Showing posts with label కార్తీక్ నవయాన్. Show all posts
Showing posts with label కార్తీక్ నవయాన్. Show all posts

Wednesday, June 5, 2013

Kalekuri Prasad = కలేకూరి ప్రసాద్



క నిజయితి గల వ్యక్తి తనను తను అంతం చేసుకోవడానికి, ఒక్క నమ్మకం వమ్ము అయితే చాలు, కానీ కలేకూరి ప్రసాద్ కు తను నమ్మిన మూడు నమ్మకాలూ వమ్ము అయినాయి, ఒక్కటి. నిజాయితి లేని, విప్లవకారులుగా చలామణి అవుతున్న నకిలీలు, రెండు రాజకీయలలో బాగంగా ప్రేమికురాలుగా నటించిన ప్రేమికురాలు, మూడు నిజయితిలేని దళిత నాయకత్వం. కలేకూరి ప్రసాద్ కి తాగుడు నేర్పింది, తాగుబోతుగా ప్రచారం చేసింది పై మూడు కేటగిరి లకూ చెందిన వ్యక్తులే. కలేకూరీ ప్రసాద్ తాగడం వల్ల అతని శరీరం నాశనం అయింది, ప్రక్కన ఉన్న స్నేహితుల డబ్బులు కర్చు అయినాయి అనే రెండు చిన్న నష్టాలు జరిగాయి కానీ, అతన్ని తాగుబోతుగా ప్రచారం చేయడం వల్ల సమాజం ఒక నిజాయితీ కలిగిన మేధావిని కోల్పోయింది. తాగడం వల్ల జరిగిన నష్టం కంటే, తాగుబోతుగా జరిగిన ప్రచారం వల్ల జరిగిన నష్టం ఎక్కువ.
 వ్యవస్తీకరించబడని వ్యక్తిగా, తాగుబోతుగా ప్రపంచానికి ప్రచారం చేయబడిన కలేకూరి ప్రసాద్ ఒక నిజాయితీగలిగిన మేధావి, కవి, రచయిత, సాహితి విమర్శకుడుల గొప్ప భావుకుడు. అతను ఒక పోస్ట్ మోడెర్నిస్ట్ కాదు యే ఎజెండా లేకుండా ఎప్పుడు బ్రతకలేదు. మనుషులంతా స్వచ్చంగా, సమానంగా, సమగ్ర సంస్కృతిక విలువలతో బ్రతకాలని తపించిన ఒక తాత్విక భైరగి. తనకంటూ ఏమీలేని నిజమైన బౌద్ధ బిక్షువు, నిజమైన కమ్యూనిస్ట్. ఒక పూర్తికాలం సామాజిక కార్యకర్త. పీపుల్స్ వార్ వ్యవస్థాపకులలో ఒకరు, ప్రముఖ దళిత విప్లవ మేధావి కె. జి‌. సత్యమూర్తి లాగా కలేకూరి ప్రసాద్ కూడా  ఏమి దాచుకోలేదు, వారిద్దరి జీవిత ఆచరణ లో సారూప్యత ఉంది. నిజానికి వీరిద్దరికి వ్యక్తిగత జీవితం అనేదే లేదు. వీరిద్దరు సమాజనికి అంకితమైన గొప్ప సామాన్యులు.
కలేకూరి ప్రసాద్, అందరూ వ్యక్తిగతమైన విషయాలనుకొనే పెళ్లి, సెక్స్, ఆస్తి, పేరు ప్రతిష్టలు చివరికి తాను రాసిన రచనలు అన్నీ ఏ విషయాలను వ్యక్తిగతం అనే ముసుగు కింద దాచుకోలేదు, తన జీవితాన్ని గురించిన ఏ విషయాన్ని అయిన ఎవరితోనైనా పంచుకొనేందుకు ఏ క్షణంలోనైనా సిద్దంగా ఉండే అత్యంత అరుదైన మనిషి.
కలేకూరి ప్రసాద్ ని తాగుబోతుగా  తయారు చేయడంలో, తాగుబోతుగా ప్రచారం చేయడంలో కులం ఉంది, కుట్ర ఉంది. తాగుడు అలవాటు అయిన నుండి, ఏ రోజు తాగకుండ లేడు, అలాగని తగినంత కాలం, చచ్చే వరకు  ఏ రోజు తాగి స్పృహ కోల్పోయిన సందర్బం లేదు, తాగిన తాగక పోయిన తాను చెప్పదల్సుకున్న విషయాన్ని అంతే సమర్ధంగా అంతే నిజాయితీతో చెప్పగలిగిన వ్యక్తి కలేకూరి ప్రసాద్. తాగుబోతుగా ప్రచారం జరిగింది చాలా ఎక్కువ. ఒకవేళ ప్రచారం జరిగినంత అతను తాగి ఉన్నట్లయితే, రెండు దశాబ్దాలుగా బ్రతికిఉండేవాడు కాదు. మనచుట్టూ అంతకన్నా ఎక్కువగా తాగే మేధావులు, కవులు ఉన్నారు కానీ వారికి తాగుబోతు బిరుదులు మాత్రం ఈ సమాజం యివ్వలేదు అతను తాగింది మాత్రం తక్కువ ప్రచారం మాత్రం ఎక్కువ
384769_2368545425381_485425323_n

అతనిది సంచార జీవితం, ఏమీలేనివాడికి ప్రపంచమంత తన సొంతం. తనకంటూ ఒక గిరిగీసుకున్న కుటుంబం లేనివాడికి మానవాళి అంతా కుటుంబ సబ్యులే, సరిగ్గా అలాగే బ్రతికాడు, సరిగ్గా అలాగే చని పోయాడు. మే 17 2013 నా ఒంగోల్ లోని అంబేడ్కర్ భవన్ లో చనిపోయాడు, ఎప్పుడు కూడా తన కుటుంబం తో లేడు. ఒకరోజు కటిక దరిద్రన్ని అనుభవిస్తే, మరుసటిరోజు 5 నక్షత్రాల హోటల్ లో బస చేశాడు, ఒకరోజు లారీలో ప్రయాణం చేస్తే ఆ మరుసటి రోజే విమానంలో ప్రయాణం చేశాడు, అందుబాటులో ఉన్న ఏ సౌకర్యమైన, అసౌకర్యమైన అది తన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేది కాదు. అతని ఆచరణలో తేడా ఉండేది కాదు. లోయర్ టాంక్ బాండ్ లో ఉన్న అంబేడ్కర్ భవన్ ముందు మురికి కాలవ ప్రక్కన, ప్రజాశక్తి బుక్ హౌస్ ముందు రోడ్ ప్రక్కన నిద్ర పోయిన రోజులు కూడా కలేకూరి ప్రసాద్ జీవితంలో ఉన్నాయి. ఆర్దికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం నుండి వచ్చి, తోటి కుటుంబ సబ్యులు ఆర్ధికంగా అనేక అవకాశాలు  కల్పీంచడానికి సిద్దంగా ఉన్నా, అన్నీ సౌకర్యాలను తిరస్కరించి జీవితాంతం తన చుట్టూ ఉన్న పేదలతో, స్నేహితులతో జీవితమంతా గడిపేశాడు.
మేధావులతో ఎలా మాట్లాడేవాడో, సామాన్యులతో అలాగే మాట్లాడేవాడు, స్త్రీలతో ఎలా మాట్లాడేవాడో పురుషులతో అలాగే మాట్లాడేవాడు, పెద్దలతో ఎలమాట్లాడేవాడో పిల్లలతో అలాగే మాట్లాడేవాడు. మనుషుల ఆర్థిక సామాజిక, స్థాయినిబట్టి వారికిచ్చే గౌరము మారేదికాదు, మనుషులందరిని సమానంగా చూడడం అనే ఒక గొప్ప మానవీయ విలువను కలేకూరి ప్రసాద్ పాటించినంతగా మరెవరూ పాటించలేదు.
మనుషులంటే అపారమైన ప్రేమ అతనికి, పరిచయస్తులైన, అపరిచయస్తులైన, అప్పుడే పరిచయమైన వారయిన ఏమాత్రం తేడా లేకుండా అందరినీ ఒకే రకంగా పలకరించడం, గౌరవించడం కలేకూరి ప్రసాద్ కె సాధ్యం.  ఎవరైనా ఏదైనా సమస్యతో కలేకూరి ప్రసాద్ దగ్గరికి వస్తే, ఆ సమస్య అతనికి అర్థమైన మరుక్షణం నుండి ఆ సమస్య అతనిదే అయిపోతుంది, దానిని పరిష్కరించడానికి తనకు అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను శోదించి అందులో పూర్తిగా ఇమిడిపోయి అది పరిస్కారం అయ్యే వరకు వదిలిపెట్టేవాడు కాదు.
ఎన్నో గొప్ప గొప్ప సిద్ధాంతాలు చెప్పి, ఏ మాత్రం పాటించని వ్యక్తులంటే నిజానికి ఎవరికైనా అసహ్యం వేయాలి, కానీ ప్రసాద్ ఎవరిని అసహ్యించుకోలేదు కానీ వారిని చాలా సున్నితంగా విమర్శిచేవాడు. ఆ విమర్శ కేవలం విమర్శ కాకుండా వారు ఏ విధంగా మారాలో సూచించే విధంగా ఉండేదే గాని విమర్శ కేవలం విమర్శ దగ్గర నే ఆగిపోయేది కాదు. కలేకూరి ప్రసాద్ ఎవరినైనా విమర్శిస్తున్నాడు అంటే అదీ ఆ విమర్శ కు గురి అవుతున్న వ్యక్తికి తప్పకుండ ఉపయోగ పడేది అయిఉండేది. అందుకే కలేకూరి విమర్శలంటే అవి ఎదుటి వారి అభివృద్దికి సలహాలు మరియు సూచనలు మాత్రమే. అందుకే కలేకూరి విమర్శిస్తే కోపగించుకొనే వ్యక్తులు లేరు అందరూ అతని విమర్శ్లను స్వీకరించిన వారే.
 390632_2368548025446_1608039444_n
కలేకూరి ప్రసాద్ నాకు చాలా లేట్ గా పరిచయం అయ్యాడు, 2005 మే లో చంపాపేట్ లో ఉండే మా రూమ్ తెనాలి వెంకటేశ్వర్లుతో కల్సీ వచ్చాడు అప్పటినుండి 2005 నవంబర్ వరకు, మద్య మద్యలో బయటకు వెళ్ళినా,  దాదాపు మాతోనే ఉన్నాడు . అదే రూంలో మా అన్న, సామాజిక కర్యాకర్త  బత్తుల ప్రకాష్ నేను కలసి ఉండేవాళ్లం, కె.జి. సత్యమూర్తి మా రూమ్ కి తరుచూ వాస్తు ఉండేవారు. అతనితో మేము బరించిన ఏకైక సమస్య డబ్బులే, యింకే సమస్యలేదు.
ఎన్నో రకాల విషయాలపై చర్చలు చేసిన, కలేకూరి ప్రసాద్ కులాంతర వివాహాలపై నేను మొదలు పెట్టిన చర్చ లో చాలా సీరియస్ గా నాతో చర్చకు దిగాడు. చంపాపేట్ చౌరస్తా నుండి ఈస్ట్ మారుతినగర్ రూమ్ కి వెళ్ళే వారకు, దాదాపు 20 నిమిషాలు కులాంతర వివాహలి ఎలా ఉండాలనే విషయాన్ని వివరించాడు. కాలాంతర వివాహలంటే వధువు వైపున ఉండే వందలాది కుటుంబాలు వరుడివైపున ఉండే వందలాది కుటుంబాల మద్య బందుత్వానికి ఈ వివాహాలు దారి తీయాలని. కానీ అది జరగక పొగా, రెండు సమూహాల మద్య శతృత్వానికి ఈ కులాంతర వివాహాలు దారి తీస్తున్నాయని చెప్పాడు. దానికి విప్లవ కుటుంబాలు తే చెప్పుకుంటున కుటుంబాలు కూడా మినహాయింపుగా లేవని చప్పడు.
2009 మే నెలలో తన చెల్లెలు దగ్గరికి వెళ్ళి కేవలం నెల రోజులు ఉండి, ఇక అక్కడ ఉండలేనని హైదరాబాద్ కు వచ్చేశాడు, వస్తు వస్తు మా అన్న, కలేకూరి చెల్లెలు తాగుడు మాన్పించే చికిత్స కోసం తీసుకువెళ్లారు. అది అర్ధమైన ప్రసాద్, వారి నిర్ణయాన్ని వ్యతికేరించి హైదరాబాద్ కు వచ్చేశాడు. జులై 2009 నుండి డిశంబర్ 2009 వరకు మా అన్న బత్తుల ప్రకాష్ వరంగల్ తీసుకువెళ్లి అక్కడి మిత్రులు, సిద్దేశ్వర్, నరేందర్ ల సహాయంతో ఒక హోటల్ లో పెట్టి అవసరమైన చికిత్స చేయించారు. అక్కడ ఉన్నపుడే, తనకు తెలియకుండా తాగుడు మాన్పించే చికిత్స చేయిస్తున్నారని అనుమానించి హోటల్ రూమ్ లోనుండి కిందకి దుకాడు, నిజానికి అది డి అడిక్షన్ ట్రీట్మెంట్ కాదు. కాలు విరిగింది ఆ తర్వాత కావలిసినా చికిత్స చేయించి అతని సొంత ఊరు కంచికచెర్ల కు పంపించారు.ఇక అప్పటినుండి దాదాపు చనిపోయే వరకు కంచికచర్ల, ఒంగోల్ లోని మిత్రులు పల్నాటి శ్రీరాములు మరియు యితరుల వద్ద గడిపాడు. అప్పటినుండి హైదరాబాద్ వచ్చింది తక్కువ. ఎప్పుడు వచ్చిన ఒకటి, రెండు రోజులు తప్ప ఎక్కువ రోజులు ఉండలేదు.
కలేకూరి ప్రసాద్, ఆంధ్ర ప్రదేశ్ సాహితి రంగం లో ఒక సంచలనం. జన నాట్య మండలి తొలి నాల్ల లో రాసిన ప్రతిపాట లో కలేకూరి ప్రసాద్ ది కనీసం ఒక చరణం అయిన ఉంటుంది  జన నాట్య మండలి కార్య కర్త, డప్పు ప్రకాష్ ఇచిన సమాచారం ప్రకారం కలేకూరి ప్రసాద్ ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు వందలాది  పాటలు వ్రాసారు. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు ఉన్నాయి.  నిజానికి ప్రసాద్ ఏది మాట్లాడినా కవిత్వంగా ఉండేది, అతని మాటలు వినడానికి చాలా మండి ఆసక్తి చూపించేవారు.
నా మొదటి పుస్తకం, దలిత్ ఆవాజ్ ఆవిష్కరణ సభలో మార్చి 10, 2007 నాడు ప్రెస్ క్లబ్ లో మాట్లాడినాడు, ఆ రోజు సభ 9 గంటలకు ముగియాలి, కానీ కలేకూరి ప్రసాద్ 8:45 కు వచ్చాడు, అతని రాకతో వెళ్లిపొవాదానికి సిద్దపడిన వాళ్ళంతా మళ్ళీ కూర్చున్నారు, దాదాపు 40 నిమిషాలు ఉపన్యసించాడు, యే ఒక్కరూ కదలలేదు. మీటింగ్ ఆపేయమని వచ్చిన ప్రెస్ క్లబ్ సిబ్బందికూడా శ్రద్దగా విన్నారు. అ తర్వాత రోజున అదే పుస్తకానికి విశ్లేషణ వ్రాశాడు అది 2007 మార్చ్ 11 నాడు వార్తా పత్రికలో అచ్చు అయింది. విశ్లేషణ ఒకే పుస్తకానికి అయిన, మాట్లాడిన పదాలు ఏవి రాయలేదు. అది అతనికి తెలుగు బాష పైన ఉన్న పట్టు.
దాదాపు 70 పుస్తకాలు ఇంగ్లీష్ నుండి తెలుగు లోకి అనువాదం చేసాడు, చేగువేరా లాంటి అంతర్జాతీయ విప్లవ నాయకులను తెలుగు ప్రజలకు పరిచయం చేసింది కలేకూరి ప్రసాద్, స్వామి ధర్మతీర్థ రాసిన హిందూ సామ్రాజ్యవాద చరిత్ర, అరుంధతి రాయ్ రాసిన తే గొద్ ఒఫ్ స్మాల్ థింగ్స్ లాంటి అతి ముక్యమైన పుస్తకాలను అనువాదం చేసింది కలేకూరి ప్రసాద్. ఈ రాష్ట్రంలో అత్యంత గొప్ప విద్యా వేత్త గా పేరున్న ఒక పెద్దాయన, కలేకూరి ప్రసాద్ తో అబ్దుల్ కలామ్ పుస్తకాన్ని అనువాదం చేయించి తన పేరుతో అచ్చు వేయింధుకున్నారు. ఎలా అనేక వందల పుస్తకాలను అనధికారంగా అనువాదం చేసి పెట్టాడు
ఒకవేళ నువ్వు చచిపోతే నీపై నేను ఒక వ్యాసం వ్రాస్తాను, ఆ వ్యాసానికి “దళిత తాత్విక భైరగి కలేకూరి ప్రసాద్” అనే టైటిల్ పెడతాను అని చెప్పి, ఈ టైటిల్ బాగుందా అని ఆడిగాను, దానికి ఎలాంటి భావోద్వేగాలు లేకుంట “బాగుందిరా” అన్నాడు. ఒక్కసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు అడిగినా చిన్నన నవ్వి. నువ్వు ఎలా వ్రాయగాలవో అలాగా ఉందిరా నీ వ్యాసానికి టైటిల్, అనేవాడు. కానీ కలేకూరి ప్రసాద్ ని టైటల్స్ వద్దు అనే ఉద్దేశ్యంతో ఈ వ్యాసానికి ఆ టైటిల్  పెట్టలేదు. కలేకూరి ప్రసాద్ అంటే కలేకూరి ప్రసాద్ అంతే.
Photo0151
చావుని, ఆ లేక్కకొస్తే జీవితాన్ని ఎ మాత్రం లెక్క చేయని మనిషి కలెకురీ ప్రసాద్. జీవితాన్ని ఎగతాళి చేసిన మనిషి, విప్లవ సిద్ధాంతాలు వల్లిస్తూ మత సంప్రదాయాలతో బ్రతుకులు వెళ్ళదీస్తున్న ప్రధాన స్రవంతి విప్లవ మేధావులుకు, నాయకులకు, కవులకు సాహితి విమర్శకులకు అంతు బట్టని, అంతు చిక్కని గొప్ప ఆచరణ కలేకూరి ప్రసాద్ ది. ఆచరణ లేని ఆదిపత్యకుల విప్లవ వాదుల పెరట్లో పాములాంటి వాడు కలేకూరి ప్రసాద్.
వ్రాయటమంటే ఇంత నీరసం ఎప్పుడు రాలేదు, కలేకురి గురించి వ్రాయటమంటే, చాల ఉంది కదా ఒక్క వ్యాసంలో ఏమి వ్రాయగలం అని? కలేకూరి ప్రసాద్ కవిత్వం,పాటలు, సాహిత్యం, వ్యాసాలు,  అనువాదాలు, సాహితి విమర్శల గురుంచి ఎంతైనా వ్రయవచు. గ్రంధాలే అవుతాయి. అంతకన్నా అతని వ్యక్తిత్వం గురించి సామాజిక వ్యక్తిగత ఆచరణ గురించి ఎంతైనా వ్రాయవచ్చు. అదృష్ట వశాత్తు కలేకూరి ప్రసాద్ ఒక అంటరాని కులంలో పుట్టాడు, అందుకే అతను పేదలకు, దళితులకు, పీడితులకు అందుబాట్లో ఉండే మేధావి కాగలిగాడు. అదే ఒక ఆధిపత్య కులంలో పుట్టి ఉన్నట్లయితే అతను ఈ ప్రజలకు అందుబాటులో కి వచ్చేవాడు కాదు, ఏ విశ్వ విద్యాలయంలోనో, ఏదో ఒక డిపార్ట్మెంట్ లో స్మారక ఉపన్యాసం అయిపోయేవాడు. కానీ యిప్పుడు ఆ ప్రమాదం లేదు. అతను ప్రజల్లో బ్రతికి ఉంటాడు
కలేకూరి ప్రసాద్ రచనలు అన్నీ ప్రచురించి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, అతని కులం రీత్యా ఈ పని ఏ విశ్వవిద్యాలయం చేయక పోవచ్చు. అది అతను కోరుకోలేదు కూడా, కానీ ఆ రచనల ప్రసంగికతను బట్టి, దళిత విప్లవ సామాజిక రంగం లో పని చేస్తున్న వారూ ఆ పని చేయాలి. అది కూడా కలేకూరి ప్రసాద్ కోసం కాదు, మన కోసం. అందులో బాగంగానే రవిచంద్రన్ అనే దళిత హక్కుల కార్యకర్త కలేకూరి ప్రసాద్ ని అతని జీవితం పై, సాహిత్యం పై ఇంటర్వ్యూ చేసి ఆ వీడియొలను దలిత్ కెమెరా వెబ్ చానల్ లో అప్లోడ్ చేశారు
అనేక పరిమితులనుబట్టి, అనేక విషయాలు ఈ వ్యాసంలో రాయలేదు, ఈ వ్యాసం కలేకూరి ప్రసాద్ అనే ఒక గ్రంధానికి కేవలం ముందుమాట లేదా వెనుక మాట లాంటిది.
                                                                                                                                                                                                                   -      బత్తుల కార్తీక్ నవయన్

Tuesday, June 12, 2012

సింహల చరిత్ర కారుడు ప్రొఫెసర్ భుక్యా భంగ్యా -Subjugated Nomads – పుస్తక సమీక్ష By Karthik Navayan

సింహలనుంది ఒక చరిత్రకారుడు ఉద్బవించే వరకు వేటగాడు చెప్పే పిట్ట కథలు కట్టు కథలే చరిత్రగా చలామణి అవుతాయి అనేది ఆఫ్రికాన్ సామెత (Until lions have their historians, tales of the hunt shall always glorify the hunter). ఈ దేశం లో ఆదిమ జాతులు ఆదిమ కులాలు తమ తమ చరిత్రలను తిరగ రాస్తున్న సమయమిది అంటరానితనం అవమానాల పెనుమంటల పెనుగులాట లో నుండి తమ తమ గతాన్ని తవ్వి ఇదిగో ఇది మా చరిత్ర అని వర్తమాన  చరిత్రకారుల డొంకతిరుగుడు వాదనలకు సవాల్ విసురుతున్న నూతన చరిత్రకారుల యుగం ఇది.




ఇపుడు పేదలుగా, అంటబడని వారుగా, కేవలం ఓటర్ లుగా, ప్రబుత్వాలు ప్రవేశపెట్టే వివిధ పథకాలకోసం ఎదిరిచుసే అర్బకులుగా ఉన్న ఆదిమ జాతుల గత చరిత్ర ఏమిటి? ఒక నాలుగైదు వందల సంవత్సరాల కిందకి వెళ్లి చుస్తే వారు ఇలాగే ఉన్నారా?  వారి బ్రతుకులు ఇలాగె  ఉన్నాయ? అనే అనేకానేక ప్రశ్నలకు ప్రస్తుతం చలామణిలో ఉన్న పేరు మోసిన చరిత్రకారుల వద్ద ఆయ ఆదిమ జాతులను సంతృప్తి పరిచే సమాదానం లేదు. ఇది మన ప్రస్తుత విద్యావ్యవస్థ లోని, విద్యాలయాలు చేస్తున్న వివిధ చరిత్ర పరిశోదనల్లోని  డొల్లతనాన్ని తెలియజేస్తుంది. విద్య వ్యవస్థలోని అప్రజస్వమిక దొరనులను తెలియజేస్తుందిప్రస్తుతం సామజిక ఆర్ధిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనానికి గురి అయిన కులాలు, జాతులు తమ తమ నిజ  చరిత్రలను తాము మాత్రమే బయటికి తీసుకురావలసి వస్తున్న పరిస్థుతులు కూడా చాల ఆలోచించవలసినవి. ఎందుకు అగ్రకుల చరిత్రకారులు ఈ ఆదివాసుల, అంటారని వారి చరిత్రలను గూర్చి నిజానిజాలను రాయలేక చెప్పలేక పోతున్నారో కూడా ఆలోచించవలసిందే. ఉన్నత విద్య వ్యవస్థ  ఇప్పటికి కొనసాగిస్తున్న కుల, జాతి వివక్ష లో బాగమే అడుగు కులాల, జాతుల నిజ చరిత్రలను దాచి పెట్టడం.అని బావించ వలసి వస్తుంది.ఇంకా చెప్పాలంటే అగ్ర కుల చరిత్రకారులు గనక ఈ దేశ నిజమైన చరిత్రను రికార్డు చేయడమంటే  తమ తమ తాతలు, తండ్రులు ఈ దేశం లోని అడుగు కులాలపై, జతులపై సాగించిన అమానవీయ అణచివేత దోపిడీ దౌర్జన్యాలను రికార్డు చేయడమే.  అంత నీతి, నిజాయితి గలిగిన చరిత్రకారులు ప్రస్తుతమున్న విద్య రంగంలో దుర్బినివేసి వెతికినా దొరకరు. అందుకే అడుగు కులాలు, జాతులు తమ తమ చరిత్రలను తవ్వి తీయవసలిన అవసరం ఇపుడు వచ్చింది

ఆ క్రమంలో, ఆ కర్తవ్య నిర్వహణలో బాగంగా రాసిందే  ప్రొఫెసర్ భూక్యా  భంగ్యా  రాసిన ” అణచబడిన సంచారులు”(నిజాం పాలనలో లంబాడీలు)  (subjugated  Nomads – the lambadas  under the  rule of  the  nizams ) అనే  తన పీ ఎచ్ డీ పరిశోదన గ్రంధం. లండన్ లోని  Warwick university  లో మూడు సంవస్తరాల వ్యవదిలో ఈ పుస్తకాన్ని రాసారు. దీనిని ఒరిఎంట్ బ్లాక్ స్వాన్ అనే ప్రచురణ సంస్థ 2010  లో ప్రచురించింది. 255  పేజీల ఈ పుస్తకం లంబడిలా గత చరిత్రను మన ముందు ఉంచుతుంది. ప్రస్తుతం అనువాద దశలో ఉన్న ఈ పుస్తకం త్వరలో తెలుగులో కూడా వస్తుంది. లంబడిలా నిజమైన గతాన్ని తెలుసుకోవాలనే వారికీ ఇదొక కరదీపిక  ఈ పుస్తకంలో ఎ విషయం కూడా అధరాలు లేకుండా లేదు. ప్రతి వాక్యానికి రేఫెరన్స్ ఉంటుంది. ఈ పుస్తకాన్ని రాయడానికి ప్రొఫెసర్ భూక్యా  భంగ్యా  నిజాం పరిపాలన కు సంబందించిన అనేక రాత  ప్రతులతో పాటు నిజాం/ బ్రిటిష్ కాలం నాటి చట్టాలతో పాటు  అనేక  వేల పుస్తకాలను చదివారు. ఆ పుస్తకాల లిస్టు ఈ పుస్తకం చివరలో ఇచారు
ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, అణచబడిన, అంటారని జాతుల చరిత్రలను విద్య రంగ పరిధిలోని తీసుకోచిన మొట్ట మొదటి పుస్తకం  యిదే. ఈ దారీ లోనే అన్ని అణచబడిన కులాలు అణచబడిన జాతులు  తమ తమ నిజమైన చరిత్రలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయ దళిత ఆదివాసి సమూహాలకు చెందిన విద్యా వేతలైన ఈ పని చేయవలసి ఉంది
ఒకప్పుడు స్వయం సంవృద్ది తో రాజీలేని జీవితం గడిపిన ఆదిమ జాతులు వలస పాలనా కాలంలో బ్రిటిష్  వారితో కలిసి  వారి తాబెదరులయిన స్థానిక అగ్ర కుల  అధికారులు ప్రవేశపెట్టిన పరిపాలన సంస్కరణల వల్ల తమ తమ వ్రుతులు, ఉపాది కోల్పోయి. తమ జీవన వైవిధ్యాన్ని కోల్పోయి ప్రస్తుతపు పేదవారుగా అన్ని రంగాలలో వెనుకబడిన జాతులుగా మిగిలి పోయారు. ఈ చారిత్రక పరిణామా క్రమాన్ని పట్టి యిచేదే ఈ పుస్తకం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే లంబాడ జాతి ఆయా సంస్కరణల వాళ్ళ తమ జాతికి ఉనికికి ఏర్పడిన ముప్పును అధిగమించేందుకు అనివార్యంగా తమను తాము హిందూ మతం లో ఒక కులంగా బావించుకొని బాగామైపోయే క్రమాన్ని ఈ పుస్తకం పట్టి చూపిస్తుంది
ప్రధానంగా హైదరాబాద్ డెక్కన్ లోని లంబాడి జాతి ఎ సంస్కరణల వల్ల, ఎ పరిపాలన విధానాల వల్ల తమ సాంస్కృతిక వైవిధ్యాన్ని కోల్పోయి  వర్తమాన కాలం లో  తమ తమ కన్న   బిడ్డలను అమ్ముకొనే దుర్బర పరిస్థితులకు గరయ్యిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. ఒక నాలుగైదు వందల సంవత్సరాల వెనకకు వెళ్లి చుసినట్టైతే లంబాడీలు ఇపుడున్న సామజిక ఆర్థిక పరిస్థుతులకు బిన్నమైన పరిస్తులను కలిగి ఉన్నారు. యిప్పటిలగా అపుడు వారు తమ కన్నా బిడ్డలను అమ్ముకొనే దుర్బర దారిద్ర్య పరిస్తులలో లేరు. వారు స్వయం సంవృద్ది కలిగిన అప్పటి వ్యవసాయ మరియు వాణిజ్య రంగాలకు అత్యంత ముఖ్యమైన రవాణా రంగాన్ని నిర్వహిస్తున్న వారు. అంతే కాకుండా అపుడు సైన్యాలు యుద్దానికి ఎక్కడికైనా బయలుదేరవలసి వస్తే ఆ సైన్యానికి సంభందించిన యుద్ద సామగ్రిని మరియు ఆహార సామగ్రిని సైన్యం తో పాటు తరలించేది లంబాదీలే
లంబాడీలు ప్రధానంగా పశువుల పెంపకం దారులు ఒక్కొక్కరికి వందలు మరియు వేల సంక్యలో పశువులు ఉండేవి. ఈ పశువుల ద్వారానే వీరు రావణ రంగాన్ని నిర్వహించేవారు. హైదరాబాద్ డెక్కన్ లోని అప్పటి వాణిజ్య వ్యాపార వ్యవస్థ అంత లంబడిలా పై ఆధారపడి మనుగడ సాగించింది. వ్యవసాయ ఉత్పతులైన ఉల్లిగడ్డలు, బియ్యము, గోదుమలు మార్కెట్ కు తరలించడానికి లంబదీలే ప్రధాన ఆదారం. బ్రిటిష్ వలస పాలనా కంటే ముందు రవాణా రంగం అంత లంబాడీల పైననే ఆధారపడి ఉండేది.
నూతన సాంకేతికత వాళ్ళ వచ్చిన రైల్వీలు, తద్వారా వచ్చిన పెద్ద కంపనీలు  చిన్న స్థాయి వ్యాపారంగా కొనసాగిన లంబడిలా రావణ రంగాన్ని దెబ్బతీసి వారిని రోజు వారి కూలీలుగా మార్చివేశాయి. అలాగే బ్రిటిష్ వారు తీసుకోచిన చట్టాలు ( cattle  tress pass  act – 1857 , మరియు criminal  Tribes  Act )   అన్ని లంబడిలా జీవితాలను వారి జీవన వైవిధ్యాన్ని నియంత్రించేవి మాత్రమే కాకుండా వారి పశువుల పెంపకాన్ని కూడా నియంత్రించాయి మరియు లంబదిలను నేరస్త జాతిగా ముద్ర వేయడానికి దోహద పడ్డాయి
మామూలుగానైతే  ఏదైనా పంటను లంబదిలకు చెందిన పశువులు నాశనం చేసినట్లయితే, లంబాడీలు ఆయ పంట చేనులను పశువుల పేడతో నింపడం ద్వార పరిహారం చెల్లించేవారు కానీ బ్రిటిష్ పాలనా కాలం లో వచ్చిన చట్టాల వలన చెల్లించవలాసిన పరిహారం రుపయలలోకి మారి  అదీ  పెరిగి లంబాడీలు తమ తమ పశువుల ను దూరం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే దోపిడీలు అనేవి కూడా లంబదిలకు పుట్టుకతో వచినవి కాదు వారసత్వంగా వచ్చినది కాదు. బ్రిటిష్ వలస పాలనా సంస్కరణలు వారి తాబెదారులైన స్వదేశీ అగ్రకుల పలక వర్గాల విధానాల వలన తమ తమ జీవనోపాదులు కోల్పోయి గత్యంతరము లేక ఎంచుకున్నదే. ఈ విషయాన్నీ ఈ పుస్తకం అనేక చారిత్రక ఆధారాలతో నిరూపిస్తుంది
అణచబడిన, అంటారని, ఆదివాసి ప్రజల నిజ చరిత్ర లను విద్య వ్యవస్థ పరిదిలోని తీసుకు రావాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం నెరవేర్చింది ఇలాంటి పుస్తకాలు అన్ని ఆదివాసి అంటారని సమూహాలపై రావాల్సిన అవసరం ఉంది. అనేక అంటారని కులాలు తెగలు క్రమ క్రమంగా అంతరించి పోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ పేరుతో అటవీ సంరక్షణ పేరుతో అడవి జంతువులను అడవులను కాపాడేందుకు ప్రణాళికలు వేస్తున్న పాలకులు అడవే ఆధారంగా జీవనం సాగిస్తున్న ఆదివాసులను ఇతర అంటారని  సమూహాలకు సంబంధించి ఎ ప్రణాళిక లేదు ఉన్న పతకాలేవి వారి అవసరాలను తీర్చేవిధంగా లేవు కావున ఆయ సమూహాల పై వారి జీవన వైవిద్యాల పై పరిశోదన అనేది తక్షణం అవసరం
ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్టీ లలో 30 వరకు తెగలు ఉన్నాయి ఏవో కొన్ని తెగలు తప్ప ఇంకా అనేక తెగలు విద్య కు వైద్యానికి నోచుకోని దశలోనే ఉన్నాయి అలాగే ఎస్సీ లలో 61 కులాలు ఉంటె మాల మాదిగా తప్ప మిగతా కులాలు ఎవరికీ తెలియవు వారు ఎ పరిస్తులలో జీవనం సాగిస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. నాగరికులుగా చెప్పుకుంటున్న ప్రస్తుత సమాజం లో నుండి కొన్నీ తెగలు కులాలు క్రమ క్రమంగా ఆర్తనాదాలతో అంతరించి పోతున్నాయి యిది ఎ సమాజానికైనా మంచి పరిణామం కాదు. ఈ పరిస్థితి వారి గురుంచి చరిత్రకారులు, మేధావులు, విద్యవేతలు తక్షణం ఆలోచించవలసిన అవసరం ఉండి. ఆయా అణచబడిన సమూహాలనుండి చరిత్రకారులు ఉద్బవించ వలసి ఉన్నది. వర్తమాన  చరిత్ర కారుడు ప్రొఫెసర్ భూక్యా  భంగ్యా లాగే  అనేక మంది సింహాల చరిత్రకారులు ఆయా అణచబడిన జాతులనుండి , కులాల నుండి ఉద్బవించ వలసి ఉన్నది
- బత్తుల కార్తీక్ నవయన్
రిసెర్చ్ స్కాలర్
ఆంగ్లము మరియు విదేశీ బాషల విశ్వ విద్యాలయము
తార్నాక , హైదరాబాద్.

Thursday, April 26, 2012

కవిత్వం లాంటి జీవితం - కార్తీక్ నవయాన్



సత్యమూర్తిని నిజాయితీగా అర్థం చేసుకోగలిగితే అతను కవులకు మహాకవిగా అర్థం అవుతాడు; విప్లవకారులకు గొప్ప విప్లవ నాయకుడుగా అర్థం అవుతాడు. పేదలకు అతనొక మహా పేదవాడుగా అర్థం అవుతాడు. తత్వవేత్తలకు అతనొక గొప్ప తాత్వికుడు. ఒక రచయితను అర్థం చేసుకోవాలంటే అతని రచనలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. సత్యమూర్తిని అర్థం చేసుకోవాలంటే అతని రచనలతో పాటు అతని బ్రతుకును కూడా అర్థం చేసుకోవాలి. 

సాంప్రదాయ అగ్రకుల మధ్యతరగతి విప్లవ నాయకులకు, విప్లవ కవులకు ఉన్నటువంటి అనేకానేక సౌకర్యాలకు సత్యమూర్తి దూరంగా ఉన్నాడు. అతను వాటిని పొందలేక కాదు, కల్పించుకోలేక కాదు. అతను దేనికోసం రాసాడో దానికోసమే బ్రతికాడు. సత్యమూర్తి కవిత్వానికి బ్రతుకుకు మధ్య Contradiction లేదు. విప్లకారుడిగా మారిన తర్వాత అతని జీవిత కాలంలో కేవలం గత మూడు సంవత్సరాలే అంటే తన చివరి రోజులు, తను వదిలి వెళ్ళిన పిల్లల దగ్గర గడిపాడు. 

2009 వరకు ఏదో ఒక కార్యక్రమంలో ఎవరో ఒకరితో తిరుగుతూనే ఉన్నాడు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ ఉన్న తన అభిమానుల వెంటనే ఉండేందుకు ఆసక్తి చూపించేవాడు. ఇక్కడికి వచ్చిన సమయంలో ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చి తన కూతురుతో తిట్లు తింటూ కూడా ఇక్కడే గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అతనిది కవిలాంటి జీవితం కాదు కవిత్వం లాంటి జీవితం. అతని కవిత్వాన్ని జీవితాన్ని వేరువేరుగా చూడలేము. అతను ఏ సిద్ధాంతాలు, ఏ రాజకీయాలు నమ్ముకున్నాడో వాటితోనే కాదు అతను ఏ ప్రజలను నమ్ముకున్నాడో జీవితాంతం అదే ప్రజల మధ్య, అదే పేదల మధ్య బ్రతికాడు. అదే ఇతర కవులకు, సత్యమూర్తికి ఉన్న తేడా. 

సత్యమూర్తితో కలిసి గడిపిన వారు ఎవరైనా ఆ జ్ఞాపకాలను మరిచిపోలేరు. అతని మాటలు, మనం సమస్యలనుకునే వాటిని అతను చూసే దృష్టి చాలా భిన్నంగా ప్రత్యేకంగా ఉండేవి. మనం చిన్న చిన్న విషయాలు అనుకునే విషయాల పట్ల కూడా సత్యమూర్తికి చాలా స్పష్టమైన ఖచ్చితమైన అభిప్రాయాలూ ఉండేవి. ఎంత గంభీరమైన వ్యక్తో అంత హాస్యంగా కూడా ఉండేవాడు. సత్యమూర్తి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నా రూమ్‌లో ఉండేవాడు. ఒకసారి నాకు కావాల్సిన భార్య మా కోసం సీతాఫల పండ్లు తీసుకొచ్చింది. సత్యమూర్తి ఏంటి బాబు అవి అని అడిగాడు, సీతాఫల పండ్లు అని చెప్పాను. ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు. విజయ తీసుకొచ్చిందని చెప్పాను. విజయ తీసుకొస్తే సీతా ఫలములు అంటావేమిటి బాబు అవి విజయ ఫలాలు అన్నాడు. 

సత్యమూర్తి తన 75 సంవత్సరాల వయస్సులో కూడా అజ్ఞాత జీవితం గడిపాడు. అజ్ఞాత జీవితం అంటే హైదరాబాద్‌లోనో బెంగుళూరులోనో కాదు. ఖమ్మం, వరంగల్ జిల్లా అడవుల్లో 2000-2002 సంవత్సరాల మధ్య దాదాపు ఆరు నెలల కాలం అడవిలోనే గడిపాడు. చాలా మంది యువకులకు స్ఫూర్తినిచ్చాడు. అసలు ఆ వయసులో అడవిలోనికి వెళ్ళాలనే ఆలోచనే ఎవరి ఆలోచనలకు అందనిది. అది కేవలం సత్యమూర్తికే సాధ్యం. 

ఒకసారి ఖమ్మం అడవి నుంచి సత్యమూర్తితో కలిసి వస్తుండగా ఒక ప్రశ్న అడగాలనిపించి అడిగాను. అప్పుడు నా దగ్గర పదివేల రూపాయలు సత్యమూర్తి దగ్గర ఇరవై వేల రూపాయలు ఉన్నాయి. నేను ఇలా అడిగాను. 'సర్ ఒక వేళ పోలీసులు మనల్ని పట్టుకుంటే నేను స్టూడెంట్ నని చెపుతాను నా దగ్గర గుర్తింపు కార్డు ఉంది, వారు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే నేను స్టూడెంట్ కాబట్టి ఫీజులు అవి ఖర్చులు ఉంటాయని తీసుకెళ్తున్నానని చెబుతాను. మరి మీరేమి చెపుతారు?'. అపుడు సత్యమూర్తి 'ఒకవేళ పోలీసులు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే ఈ డబ్బులు నావే మీకు కావాలా అని అడుగుతాను' వారికి కావాలంటే యిచ్చేస్తానని అన్నాడు. 

సత్యమూర్తిని లెక్క కట్టేసారు, అతను శ్రీశ్రీ తర్వాత అని లెక్కేసారు. దానికి కొలమానము ఏమిటో? నిజానికి సత్యమూర్తికి ఎవరితో పోలిక సరికాదు. అతను ఎవరి తరువాత కాదు. అతనికి అతనే సాటి. యిక్కడి విప్లవ కవులు అందరూ సత్యమూర్తి ద్వారా స్ఫూర్తి పొందినవారే. సత్యమూర్తి కేవలం కవి మాత్రమే కాదు అతను పూర్తి కాలం సామాజిక విప్లవ నాయకుడు. 

అతను కవిత్వం మాత్రమే రాయలేదు. కవిత్వం సత్యమూర్తికి తన విప్లవ ఆచరణలో భాగమే ఆ విధంగా చూసినపుడు సత్యమూర్తిని ఏ మాత్రం ఆచరణ లేని ఇతర కవులతో పోల్చడం అన్యాయం. కేవలం కవిత్వం మాత్రమే కాదు సత్యమూర్తి బ్రతుకుని గురించి మాట్లాడండి. ఇతర కవుల బ్రతుకులు ఏమిటో ఎలా బ్రతుకుతున్నారో చూడండి. అందుకని పోలికలు వద్దు. సత్యమూర్తి విప్లవ కవిత్వమైనా, దళిత కవిత్వమైనా, విప్లవోద్యమమైనా, దళితోద్యమమైనా అగ్రశ్రేణిలో ఉంటాడు. అది సైద్ధాంతికమైనా ఆచరణ రీత్యానైనా సత్యమూర్తి సత్యమూర్తే.

దళిత శ్రేణులు కూడా విప్లవ శ్రేణుల లాగా సత్యమూర్తిని నిర్లక్ష్యం చేసాయి. విప్లవోద్యమానికి దళితోద్యమానికి సత్యమూర్తి చేసిన సేవలు కొలమానం లేనివి, సత్యమూర్తి దళిత ఉద్యమానికి చేసిన... ప్రస్తుత దళిత నాయకులకు అర్థమైనా సరే మౌనంగానే ఉన్నారు. ఈ పరిధుల నుంచి విప్లవోద్యమం, దళితోద్యమం బయటపడాల్సిన అవసరం ఉంది. విప్లవోద్యమానికి తర్వాత దళితోద్యమానికి సత్యమూర్తి తన జీవితాన్ని అంకితం చేశాడు. పేదలు, దళితులు, పీడితులు, అణచబడిన జన గణాలు సత్యమూర్తి ఆలియాస్ శివసాగర్‌ని అనునిత్యం తలచుకుంటారు.

- కార్తీక్ నవయాన్
Andhra Jyothi News Paper Dated : 27/04/2012