహుజన కులాల మధ్య కూడా అక్కడక్కడ వర్ణాంతర వివాహాలు జరగవచ్చు. పురాణ కాలాల్లోనే వర్ణాంతర వివాహాల దాఖలాలు ఉన్నాయి. 

ఉదాహరణకి 'వశిష్ఠుడు-అరుంధతి'. అక్కడక్కడా అడపాదడపా వర్ణాంతర వివాహాలు జరగడంతోటే కులాలు పోయి, 'కుల నిర్మూలన' జరిగే లాగుంటే వశిష్ఠుడి కాలానికి కుల నిర్మూలన జరిగిపోవాలి కదా! యవ్వన మోహంలో కులాన్ని కాదని ఎవరో అక్కడక్కడ వర్ణాంతర వివాహాలు చేసుకోవడం కుల నిర్మూలనికి ఉపయోగ పడదు. ఆ వివాహాలు లెక్కకు మించి ఎక్కువ సంఖ్యలో జరిగితేనే 'కుల నిర్మూలన' జరుగుతుంది. అలా జరగాలంటే కులాన్ని ధిక్కరించగలిగే హేతు వాద జ్ఞానం కావాలి. 

అది, సాంకేతిక విజ్ఞానంతో పాటు సమాజ జ్ఞానాన్ని కూడా అందించగలిగే సమగ్ర విద్యా విధాన ం వల్లే సాధ్యం. అంటే అందరికీ మంచి చదువులు ఉండాలి. చదువులు ఉండాలంటే డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే అందరికీ ఉపాధులుండాలి. అందరికీ ఉపా ధి కల్పించే పూచీ ప్రస్తుత వ్యవస్థ, ఆ వ్యవస్థకి ప్రాతినిధ్యం వహిం చే ప్రభుత్వం పడగలవా? అలాంటి పూచీలేని రాజకీయ విధానంతో విస్తృతంగా వర్ణాంతర వివాహాలు ఎలా జరుగుతాయి? 

'కుల నిర్మూలన' ఎలా జరుగుతుంది? సాంఘికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారిలోనయినా, అలా లేనివారిలో నయి నా, వర్ణాంతర వివాహాలు జరగాలంటే కులాలని పాటించని, హేతువాద సంస్కరణ దృష్టి లేక పోతే ప్రేమలూ కలగవు, పెళ్ళి ళ్ళూ జరగవు. అవి ఎక్కువగా జరిగి కుల నిర్మూలన జరగాలంటే ముందు జరగవలసింది దోపిడీ నిర్మూలన (దోపిడీ రహిత సమాజ స్థాపన). రిజర్వేషన్లు చేస్తున్న పని దళిత-బహుజనుల్లో కొందరికి 'క్లాస్'ని మార్చడం. 'క్లాస్' ఒకటయినప్పుడు, కొన్ని వర్ణాంతర వివాహాలు జరుగుతున్నాయి. రంగనాయకమ్మ అడిగేది అదే. రిజర్వేషన్ల కోసం మీరు మీ చిన్న కులాలనే ఉంచుకోదలుచుకున్నారా? లేక 'కుల నిర్మూలన' కోరుకుంటున్నారా? అని. 'కుల నిర్మూలననే' కోరుకుంటే మార్క్సిజాన్ని కోరుకోండి అని.

డాక్టర్ వెంకటేశ్వర్లు చెబుతున్న 'నూతన ప్రజాస్వామిక సంబంధాల'గురించి చూద్దాం. 'సమస్త అగ్రకుల ఆధిపత్య రంగాలను క్రింద కులాల వారికి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 'నూతన ప్రజాస్వామిక శ్రమ సంబంధాలని అమలులోకి తీసుకురావడం' వారి పోరాటా ల ద్వారా జరుగుతుందని అంటున్నారు. అవును, గట్టి పోరాటాల ద్వారా కొందరు 'దళిత-బహుజనులకి' మాత్రం అగ్రకుల ఆధిపత్య రంగాలు అందుబాటులోకి రావొచ్చు. తర్వాత వాక్యంలోనే ఇంకా ఏమంటారంటే 'ఇతర అన్ని అవకాశాల్లో వారి జనాభా ప్రకారం అగ్రకులాలకు రిజర్వేషన్లు కల్పించడం'. 

ఇప్పుడు దళిత-బహుజనులకు' రిజరేష్వన్లు ఎందుకు అవసరమయ్యాయి? ముందే చెప్పుకున్నట్టు వాళ్ళు సమానత్వానికి చాలా దూరంగా, ఒక దుస్థితిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం'. ఈ రిజర్వేషన్లు ఎలా వచ్చేయి? వాళ్ళు చేసిన పోరాటాల వల్లే వచ్చాయి. ఎవ్వరూ హృదయం ద్రవించిపోయి వారికి సాయం చెయ్యలేదు. సరి కదా అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ రిజరేష్వన్లలో కూడా సమానత్వం రాలే దు. సమానత్వం సుదూరంలోనే ఉండి, ఇంకా పోరాటాల్ని ఆహ్వానిస్తోంది. 'దళిత-బహుజనులు' ఈ పోరాటాల తర్వాత ఏం చేస్తారు? 'అగ్రకులాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తారట'. 

అంటే ఇప్పటి అగ్రకులాల వాళ్ళు, కొన్నాళ్ళకి నిమ్న కులాల వాళ్ళు, అంటే ఈనాటి అగ్రకులాల వాళ్ళ రిజర్వేషన్ల కోసం కొన్ని శతాబ్దాలు పోరాటాలు చేస్తే, వాళ్లకి రిజర్వేషన్లు కల్పిస్తారన్న మాట. పరిస్థితులు తారుమారు అవడమా నూతన ప్రజాస్వామిక సంబంధాలు అంటే ? 'నూతన ప్రజాస్వామిక సంబంధాలు' అంటే- 'ఇక దోపిడీరహిత సమాజం, శ్రమ సంబంధాలని పూర్తిగా మార్చెయ్యడం. ప్రస్తుత దశ కానప్పుడు, దాని గురించి చర్చ చెయ్యడం అనవసరం' అని వ్యాసకర్త అన్నారు. ఈ రకంగా దళితోద్యమం జరిగితే ప్రస్తుత చర్చగా కాదు కదా, ఎన్ని యుగాలయినా 'దోపిడీ రహిత సమాజం' సిద్ధించడం కాదు సరికదా చర్చగా కూడా రాదు. 'కుల నిర్మూలనా' జరగదు. 

సమాజానికి సహజ అవసరాలయిన శ్రమల్ని చేయని పెట్టుబడిదారులూ, ఇప్పుడు శ్రమ చేద్దామన్నా ఉపాధి దొరకని నిరుద్యోగులు, ముష్టి వాళ్ళూ, వేశ్యలూ, బైరాగులూ, బాబాలూ, ఖైదీలు, రౌడీల వగైరాలంతా పనిలోకి రావడంతో 'పెట్టుబడిదారుడు- వేతన బానిస' అన్న సంబంధం పోవడాన్ని 'శ్రమ -సంబంధాలలో మార్పు' అంటారు. అందరూ (ఒక్కరికి కూడా మినహాయింపు లేకుండా) ఉన్న త విద్యలు అభ్యసించి, అందరూ అన్నిరకాల శ్రమల్నీ చెయ్యడాన్ని 'కమ్యూనిస్టు శ్రమ విభజన' అంటారు. అప్పుడు వర్గ నిర్మూలనతో వారి కుల నిర్మూలన 'కూడా జరుగుతుంది. దోపిడీరహిత సమాజ ఆవిర్భావం జరిగిన కొద్ది వ్యవధిలోనే 'కుల రహిత సమాజం' ఏర్పడ్డానికి కావలసిన పునాదిని ఏర్పరచుకోవడానికి ఇప్పుడు పోరాటాలు జరగాలి. 

రంగనాయకమ్మ గారు ఇతర పుస్తకాల్లో అన్నట్టు, కమ్యూనిస్టు, కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు దేశం, కమ్యూనిస్టు సిద్ధాంతం ఒకటి కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని మనసా, వాచా, కర్మణా అమలు జరిపే వాడు కమ్యూనిస్టు . శాస్త్రి, శర్మ, చౌదరి, రెడ్డి అని కుల భేదాల్ని కాని, మతభేదాల్ని కాని ఇష్టపడే వాడెవ్వడూ, అనుష్ఠించే వాడెవ్వడూ కమ్యూనిస్టు కాదు. అలాంటి కమ్యూనిస్టులే (కమ్యూనిస్టులు కాని కమ్యూనిస్టులు) దళిత-బహుజనులపై ఆధిపత్యం చెలాయించే వాళ్ళయితే, వాళ్ళ నుంచి విడిపోయి, నిజమైన కమ్యూనిస్టు దృక్పథంతో ఓ పార్టీ పెట్టుకుని ఉద్యమం సాగించాలి. 

'దళిత ఉద్యమం' నుంచి కమ్యూనిజాన్ని తీసి పారేస్తే 'దళిత ఉద్యమం'నిస్త్రాణమై పోతుంది. 'దళిత ఉద్యమాని' కే కాదు, సమానత్వం కోసం చేసే ఏ ఉద్యమానికైనా కమ్యూనిస్టు సిద్ధాంతమే వెన్నెముక. మార్క్స్‌ని అంగీకరించడం అంటే అంబేద్కర్‌ని అవమానించడం అవదు. అది అంబేద్కర్ పరిధిని అంగీకరించడం, ఆయన చేసిన కృషిని, చేకూర్చిన ప్రయోజనాల్నీ స్వీకరించడమే. కుల నిర్మూలన వైపు చిత్తశుద్ధితో నిజమైన ప్రయాణం సాగించడమే అవుతుంది. ఎప్పటికైనా అది ఆ గమ్యానికి చేరుస్తుంది. 

అరిస్టాటిల్ గొప్పవాడే . అప్పటికి ఉన్న సకల శాస్త్రాలలోనూ నిష్ణాతుడు. అరిస్టాటిల్ పరిధిని అంగీకరించక , ఆయన్ని మించి ఆలోచించడం తప్పు అనుకున్న కాలం అంతా చరిత్రలో 'అంధయుగం'గా మిగిలింది. అంబేద్కర్ గొప్పదనానికైనా అదే పరిమితి. అరిస్టాటిల్ కాలం తర్వాత అంధయుగాన్ని చెరిపివేసినా చరిత్రలో అరి స్టాటిల్ పాత్ర చెక్కుచెదర లేదు. అంబేద్కర్ పరిమితిని అంగీకరించినంత మాత్రాన చరిత్రలో అంబేద్కర్ పాత్ర చెక్కు చెదరదు. 

- డా.డి.ఎల్.విద్య
Andhra Jyothi News Paper Dated : 12/06/2012 

Monday, October 10, 2011

ఈ కులాలు తెలుసా ? By Vakulabharanam Krishna Mohan Rao Surya News Paper 11/10/2011


ఈ కులాలు తెలుసా ?
అరవైనాలుగేళ్ళ స్వాతంత్య్రానంతరం కూడా మన ప్రజాస్వామ్య దేశంలో అసమానతలను, వివక్షను, అణిచివేతను మట్టు పెట్టలేకపోయాం. పలు మానవ సమూహాలను మన సమాజంలోని నాగరిక జీవన వ్యవస్థలోకి ఇంకా తీసుకు రాలేకపోయాం. దేశంలో అవినీతిపై ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ప్రాంతాల వెనుకబాటుతనంతో అన్యాయాలకు గురైన ప్రాంతాలలో ‘ప్రత్యేక రాష్ర్ట విభజన వాదా లు’ పెల్లుబుకుతున్నా యి. చిన్న కులాల ప్రజలు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురి కావడంతో అత్యంత పేదలుగా దారిద్య్రరేఖకు దిగువన చేరిపోయారు. కులాల మధ్య అంతరాలు పెరిగాయి. కులం పునాదుల మీద రాజకీయ వ్యవస్థ రాజ్యమేలుతున్నది. జన బాహుళ్యంలేని కులాలు డబ్బు, రాజకీయాధికారాన్ని చేజిక్కించుకుని తర తరాలుగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.

ఇలాంటప్పుడు సమ సమాజం ఎలా ఏర్పడుతుంది? సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు- ఎలా సాధ్యపడుతుంది? జనాధిక్యత కలిగిన బలహీన వర్గాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందకుండా దేశం సంపన్న అగ్రరాజ్యం ఎలా అవుతుంది? మహాత్మా జ్యోతిబా ఫూలే, డా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ కన్న కలలు ఎలా సాకారం అవుతాయి?ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని మన రాష్ర్టంలోని పలు బీసీ కులాల వాస్తవ జీవన స్థితి గతులను సమాజం ముందుంచి చర్చనీయాంశం చేసి ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు గైకొనవలసి ఉన్నది.

రాష్ర్టంలో బీసీ కులాలలో- బాలసంతు, బహురూపి, బందర, బుడబుక్కల, దొమ్మర, గంగిరెడ్లవారు, జంగం, జోగి, కాపటిపాపల, కొర్చ, మొండివారు, మొండిబండ, బండ, పిచ్చకుంట్ల, వంశరాజ్‌, పాముల, పార్థి, నీర్‌షికారి, పంబాల, దమ్మలి, పెద్దమ్మలవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలవాండ్లు, వీరముష్టి, నెత్తికోటల, వీరభద్రీయ, గుడల, కంజరబట్ట, రెడ్డిక, మొండిబట్ట, నొక్కర్‌, పరికిముగ్గుల, యాత, చొపమెరి, కైకాడి, మందుల, మేథర్‌, కూనపులి, పొందర, పట్రా, కురాకుల, పొందర, సిక్లిగర్‌, పూసల, కెవ్వుట్లు, గుడియా, జక్కల వంటి మరెన్నో కులాలు. అసలు ఎప్పుడైనా ఈ కులాల పేర్లు విన్నారా? ఇవి బీసీ కులాలని, వీరు మన రాష్ర్టంలోనే ఉన్నారని ఎందరికి తెలుసు? ఈ మానవ సమూహాలు మన నాగరిక వ్యవస్థలోనే ఉన్నాయా? అనే అనుమానం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
అనంతరామన్‌ అధ్వర్యంలో మొట్ట మొదటి బీసీ కమిషన్‌ 1970లో ఈ కులాలను సంచార, విముక్తి జాతులుగా గుర్తించి బీసీ కులాల జాబితాలోని ఎ గ్రూపులో చేర్చింది. వీరి అభి వృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి జన జీవన స్రవంతిలో తగిన గుర్తింపు తేవాలని సూచించింది. అ యితే 64 ఏళ్ళ స్వతంత్ర భారతంలో వీరి గురించి పరిశీలించడం మొదలుపెడితే, ఇవి జాడ తెలియని కులాలుగా నేటికీ సంచార జాతులుగానే మిగిలిపోవడం హృదయ విదారకరమైన అక్షరసత్యం.

బాల సంతు, బహురూపి కులస్థులు గ్రామీణ ప్రాంతాలలో బహురూప కళల ద్వారా ప్రజలకు వినోదాన్ని కలిగిస్తూ, భిక్షాటనే ఆధారంగా జీవించేవారు. కావడికి జోలె వేసుకొని గంట ఊపుతూ సూర్యోదయానికి ముందే గ్రామ ప్రజల్ని నిద్రలేపేవారు. ఆ పద్ధతిలో గంటను ఊపడం వీరి ప్రత్యేకత. స్థిర నివాసం లేకుండా సంచార జీవితం గడుపుతూ బతుకులీడ్చేవారు. కాల క్రమంలో వీరి వృత్తి కనుమరుగైపోయింది. వీరు నేడు ఏ విధంగా బతుకుతున్నారో తెలియదు. వీరు ప్రధానంగా తెలంగాణ జిల్లాలకే పరిమితమై ఉండేవారు.
దొమ్మర కులస్థుల దొమ్మరి విద్యలు, ఒలింపిక్స్‌ ఆటలతో పోటీపడతాయి. వీరు పందుల పెంపకం చేపట్టేవారు. కాలక్రమంలో జీవనాధారం లేక పలువురు పడుపు వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చింది. చట్టం దృష్టిలో నేర ప్రవృత్తి అయిన వీరి వ్యాపకం దినదినగండం అవడంతో ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో తెలియదు. గంగిరెడ్లవారి గురించి అందరికీ తెలుసు - కాని నేడు వారి జీవితాల గురించి ఎవరికీ తెలియదు. జంగం, జోగి కులాలు భక్తి ఉద్యమాల కాలంలో ఏర్పడ్డాయి. శైవమత ప్రచారం కోసం జీవితాలను అంకితంచేసి విస్తృతంగా పర్యటించారు.

కాల క్రమములో భిక్షగాళ్ళుగా మారిపోవాల్సి వచ్చింది. ప్రధానంగా కడప జిల్లాలో భిక్షాటన చేస్తూ, సంచార జీవులుగా బతికిన ‘బందర’ కులస్థులకు దొంగలుగా ముద్రవేశారు. దాంతో వారు సమాజంలో కలసి పోలేక పోయారు. బుడబుక్కల కులస్థు లు సంచార జీవితంలో యాచక వృత్తే ప్రధానాధారంగా జీవిం చారు. కాటిపాపల వాళ్ళు కూడా శవదహన క్రియలు చేపట్టే వృత్తి నుండి దూరం అయ్యారు. సమాజంలో ప్రస్తుతం వీరి జాడ కనిపించడం లేదు. పూసల వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో సామాన్యులకు అందుబాటులో ఉండే చవకధరల దువ్వెనలు, కొప్పుపిన్నులు, అద్దాలు మొదలైనవి అమ్మి జీవించేవారు. జక్కుల వాళ్ళు సర్కారు జిల్లాలకు పరిమితమైన జక్కలవారు. జనాధిక్యత లేని సామాజిక వర్గం ఇది. వీరి పూర్వీకులు భాగవతం తదితర ఇతిహాసాలపై కథలు చెపుతూ బ్రతికేవారు. క్రమంలో జనాదరణ తగ్గడంతో బతుకుదెరువు కోసం పడుపు వృత్తిలోకి దిగి జీవితాలను బలిపెట్టుకున్నారు.

ప్రపంచీకరణలో ఇలా ఎన్నో కులాలు నిర్వీర్యమయ్యాయి. వృత్తి కులాలు, శ్రామిక కులాలు అవకాశాలు లేక చేయూతనిచ్చేవారు కరువై, నిర్వీర్యమై అభివృద్ధి సాధించలేక ప్రత్యామ్నాయ జీవనోపాధి దొరకక పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయారు. ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో దారిద్య్ర రేఖకు దిగువన జీవించే ప్రజలుగానే వీరు కొనసాగుతున్నారు. ఒకనాటి వృత్తులు, వృత్తి ధర్మాలు నేడు అక్కరకు రాకుండా పోయాయి. అయినా మనుషులు బతకాలి కదా! పారిశ్రామికీకరణతో నూతన వ్యాపార ఉత్పత్తులతో కోట్లాది మంది జీవనాధారం కోల్పోయారు.పారిశ్రామికీకరణతో అభివృద్ధి సూచిలను ఘనంగా ప్రకటించుకుంటున్నారు. కాని వాటివల్ల కోట్లాది ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిన సూచికలు ప్రకటించరెందుకు? ఎవరు, ఏఏ వృత్తులు కోల్పోయారో ఎలా బ్రతుకున్నారో తెలియకుండా వారి అభివృద్ధికి ప్రణాళిక వేయడం ఎలా సాధ్యం? అందువలన ఈ పేదకులాల జీవన స్థితుగతుల గురించి, వారిని అభివృద్ధి పథంలోకి, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రత్యేక కృషి ఎలా చేయాలో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాలు తమ పరిశోధనలను ఈ రంగాలకు విస్తరించకపోతే అవి ఎందుకు, ఎవరి కోసం ఉన్నట్టు? పరిశోధనల పేరిట ఏం చేస్తున్నట్టు? సామాజిక, ఆర్థిక, చరిత్ర, మానవ పరివర్తన శాస్త్ర విభాగాల ద్వారా విస్తృతంగా అధ్యయనాలు నెరపి, విశ్వవిద్యాలయాలు పరిష్కార ాలు సూచించాల్సి ఉంది.

sithaaram
అన్నింటికన్నా మించి జాతీయ ప్రణాళికా సంఘం ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్య మూలాల్లోకి వెళ్లి, అధ్యయనాలు చేయించి, ఆ దిశగా నిధులు కేటాయించి, చర్యలు చేపట్టాలి. అలాగే ఆయా కుల సంఘాల నాయకత్వం ఎదిగి, తమ కులస్థుల జీవితాలు ఎలా బాగుపడుతాయో క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారాలకై ప్రభుత్వాలకు నివేదించాల్సి ఉంది.42 ఏళ్ళుగా రాష్ర్టంలో విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, ఈ కులాలు మరీ వెనుకబడి, జాడ తెలియకుండా కనుమరుగవడం, ఉనికిని కోల్పోయే పరిస్థితులు నెలకొనడం దిగ్భ్రాంతికరం. ఆధునిక సమాజం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా దూసుకువెళుతున్న ప్రస్తుత తరుణంలో మరింత బాధ్యతాయుతంగా వీరి అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సి ఉంది.


రచయిత కేంద్ర సామాజిక, న్యాయ పరిశోధన సలహా సంఘం సభ్యుడు