Showing posts with label Laxmipeta atrocity on Dalits. Show all posts
Showing posts with label Laxmipeta atrocity on Dalits. Show all posts

Monday, June 17, 2013

తెగిపడిన తలలే.. నూటొక్క గొంతులై..! --- డా.జి.కె.డి.ప్రసాద్-


June 17, 2013
లక్ష్మింపేట దురంతం మీద దళిత అక్షరం పదును దేలింది. కవిత్వం ఉప్పెనలాంటి అభివ్యక్తితో ప్రవహించింది.. దళిత ఉద్యమ గమనానికి కొత్త ప్రశ్నలు సంధిస్తోంది..
దళితుల సామాజిక, ఆర్థిక విముక్తి పోరాటాల్లో మరో నెత్తుటి పుటగా లక్ష్మింపేట నమోదయింది. 12 జూన్ 2012 తెల్లవారే ఇక్కడి దళితుల మీద మారణకాండ జరిగింది.. హత్యకు గురయిన ఐదుగురి మృతుల కనుగుడ్లను హంతకులు చిదిమేయడాన్ని గమనిస్తే ఈ హత్యల వెనుక ఎంతటి విద్వేషం విలయతాండవం చేసిందో కళ్లున్న వారంతా గ్రహించగలరు. 'సర్వేంద్రియానాం నయనమ్ ప్రధానం' ఆర్యోక్తి నరరూప రాక్షసుల ఆధిపత్య క్రీడలో దుర్మార్గానికి ఉపకరించింది. ఈ నేపథ్యంలో మనువాదీ! నీ నికృష్ఠ నినాదం మా బతుకు బండిని ఛిద్రం చేస్తూనే వుందని 'తెగిపడిన చోట తెగబడటమే' నన్నారు దళిత కవులు. మా అక్షరాలు మానస సరోవరంలో హంసలు కాదు- చీకట్లను చీల్చే వెలుగుతారలని గొంతెత్తారు. తూరుపు కాపులు దళితుల్ని వధించడానికి వినియోగించిన 'కొంగుల్లో కారం, కత్తులు, వేటకొడవళ్ళు, బరిశెలు, నాటు బాంబులు, శూలాలు' వీటినే దళిత కవులు ప్రతీకలుగా తీసుకున్నారు.

ఈ అమానుష ఆటవిక దాడిలో 'ఆడవాళ్ళు కళ్ళల్లో కారం కొడుతుంటే.. మగవాళ్ళు కనుగుడ్లు బరిసెలతో పొడుచుకుంటూ.. కత్తులతో భుజాలు తెంచుకుంటూ.. గొడ్డళ్ళతో చేతులు నరుక్కుంటూ.. వెన్నెముకల మీద బండలతో మోదుకుంటూ మూగవాళ్ళను విగత జీవుల్ని చేసిన ఘట్టాన్నే' కవులు నరహంతక భావచిత్రంగా గీశారు. కుల క్రోధం కోరలు చాపి వికటాట్టహాసం చేస్తుంటే హాహాకారాల నడుమ దళిత గుడిసెలు దద్దరిల్లిపోయిన సన్నివేశాన్ని భీతావహ శిల్పంగా చెక్కా రు. గుండెలు అదిరిపోయి పిల్లామేక చెదిరిపోయి; కాకులు కలవరపడి; చూరుల్లో గబ్బిలాలు కీచులాడి; ఎలుకలు, పిల్లులు ఏకమై పరుగులు తీసి; ఈ మృత్యుహేల చుట్టూ రాబందులు రెక్కల చప్పుడు చేసిన సన్నివేశాన్ని కక్ష శిలల మీద ధిక్కారవర్ణ చిత్రం వేశారు. అంతకుమించి ఎలాంటి అలంకార ప్రాసక్రీడలు కావాలి ఈ కవిత్వానికి? దీనిలో శబ్ద సౌందర్యానికి, భావ సౌందర్యానికి బదులు నెత్తురే వస్తువయింది. ఆత్మాభిమానమే అలంకారంగా, శోకమే ఛందస్సుగా, నరమేధమే శిల్పంగా, 'అగ్ర'త్వమే యతిస్థానంగా బూడిదయిన బతుకుల మీద భూమిపుత్రుల ఆర్తనాదమే కవిత్వంగా రూపుదాల్చింది.

'కూలికెళ్ళేటోళ్ళకి, పాలేరోతికి భూమి ఏంతురోయ్' అన్న తూరుపుకాపుల నోటిమాటే దళితుల్ని ఆత్మాభిమాన పోరాటానికి పురిగొల్పింది. దళితులు రెండు, మూడేళ్ళుగా రాజ్యాంగబద్దంగా రాళ్ళను రప్పలను చదును చేసుకుంటూ నాలుగు గింజలు పండించుకుంటున్నారు. కాపు కాసిన శత్రువు దళితుల రక్తం కళ్ళ చూడటానికి కంకణం కట్టుకున్నాడు. ఇక్కడే వాళ్ళను ఒక విద్వేష వచనం ప్రేరేపించింది. 'మాలోల్లు మన పక్కలో భూమితున్నమేంతి రా! మనం కాపులోల్లకి పుత్తలేదేంతి' అంటూ విద్వేషాన్ని ఎల్లగక్కారు. దేశవ్యాప్తంగా జరిగిన దళిత హత్యలన్నీ ఆధిపత్య కులాల క్రౌర్యం నుంచి, అధికార మదం, ఆర్థిక దోపిడీల నుంచి జరిగితే లక్ష్మింపేట దుర్ఘటన ఓ ప్రత్యేకతని చాటుకుంది. మారణహోమం సృష్టించినవాడు గంజి లో ఉప్పేసుకొని తాగేవాడు. బలైనవాడు గింజి తాగేవాడు. ఇక్కడ వర్గ మెక్కడిది.. ఇద్దరూ పేదలే. సరిగ్గా అదే సమయానికి ఇక్కడ తూరుపుకాపుని మనువు ఆవరించి అంటరానివాడి మీద ఆధిపత్య సాంప్రదాయాన్ని గుర్తుచేశాడు. ఈ దేశ చరిత్ర నరనరాల్లో జీర్ణించుకుపోయిన స్మృతిగతుల్ని ఆవిష్కరించాడు. దళిత చైతన్యం ఎప్పుడైనా ఎక్కడైనా నాలుగు మెతుకులు సాధించే దిశగా పయనిస్తున్నప్పుడు అలికిడికి తెలియకుండా ఎలా ఆవహించాలో నేర్పించాడు. లక్ష్మింపేట మీద 'నిఘా' తర్ఫీదు నిచ్చాడు.


భూమి కోసం.. భుక్తి కోసం.. తరతరాల అంటరానితనం విముక్తి కోసం లక్ష్మింపేట దళితులు సమిధలయ్యారు. ఆత్మాభిమానంతో రగిలిపోయిన వీరి రక్తం ఆ మట్టిలోనే ఇంకిపోయింది. ఆ కుటుంబాల కన్నీటిఘోష అక్కడి గాల్లోనే కలిసిపోయింది. దళితుల మాన, ప్రాణాలను కాపాడుకోవడానికి కొన ఊపిరిలో కూడా కొదమసింహమై కోత కొడవలితో యుద్ధం చేసిన మహావీరుడు.. మా మాల కన్నమదాసు 'బురడా సుందరరావు' నేలకొరిగాడు. కనుగుడ్డు వేలాడుతున్నా వెనక్కి తగ్గని 'నివర్తి వెంకటి' నింగి కెగిశాడు. బాంబుల దాడి నుంచి తప్పించుకొని బళ్ళాలకు, బరిశెలకు బలై నలభై కత్తిపోట్లతో సంగమేసు కుప్పకూలాడు. గొడ్డలివేటుకి చిత్తిరి అప్పడు, శూలాలపోట్లకి బొద్దూరి పాపయ్య ప్రాణాలు విడిచారు. మరో ఇరవై ముగ్గురు మూగవాళ్ళు క్షతగాత్రులయ్యారు. ఈ వార్త నలుగురికీ తెలిసేసరికి దుండగులు పలాయనం చిత్తగించారు. ప్రజాసంఘాలు చేరుకొని న్యాయపోరాటాన్ని నిర్మించాయి. దీంతో రాజకీయం రాట్నం తిప్పడం మొదలెట్టింది.

లక్ష్మింపేట దురంతం మీద జరిగిన చర్చోపచర్చలు, వాద వివాదాలు, అనేక అభిప్రాయాలు, పరిష్కారాలు, పరిహారాల నేపథ్యంలో.. దళిత అక్షరం పదును దేలింది. నలు మూలల అక్షర సైనికులు కలాలను చేతబూనారు. కవిత్వం ఉప్పెనలాంటి అభివ్యక్తితో తెగిపడిన తలలే నూటొక్క గొంతులై ప్రవహించాయి. తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ సంకలనం తీసుకురావడానికి పూనుకున్నారు. ఒంగోలు 'సాహితి-అధ్యయన' వేదిక దానిని ప్రచురించింది. 'తెగిపడినచోట తెగబడటమే' సంకలనంలో దళిత ఉద్యమ గమనానికి సంబంధించిన కొత్త ప్రశ్నలు, పాతప్రశ్నలకు సమాధానాలు వున్నాయి. ఈ సంకలనంలో 'ఇప్పుడు నిజంగా పిడికిళ్ళు బిగించకపోతే మణికట్టులు నరికేసే కాలం' నడుస్తుందన్నాడు నూకతోటి రవికుమార్. తాగునీటి చెరువులో పశువుల్ని కడక్కూడదనే ఇంగిత జ్ఞానాన్ని గుర్తు చేసినందుకు కారంచేడు, చివరికి న్యాయబద్ధంగా నాలుగు అడుగుల నేలను సాగు చేసుకుంటుంటే లక్ష్మింపేట రణరంగమయ్యాయి. అందుకే గోపీనాథ్ 'అగ్రవర్ణం రంగు మార్చింది.. రక్తపు మడుగులో అంటరానితనం వెలుగు చూసింది' అన్నారు. బ్రాహ్మణుల కన్నా బ్రాహ్మణవాదం ప్రమాదకరమని, శూద్ర దోపిడీ కులాల బ్రాహ్మణవాదం అంతకన్నా ప్రమాదకరమనే ప్రశ్న తెరమీదికి వచ్చింది.|

'ప్రతి చరణమూ మరణమేనా! ఎవడు కట్టాడ్రా ఈ పాటని?' సతీష్‌చందర్ 'భూగర్భశోకం' నుంచి సమూల సామాజిక పరివర్తనతో వేసిన మరో కొత్తప్రశ్న ఇది. ఇటువంటి పాశవిక ఘటనలు పునరావృతం కాకుండా ఈ కుసంస్కృతిని తగలెట్టమన్నాడు కవి. దళితుల్ని మనుషులుగా జీవించనిచ్చే ఒక్క ఊరు కూడా ఈ దేశంలో లేదని ఎండ్లూరి సుధాకర్ దేశవిభజనకు దారితీసేటంతటి ప్రశ్న సంధించాడు. దళితుల సంఘీభావంతోనే వెనుకబడిన కులాలు ఈ దేశంలో 'మండల్ కమిషన్' ద్వారా రిజర్వేషన్లు సాధించాయి. వెనువెంటనే అండగా నిలిచిన దళితుల మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి హత్యల దుర్నీతిని అలవర్చుకున్నాయి. ఉత్తరాదిలో బ్రాహ్మణులు కాకుండా బ్రాహ్మణవాదులయిన బీసీలు చేస్తున్న హత్యల గణాంకాలే ఇందుకు సాక్ష్యం. ఇప్పు డు ఆ ప్రభావం తమిళనాడుని దాటుకొని ఉత్తరాంధ్ర వరకు పాకింది. ఆనాడు ఏ హిందూవాదమయితే బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించి బీభత్సాన్ని సృష్టించిందో అదే రథమెక్కి గెంతులేస్తున్న వారిని ఏమనాలి? 'ఇది మండల రథమెక్కి పాడుతున్న కమండల గీతం' -మనోఫలకాల మీద మనుధర్మాన్ని ముద్రించుకున్నోళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవలసి వుంటుంది. కత్తి పద్మారావు చారిత్రక కోణాన్ని 'నెత్తుటి ప్రశ్న'గా మాట్లాడారు. 'హతుడు వీరుడే కాదు, చరిత్ర సృష్టికర్త కూడా' అన్నారు. గతకాలంలో జరిగిన అత్యాచారాల చరిత్రను మరొక్కసారి పునరావృతం చేసిన ఈ ఘటనలో మూలాల్ని శోధించమన్నారు. కుల వివక్ష సమాజాన్ని 'పంచనామా' చేసిన పైడి తెరేష్‌బాబు ధిక్కార స్వరాన్ని వినిపించారు.

'ఓయీ ఓరి ఓసీ బీసీ/రక్తము రెండు విధములు../మీకు కావలసినది రక్తము అయినచో/మా స్త్రీల రుతుస్రావరక్తాన్ని మీ ముంగిట దిమ్మరించెదము/సలసల కాగు రక్తము మా సొంతము కదా' అని అస్తిత్వ భావప్రకటన చేశారు. 'అంటు దోషము మానరెలా?' అన్న కుసుమ ధర్మన్న సూటిప్రశ్న నుంచి నేటి వరకు అంటరానివారికి సమాధానమే దొరకలేదు. వెతుక్కోమన్నారు. వెతుక్కుంటూనే వున్నారు. మనిషిగా గుర్తింపు కోసం ఇంతకాలం వివక్షను ఎదుర్కొన్న జాతి ప్రపంచపటంలో ఎక్కడా కనిపించదు కదా! దళితజాతి తప్ప.
రావినూతల ప్రేమకిషోర్ 'లక్ష్మింపేట సాక్షిగా' చెప్పిన మాట సామ్యవాదంలోనూ కొరవడిన సామాజికతను గుర్తుచేస్తుంది. 'ప్రభుత్వం అందరిదీ అంటే/సర్కారు భూమి మాది కూడా..' అని మోసపోయినవాళ్ళం' అన్నారు. 'బీసీ ఐతేంది ఓసీ ఐతేంది.. పారింది మా నెత్తురే' అన్నాడు కృపాకర్ మాదిగ. నేతల ప్రతాప్‌కుమార్ 'మనువంటే ఇపుడు బ్రాహ్మణ అగ్రహారం కాదు/భూస్వాముల శూద్రవతారం-దాని విధి దళిత సంహారం' అన్నాడు. 'ఓసీ బీసీ హిందూ కలయిక/నిరాకరణ నిజం/ఈ దేశం కూడబలుక్కున్న నినాదం'గా వేముల ఎల్లయ్య లోకపంచనామా చేశారు. పిల్లి మల్లిఖార్జున్ 'ఓ నా ప్రియమైన గోడ మీద బీ.సీ.ల్లారా!/మన చెట్టు ముల్లే గదా అని దారిలో ఉంటే చూస్తూ ఊరుకుంటామా/ఏరి పారయ్యమూ!' అని హెచ్చరించారు. శిఖామణి 'ఆత్మగౌరవపు సూరీడు ఎటు తిరిగితే అటు/నా కోటానుకోట్ల దళిత పొద్దు తిరుగుడు ముఖాలు' అంటూ దళితుల దీనగాథలకు అక్షరరూపంలో సిద్ధపడ్డారు.

శిఖాఆకాష్ 'నా అక్షరం నిన్ను నిలువెత్తు ద్రోహిగా నిలబెడుతుంది' అంటున్నారు. డా.విద్యాసాగర్ అంగళకుర్తి 'కులధర్మంగా తినగలిగినంత కాలం/దున్నేందుకు పిడికెడు భూమెందుకు? మనిషిగా పోరాటమెందుకు' బానిసత్వం మీద తిరుగుబాటు తప్పనిసరి అన్నారు. 'ఎన్ని పుస్తెలు తెగితే పత్రికల పతాక శీర్షికల్లో కన్నీళ్లు అక్షరాలయ్యాయో!/ఎన్ని శ్వాసలు ఆగితే ఛానళ్లు శవాలను చూపించి రాత్రిని ఆవులించాయో!' అన్నారు సుందరరావు. ఖాజా 'ఇప్పుడు మనువులు, పుష్యమిత్రులు/ముఖం నుంచి కాదు/పాదాల నుంచి పుట్టుకొస్తున్నారు/పంచమజాతి అన్నలారా కొంచెం జాగ్రత్త' అని సంఘీభావాన్ని ప్రకటించారు. 'వర్ణ ధర్మం అధర్మమన్న కళింగ ప్రదేశాన/భూమి హక్కు దున్నేవాడిదేనన్న రైతాంగ విప్లవాల స్వదేశాన/కుల దురహంకారాన్ని ఇన్నాళ్లుగా దాచి ఇప్పుడు బహిరంగపరిచిందే వర్గం' ఇది ఛాయారాజ్ ప్రశ్న. వడ్డెబోయిన శ్రీనివాస్ 'భూమి నా ఎజెండా/పోరు నా జెండా/వారెవ్వా!/నా డప్పులోంచి తుపాకీ వికసిస్తోంది'అన్నాడు. 'బలిని బలి తీసుకున్న కుయుక్తుల/వామనమూర్తులు ఊరేగే దేశంలో/దళిత పాదాల్ని జయకేతనాలుగా జాంబవ భూమి పై నిలబెట్టడం తప్ప' డేవిడ్ లివింగ్‌స్టన్ నిట్టూర్చారు. వడలి రాధాకృష్ణ లక్ష్మింపేట ఘటనను 'ఆకాశమంత అరాచకం'గా వర్ణించారు.

'నేను మట్టిని కలగంటా ఉట్టి మీద గుప్పెడు బువ్వకోసం' అన్నాడు ఎజ్రాశాస్త్రి. కుంచే నాగసత్యనారాయణ 'మీరు ఆక్రమించిన సమస్తం మాకు కావాలి' అని తిరుగుబాటును ప్రకటించారు. జి.వి.రత్నాకర్ 'పిడికెడు ఉప్పు మహోద్యమ మయింది/దోసెడు నీళ్లు మహ ద్ ఉద్యమయింది/మరి గజం నేల మారణకాండ నెం దుకు రచించింది' -కారణాలను అన్వేషించాలన్నారు.

'లక్ష్మింపేట మానవతీ-ఎంకీ/బొడ్లో చీరలు దోపి/సంకెత్తి జుట్టు ముడేసి/నీ నాయుడు బావతో కలిసి/మా మానాల్లో చల్లడానికీ/గుప్పెట్లో బిగించి నువు తెచ్చావే..కారం/అదేమ్ కారం తల్లీ? దాని పేరేమిటి' అని వినోదిని ప్రశ్నించారు. 'నిద్ర లేదు, నిమ్మళం లేదు దమ్ముందా బిడ్డా!/రా, నా నెత్తుటి యుద్ధభూమిలో తేల్చుకుందాం' అని సూజాత సూరేపల్లి సవాల్ విసిరారు. 'శతపత్ర కుసుమాన్ని నేను/నా తోబుట్టు ముళ్ళు/నా పాలిట తోడేళ్లు' అని నిందించారు జ్వలిత. దానక్క ఉదయభాను 'నాకు చారెడు నేల ఉండటం రాజద్రోహం/ఈ నేలపై జీవించి ఉండడమే ఒక దేశద్రోహం'. ఎస్సీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలని బహుజన రాజ్యాన్ని స్థాపించాలని నినదిస్తున్న అణగారిన కులాలు ఈ అకృత్యానికి పాల్పడటాన్ని ఖండిస్తున్నారు. 'ఒసే రాములమ్మలు/కులం కుంపట్లు ఆర్పడానికి/రాజముద్రలు ధరించే దిశలో/పిడికిళ్లు బిగించడమే న్యాయం' నడకుర్తి స్వరూపారాణి హెచ్చరికలు జారీచేశారు. 'నా చుట్టూ నీరు ఎర్రగా ఉందే/ఏ మాదిగో, ఏ మాలో ఇక్కడ నరకబడ్డారా?../ఇక్కడేదైనా పెద్ద కులాల గొడ్డళ్లు మిడిసిపడ్డాయా/..గొడ్డలికి తెలిసేది గొడ్డలి భాషే' అన్నారు జూపాక సుభద్ర.

నిమ్న కులాలు తమ శ్రమని, భాషని, సంస్కృతిని చూసి గర్వపడటం నేర్చుకుంటున్న దశలోనే అణచివేతకు గురయిన సందర్భాలు ఎన్నో తారసపడతాయి. ఆత్మగౌరవమే దళితులకి ఊపిరి. అందుకే దళితులకి జాషువా గుర్తుకొస్తాడు. 'తల్లి దండ్రి లేని బిడ్డల జూచి కన్నీరు దానంబు చేయు నేత్రములు నావి/జంతుకోటికి గల్గు స్వామిభక్తిని మెచ్చి తృప్తినొందెడు నవ్యదృష్టి నాది/సకల కార్మిక సమాజముల జీవిత కథానకము లాలించు కర్ణములు నావి/కఠిన చిత్తుల దురాగతములు ఖండించి కనికరమొలికించు కులము నాది'. పశువులు గడ్డి తిని పాలిస్తుంటే మనిషి అన్నం తిని విషం కక్కుతున్నాడనే సందేశం జాషువా కవిత్వంలో వుంది. దళిత కలాలు కరుణతో జాషువా బాటలో పయనిస్తున్నాయి. ఈ రాజ్యంగం సమాజాన్ని మారుస్తుందనే ఆశే వారిది. అదే ఇప్పటివరకు దళిత కవుల ఆలోచనకు ఆది, అంతం. కరుణ వదలి కఠినత్వాన్నో, లేకుంటే పాళీల భాష మార్చి ప్రగతిబాటనో.. ఏదో వెతికేవారే కదా!
- డా.జి.కె.డి.ప్రసాద్
gkd1994@yahoo.com

Andhra Jyothi Telugu News Paper Dated : 17/6/2013

Saturday, November 24, 2012

Laxmipet Dalit Killings



A land dispute may have been the immediate cause of the June 2012 attack on dalits in Laxmipet, a village in Srikakulam district, Andhra Pradesh, but the episode signals a potentially explosive situation. The incident was fuelled, on the one hand, by the dalit desire for self-respect and identity, embodied in the increasing assertion of a female dalit sarpanch, and on the other, by the state-level political advancement of the backward caste Kapu community. Particularly disturbing are the participation of Kapu women and children in the killings, and the failure of dalit offi cials and politicians in preventing the incident and securing justice for the victims.
This report was prepared after a visit to Laxmipet on 8 and 9 September by K Laxminarayana (klnss@uohyd.ernet.in), K Srinivasulu (srinivasulukarli@gmail.com), Arun K Patnaik (akpatnaik1@yahoo.com), K Y Ratnam and Timma Reddy.
The sleepy village of Laxmipet in Vangara mandal in Srikakulam district of northern coastal Andhra flashed on news channels on 12 June. In the early morning hours of that day, a large posse of Turpu Kapus, comprising men, women and even teenage children drawn from the village and the neighbouring villages, arrived in tractors, auto­rickshaws and bicycles. This horde gathered and vengefully pounced on the unsuspecting Malas, who live on the other side of the road that separates them from the Turpu Kapus. In the orgy which went on for four hours, five Malas were killed and more than two dozen were seriously injured. This number included women and even children. The fact that 80 Kapus were arrested and jailed shows the scale and magnitude of the riot in terms of planning, motive and participation.
A Resettlement Problem
Laxmipet is a resettled village where the evacuees of the Madduvalasa reservoir were resettled in 2001. The old Laxmipet had a population of 1,500. The major castes in this village were the Malas and Turpu Kapus. These comprised 80 and 120 families respectively. Others like service and artisan castes – Chakali, Mangali and Padmasali – constituted few families. While the Turpu Kapus (backward castes) owned most of the farmland, the Malas (dalits) constituted the bulk of the agricultural labour force.
With the land acquisition for the reservoir and resettlement of the displaced, some of the Kapu and Mala families moved out to other places. All the land thus acquired, except 250 acres, got submerged in the reservoir. Out of these, 190 acres are cultivated by the Kapus and remaining 60 acres have been cultivated by the Malas. Though this land was acquired and due compensation paid by the government, yet in the popular perception, the unsubmerged land is considered to be the property of the erstwhile owners. The dalits negotiated with the Kapus who had settled elsewhere and that is how they came to cultivate the 60 acres of land for almost a decade.
This became a bone of contention. The Kapus in the village began to demand that the dalits vacate the land so that they could take possession and cultivate it. Resisting this, the dalits even petitioned to the district administration to allot these lands to them since they were landless. There were attempts on the part of the revenue divisional o­fficer (RDO) to amicably settle the issue by making the Kapus consent to the status quo. But back in the village, the K­apus remained adamant and kept pressuring the dalits.
Explosive Situation
Though the land dispute is the immediate cause of the conflict, the portrayal of the conflicts in Laxmipet as an economic issue alone would reduce the significance of a caste conflict emerging in the village. The northern coastal Andhra districts, dominated by the Turpu Kapus, have witnessed a sense of assertion from the dalits in the last decade or so. This is largely because of the emergence of an educated class among the dalits. This has resulted in the assertion of dalit youth in different walks of life – education, employment, electoral politics, etc. For instance, the state policy of reservations to the scheduled castes (SCs) could be seen as having resulted in the denial of jobs and promotions to the others, especially to the Turpu Kapus.
Though the Turpu Kapus practise many cultural norms similar to the dalits, such as their liberal attitudes towards widow remarriage and so on, what has, in fact, added to the Kapu’s power is a process of visible change in state-level politics in the post-Rajasekhara Reddy period. The appointment of Botsa Satyanarayana, a man from the Kapu community in this region, as the president of the State Congress Committee has emboldened them politically. Though the Kapus have a significant presence in this region, with the prominence of Botsa Satyanarayana and Chiranjeevi in the ruling Congress Party, there was a perceptible change at the state level in the self-image of the Kapus – the elite as well as the masses – as counterpoint to the Reddys and Kammas, the two communities that have dominated state politics through their hold on the Congress and Telugu Desam Party (TDP) respectively.
Seen in the emergent context of the political economy of the state, the Laxmipet incident cannot be seen as an isolated event but as indicative of a potentially explosive situation. If the dalit desire for self-respect and identity constitutes one part of the emergent reality, then the arrogant expectation of the Kapus that the dalits will continue as their palerus(farm servants) forms the other side.
Laxmipet Gram Panchayat was reserved for an SC woman in the last Panchayat elections. The dominant Turpu Kapus identified a Mala woman by the name of Chittiri Simhalamma and got her elected unopposed as the sarpanch. Out of dependence and ignorance, Simhalamma initially acted at their behest. Once installed in the position, however, she could understand her own power over resources and the need to utilise it for the purposes it was meant for. This meant a substantial material loss to the Turpu Kapu elite, apart from the injury to their pride because, till recently, they had enjoyed unchallenged access and control in the village.
The village panchayat office is under construction. The panchayat meetings used to be held in the ex-sarpanch’s residence. Later, the meeting was shifted to the primary school building. But the sarpanch used to stand while “conducting” meetings whereas other ordinary members from the Kapu community sat down in the chairs during deliberations. From this servile position in the panchayat, despite being its sarpanch, Simhalamma took independent decisions on the utilisation of the funds and developmental activities in the village. This was seen as sufficient grounds to teach a lesson to the dalits. Simhalamma and her actions were seen as unacceptable to the Kapus. But given her official position, the Kapus found it risky to harm her and instead resorted to other methods.
Several instances point to the tensions that were building up between the Turpu Kapus and the dalits. For instance, a dalit president of the local mahila mandali was attacked and injured. Two months later, she died. The brother-in-law of the sarpanch, Chittiri Appadu, was attacked when he went to cultivate “disputed” lands. Both instances were treated as ordinary cases by local police, by ignoring the written request from victims to book cases under the Scheduled Caste and Scheduled Tribe (Prevention of Atrocities) Act. Most of the police officers were dalits, including the station o­fficer. The casual treatment of these instances by dalit officers, in fact, seems to have emboldened the local Kapus for an attack on a larger scale.
In view of these instances, a police picket was set up in the village to prevent further occurrence of any such incidents. This was lifted on 11 June, after almost six months, on the pretext that there was a bye-election to Narasannapet assembly constituency on 12 June.
Anatomy of the Attack
The attack on the dalits immediately a­fter the lifting of the police picket was not accidental. It indicates the fact that the Kapus were waiting for the removal of the police post. The sharp focus on the targets during the four hour-long uninterrupted attack suggests its well-planned and meticulously executed nature. In this operation, while the local Turpu Kapu men gave the directions, the Kapu men from the neighbouring villages along with the local women and children actively participated.
Specific to the Laxmipet atrocity and deserving of attention as a dangerous development, reminiscent of the Gujarat riots, is the active involvement of Kapu women and children in killing dalits. There are two instances clearly identified by the dalits where Kapu men attacked, but Kapu women and children completed the task. Nivarthi Sangmeshu, who was known for his courage and uprightness, was dragged from his house in the early morning, chased, beaten and floored. Women beheaded him by axing him as he tried to approach his sister’s house. Similarly in the case of Chittiri Appadu, the Kapu women did the final act. The dalit eyewitnesses point to a meticulous execution that almost followed a pattern: the men identified the victim and attacked him as grievously as possible within a short span and moved on for new prey. The women accompanied by adolescents followed them to ascertain and finish the task.
Even to the most cruel, it would appear unbelievable that apart from five gruesome murders, 19 other non-murder victims had their skulls broken and limbs severed. Fourteen of the latter could escape death because they fell unconscious and were found in a pool of blood and were therefore taken to be dead. The remaining five who were not unconscious ran for their lives and hid in all kinds of unlikely places to escape death.
Even in the notorious Karamchedu or Chundur cases, which were as gruesome and large-scale as the present one, there was no direct involvement of women, let alone children. What is alarming is that despite the active participation of the Turpu Kapu women and children in the attack, no enquiry was pursued on this aspect. No cases were filed and no one arrested. This is clear evidence of the shabby work done by the investigating agency and points to a dilution of the cases.
Dalit Representation?
What is of an equal concern is the fact that the Laxmipet atrocity happened at a time when all the local administrative functionaries in charge of law and order – the chief inspector (CI), additional ­superintendent of police (ASP), deputy superintendent of police (DSP) and mandal revenue officer (MRO) – were SCs. Sensing the gravity of the situation, the sarpanch’s husband Chittiri Gangulu informed the local police but the latter arrived in the village only four hours later. The local Member of Legislative Assembly (MLA), also a member of the state cabinet, Kondru Murali, belongs to the dalit community. He is even said to have suggested to the dalits to give up their claims over the land and compromise with the Kapus. That he has not visited Laxmipet, a village in his constituency, even three months after the atrocity is worth noting.
The failure of the officials and politicians in preventing the incident gets further compounded by their inadequate efforts at initiating the justice mechanism – bringing the culprits to book and addressing the grievances of the victims. Anyone who visits Laxmipet would notice that even three months after the atro­city, despite a police camp in the village, the dalitwada is gripped by fear and ­insecurity of life and livelihood. This is only heightened by the suspicious visits of the influential Turpu Kapu men from the neighbouring villages.
The state government has responded by setting up a special court in Srikakulam to deliver justice on a fast-track basis through a government order (GO) issued on 26 September. The dalit organisations demand immediate withdrawal of this GO as it violates the SC/ST Atrocities Prevention Act, which clearly mandates that such a special court needs to be set up in Laxmipet itself where the atrocities happened. It is also reported that dalit organisations propose a four-day padayatra from Laxmipet to Srikakulam, a distance of 90 kilometres, to show solidarity with and instil a sense of security among the dalits of Laxmipet.

source : Vol - XLVII No. 47-48, December 01, 2012 Hyderabad Political Economy Grou

http://www.epw.in/commentary/laxmipet-dalit-killings.html 

Wednesday, October 31, 2012

లక్షింపేట కుల -వర్గ సమస్యే - పాపని నాగరాజు



లక్షింపేటలో ఐదుగురు దళిత మాలల్ని తూర్పుకాపులు హత్య చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయమై రాష్ట్రంలో చాలా సీరియస్‌గా చర్చ జరుగుతుంది కూడా. లక్షింపేటలో మాలలు తూర్పు కాపుల కులదురహంకారానికి, దుర్మార్గానికి దాష్టీకానికి గురైనారు. ఈ కుల దుష్టలక్షణాల్ని అనుభవిస్తూనే ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలులోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ మిగులు భూములు దళితుల్లోని పేదలకు చెందాల్సిందేననే దృష్టితో మడ్డువలస ప్రాజెక్టు క్రింద ముంపునకు గురికాని భూమిని మాలలు సాగుచేసుకోవడం జరిగింది. 

అప్పటికే అనేక విధాలుగా తూర్పుకాపులు ఈ దళిత మాలల్ని కుల వివక్ష, దాడులు, దూషణలు చేసినా ఆ భూముల్ని మాలలు వదలకపోవడంతో ఈ హత్యాకాండకు పాల్పడ్డారన్నది స్పష్టం. అయితే ఈ అంశంపై వివిధ ప్రజా ఉద్యమ, విప్లవ శక్తులు వాస్తవాల్ని కప్పిపుచ్చి, శాస్త్రీయంగా విశ్లేషించకపోవడం జరుగుతోంది. దళితులపై దాడులు, వెలివేతలు, వివక్ష, అత్యాచారాలకు మూలం వారికి భూమిలేక పోవడమేనని ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో దళిత బహుజనులు ముఖ్యంగా దళిత ప్రజలు ఆర్థికంగా మంచి స్థితిలో ఉండి కూడా అగ్రకుల దురహంకారానికి గురైన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. 

తాగునీరు కావాలన్నందుకు, పెళ్లి ఊరేగింపులు నిర్వహించినందుకు, ఓట్లు వేసినందుకు, అగ్రకులాల వారితో సమానంగా సినిమాలు చూసినందుకు, అగ్రకులాల వారి ఇళ్ల ముందు నుంచి గ్రామ చావిడి మీదుగా వెళ్లినందుకు పెత్తందారుల దాష్టీకానికి గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ భూమి కావాలన్నందుకు కాదు ఆత్మ గౌరవం కావాలని అన్నందుకు జరిగినవి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నత స్థానాలలో ఉన్న దళితులూ వివక్షకు గురవుతున్న వారే. లక్షింపేటలో దళిత మాలలు స్వయం గౌరవ సమన్యాయం ప్రాతిపదికన భూమి కావాలని దున్నుకోవడంతోనే హత్యాకాండ జరిగింది. ఒక్క మాటలో కులం-వర్గం జమిలియై మాలల్ని హత్య చేసింది. 

ఈ దాడి కుల-వర్గ దృక్కోణంలో జరిగిందనడానికి కులానికి వర్గానికి ఉన్న సంబంధ విషయాల్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. కులం-వర్గం ఒకటి కాకపోయినా అవి ప్రత్యేక అస్తిత్వాలను కలిగిఉంటూ రెండు పోగుల ట్వైన్ దారంలాగా కలగల్సి ఉన్నాయి. వర్గ ఉత్పత్తి సంబంధాలు ఇండియాలో నిచ్చెన మెట్ల కుల వర్గ ఉత్పత్తి సంబంధాలుగా విడగొట్టబడి ఉన్నాయి. కనుక నిచ్చెన మెట్ల కుల అసమానతల స్వయం పోషక గ్రామ వ్యవస్థే మన దేశంలో కుల భూస్వామ్య వ్యవస్థకు పునాదైంది. బ్రిటిష్ వారు ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత వారు ప్రవేశపెట్టిన సెటిల్‌మెంట్ విధానంలో కులాల్లో వర్గాలేర్పడి కుల-వర్గ ద్విముఖ వ్యవస్థ మొట్టమొదట ఆవిర్భవించింది. 

ఇక్కడే భూమి అగ్రకులాల ఉమ్మడి ఆస్తిగా కొనసాగడంతో బడుగు వర్గాల ప్రజలు ఊరుమ్మడి సేవకులుగా, బానిసలుగా, వ్యవసాయకూలీలుగా మార్చ బడ్డారు. మన దేశంలో బ్రాహ్మణీయ అగ్రకుల పాలక వర్గాలు వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర సకల సామాజిక రంగాలలో అవలంభించిన విధానాలన్నీ కూడా బ్రాహ్మణీయ కుల స్వభావాన్ని ఆధారం చేసుకొని అమలు పర్చ బడ్డాయి. వ్యవసాయ క్షేత్రాల్లో నూతన సాంకేతిక విధానాల అమలుతో అధిక దిగుబడి సాధించడం ప్రారంభమైన తర్వాత చిన్న సన్నకారు రైతాంగం ఈ అగ్రకుల బడా ఉన్నత వర్గాలలో పోటీపడలేక వ్యవసాయకూలీలుగా మార్చబడ్డారు. 

ఇలా లాభపడిన భూస్వాములు, ధనిక రైతులు, మధ్యతరగతి రైతాంగంలోని పై అంతస్తులోని శూద్ర అగ్రకులాల వారే. భూమిలేని వారెవరూ అంటే దళిత బహుజన శ్రామిక ప్రజలే. దళిత ప్రజలే. ఈ అన్ని విషయాల్ని సామాజికవేత్తలైన ఫూలే, అంబేద్కర్‌లు, చరిత్రకారులు, వీరన్నలు ప్రకటించారు. మన రాష్ట్రంలో బ్రాహ్మణ, శూద్ర అగ్రకులాలైన కర్నాలు, కమ్మరెడ్డి, వెలమలు చారిత్రకంగా ఈ కుల-వర్గ వ్యవస్థలో లాభపడిన వాళ్లలో ఉన్నారు. దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితంగా లేకపోయినా ఉత్తరాంధ్రలో తూర్పుకాపులు, కళింగులు ఉన్నారు. వీరే ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లోని దళితులపై, బీసీలపై, బీసీల్లోని మైనార్టీ బీసీలపై, ఆదివాసీ గిరిజనులపై దాడులు, శిరోముండనలు, అత్యాచారాలు, కుల, గ్రామ సామూహిక బహిష్కరణలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే లక్షింపేటలో దళితులు స్వయం గౌరవ సమన్యాయంతోనే మాకు కూడా భూమి కావాలని అన్నందుకు ఈ హత్యాకాండను సృష్టించారు. ఒక్కమాటలో అగ్రకులాలుగా చెలామణి అవుతున్న తూర్పుకాపులు ఆధిపత్య, అహంకారంతోనే భూమిపై తమకు కూడా హక్కు ఉండాలని రాజ్యం అండదండలతో మారణహోమంకు పాల్పడుతున్నారు. అందుకే లక్షింపేట సంఘటనకు ద్వీముఖ కుల-వర్గ స్వభావం ఉంది. లక్షింపేట సంఘటనను వివిధ విప్లవ, ప్రజా ఉద్యమశక్తులు లక్షింపేటలో కులేతర భూ(వర్గపోరాట) సాధన పోరాటంలోనే దళిత సమస్యకు, కులసమస్యకు, స్పృశ్య-అస్పృశ్య, గ్రామ, కులవెలివేతలకు పరిష్కారం జరుగుతుందని ప్రకటిస్తున్నారు. 

అలా ప్రకటించడంలోనే బ్రాహ్మణీయ అగ్రకులతత్వాన్ని మరుగునపర్చడం అవుతుంది. వీరిసంస్థల్లో నేటికీ బ్రాహ్మణీయ అగ్రకులతత్వం ఇంకా కొనసాగుతుందని స్పష్టమైపోతుంది. పైగా ఈ శక్తులు సామాజిక (కుల) ప్రజాస్వామ్య పోరాటాలు కులతత్వాన్ని పెంచుతున్నవని నీలాపనిందల్ని వేస్తున్నారు. మరొకరేమో ఈ సమాజంలో కులం-వర్గం పునాదిగా ఉన్నవని ప్రకటిస్తూనే వర్గ విప్లవ పోరాటం విజయవంతంతో ఉపరితలమైన కులాన్ని అంతంచేయొచ్చని ప్రకటిస్తున్నారు. 

వాస్తవానికి వీరు బైటికి కులం పునాదంటూనే అంతర్గతంగా కులం ఉపరితలంగానే చూస్తున్నారు. మార్పుపేర 1987లో మద్రాస్‌లో ప్రకటించిన అవగాహననే నేటికీ కొనసాగిస్తున్నారని అర్థమవుతుంది. కొత్తసీసాలో పాత సారా లాంటిదే. కులం ప్రాతిపదికన స్వయంగౌరవంతో జరిగే సామాజిక న్యాయ పోరాటంతో దళిత బహుజనుల్లో బూర్జువాలు పుట్టుకొస్తారని ఈ దళిత బూర్జువాలు దళితమాలల పక్షాన ఉండరని లక్షింపేట రుజువుచేసిందని ప్రకటిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ సామాజిక పోరాటాలు వర్గపోరాటానికి అడ్డంకిగా మారుతుందని అపవాదును అంటగట్టారు. 

నిజానికి కుల-వర్గ వ్యవస్థలు అస్పృశ్యతకి మూలం కులవ్యవస్థ. కులవ్యవస్థకు మూలం మతం(వర్ణాశ్రమ) సనాతన ధర్మం. వర్ణాశ్రమ ధర్మానికి మూలం బ్రాహ్మణీయ హిందూమతం. బ్రాహ్మణీయ హిందూమతానికి మూలం రాజ్యాధికారం. ఈ బ్రాహ్మరహస్య వ్యూహానికి బ్రాహ్మణిజం దోపిడీ వర్గ రాజ్యాధికారానికి పరిరక్షించేదిగా ఉంది కనుక బ్రాహ్మణీయ పద్మవ్యూహమైన విడగొట్టి పాలించే దానికి ప్రతివ్యూహమైన కూడగట్టి పాలించే దళితబహుజన 'ఐక్యత' పాలసీతో దళితులతో బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఆదివాసీ గిరిజనులు ఐక్యసంఘటన కట్టాలి. లేదా దళితులు బీసీతో, ఎస్టీతో, మైనార్టీతో, ఆదివాసీ గిరిజనులతో ఐక్యసంఘటన కట్టాలి. 

ఈ ఐక్యసంఘటన వేలసంవత్సరాలుగా విద్య, ఉద్యోగ, వైద్యం, రాజ్యాధికారానికి నోచుకోని ఈ బడుగులు స్వయంగౌరవ, సామాజికన్యాయం ప్రాతిపదికన రాజ్యాధికారాన్ని కైవసంచేసుకొని కుల-వర్గ వ్యవస్థల నిర్మూలన పోరాటంగా మలచవచ్చు. ఈ క్రమంలో అణగారిన కులాల్లో బూర్జువావర్గం వర్గరీత్యా ఉన్నత వర్గంగా ఉంది కనుక వారికి కుల రీత్యా అవమానాలకు గురౌతున్న మేరకు మనతో కలిసివచ్చే స్థాయి వరకు కులపుకోవాల్సి ఉంటుంది. 

అలా రానియెడల వారికి వారే బడుగు వర్గాల శత్రువులవుతారు. కనుక విప్లవ శక్తులు ఈ జమిలి పోరాటాల్ని చేపట్టకుండా ఏక వర్గ విప్లవం పేరిట, కుల-వర్గ నిర్మూలన లక్ష్యం గల కుల విప్లవ పోరాటాల్ని ఫూలే, అంబేద్కర్‌ల కులనిర్మూలన అంశాల్ని విమర్శనాత్మకంగా స్వీకరించకుండా దాటేయడం కులతత్వమే అవుతుంది. బడుగువర్గాల్ని నేటికీ కులవ్యతిరేకత పేరుతో మభ్యపెట్టి దగాచేయడమే అవుతుంది. ఇలా నూతన తరహా అవగాహనను స్వీకరించకుండా ఉంటే లక్షింపేటలు అనేకంగా జరిగే అవకాశం ఉంది. 

- పాపని నాగరాజు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక తెలంగాణ మహాసభ

Andhra Jyothi Telugu News Paper Dated : 1/11/2012 

Sunday, July 1, 2012

India: Condemn the murder of Dalits, and support the resistance of dalits and adivasi!



REVOLUTIONARY DEMOCRATIC FRONT (RDF), Press Release22 June 2012
  • RDF strongly Condemns the Dalit Massacre in Lakshimpeta in Srikakulam
  • Punish the Culprit Upper Caste Brahmanical Forces Including their Abettors, the Ruling Party Leaders
  • RDF Hails the Exemplary Courage of Dalit People of Lakshimpeta for Putting Up Brave Fight to Own the Land.
  • Rally Around All Dalit and Adivasi People’s Struggles for Self-Assertion and Dignity
  • Develop Self-Defense to Protect the Movement and its Gains Against Murderous Attacks of the Brahmanical Forces.
Yet another massacre on dalit people in Andhra Pradesh shows that the landowning castes still turn violent when dalits assert themselves to take over land.  Four dalit people were hacked to death, and about 30 dalit men and women were critically injured in a well-orchestrated attack by Turpu Kapu backward caste brahmanical forces in Lakshimpeta village of Vangara block in Srikakulam District on 12 June 2012. The brahmanical forces targeted 60 dalit families in the village with crude and brutal weapons like bombs, sickles, hatchets and axes supported and patronised by the ruling Congress Party leaders of the region. Burada Sundara Rao (45), Chitri Appadu (35), Nivarti Venkati (65) and Nivarti Sangameshu (40) died in the bloodbath. Bodduru Papaiah died in King George Hospital, Vishakhapatnam on 20 June while taking treatment. With his death, the number of people killed in the massacre increased to five.
Land was acquired by government for Madduvalasa reservoir built on two tributaries of Nagavali river, Suvarnamukhi and Vegavathi which, while displacing thousands of people irrigated 15000 acres of land. In Lakshimpeta village, after the construction of the reservoir, 240 acres of land intermittently comes out of the submergence when water dries up. As the land turns fertile, rich crops were being raised on it with profitable cultivation in the past five years. The government paid a compensation of two lakh rupees per acre to Kapu land owners and settled 190 Kapu families and 60 dalit families about seven kilometres away from the reservoir. The dalit families were not paid any compensation or given employment though they were also displaced and resettled except for four families, who had assigned lands—only 40 thousand rupees per acre were paid to each of these four dalit families. Meanwhile one each from 40 families of the Kapu caste was provided with employment in the reservoir office departments in addition to compensation amount for land. All 250 families were settled in pacca houses built by the government. Having been deprived of land for centuries, the dalits of Lakshimpeta, as in most other cases, aspired to take over the unaffected land under the project and they have been asserting their rights over the land which now falls under the control of the government.
As the 240 acres of land—that once belonged to Kapu community became government land after compensation was being paid—came out of submergence every now and then,  180 acres of land has been cultivated by the Kapu families while only 60 acres by 60 dalit families in the last five years.  Kapu community in the village claimed that the entire land belongs to them as it once belonged them. Dalits argued with the local revenue administration that they should be allowed to cultivate this land as it was now government land.
The local administration maintained silence as the Kapu caste people were supported by powerful lobbies within the ruling party from the state to the bloc levels within the same caste. Both sides of the dispute approached the court for justice. The court as usual stayed the cultivation from both sides till its judgment. This triggered fury among the Kapu backward community and they blamed squarely the dalit community for the court order, though both communities had approached the court. The former local block president of Congress Party, Botsa Vasudevanaidu instigated the Kapus against the dalit people with the active encouragement from PCC chief, Botsa Satyanarayana. Congress leaders like Botsa Satyanarayana, Dharmana Prasada Rao (Minister for Roads and Buildings in Andhra Pradesh Government) from North Andhra Region have become the powerful agents of land grab in the region for thermal power plants, industrial corridor projects and mining. They are maintaining land mafia’s and have acquired thousands of acres of for their own families. They are responsible for the police firings and state-sponsored killings of the people, who are protesting against land grab in the region. They are the powerful political leaders of the region who are in real sense representatives of globalisation and displacement of hundreds of thousands of people in the region.
As the tension in the village grew, the government put up a police picket in the village, instead of solving the issue and the bloc has been placed under the atrocitiy-proned area. This shows such an attack as the one on dalits on 12 June has been expected to happen. In these circumstances, the government itself is directly responsible for the massacre of dalits. On June 12, majority of police personnel at the picket were sent away on by-election duty. The police forces returned to the village only after giving enough time to the caste chauvinists to carry out the massacre unhindered. History testifies to this set pattern of conduct of the state forces as every time they remained mute witnesses to the upper caste brahmanical fascist attacks on dalits. In fact the India state forces like police, paramilitary and army always either sided with upper caste big landing owning communities or stayed as onlookers over the atrocities as they represented the interests of the brahmanical upper caste Indian state.
As the dalit people were not prepared to face the brutal attack from the brahmanical casteist forces, they either prayed their attackers to leave them or couldn’t move away to safety. The motivated and calculated nature of the attackers was evident from their preparedness to strike on the dalits fatally. All the victims targeted were the main bread-winners of their respective families. All of them were mainly landless peasants.
The infuriated dalits of Lakshimpeta refused to bury the dead for the next three days as the government did not arrest the culprits and their abettors, the kingpins in the massacre and the ruling parties’ leaders. The dalit people protested the government’s inaction placing the dead bodies of their kith and kin in front of the village. The administration did not use SC and ST Atrocities Act against the culprits and their abettors till all dalit and democratic forces raised their voices in protest. A week after when the law was evoked, it was used against small insignificant elements among the culprits, leaving out safely the main abettors and political leaders like Botsa Vasudeva Naidu, Botsa Satyanarayana and others.
The political leaders of all ruling parties hovered over the surviving victims of dalit families pouring out their crocodile tears and false promises of jobs, lakhs of compensation and distribution of land. People have seen through the cunningness of these leaders as well as the empty rhetoric of their false promises. The upper caste brahmanical forces would never allow land to come into the hands of dalits as it is both symbolically and in real sense economic and political power. Further it will nullify all the coercive methods of surplus maximisation of the landed through the forced rendering of the dalits landless and hence dependent on the upper castes for their survival. The powers that be have only ensured through their police and paramilitary hand in glove with politician and the landowning classes to perpetuate this system by careful promotion of their interests. Dalit people of Lakshimpeta village have shown exemplary self-assertion to own the land despite continuous threats and atrocities from the powers that be.
RDF appeals to all democratic, progressive and revolutionary individuals and organisations to rally around the dalits in their attempt to self-assertion for dignity and to acquire land as a source of livelihood. Traditionally land mainly remained in the hands of the upper caste brahmanical feudal landowners. It is important to understand that at present the biggest land grab by the upper caste feudal and comprador forces in the name of projects, companies, mining, etc, are further depriving the dalits and adivasis, while at the same time preaching them that agriculture is not a profitable profession to live on. But the dalit and adivasi people are increasingly asserting themselves for their rights over land and other natural resources as they provide livelihood to the largest number people in the subcontinent. The movement for self-assertion and dignity is invariably linked to the land question for the vast majority of the oppressed people from oppressed castes and communities like Dalits, Adivasis, Muslims, and a vast majority of oppressed other weaker castes, though a section of the land owning among them turned brahmanical and caste oppressors.
The Dalit, Adivasi, Muslim and other communities of oppressed people need to have self-defence mechanisms while asserting themselves in every aspect in life, otherwise they are being massacred or facing genocidal attacks. In this context it is important to remind ourselves of the call given during Dalit Panthers upraising for self-defence of dalits in 1970s.
Most of the demands raised by all democratic organisations are for more compensation for the deceased and injured families of dalits. While compensation is required as an immediate relief and justice by punishing the culprits, what is important as the permanent solution is to build self-defence cover for dalits to protect themselves as well as a sound deterrent against the massacres from brahmanical upper caste fascist forces. Only through acts of retaliation can we stop and prevent atrocities on dalits.
(This statement is based on Fact-finding done by various people’s organisations in which an RDF executive member was part).
President                                                                                             General Secretary
Varavara Rao                                                                                      Rajkishore
09676541715                                                                                      09717583539

REVOLUTIONARY DEMOCRATIC FRONT (RDF)
Contact: revolutionarydemocracy@gmail.com



Saturday, June 30, 2012

దళితులపై దాడులు ఆగేదెన్నడు? ----యెపూరమల్ల రాములు, రాష్ట్ర అధ్యక్షుడు మాలమహానాడు -కె. కాశీవిశ్వనాథం,




CM00 talangana patrika telangana culture telangana politics telangana cinema


శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేట దళితులపై ఓ వర్గం వారు దాడి చేసి ఐదుగురిని హత్యచేశారు. 30 మందిని తీవ్రంగా గాయపర్చారు. లక్షింపేట కుల వివక్షకు కేంద్రంగా ఉన్నది. గ్రామ సర్పంచ్ చిత్తి రి సింహలమ్మను గ్రామ పంచాయితీ సమావేశంలో ఏనాడూ కుర్చీలో కూర్చోనివ్వలేదు. గ్రామ సచివాలయంలో మొత్తం ఒక వర్గం వారే కావడంతో వారు చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. వారు ఆడిందే ఆటగా, పాడిందే పాట గా ఉన్నది.



ఈ నేపథ్యంలో దళితులపై దాడికి ఆ గ్రామంలో జరుగుతున్న పరిణామాలకు చాలా చరివూతనే ఉన్నది. వంగర సమీపంలో మడ్డువలస జలాశయం నిర్మాణం కోసం చుట్టుపక్కల గ్రామాల రైతుల భూములును ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగే లక్షింపేట గ్రామంలో కాపులు, మాలల ఇళ్లు, కాపు రైతు ల పంటభూములు, మడ్డువలస డ్యామ్ నిర్మాణం కోసం సేకరించారు. కొత్త కాలనీకి తరలింపునకు మొదట కాపు కులస్తులు నిరాకరించగా,మాలలు తమ నివాసాలు విడిచిపెట్టి, కొత్త లక్షింపేట కాలనీలోని స్థలంలో గృహాలు నిర్మించుకున్నారు. తరువాత కాపు కులస్తులు కూడా సదరు కాలనీకి తరలి ప్రభు త్వం రైతుల భూములకు పరిహారం చెల్లించి ఉపాధి కోసం కుటుంబానికి ఒక్కరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. కానీ మాల కులస్తులకు ఎటువంటి ఉపాధి చూపించలేదు. కాలనీ తరలించుటలో జలాశయంలో ముంపునకు గురికాకుండా ఉన్న భూమిలో మాలలు పంటలు పండించుకోవడానికి అధికారులు హామీ ఇచ్చారు. అదే ప్రభుత్వం మాలలకు చూపిన ఉపాధి హామీ. 



మడ్డువలస డ్యామ్ నిర్మాణం పూర్తయ్యి, నీటితో జలాశయం నిండినా, లక్షింపేట గ్రామం భూములు ముంపునకు గురికాకుండా ఉన్నందున వాటిని దళితులకు ఇచ్చారు. కానీ అదే కాపు కులస్తులు మాత్రం సుమారు 195 ఎకరాలను ఒక్కొక్కరు 5నుంచి 10 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. దేవకివాడ గ్రామం నుంచి సేకరించిన 60 ఎకరాల భూమిని 75 దళిత కుటుంబాల వారు సాగు చేసుకొని బతుకుతున్నారు. ఈ భూములు లక్షింపేట గ్రామానికి ఒక కిలోమీట రు దూరంలోనే ఉన్నాయి. అలాగే డ్యామ్ చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు కూడా ముంపునకు గురి కాకుండా ఉన్న ప్రాంతాన్ని సాగుచేసుకొంటున్నారు. నేడు సీతారాంపురం, మద్దివలస సరిహద్దులో ఉన్న డ్యామ్ భూములు కూడా దుక్కులు దున్నుతున్నారు. డ్యామ్ భూములను లక్షింపేట మాలలు సాగు చేసుకోవడాన్ని అక్కడి కాపులు సహించలేకపోయారు. దీని ఫలితమే లక్షింపేట దళితులపై దాడి.
ఇది తక్షణ కారణంగా కనిపించినా.. లక్షింపేటలో కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు దీనికి ఆజ్యంపోశాయి. లక్షింపేటలో కాపులు, మాలలు కలిసి ఎస్సీ రిజర్వుడు పంచాయితీకి ఏకగ్రీవంగా చిత్తిరి సింహాలమ్మను కాంగ్రెస్ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. కాపులకు ముఖ్య నాయకుడుగా ఉన్న వంగర మండలానికి చెందిన బొత్స వాసుదేవరావు నాయుడుదే ఆధిపత్యం.



ఏ పని జరగాలన్నా ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది. ఈయన గారే లక్షింపేట దాడికి సూత్రధారి అని దళితులు అంటున్నారు. అలాగే.. ఏకక్షిగీవంగా ఎన్నికైన సింహాలమ్మను ఏనాడూ గ్రామ పంచాయితీ సమావేశాలలో కుర్చీపై కూర్చోనివ్వలేదు. కానీ పంచాయితీ సభ్యులు మాత్రం కుర్చీల్లో కూర్చుంటారు. కాపులు చెప్పిందే, సూచించిందే చేయాలి. గ్రామంలోని పాల కేంద్రాన్ని దళితుడైన గణపతి నిర్వహిస్తున్నాడు. దీనికి అందరూ పాలు పోసేవారు. తరువాత ఏమైందో ఏమో.. కాపులు మరో పాలకేంవూదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గణపతి పాలకేంవూదానికి కాపులు పాలు ఇవ్వడం మానేశారు. కాపులతో సమానంగా దళితులు ముంపునకు గురికాని భూములను సాగు చేసుకోవడాన్ని సహించలేక రగిలిపోతున్నారు. దళితులు సాగుచేసుకుంటున్న భూముల నుంచి దళితులను ఎలాగై నా తరిమేయాలని పథకం పన్నారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన వారిని గ్రామానికి పిలిపించి, దళితులు భూములు దున్నరాదని వివాదం సృషించారు.



దీంతో దళితులు తాము దున్నుకుంటున్న భూములను తమకే అప్పగించాలని శ్రీకాకు ళం జిల్లాకపూక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, డ్యామ్ అధికారులు, రాజకీయ నేతలు, మంత్రి కొండ్రు మురళి సమక్షంలో ఇరు పక్షాలు వివాద పరిష్కారానికి ప్రయత్నించారు. మాలలకు భూమి ఇవ్వడానికి కాపులు అంగీకరించలేదు. పీసీసీ అధ్యక్షడు, మంత్రి బొత్స ముఖ్య అనుచరుడైన బొత్స వాసుదేవరావు నాయుడు మాలలపై కక్షగట్టి దళితులపై దాడికి పథక రచన చేశాడు. ‘మిమ్మల్ని నలుగురినో, ఐదుగురినో చంపితే గానీ భూములు వదలర’ని హెచ్చరించాడు. ఈవిధంగా లక్షింపేటలో కాపులు, దళితుల మధ్య రోజురోజుకూ ఘర్షణ వాతావరణం పెరిగిపోతున్నా శాంతిభవూదతలు కాపాడవలసిన వంగర పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. గ్రామంలోని ఉద్రిక్తతల నేపథ్యంలో 18 మార్చి నుంచి నేటి వరకు లక్షింపేట గ్రామస్తులపై సీఆర్‌పీసీ 107 సెక్షన్ అమలులో ఉన్నది. కాపు లు 54 మంది, మాలలు 53 మందిపై బైండోవరు కేసులు పోలీసులు పెట్టారు.



ఆ తరువాత గ్రామంలో 144 సెక్షన్ కూడా నెలరోజుల పాటు కొనసాగింది. శాంతి కమిటీని ఏర్పాటుచేశారు. భూ వివాదానికి సంబంధించి సీఆర్‌పీసీ 145 ఆర్డర్ కూడా లక్షింపేట గ్రామస్తులపై విధించారు. నేటికీ ఆ గ్రామంలో 107 సెక్షన్ అమలులో ఉన్నది. లక్షింపేట సర్పంచ్ సింహాలమ్మ బంధువు పంటచేనును పక్క గ్రామానికి చెందిన వ్యక్తి పశువులు పాడు చేశాయి. దీనిని అతను ప్రశ్నించాడు. దీంతో.. కాపులు ముందుకు వచ్చి తిరుపతిరావు నాయకత్వంలో దళిత రైతు అప్పడును కులం పేరుతో దూషించి కొట్టారు. దీంతో చేసేది లేక దళితులు కులం పేరుతో దూషిం చి కొట్టినందుకు వంగర పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. దీనిపై విచారించిన డీఎస్పీ కాపు కులస్తులైన ముద్దాయిలను అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన కాపులు తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినందుకు మాల కులస్తులను బెదిరించసాగారు. బెదిరించినట్లుగానే 12-06-2012నాటి దాడిలో అప్ప డును బల్లెంతో పొడిచి దారుణంగా చంపారు.



అట్రాసిటీస్ కేసు నమోదైన నాటినుంచీ లక్షింపేటలోపోలీస్ పికెట్ పెట్టారు. కానీ ఇంతలో ఎన్నికలు రావడంతో పికెట్‌లోని పోలీసులను ఎన్నికల నిర్వహణకు పంపారు. పోలీస్ పికెట్‌లేని సమయాన్ని అదనుగా భావించిన కాపులు దళితులపై దాడికి పన్నాగం పన్నారు.



జూన్ 11న బొత్స వాసుదేవరావు నాయు డు ఇంట్లో 20మంది కాపులు సమావేశమయ్యారు. హత్యాకాండకు పథక రచన చేశారు.12న ఉదయం ఏడు గంటలకు కాలనీ రహదారి పక్కన ఆవు తిరుపతిరావు ఇంటి దగ్గర కాపులు సమావేశమయ్యారు. దాడి కుట్ర తెలియని దళితులంతా తమ పనుల్లో మునిగిఉన్నారు. ఏడున్నర గంటల ప్రాంతంలో దళితవాడలో బాంబులు వేసి భయవూబాంతులు సృష్టించారు. కాపు స్త్రీలు కారం చల్లుతూ మాలలపై దాడికి దిగారు. దొరికిన వారిని దొరికినట్లు కత్తులు, బల్లాలతో పొడిచారు. కర్రలు, బండరాళ్లతో బాది నలుగురిని చంపారు. ఇంటి తలుపులు పగుల కొట్టి ఇళ్లలోని వారిని బయటకులాగి దారుణంగా నరికి చంపారు. 30 మందిని తీవ్రంగా గాయపరిచారు. దాడితో దళితులు హాహాకారాలు చేస్తుం కాపులు వికటాట్టహాసం చేస్తూ.. హత్యాకాండ కొనసాగించారు. ఆ సమయంలో మంచినీళ్లు తెచ్చుకుంటున్న కలమటి సంఘమ్మను కట్టెలతో తీవ్రంగా కొట్టి చేతులు, కాళ్లు విరగ్గొట్టారు. ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. 



ఈ హత్యాకాండ వెనుక కాపుల దౌర్జన్యకాండ ఎంత ఉన్నదో, దీనికి పరోక్షంగా సహకరించిన పోలీసుల పాత్ర కూడా అంతే ఉన్నదని చెప్పకతప్పదు. కాపులు జూన్ 12 ఉదయం సమావేశమవుతున్నారని పోలీసులకు సమాచారమందించినా సకాలంలో స్పందించలేదు. సుమారు పది గంటల ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ వచ్చి జరుగుతున్న దౌర్జన్యాన్ని చూసి వెంటనే వెళ్లిపోయాడు. తిరిగి పదకొండున్నరకు వచ్చి హంతకులు పారిపోయేందుకు వీలుగా విజిల్స్ వేస్తూ ఊళ్లోకి వచ్చారు. పారిపోతున్న కాపులను పట్టుకొనేందుకు ప్రయత్నించలేదు. అప్పటికే శ్రీనివర్తి వెంకట్, బూరాడ సుందరరావు చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న శ్రీనివర్తి సంఘమేషు, చిత్తరి అప్పడు దారిలో చనిపోయారు. జూన్ 20న మరో క్షతగావూతుడు పాపయ్య చనిపోయాడు. 



గ్రామంలోని ఘర్షణ వాతావరణం, కాపుల బెదిరింపులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా..పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే లక్షింపేట హత్యాకాండ జరిగింది. నెలల తరబడి పోలీస్ పికెట్ పెట్టి, ఎన్నికల నెపంతో పోలీసులను ఉపసంహరించిన ఉన్నతాధికారులు పరోక్షంగా దళితులపై దాడికి కారణమయ్యారు. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేయడంలోనూ పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్యం చూస్తూనే ఉన్నాం. అసలు దోషులను విడిచి పెట్టి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ దాడిలో బొత్స సత్యనారాయణకు దగ్గరి బంధువులున్నారన్న విషయం దాచేస్తే దాగని సత్యం. వీరిని కాపాడేందుకు ఉన్నత స్థాయిలో పైరవీలు సాగుతున్నాయి. లక్షింపేట దాడిని, పోలీసులు, పాలకులు వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రంలోని ప్రజాసంఘాలు, హక్కుల సంఘా లు, మేధావులు తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దళితులపై దాడి వెనుక ఉన్న కుట్ర బయటకి రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలి. చనిపోయిన వారికి పది లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షలు పరిహారం చెల్లించి బాధిత కుటుంబాలకు రక్షణ, ఉపాధి కల్పించాలి. దళితల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దళితుల ఆత్మరక్షణకు దళితుల తోకూడిన గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేయాలి. 

-యెపూరమల్ల రాములు, రాష్ట్ర అధ్యక్షుడు మాలమహానాడు
-కె. కాశీవిశ్వనాథం, రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ దళిత కూలీ రైతు సం

Namasete Telangana News Paper Dated 1/7/2012

సారాంశం, సామాజిక సంక్షోభమే! - కె. శ్రీనివాస్



ఇరవయ్యేడేళ్ల కిందట కారంచేడు జరిగినప్పుడు అదొక సంచలనం. షాక్. పత్రికా కార్యాలయాల్లో పెద్ద సంరంభం. 'పంట పొలాల్లో పులిచంపిన లేడి నెత్తురు' అన్న శీర్షికలో దళితుల మారణకాండను మానవీయంగా కథనం చేసిన సందర్భం. మరణాల సంఖ్య పెద్దగా లేకపోవచ్చును. కానీ, ఆ సంఘటన రాష్ట్రాన్ని దేశాన్ని కల్లోలితం చేసింది. దళిత కారంచేడు ఖాళీ అయిపోయి చీరాలలో విడిది చేసింది. ఒకనాటి దాడే కావచ్చు, కానీ అది రాష్ట్రంలో దళిత ఉద్యమానికి నాంది పలికింది. సామాజికోద్యమాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని తెరచింది. 

మరో ఆరేళ్లకు చుండూరు సంఘటన. మరింత దారుణంగా, భీకరంగా, దుర్మార్గంగా దళితులను వేటాడి నరికారు. ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అనేక అంతర్గత విభేదాల మధ్యనే అయినా దళితుల ఐక్యత ప్రస్ఫుటమైంది. దళితుల్లో ఆత్మగౌరవభావన మరింత బలపడింది. మరి మొన్న జూన్ 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా లక్షింపేటలో జరిగిన మారణకాండ, ఉత్తరాంధ్ర భూసామాజిక సంబంధాల్లోని వైరుధ్యాలను బహిర్గతం చేసింది. కారంచేడు, చుండూరు సంఘటనలనుంచి రూపొందిన దళిత నాయకత్వం లక్షింపేట వెళ్లి నిజనిర్ధారణలు చేసింది. మానవహక్కుల కమిషన్లకు, ప్రభుత్వాలకు నివేదికలు పంపింది. 

విప్లవ, వామపక్ష ప్రజాసంఘాలు, వివిధ ప్రధాన స్రవంతి రాజకీయనాయకులు బాధితులను పరామర్శించారు. కానీ, ఎందువల్లనో, గతంలోని ఆక్రోశం, ఆవేదన, ఆవేశం కనిపించడం లేదు. ఉప ఎన్నికల రాజకీయ సంరంభం వల్ల ఈ సంఘటన మరుగున పడిందని అనిపించినా, అందులో పూర్తి వాస్తవం లేదని అర్థమవుతూనే ఉన్నది. ఎక్కడో ఏదో లోపించింది. నిప్పు భగ్గున మండకుండా, గోరువెచ్చగానే మిగిలిపోయింది. ఏమిటి కారణం? గత రెండు దశాబ్దాల కాలంలో దళిత ఉద్యమం చీలిపోవడం వల్ల కలిగిన పరిణామమా ఇది? బాధితుల ఉపకులానికి సంబంధించిన సంఘాలు సైతం సమరశీలంగా కనిపించకపోవడానికి- కాలం తీసుకువచ్చిన మార్పు కారణమా? వారిలో అధికులు వ్యవస్థలో క్రమంగా సంలీనం అవుతున్నారా? 

పై ప్రశ్నలకు వచ్చే సమాధానాలు కూడా నేటి పరిస్థితికి కొంతమేరకు కారణం కావచ్చు. అయితే, సంఘటన జరిగిన ప్రాంతం స్థితిగతులు కూడా ముఖ్యమైన కారణమనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతం తక్కిన రాష్ట్రం నుంచి విడిగా, దూరంగా ఉంటున్నదా? యావత్ రాష్ట్ర సమాజంలో అది అంతర్లీనం కాలేదా? అక్కడి పరిణామాలను తక్కిన రాష్ట్రం తమవిగా స్వీకరించడం లేదా? కారంచేడు, చుండూరు సంఘటనలు జరిగినప్పుడు, నిందితుల సామాజిక వర్గాలు రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న రాజకీయపార్టీల నేపథ్యవర్గాలు. పైగా, అవి రాష్ట్ర సామాజిక, రాజకీయ చిత్రపటాన్ని దీర్ఘకాలంగా శాసిస్తున్న కులాలు. 

వాటి ఉనికి, వ్యాప్తి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను ఆవరించినవి. లక్షింపేట సంఘటనలో నిందితులుగా ఉన్నవారి సామాజిక వర్గం ఉత్తరాంధ్ర ప్రాంతానికే పరిమితమైనది. ఇతర ప్రాంతాలలో కాపు కులస్తులతో వారికి స్థూలమైన సమీకరణం ఏర్పడుతున్నది కానీ, సాంస్క­ృతికంగా ఐక్యత ఇంకా ఏర్పడలేదు. ఉత్తరాంధ్రలోని తూర్పు కాపులు రాష్ట్ర రాజకీయరంగంలో ప్రాబల్యం పొందుతున్న మాట నిజమే కానీ, దాని ప్రభావం రాష్ట్రవ్యాప్తమైనది కాదు. 

దళితులమీద దాడిచేయడానికి కావలసిన అహంకారాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది కొత్తగా సమకూరుతున్న ప్రాబల్యమే అయినప్పటికీ, దానికి కూడా పరిమితులున్నాయి. కారంచేడు, చుండూరు సంఘటనల నిందితులకు సమాజంలోని వివిధ శ్రేణులలో ప్రాతినిధ్యం ఉండడంతో, వారిని వెనకేసుకువచ్చినవారు కూడా గణనీయంగా కనిపిస్తారు. కానీ, లక్షింపేట నిందితుల వర్గానికి అంతటి హంగు ఇంకా ఏర్పడలేదు. అయితే, ఇంకా అధికారపు సానువులకు సమీపానికి వచ్చీ రాగానే సాంప్రదాయిక ప్రాబల్యశక్తుల మాదిరిగా దళితులపై కత్తిఝళిపించడం ప్రమాద సంకేతం. 

రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితి కారణంగా ఒక సామాజిక దౌర్జన్యం జనం దృష్టిలో పడలేకపోయిందనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే, ఆ రాజకీయపరిస్థితే ఒక సామాజిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల వెనుక ఒక పెద్ద సామాజిక సమీకరణం ఉన్నది. ఆ సమీకరణంలో లక్షింపేట బాధితుల కులం కూడా ఒక భాగస్వామే. రాజకీయంగా తమ ప్రాధాన్యాన్ని ప్రకటించడానికి వారు ఒక వర్గంగా ఏ మాత్రం వెనుకాడలేదు. కానీ, సమరశీల పోరాటానికి మాత్రం వారు సంసిద్ధంగా కనిపించడంలేదు. 

ఉప ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి చర్చలోకి వచ్చిన రాష్ట్రవిభజన అంశం కూడా సామాజికంగా తీవ్రమైన పర్యవసానాలున్న అంశం. విభజనను వ్యతిరేకిస్తున్న వారు కానీ, తెలంగాణవాదులు కోరుతున్న సరిహద్దులకు మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్నవారు కానీ సామాజికమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నవారే. తమ మతవర్గానికి చెందినవారు అధికంగా ఉన్న మరోప్రాంతాన్ని కూడా తెలంగాణలో కలిపితే ప్రత్యేక రాష్ట్రానికి అభ్యంతరం లేదని మజ్లిస్ భావిస్తున్నది. 

రాయలసీమలోని రెండు జిల్లాలను కలిపితే, తెలంగాణలో తమ ప్రాబల్యానికి గ్యారంటీ ఉంటుందని రెండు ప్రాంతాలలోను బలంగా ఉన్న రెడ్డి కులస్థులు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే, సామాజికమైన సమీకరణాల కారణంగా, జగన్‌మోహన్‌రెడ్డి ప్రాబల్యాన్ని పరిమితం చేయవచ్చునని, పనిలో పనిగా చంద్రబాబును బలహీనపరచవచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నది. తెలంగాణ వస్తే, ఇంతకాలం పెత్తనం చేసిన భూస్వామ్య ప్రాబల్యవర్గాలు బలహీనపడి, బిసిల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఉద్యమకారులు ఆశపడుతున్నారు. ఆంధ్రప్రాంతం విడిపోతే, తమను అణచివేస్తున్న స్థానిక ప్రాబల్యకులస్థులు బలహీనపడతారని, అంకగణితాలు మారిపోయి తమ పలుకుబడి పెరుగుతుందని అక్కడి దళితులు ఆశిస్తున్నారు. 

అందరి ఆశలూ నెరవేరే అవకాశమైతే లేదు కానీ, రాష్ట్ర విభజన మాత్రం ఊహించిన మార్పులనే కాక, అనూహ్యమైన మార్పులను కూడా సామాజిక రంగంలో తీసుకువచ్చే అవకాశం ఉన్నది. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, కాపు- రాష్ట్రంలో అధికారపీఠాలు సంక్రమిస్తున్న ఈ క్రమం బిసిలకు, దళితులకు చేరువ కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నది. ఈ లోపున లక్షింపేట వంటి సంఘటనలు అనేకం జరిగి, మన వాస్తవికతను గుర్తుచేస్తుంటాయి. 

పదేళ్ల కిందటే, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకోల్‌లో నామాల బాలస్వామి అనే దళితుడి హత్య తెలంగాణ సమాజానికి ఒక హెచ్చరిక పంపింది. ఉద్యమక్రమంలో ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణతిని, అవగాహనను సంతరించుకున్న తెలంగాణవాదులు సామాజికమైన ప్రహేళికను పరిష్కరించుకున్నప్పుడే వాస్తవమైన విజయం సాధించగలరు. లక్షింపేట బాధితులకు సంఘీభావం తెలపడానికి ఉస్మానియా విద్యార్థులు తరలివెళ్లారనే వార్త అటువంటి ఆశను కలిగిస్తోంది. 

కారంచేడు నుంచి ప్రారంభమైన ఆత్మగౌరవ అస్తిత్వాల ప్రస్థానం, తమను తాము చాటిచెప్పుకునే క్రమంలో సాంప్రదాయిక ప్రగతిశిబిరాలను ప్రశ్నించాయి, నిలదీశాయి. దూరంగా నడిచాయి. సొంత అస్తిత్వాల నుంచే ప్రారంభమయ్యే ప్రశ్నలు, ఆ అస్తిత్వాలను కూడా విభజించాయి. వివక్ష, అసమానత్వం ఎక్కడ ఉన్నా వేరుమాటలు మాట్లాడాయి. ఇప్పుడు, అనేక సంఘాలు, అనేక సంస్థలు, అనేక అస్తిత్వాలు. తాము విస్మరించిన కోణాలను, పార్శ్వాలను వామపక్ష ప్రగతిశీల శక్తులు సరిదిద్దుకోలేక తప్పలేదు. 

స్థైర్యంతో తాము నమ్మిన మార్గంలో నడవడమూ విరమించలేదు. ఇప్పుడు అనేక శక్తులు ఇంకా అనేకంగా ఉండడమే పెద్ద సమస్య. ఒకరి ఉనికిని మరొకరు మింగేసే విలీనాలు అక్కరలేదు కానీ, ఒకరి చేతులను ఒకరు పెనవేసుకునే ఐక్యత కావాలి. బాధిత కులాలు, ఉపకులాలు, మతాలు, జెండర్, ప్రాంతాలూ, ప్రజాస్వామిక సంస్థలూ ఉద్యమాలూ- అవసరమైనప్పుడు ఒకటిగా నిలబడాలి. వాస్తవమైన అర్థంలో ఆ ఐక్యత ఇప్పుడే ఉండి ఉంటే, లక్షింపేట ఉదంతం త్వరగా మసకబారే ప్రమాదం ఉండేది కాదు. 

మనకు స్పష్టంగా తెలియకపోవచ్చును కానీ, ఈ నేల మీద పెద్ద సామాజిక సుడిగుండమే చెలరేగుతున్నది. రకరకాల మారువేషాల్లో వాటి సంకేతాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అధికార రాజకీయ క్రీడ వెనుక పెద్ద సామాజిక సంక్షోభం ఉన్నది. తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాల వెనుక సామాజిక కోణమే ప్రభావం వేస్తున్నది. సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పడే కొత్త అధికార సమీకరణలను, చేజిక్కనున్న కొత్త అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఎదుగుతున్న కులాలు జబ్బ చరుస్తున్నాయి. లక్షింపేట అందుకు సంకేతం. ఇంత పెద్ద రంగస్థలాన్ని సామాజికోద్యమాలు ఎట్లా వినియోగించుకుంటాయన్నది సమస్య. 

- కె. శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated : 1/7/2012

Friday, June 29, 2012

Four Dalits done to death in Srikakulam village

Karamchedu in Laxmipeta By Katti Padma Rao


Kathi Padma Rao
(This is a translation of his recent article 'Lakshimpetalo 'Karamchedu'')
The oppression of the Dalits continues unabated in the state. Whichever dominant castes are in power, people belonging to those castes continue to conduct violent attacks on the Dalits. When NTR was in power, six Dalits were brutally killed in Karamchedu, his samdhi's village. When Nedurumalli Janardhan Reddy was in power, they chopped off the heads of eight Dalits in Chunduru of Guntur district, and dumped them in the Tungabhadra. Now when Botsa Satyanarayana, who calls himself a BC, is the Pradesh Congress President, Botsa Vasudeva Naidu and his horde of Toorpu Kapus, armed with swords and axes, have tortured and killed the Dalits of Lakshimpeta in Srikakulam district.
lakshim_pamphlet


What really happened? The landowning Toorpu Kapus of Lakshimpeta village in Vangara mandal of Srikakulam district surrounded the Dalitwada of the village at seven in the morning. Groups of around twenty people each, armed with deadly weapons, laid siege to every house. They dragged the people from their homes and showered inhuman abuse and insults on them. 'You Mala ba#$%^s, you think you've grown big enough to be cultivators?' they ranted in their caste arrogance. Shouting 'You think you can till fields alongside us?' they launched a brutal attack on Nivirti Venkati (60), his son Nivirti Sangamesu (35), Burada Sundar Rao (35) and Chittari Appadu (25).
According to Chintapalli Guruprasad, Andhra Pradesh Dalit Mahasabha President, and his associates P. Benjamin, Nuthalapati Chandrasekhar, Bokara Narayana Rao who had visited the scene, each body bore around 40-50 knife or spear wounds. This attack was caused by a grudge. Planning, strategy, hatred – all of them are behind this attack. The victims died almost immediately after they received the injuries. They have become martyrs in the struggle for land. Offerings to the fire of caste hatred. Bodduri Papaiah, another victim who was injured during the attack on these four Dalits, died in King George Hospital, Visakhapatnam, on Wednesday. Which means five people have died in the Lakshimpeta massacre until now.
Since the formation of the state, landowning castes in the various regions – be it Kammas or Reddies or Kapus or Kalingas or Velamas or Kshatriyas – have been unable to bear the sight of Dalits tilling land on their own, developed grudges against them claiming that the Dalits have no right to land, conducted violent attacks on them or expelled them from villages. There is a strong bond between state power and caste hatred of this kind. This attack has the support of the powerful. In this brutal, inhuman incident which all Telugus should feel ashamed about, around 20 people have been seriously injured, apart from the five who died.
They are undergoing treatment in RIMS Hospital in Srikakulam now. Kalamata Ganapati (35), Kalamata Prakash (50), Kalamati Simhachalam, Kalamati Gangulu, Gonela Ravi (25), Nivirti Gangaiah (50), Kalamata Gaddiah (Lachchaiah's son), Kalamati Gaddaiah (Chinna Mutyalu's son), Nivirti Simhachala, Nivirti Narsaiah, Nivirti Rama Rao, Bodduri Bhogesu, Gongada Shivudu, Nivirti Darappadu, Nivirti Gangaiah, Kalamati Sangamma, Chittari Yellaiah, Kalamati Gangulu, Bodduri Gowraiah are fighting for their lives in the hospital.
Lakshimpeta is the biggest massacre by the upper castes after Karamchedu and Chunduru. These caste villains surrounded the Dalits, chased and hunted them for two and half hours with deadly weapons and derived perverse pleasure from attacking even dead bodies with swords and axes. The Toorpu Kapu landlords here, even though BCs in name, are great believers in caste supremacy. The Kalingas, Koppula Velamas and Toorpu Kapus in Srikakulam district perform the role undertaken by the Kammas, Reddies and Kshatriyas in Coastal Andhra.
The Kapus of neighbouring villages, following the bonds of blood and caste, also participated in the attack headed by the Kapus of Lakshimpeta. 26 year old Chittari Sridevi, Borada Kasalu, Nivirti Ramudamma, Nivirti Venkatamma were widowed and rendered helpless by this gruesome attack. Most of them are between the ages of 30-40, all mothers. Women who had husbands at 5 in the morning lost them by 7.30. What was their crime?
Was it because 80 Dalit families chose to cultivate 60 acres of government land? Joint Collector Satyanarayana had allocated this land to the Dalits in 2002 and they had divided it among themselves, every family getting 45 cents of land, and started tilling the land. Is it a crime for Dalits to cultivate land in this country? Should that cause burning rage among others? The Chief Minister Kiran Kumar Reddy's visit to the village, even before the dead were laid to rest, and announcement of nominal compensation, was an attempt to pre-empt any demand for a CBI probe and an indicator of his upper caste feudal loyalties. Why are these powerful people who order a CBI probe into every trivial issue not ordering one into this great tragedy? Is it because they are scared of big people being caught?
These are the facts disclosed by Lakshimpeta victims Chittari Gangaiah, Gongoda Gangaiah, Nivirti Simhachalam, Nivirti Tirupati Raju and Bodisingu Ramu: The lands they are cultivating now were acquired from various castes ten years ago when the Madduvalasa reservoir was being built. The government had paid full compensation to the landowners when the land was acquired. Now it is assigned land and the government has every right to allot it to anyone. Why did not the Chief Minister announce that he was allotting this 250 acre land to the Dalits even after so much blood has sunk into it now? Here, the Chief Minister has taken an anti-Dalit stand. This is Dalit Minister Kondru Murali's constituency.
It is shameless that Dalit Ministers have neither demanded a CBI inquiry, nor have they urged the government to allot the 250 acres of land to the Dalits but have remained faithful courtiers to the ruling classes and have clung to their seats in their power lust even when fellow Dalits were being cut down with swords. They have forgotten how they became ministers through the reservations Ambedkar had won for them. Today Dalit organizations and left affiliated Dalit, people's organizations are fighting together. This is the historic moment when all pro-people forces have to come together to bend upper caste state power and lead the self-respect movement of the Dalits towards victory.
The unity of Dalit movements determines the form of this resistance. The blood of the Dalits which has sunk into the earth shall not go to waste. History has to answer this question soaked in blood. The martyrs have sounded the great drum of self-respect. The Dalit camp is raising the slogan of self-defense in Lakshimpeta. The Dalits have not lost courage even after losing five people. This battle will not stop until the Dalits win rights over the 250 acres of land. All the forces, under the red and blue banners, which have come together for this movement, should not rest until these demands are met.
Andhra Pradesh Dalita Mahasabha shall work together with the victims and other organizations. This Dalit self-respect movement should challenge caste, feudal and political hegemony in these times of historic resistance. Dalits Bahujans Minorities! Put aside your party affiliations and respond to the resounding cries emanating from the blood drenched land. Prepare as Dalit warriors for battle. History belongs to the oppressed, not the oppressors. Revolt is the way to victory.
We have taken up a 'Chalo Hyderabad' programme on July 17th to take forward this movement. We request all to participate.
Update: 
Program to take forward the Movement
~ A Representation is being given to State Human Rights Commission on June 27th
~ Protest rally to be organized as 'Chalo Srikakulam' on July 2nd
~ Chalo Hyderabad on July 17th
Demands
• CBI enquiry must be ordered to thoroughly investigate the circumstances that led to the brutal massacre.
• The state government should support every victims' family with Rs.10 lakhs. One person from each victim family should be accommodated with a government job. All the dalit children in the village should be admitted in AP Residential Schools.
• 250 acres of assigned land should be handed over to dalits.
• Action should be taken against all the culprits responsible for this attack under the provisions of the SC/ST (Prevention of Atrocities) Act, 1989.
• Botsa Vasudeva Rao Naidu should be booked as A1 and all the accused should be arrested within ten days. The main abettors Botsa Satyanarayana and others should not be spared. 
• Special court should be established in Lakshimpeta village and ensure that justice is delivered within six months.
[Translated from Telugu by Kuffir]