Dalit Information and Education Trust (DIET)

Showing posts with label పసునూరి రవీందర్. Show all posts
Showing posts with label పసునూరి రవీందర్. Show all posts

Sunday, July 28, 2013

కచ్చీరు ఉమ్మడి వేదికకు దిక్సూచి - డాక్టర్ పసునూరి రవీందర్


July 29, 2013
'బహుజన కచ్చీరు' చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. విశాల ప్రయోజన దృష్టితో నిర్వహించిన కచ్చీరు కొందరి సంకుచిత ఆలోచనల నడుమ గమనం గతితప్పింది. 'వివిధ'లో వ్యక్తమైన కొన్ని అభిప్రాయాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం బీసీలను, దళితులను పావులుగా వాడుకుంటున్నారు. అందుకే ఎక్కడ సంఘం పెట్టినా అందులో ఒకరిద్దరు దళితులకు, బీసీలకు అవకాశం కల్పించారు. పైగా అగ్రవర్ణ రాజకీయ నాయకుల కార్యక్రమాలకు మద్దతు కూడగట్టే వారిగానే వారిని మార్చివేశారు. ఈ మూసనుండి బయటపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ (బహుజన) సాహిత్యకారులంతా కలిసి బహుజన ఉద్యమాన్ని నిర్మించాలని కొందరం భావించాం. ఇదే సందర్భంలో బహుజన కథల విషయానికి వచ్చేసరికి శిల్పపరమైన చర్చ అనివార్యంగా అగ్రవర్ణస్తులు ముందుకు తెస్తుండడం గమనించాం. ఇలాంటి చర్చ జరుగుతున్నప్పుడు దళితులు, బీసీలు చెప్పిన ఏ విషయాన్ని కూడా అగ్రవర్ణ సాహిత్యకారులు అంగీకరించడం లేదు. దీంతో అగ్రవర్ణాలతో కూడిన బహుజనోద్యమం సాధ్యం కాదనే విషయం స్పష్టమైంది. ఆధిపత్యవర్గాల దిశానిర్దేశాలు లేకుండా ముందుకెళ్లాలనే నిర్ణయం బలం గా ముందుకొచ్చింది. అందుకోసం బహుజనుల ఆధ్వర్యంలోనే బహుజన కథకుల కచ్చీరు జరగాలని నిర్ణయించుకొని సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, నేను కలిసి ఏర్పాటుచేశాం.

ఈ 'కచ్చీరు' ఏర్పాటు వెనుక దాగిన కీలకోద్దేశాన్ని అర్థం చేసుకోకుండానే ఆరంభంలోనే కొందరు మిత్రులు తొందరపడ్డారు. సమస్యను గుర్తించిన పగ డాల నాగేందర్ దాని పరిష్కారాన్ని ఆలోచించకుండా ఇది సాధ్యం కాదన్నట్టు ఆదిలోనే అందరినీ నిరుత్సాహపరిచాడు. బీసీలు అంబేద్కర్‌ను ఒప్పుకోరని, తన పర్సనల్ అభిప్రాయాన్ని జనరలైజ్ చేసే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ఇవాళ కార్యక్షేత్రంలో బీసీలు, దళితులు కలిసి అనేక సామాజిక ఉద్యమాల్లో కలిసి పనిచేస్తున్నారు. ఊరూరా ఫూలే, అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పుకుంటున్నారు. అంబేద్కర్‌ను గౌరవించే స్థాయిలోనే ఫూలేను కూడా దళితులు గుండెలనిండా నిలుపుకుంటున్నారు. ఈ వాస్తవాన్ని మరిచి చీలికలు తీసుకురావడం బహుజనోద్యమానికి నష్టమే తప్ప ప్రయోజనం కాదు. అంబేద్కరిజమంటే బుద్ధుని నుంచి కాన్షీరాం వరకు అనేకమంది బహుజన మహాపురుషుల తాత్వికత అని చెబితే దాన్ని అంగీకరించలేకపోయారు. బహుజనవాదం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యతతోనే రూపుదిద్దుకుంటుంది. సమాజంలో మెజారిటీగా ఉన్న బహుజనులు తమ ఐక్యతను కాదనుకొని కులాలవారీగా విడిపోతే ఆ పయనం ఏ దరికీ చేరదు.

ప్రతీ కులానికి తమ అస్తిత్వం ముఖ్యమే. కానీ దళితులకు, బీసీలకు, గిరిజనులకు, మైనారిటీలకు అందరి మధ్య ఉన్న కామన్ పాయిం ట్ అగ్రవర్ణ పీడితమే. అలాంటప్పుడు వీళ్లంతా కలిస్తేనే బహుజన ఉద్యమంలో విప్లవాత్మకమైన మార్పు సాధ్యమవుతుంది. బ్రాహ్మణీయ భావజాలం బహుజనుల్ని కులాల పేరుతో విడదీస్తే ఇవాళ కొందరు మిత్రులు ఫూలేను బీసీలకు, అంబేద్కర్‌ను దళితులకు మాత్రమే పరిమితం చేయడం ఖచ్చితంగా బ్రాహ్మణీయ భావజాలమే. మనుషులను విడదీసీన మనువాదం లాంటిదే ఇది కూడా. దళితులతో కలిసి పనిచేస్తే తమ అస్తిత్వానికి నష్టం వాటిల్లుతుందనే సంకుచితమైన అభద్రతాభావం వారిలో ఎందుకు ముందుకొస్తున్నది? బహుజనులంతా మూలవాసులనే తాత్విక భావన ఎందుకు కొరవడుతున్నదో అందరం ఆలోచించాలి. ఈ రకమైన పయనం ఎవరికి మేలు చేస్తుందో అర్థం చేసుకోవాలి.

అగ్రవర్ణ ఆధిపత్యం ప్రతీ సందర్భంలో ఇక్కడి భూమి పుత్రులను భౌతికంగానో, అభౌతికంగానో గాయపరుస్తూనే ఉంది. ఈ కుట్రలను ఓ కంటకనిపెడు తూ పోరాడాల్సిన బాధ్యత బహుజన సమాజానిది. ఈ దేశంలో ఉన్న నూటికి ఎనభైఐదు శాతంమంది బహుజనులే! సంపద సృష్టికర్తలైన వీరికి కనీసఅవకాశా లు దక్కకుండా చేశారు అగ్రవర్ణ పాలకులు. ఈ దుర్మార్గాలను బయటికి కనపడకుండా అగ్రవర్ణ సాహిత్యకారులు ఎప్పటికప్పుడూ జాగ్రత్త పడుతూనే ఉన్నా రు. బహుజనుల మధ్య ఐక్యత సాధ్యపడకుండా బ్రాహ్మణీయవాదులు కుట్ర చేస్తూనే వస్తున్నారు. దీనిని గ్రహించకుండా బహుజనులు తమలో తాము కొట్లాడుకుంటున్నారు. ఈ వాస్తవాలను గ్రహించలేనంత అంధకారంలోకి కూరుకుపోయిన బహుజన జాతి జాగృతానికి బహుజన సాహిత్యోద్యమం చారిత్రక అవసరం.
గడచిన మూడు దశాబ్దాలుగా బహుజనులు చేసిన సాహిత్యకృషి అసామాన్యమైంది. అప్పటికే స్థిరపడిపోయిన సాహిత్య విలువల్ని తృణీకరించి రచనలు చేయడం మామూలు విషయం కాదు. మొదట దళిత ఉద్యమం పురుడుపోసుకొని అగ్రవర్ణ ఆధిపత్యాన్ని నిలదీసింది. బీసీ కవులు ఇందులో భాగమయ్యారు. ఆనాడే బహుజనవాద దృష్టితో ఉద్యమం నడిచి ఉంటే ఇవాళ తెలుగు సాహిత్య చిత్రపటం మరోలా ఉండేది. ఇవాళ ఎవరికి వారు పూర్తిగా విడివడి దూరం జరుగుతున్నారు. ఈ పరిణామం ప్రమాదకరం. ప్రొఫెసర్ కొమ్రన్న బతికి ఉన్నప్పుడు దళితుల పట్ల, బీసీల పట్ల, ముస్లింల పట్ల ఒకే రకమైన బాధ్యతతో నడుచుకున్నాడు. ప్రస్తుతం డా.కాలువ మల్లయ్య లాంటి వారి స్ఫూర్తి అందరిలో రావాలి. ఎవరు బాధితులు, మనం ఎటువైపున్నామో ఆలోచించుకోవాలి.

ఇవాళ కావాల్సింది బహుజన రచయితలందరూ కలిసి ఒక ప్రత్యామ్నాయం నెలకొల్పడం. బీసీల్లోని ఒక కులం మరొక కులాన్ని వీళ్లు మా బీసీలే అనే భావన పెంపొందించుకోవాలి. అలాగే దళితుల్లోని కులాల్లోనూ ఉన్న భేదాభిప్రాయాలను తొలగించుకోవాలి. ఈ అగాథాలను అగ్రవర్ణాలే ట్యూన్ చేసి పెట్టాయి. ఈ అగాథాల్ని పూడ్చవలసిన బాధ్యత సామాజిక ఉద్యమకారులతోపాటు, సాహిత్యకారుల మీద కూడా ఉంది. దళిత, బీసీ, గిరిజన, మైనారిటీలను కలుపుకుపోయి ఒక బలమైన ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసుకోవలసిన అవసరముంది. విశాల దృక్పథంతో బహుజన రచయితలందరి కోసం ఒక ఉమ్మడి వేదిక ఏర్పడాలి. అది బహుజన రచయితల సంఘంగానో, వేదికగానో ఉంటే బాగుంటుంది. కలిసిరాని, రాలేని వారిని వదిలేద్దాం. ఈ దేశమూలవాసులమనే ఎరుకతో, ఫూలే, అంబేద్కర్ ఆలోచనా విధానం ప్రాతిపదికగా ముందుకు వెళదాం.
- డాక్టర్ పసునూరి రవీందర్
drpasunuri@gmail.com
Andhra Jyothi News Paper Dated : 29/07/2013
Posted by Dalit Blog at 6:57 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: పసునూరి రవీందర్

Sunday, April 7, 2013

Turum Khan a story by Pasunuri Ravindar from the forthcoming The Oxford Anthology of Telugu Dalit Writing.



Pasunuri Ravinder
Courtesy OUPPasunuri Ravinder

What’s a poor labourer to do when his son scores more marks than his landlord’s daughter? Excerpts from a story by Pasunuri Ravindar from the forthcoming The Oxford Anthology of Telugu Dalit Writing.

One afternoon in the village, summer was so harsh that it seemed as if even the stone mortar would split. There was a slight respite from the hot winds, but the trees with their shriveled leaves and downcast heads looked miserable. Muthaiah and his wife, Lachamma live off daily wage work. About four years ago, they got their daughter married. Now, the only other person in that hut is their beloved son, Dhanunjay. This fellow, Dhanunjay is not all that old mind you, perhaps more than 18 years, certainly less than 20. The meager earnings from his parents’ labours was not enough to keep the oil lamp burning for him to carry out his studies at home. So, Dhanunjay had no choice but to stay in government-run hostels throughout his school life…
Narsi Reddy was the dora of that village. In spite of his position, he had a good reputation because hemingled with people from all classes and castes and treated them well.
Narsi Reddy’s father’s wasn’t so kind, I believe. I wonder what kind of firearms brought on this change!
Hearing the name of Narsi Reddy dora, Muthaiah got up, stuck a neem twig to in his mouth and walked behind Madigellayya as he brushed his teeth. On the way he threw away the neem twig, washed his face with water from a hand-pump, ran and stood in front of Narsi Reddy dora, palms together as though he were a witness standing in front of a judge.
‘Dora, I believe you asked for me.’
‘Yes, Mutha, I wanted to speak to you.’
‘Please tell me what I can do for you.’
‘Nothing much, yesterday they announced the results of the children who passed the examinations. My daughter passed with a first class. That’s why I want to throw a party. You have to slaughter a goat, bring toddy and brandy and firewood for cooking the feast. So, you must stay here today and work along with Ellayya. Tonight, our friends who have gone to the town are returning,’ said Narsi Reddydora.
‘Surely dora, whatever you say will be done,’ Muthaiah replied, nodding obediently. He was happy that he had some work for the day. Narsi Reddy dora had seven to eight people working for him, but Muthaiah was his favourite because he took pride in the work assigned to him, ate what was served and produced enough work for the food he was given. That’s why Narsi Reddy dora had more respect for Muthaiah than any others who worked for him.
Narsi Reddy dora was so happy that his daughter had passed the exam that he had begun to drink well before evening, eating chunks of fried mutton from a plate before him. After he had had a couple of rounds of drink, he called out, ‘Orey, Mutha! Come here.’
‘Dora, only the lemons have to be sliced, except for this, the food is ready,’ replied Muthaiah politely.
By then, the toddy had hit Narsi Reddy dora.
‘Mutha, come, sit here on the floor.’
‘What is it dora?’ replied Muthaiah as he scratched his own head.
‘How can you cut lemons standing?’
Now Muthaiah had no option but to sit close to the dora’s chair and continue cutting the lemons.
Narsi Reddy dora licked the mutton chop and finished his drink. He seemed to have sobered a bit. ‘Mutha, your son is in the same class as my daughter, isn’t he?’
‘Yes, dora.’
‘Did he pass?’
‘He said he did dora, I don’t know if it is true or false.’
Even though he knew the truth, Muthiah was trying to put his son down to avoid comparison with thedora’s daughter and of course also to continue to receive the affection that this dora showered on him. But, like everyone else, the dora also knew how talented Dhanunjay was.
‘Why do you say that? Don’t we all in the village know how well your son studies?’
‘Yes, but it’s by your grace, dora.’
‘What have I done? Anyway, how many marks did he get in the exam?’ enquired the dora, unable to contain his curiosity.
‘Illiterate fellow that I am, what do I know about matters like this, dora?’ Suddenly Muthiah was innocence personified.
Meanwhile, the karobar, the village secretary, and an official from the mandal headquarters, both belonging to the Reddy caste and distantly related to the dora, came up and greeted him, ‘Namaste, Reddy saab.’
‘Come, come. I have been waiting for you people. Muthaiah, fetch two more glasses.’
Dora now had company to drink and to talk. What use was a drink without someone to share gossip! The three filled their glasses and shook each other’s hands. Muthaiah served them, refilling their plates with curry, filling their glasses with water, and generally overseeing all the food arrangements. After two or three rounds of brandy, the conversation began again.
‘Patel saab, how many marks did chinna dorsani, the young lady get in the exam?’ asked the village secretary.
‘What is there to ask? She is good in her studies. I am sure she has scored well,’ the visitor replied as he handed over his glass for a refill.
Thinking it improper to keep quiet any more, Narsi Reddy Patel replied, ‘I don’t know her exact marks in all the subjects…she said, “Daddy, I got 76%,” proudly twirling his moustache.
‘Congratulations, a tiger’s cub is a tiger, as the saying goes.’
Narsi Reddy was very pleased to hear them praise him like this.
‘Dora, how many plantain leaves should I get for the food? Muthaiah shouted.
‘Get some twenty leaves,’ said he.
‘As you say, dora,’ said Muthaiah.
As he turned to go, the karobar called out to him, ‘Orey, Mutha, how many marks did your son get?’
‘Nothing much, karobaar-saab, we are not big people…when he was a small boy, everyone used to tell me that my son studies well, but I don’t know how many marks he got,’ replied Muthaiah joining his palms humbly.
‘Come on man, yesterday they announced the results in the newspaper. Didn’t your son tell you how many marks he got? See, the dora’s daughter got 76%,’ the karobar egged him on with a voice filled with sarcasm.
‘He did tell me, but no comparison to chinna dorsani. That fellow may fight with me if there is no curry to eat, or no trousers to wear, but he does well in his studies.’
Dora held on to the brandy glass and listened. Muthaiah continued ‘My son said that he had got 920 or 960 out of 1000. He is not going to get 76 marks like our chinna dorasani. After all, he will always be your servant!’
‘960 out of 1000!!!’ their mouths fell open, jaws dropped.
Narsi Reddy’s glass slipped and almost fell from his hand.
The karobar felt as if his mouth was filled with freshly pounded chilli powder, and the visitors’ faces paled.
They looked at each other. The Patel’s high came crashing down after hearing Dhanunjay’s marks. He opened a new bottle of brandy and drank directly from it, without waiting to pour it into a glass. Muthaiah didn’t understand what had happened. He wondered whether he had said something that he shouldn’t have. He stood there scratching his head. Narsi Reddy excused himself, went to a corner and called out, ‘Mutha, come over here.’ Fearing a thrashing from the dora, Muthaiah ran to him at once. ‘Listen, your son got more marks than my daughter. 76% is much less than 960. But don’t tell anyone this. I will die of shame,’ the dora murmured
While the dora’s face was pale, Muthaiah’s face lit up as if a rainbow had suddenly appeared from behind the clouds after a brief shower on a summer afternoon.
Translated by Duggirala Vasanta
Excerpted from The Oxford Anthology of Telugu Dalit Writing; edited by Gita Ramaswamy, K. Purushotham and Gogu Shyamala, Oxford University Press, price not stated.
Keywords: The Oxford Anthology of Telugu Dalit Writing, Gita Ramaswamy


The Hindu English News Paper Dated : 7/4/2013 

Posted by Dalit Blog at 3:08 AM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: పసునూరి రవీందర్

Friday, August 17, 2012

వర్గీకరణ సాధనే నివాళి---పసునూరి రవీందర్



surendra
‘ఇవాళ నా కొడుకు లేడు. కానీ, రాష్ర్టంలో ఉన్న మాదిగ యువకుల్లో నా కొడుకు రూపం పదిలంగా కనిపిస్తున్నది. ఆయన కలగన్న వర్గీకరణను సాధించడమే నా కొడుకుకు అసలైన నివాళి’
-పొన్నాల యాదయ్య, సురేందర్ మాదిగ తండ్రి. (మాదిగ పొద్దు పుస్తకం నుంచి)
ఆరు దశాబ్దాలుగా అణగారిపోతున్న మాదిగ జాతి కోసం నేలరాలిన మండే సూర్యుడు సురేందర్ మాదిగ. పదిహేడు వసంతాల వర్గీకరణోద్యమంలో అసువులు బాసిన యువకిశోరం. రిజర్వేషన్ల వాటాలో సమన్యాయం జరగాలని చేసిన పోరాటంలో ముందుకురికిన కొదమసింహం. త్యాగాలు చేయడానికి వెనుకాడని మాదిగ జాతికి సురేందర్ మాదిగ ఒక మాదిగపొద్దు.

బ్రాహ్మణీయ మనువాద నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో ప్రతీసారి తనపై కులం చేసే అణిచివేతలను ధిక్కరిస్తూనే, ప్రతీ కులం తన కింది కులాన్ని తక్కువగా చూసే సంస్కృతి సజీవంగా ఉంది. అటువంటి సామాజిక వ్యవస్థలో ఆర్థికంగా, రాజకీయంగా నిలదొక్కుకోవడంలో కూడా ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ ఆటంకంగా మారింది. కిందికులాలు అభివృద్ధి చెందడానికి ఆధారంగా ఉన్న రిజర్వేషన్ ఫలాలను గుట్టుచప్పుడు కాకుండా అనుభవిస్తూ ఉండడం వల్ల దళిత కులాల్లో ని అణగారిన కులాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ అన్యాయాలను ప్రతిఘటించి రాష్ర్టంలో ఉన్న తొంభైలక్షలమంది మాదిగల అభివృద్ధి కోసం ముందుకొచ్చిందే వర్గీకరణోద్యమం.

మంద కృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగ తదితరుల నాయకత్వంలో మొదలైన ఈ ఉద్యమం పదిహేడు సంవత్సరాల పాటు అలుపెరుగని పోరాటం జరిపితే కేవలం నాలుగేళ్లు వర్గీకరణ ఫలాలను అందుకోగలిగారు. ఇలా అందుకోవడం కోసమే ఎంతోమంది మాదిగ యువ కులు ప్రాణత్యాగాలు కూడా చేయవలిసి వచ్చింది. ఉద్యమాల్లో పనిచేస్తూ అనారోగ్యంతో, మరో కారణంతోటో మరణించవచ్చు. కానీ లక్ష్యం కోసం ఉద్యమంలోనే అసువులు బాసిన చరిత్ర సురేందర్‌ది. 

హైదరాబాద్ నగరంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన సురేందర్‌ది చిన్న నాటి నుంచి తెగించే మనస్తత్వం. తాను నమ్మిన విషయం సరైందని నమ్మితే, దాన్ని సాధించే వరకు అంకితభావం పనిచేయడం అతని సొంతం. ఈ తెగింపే మాదిగజాతి కోసం ప్రాణాలను సైతం అర్పించే త్యాగానికి సన్నద్ధం చేసింది. మంద కృష్ణ మాదిగకు అనుయాయుడుగా ఉంటూ మాదిగ యువసేనను ఏర్పాటు చేశాడు సురేందర్. ఒకరకంగా రాష్ర్ట రాజధానిలో జరిగిన దండోరా ఎమ్మార్పీఎస్ పోరాటాల్లో సురేందర్ మాదిగదే ప్రధాన పాత్ర. మాదిగల ఆర్తనాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోసుకుపోవడం కోసం తుది శ్వాసదాకా పోరాడాడు. ఉషామెహ్రా కమిషన్ నివేదికను అందించడం నుంచి సోనియా గాంధీని హైదరాబాద్‌లో అడ్డుకునే వరకు సురేందర్ చేయని పోరా టం లేదు. 

తెలంగాణ ఉద్యమంలో ఎనిమిది వందల మంది తల్లులకు గర్భశోకం మిగలడానికంటే ముందే సురేందర్ మాదిగ తల్లి కాలిన పేగుదుఃఖాన్ని మోసింది. సురేందర్ తండ్రి కూడా పుట్టెడు దుఃఖాన్ని మోస్తూనే కొడుకు జీవితాన్ని ఒక పుస్తకంగా రూపొందించాడు. ఆ పుస్తకం పేరే మాదిగపొద్దు. కొడుకు లేడనే చేదు నిజాన్ని గొంతులోనే దాచుకొని తాను కూడా వర్గీకరణ ఉద్యమం కోసం నిలబడ్డాడు. రాష్ర్టవ్యాప్తంగా మరోసారి మాదిగలంతా సన్నద్ధం కావా లని ఆ పుస్తకంలో కోరిండు. సురేందర్ జీవితాన్ని తనకొచ్చిన కొద్ది చదువుతో హృద్యయంగా ఆ పుస్తకంలో పొందుపరిచాడు. అలాగే సురేందర్ త్యాగాన్నిస్మరిస్తూ రాసిన స్మృతి కవితలను కూడా ఈ మాదిగపొద్దు పుస్తకంలో పొందుపరిచాడు. అలా దళితసాహి త్య చరివూతలో ఇది ‘తొలిదళిత స్మృతి కావ్యం’గా నిలిచింది. 

ఇప్పుడు మరోసారి వర్గీకరణ విషయం తెరమీదికొచ్చింది. చంద్రబాబు ప్రధానికి లేఖరాస్తమనే సరికి మాలలు మళ్ళీ అడ్డుకోవడం ఎలా? అని లక్ష ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం అవసరమైతే కొత్తపార్టీకూడా పెడతామని ప్రకటించారు. వర్గీకరణతో పాటు పిల్లల గుండెజబ్బులు, బహుజన కులాల ఐక్యత కోసం ఉమ్మడి వేదికలు వంటి అనేక కార్యక్రమాలకు దండోరా విస్తరిస్తే, మాలలు మాత్రం వర్గీకరణను అడ్డుకొని రిజర్వేషన్ ఫలాలు అడ్డంగా దండుకోవడం కోసమే ఎజెండాను రూపొందించుకున్నారు. సీమాం ధ్ర పెట్టుబడిదారులు ఐక్యమై తెలంగాణను అడ్డుకోవాలనుకుంటున్నట్టు, ఇవా ళ వివిధ పార్టీల్లో ఉన్న మాలలు కూడా ఏకమై మాదిగల పొట్టకొట్టాలని చూస్తు న్నారు.

వర్గీకరణ బిల్లును టెక్నికల్ సమస్యలను చూపించి సుప్రీంకోర్టు కొట్టివేసి ఉండొచ్చు. కానీ, వర్గీకరణ డిమాండ్ సరైందా కాదా అనేది మాలలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకానీ ఎంతమంది సురేందర్‌లైనా చచ్చిపోనీ, మేము మాత్రం మారమంటే ఛాందస బ్రాహ్మణులకు మాలలకు తేడా ఉండ దని గుర్తించాలి. ఇక మాల మేధావుల్లోని చాలామంది వర్గీకరణకు మద్దతు ఇస్తున్నాం అంటూనే తెర చేయాల్సిన కుట్రలన్నీ చేయడం ఏ విలువల కు, ఏ ప్రజాస్వామికతకు నిదర్శనమో ఆలోచించాలి. సురేందర్‌తో పాటు ఆనా డు గాంధీభవన్ మంటల్లో కాలిపోయిన దామోదర్ మాదిగ, మహేష్ మాదిగల త్యాగాలను కొనియాడిన మాలలు, వర్గీకరణ బిల్లుకు మాత్రం మద్దతు తెలుపలేకపోయారు. ఇలా సంకుచితంగా వ్యవహరించడాన్ని చరిత్ర ఏనాడు విస్మరించదు. కానీ, ప్రస్తుతం వర్గీకరణ కోసం ప్రధానికి లేఖ రాస్తానని అనడం వెనుక చంద్రబాబు కుటీల నీతి ఏమైనా ఉండొచ్చు. అయినా వర్గీకరణ డిమాండ్ న్యాయమైందా కాదా అని ఆలోచించకుండా వివిధ పార్టీల్లో ఉన్న మాలలు అడ్డుపడడం సమంజసమా? 

తెలంగాణ ఎంతటి న్యాయమైన డిమాండో, వర్గీకరణ కూడా అంతే న్యాయమైందని తెలంగాణ మాలమహానాడుతో పాటు, సీమాంధ్ర మాలనేతలు కూడా గుర్తించాలి. సోదర దళిత జాతుల పొట్టగొడుతూ ఐక్యత అని నినదించడం కుహనా మేధావితనం.మాల మాదిగల మధ్య వైరుధ్యాలు పెంచడానికే ఈ కుట్రలు పనిచేస్తాయి. రిజర్వేషన్ల అసమపంపిణీ వల్ల ఏర్పడిన అభివృద్ధి సమస్యను పరిష్కరించకుం డా దళితుల మధ్య సయోధ్య సాధ్యం కాదు. 

వర్గీకరణకు మద్దతు ప్రకటించలేని మాలలకు దళితులకు రాజ్యాధికారాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు ఎలా ఉంటుంది. అసలు మాదిగ మేధావులు మాలమాదిగల కుహనా ఐక్యతను కోరుకుంటున్నా రా, లేక ఎస్సీ,ఎస్టీ, బీసీలతో కూడిన విశాల దృక్పథంతో పనిచేయాలనుకుంటున్నారా అనేది మాలలు గ్రహించాలి. మాలలు వర్గీకరణను అడ్డుకోవడం కోసం మాత్రం దళితుల ఐక్యత అనే కుట్రపూరిత నినాదాన్ని వల్లెవేస్తున్నారు. కానీ, ఈ దేశమూలవాసులందరూ విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు, సాంస్కృతికంగా, రాజకీయంగా ముందడుగువేస్తూ రాజ్యాధికారదిశగా పోరాడాలని మాదిగ మేధావులు కోరుకుంటున్నారు. రిజర్వేషన్ల పంపిణీలో మాలమాదిగలే కాకుండా మిగిలిన దళిత కులాలన్నింటికి న్యాయం జరగాలి. అంతేతప్ప ఒక్క మాలలే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తూ, ఐక్యత గురించి మాట్లాడితే దొంగే దొంగ దొంగా అని అరిచినట్టు ఉంటది.

అధికారంలో ఉన్న పాలకుల వెంటబడి వర్గీకరణను సాధించుకోవాలి తప్ప, టీడీపీ ఆఫీసులో కమ్మనేతలకు శాలువాలు కప్పితే వర్గీకరణ రాదు. వర్గీకరణకు మేము అనుకూలమే అని వేదికల మీద ప్రగల్భాలు పలికే మాల మేధావులను కూడా ఈ సమయంలో నిలదీయాలి. అన్ని పార్టీలు మద్దతిచ్చిన వర్గీకరణ బిల్లు ఎందుకు పార్లమెంటు మెట్లు ఎక్కలేకపోతుందో ఎమ్మార్పీస్ నాయకత్వం ఆలోచించాలి. మాదిగజాతి బాగుపడాలంటే ఏబీసీడీ వర్గీకరణ ఒక సాధనమని గుర్తించి, సోనియాగాంధీకి సైతం ముచ్చెమటలు పట్టించి, చావును ముద్దాడాడు సురేందర్ మాదిగ. ఆ వీరుని ఆశయం, అతని తండ్రి చెప్పినట్టు వర్గీకరణ సాధనతో మాత్రమే సాధ్యమవుతుంది.

-పసునూరి రవీందర్ 
(నేడు సురేందర్ మాదిగ జయంతి)
Namasete Telangana News Paper Dated : 17/08/2012

Posted by Dalit Blog at 11:35 AM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: పసునూరి రవీందర్

Saturday, February 25, 2012

చేసింది చాలక సమర్థింపులా? - పసునూరి రవీందర్


'హక్కులు ఒకరిని అడుక్కునే భిక్ష కాదు, పోరాడి సాధించుకోవాలి' 
-మార్టిన్ లూథర్ కింగ్

అవార్డులు, అభినందనల కోసం ఎగబడడం ఇటీవల బాగాపెరిగిపోయింది. ఆ విధంగా ఎగబడుతున్నది మామూలు జనం కాదు. ఉద్యమాల్లో పనిచేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని, ఆ పేరుతో ప్రభుత్వం వద్ద దళారులుగా మారినవాళ్ళే ఆ పనిని సమర్థించుకోవడం విచారకరం. వీరు దళిత సర్టిఫికెట్ చూపి వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. ఇటువంటి సంఘటనల్లో వెలుగు చూడకుండానే కాలగర్భంలో కలసిపోతున్నవి కొన్నైతే, మీడియా ముందుకొచ్చి న్యాయంవైపు నిలబడ్డవాళ్లపై బురదచల్లేవి మరొకొన్ని. 

ఈ కోవలోనే- ఈ నెల నాలుగవ తేదీన 'ఆంధ్రజ్యోతి'లో కృపాకర్ మాదిగ 'అవార్డులు దళితులకు అంటరానివా?' అంటూ కుతర్కాన్ని లేవదీశారు. పైగా దళిత కవితోత్సవాన్ని తిరస్కరించడం తీవ్ర అభ్యంతరకరమంటున్నారు. ప్రభుత్వమే దళితుల ప్రతిభను గుర్తించినపుడు ఆ అవకాశాన్ని అందుకోవాలంటూ కృపాకర్ దళితులకు దళారిగా మారి తాను బేరం కుదుర్చుకున్న విషయాన్ని మరింత బట్టబయలు చేశాడు. కృపాకర్ వాదనం తా ప్రభుత్వ ఎంగిలి మెతుకుల కోసం ఎగబడాలి. అందుకోసం ఉద్యమాలు నిర్వాహించాలన్నట్టుగా ఉంది.

ప్రాణత్యాగాలు చేసిన అమరుల ఆశయ ఫలం నెరవేరకముందే ప్రభుత్వం ఇచ్చే అవార్డులను స్వీకరించాలని, వాళ్లు అందుకోసమే ప్రాణాలిచ్చినట్టు దళితులను పక్కదారి పట్టిస్తున్నారు. కృపాకరే ప్రభుత్వానికి దళిత కవులకు మధ్యలో దళారిగా వ్యవహరించడం వల్ల తాను చేసిన పని ని సమర్థించుకుంటున్నారు. ఈ పనివల్ల దళిత పోరాటాలన్నీ అవార్డులు, అభినందనల కోసమే అనుకునే దిగదుడుపు ఆలోచనను కలిగించారు. దీనివల్ల కృపాకర్‌కు రాజ్యం పట్లగానీ, రాజ్య స్వభావం పట్ల గానీ అవగాహన లేదని అర్థమవుతున్నది.

ప్రభుత్వాలు ఎప్పుడు సామ, దాన, భేద దండోపాయాలను ఉపయోగిస్తాయని కృపాకర్ కు తెలియదనుకోవాలా? ఏ దేశంలోనైనా రాజ్య స్వభా వం ఒకే తీరుగా ఉంటుంది. ప్రజలను బుజ్జగించే సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు ప్రజల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి నిదర్శనమనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ప్రభుత్వాలు తమ మనుగడ కోసం, ప్రజాగ్రహం వెల్లువెత్తకుండా నివారించడం కోసం అనేక కార్యక్రామాలు చేపట్టడమో, వాగ్దానాలు ఇవ్వడమో చేస్తా యి. వాటిని కాదని ఎదురు తిరిగితే రాజ్యహింస ద్వారా నేలరాల్చడం చరిత్ర చెబుతున్న అనుభవం. 

అరవయో దశకంలో బ్లాక్ పాంథర్స్ ఉద్యమాన్ని అణచివేయడానికి అమెరికా ప్రభుత్వం ఉపయోగించిన ఆయుధాల్లో అవార్డులియ్యడం కూడా ఒకటి. ఉద్యోగాలు, అవార్డులు, డబ్బు, మద్యానికి లొంగే వారికి వాటిని అందజేసి తమ శ్వేతజాతి ఆధిపత్యాన్ని కాపాడుకొని, బ్లాక్ పాంథర్స్ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిర్వీర్యం చేసింది. మరాఠీ దళిత చైతన్యాన్ని అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేసి అఖరుకి అవార్డులు రివార్డులతో ఆ కవులను పతనం చేశాయి. 

మన రాష్ట్రంలోనూ ప్రభు త్వం అవార్డులు, ఉద్యోగాలను ఎరచూపి దళిత సాహిత్యా న్ని స్తబ్దతకు గురిచేసేందుకు దశాబ్దంన్నర కాలంగా కృషి చేసి కొంతమందిని లొంగదీసుకోగలిగింది. ఈ విషయా న్ని మరిచిన కృపాకర్ ప్రభుత్వ సన్మానాలను సమర్థించుకొని దళితుల ఆత్మగౌరవాన్ని, దళిత సాహిత్య పరువును దిగజార్చేందుకు పూనుకున్నారు. తన ఒక్కడి కోసం జాతి ప్రయోజనాలు దెబ్బతీయడం క్షమార్హం కాదు.

ఉత్సవాలు నిర్వహించుకోవడానికి ఎవరు అడ్డంకి కాదు. అయితే అవి చేసుకునే సందర్భం కూడా ముఖ్యం. దళిత కవితోత్సవాన్ని వ్యతిరేకించిన కవుల్లో నేనూ ఒకణ్ణి. దళిత కవితోత్సవాన్ని జీవిత కాలంలో ఎన్నడూ జరుపుకోకూడదని మేం ఆ సభను ఖండించిన కరపత్రంలో పేర్కొనలేదు. సుమారు నాలుగువందల మంది యువతీ యువకులు తెలంగాణ కోసం ప్రాణాలను బలిదానమిచ్చిన సందర్భంలో 'చావులొక పక్క, ఉత్సవాలొక పక్కా?!' అని ప్రశ్నించాము.

సమైక్యాంధ్రకు వ్యతిరేకినని చెప్పుకున్న కృపాకర్‌కు ఏ మాత్రం నైతిక విలువలున్నా మా ప్రశ్నను, మా ఆవేదనను అర్థం చేసుకొని పశ్చాత్తాప పడి, ప్రజలను క్షమాపణలు కోరాల్సింది. కానీ కవితోత్సవం జరుపడమే కాకుండా తాను చేసిన దళారీ పని గొప్పదైనట్టు సమర్థించుకుంటున్నారు. తెలంగాణ పది జిల్లాల్లో ఉద్యమం ఉవ్వెతున్న నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు ఊరూరా చేస్తున్న దీక్షా శిబిరాలు రెండు వందల రోజులకు చేరాయి. ఒక బలమైన కాంక్ష కోసం తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేస్తుంటే, వారిని నమ్ముకున్న కుటుంబాలు శోక సముద్రాలవుతున్నాయి. ఇటువంటి సమయాన ఉత్సవాలు జరుపుకోవడం సరైన సందర్భమా?

ప్రభుత్వ ఉత్సవాలకు, సన్మానాలకు, అవార్డులకు దళితులు దూరంగా ఉండాలని దళితేతరుల నాయకత్వంలో ని తెలంగాణ రచయితల సంఘం పిలుపివ్వడం సరైంది కాదన్నారు కృపాకర్. ఇట్లా అనడంలో కృపాకర్ ఆంధ్రా ఆధిపత్య ధోరణితో పాటు తెలంగాణ దళిత రచయితల పట్ల చిన్న చూపు కూడా కనిపిస్తున్నది. మంచిమార్గం మనో డు చెప్పినా, మందోడు చెప్పినా దాంట్లోని నిజానిజాలను గ్రహించి సరైన మార్గంలో నడుచుకోవాల్సింది పోయి రంధ్రాణ్వేషణకు సిద్ధమయ్యారు. అయినా 'సింగిడి'లో పనిచేసే తెలంగాణ రచయితలు (నాతో సహా) ఒకరు చెప్తే నడుచుకునే దయనీయమైన అజ్ఞానంలో జీవించడం లేద ని కృపాకర్ తెలుసుకోవాలి. తెలంగాణ రచయితల సంఘంలో పని చేస్తున్న దళిత కవుల స్థాయిని దిగజార్చిన తీరే ఆయనలోని ఆంధ్ర పెత్తందారును ఎత్తి చూపిస్తున్నది.

దళిత జాతి కోసం ప్రాణ త్యాగాలు చేయడానికి వెనుకాడనిది ఒకరైతే, ప్రభుత్వంతో సన్మానాలు చేయించుకుంటూ సమర్థించుకుంటున్నది మాత్రం ఈ దండోరా నాయకుడు. గాంధీభవన్ ఘటనలో వర్గీకరణకోసం ప్రాణాలొదిలిన సురేందర్ మాదిగ సంస్మరణ సభకు రాలేని ఈ నాయకు డు ఇదే హైదరాబాద్‌లో దళిత ఉత్సవాలను నిర్వహించ డం ఏ నాయకత్వ లక్షణం? సురేందర్ తదితర అమరులు తెలంగాణ మాదిగలు కావడమే కారణమా? 

ప్రభుత్వానికి మెలకువ వచ్చి దళితులకు సన్మానాలు చేస్తున్నదంటూ ప్రభుత్వ మొక్కుబడి కార్యక్రమాలకు ప్రచార కార్యదర్శి బాధ్యతలు స్వీకరిస్తున్నారు కృపాకర్. పదిహేనేళ్ల పాటు పోరాడినా వర్గీకరణ కొట్లాట ఇంకా తెగనేలేదు. తెలంగాణ ఏర్పాటు ఇంకా జరగనే లేదు. ఇవన్ని మరిచిపోయి వర్గీకరణ-తెలంగాణ వ్యతిరేకుల పంచన చేరడం ఏ మెలుకువో జాతి ప్రజలకు చెప్పాలి.

ప్రభుత్వం దశాబ్ద కాలం కిందటి వరకు అంబేద్కర్ జయంతిని అధికారికంగా జరపలేదు. కానీ దళితోద్యమ ఉధృతి వల్లనే ఈ మాత్రం పుష్పగుచ్చాలు అంబేద్కర్ విగ్రహాల మెడలో వేస్తున్నది. పాపం కృపాకర్ ఈ చరిత్రనంతా మరిచి ప్రభుత్వానికి మెలుకువ వచ్చిందని ఒక పగటి కల కంటున్నారు.

ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు దళితులు పోరాటం జరిపింది సన్మానాలు, సంబరాల కోసమో కాదు. అసలు దళితుల ఏ ఉద్యమంలోనూ అవార్డుల, అభినందనల ఎజెండా లేదు. కానీ కార్యవర్గం లేని ఒక సంఘానికి వ్యవస్థాపకునిగా చెప్పుకునే ఈ నాయకునికి దళితోద్యమ పోరాటాలన్నీ సన్మానాల కోసం చేసినవిగానే తోచడం చిత్రం.

ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, అభినందన పత్రాలు స్వీకరించిన తర్వాత ఏ కవికైనా, కళాకారునికైనా ప్రభుత్వ విధానాల మీద పోరాడే నైతిక హక్కు ఉంటుందా? అతడు చేసే పోరాటం నిజమైన పోరాటం అవుతుందా? అసలైన ఉద్యమకారులు జరిపే పోరాటాలను దెబ్బతీయడానికి ఆధిపత్య వర్గాలు తమ ఏజెంట్ల ద్వారా జరిపించే ఉత్తుత్తి పోరా టం కాదా? అయినా ఫర్లేదు అనుకోవడం కేవలం బూర్జువా ఆలోచనా విధానం మాత్రమే! కట్టె విరుగొద్దు, పాము చావొద్దనే ద్వంద్వ నీతిని స్వీకరించడానికి తెలంగా ణ మాదిగ బిడ్డలు సిద్ధంగా లేరు.

నిజానికి దళితోత్సవాల ను దళితులే నిర్వహించుకుంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు. కానీ దళితుల హక్కుల్ని కాలరాచి, దళితులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలతో కుమ్మక్కై ఉత్సవాలు జరపడాన్ని మాత్రమే మేము వ్యతిరేకించాము. రాష్ట్ర విభజన ను, వర్గీకరణను వ్యతిరేకించే వారితో తెలంగాణ గడ్డపై ఉత్సవాలు జరపడం పైనే మా అభ్యంతరం.

ఉద్యమ నేపథ్యం లేనివాడు ఆ పూటకు తన ప్రయోజ నం నెరవేరితే చాలనుకుంటాడు. అవార్డుతో పాటు వచ్చే నగదు పట్ల వ్యామోహానికి గురవుతాడు. ఆ తర్వాత మరో అవార్డు కోసం కాచుకొని కూర్చుంటాడు. తనకు తెలియకుండానే అవార్డులకు బానిసై రాజ్యానికి బానిసగా మారుతాడు. ఇప్పటికే కొంతమంది దళిత సాహిత్యకారుల, విశ్వవిద్యాలయాల ఆచార్యుల జీవితాలను చూస్తే ఇదే అర్థమవుతుంది. చివరికి 'న ఘర్‌కా, న ఘాట్‌కా' అన్నట్టు సమాజానికి కాక, వారి కోసం వారుకాక కేవలం కేరీరిస్టులుగా మిగలడం అందరికి తెలిసిందే. అకాడమీ పోటీలలో ముందుండాలని కృపాకర్ దళిత సాహిత్యకారులకు సాహి త్య మార్గనిర్దేశం చేస్తున్నారు. సామాజిక ఉద్యమానికి అంకితం కాలేని కృపాకర్ అనతికాలంలోనే దళిత సాహిత్యకారులకు సూచనలు, దిశానిర్దేశాలు చెప్పే ఉచిత సలహాదారుగా మారడం విచారకరం. 

ఆంధ్ర దోపిడీ పాలనను విమర్శించేవాళ్లు, వారిచ్చే ప్రైవే టు ఉద్యోగాలను వదులుకోవడం లేదనేది కూడా కృపాకర్ విమర్శ. దోపిడీ వ్యవస్థలో ప్రకృతి, సామాజిక వనరులన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధిపత్య వర్గాల ఆధీనంలో ఉంటాయి. పాలక వర్గాల చేతిలో ప్రభుత్వం అణచివేత సాధనమే. ప్రభుత్వ ఉద్యోగులు పాలకవర్గాలకు సేవ చేయడం లేదనుకుంటే అవగాహనా రాహిత్యమే. 

రాజ్యంతో కుమ్మక్కై చేసే స్పాన్సర్డ్ కార్యక్రమాల ద్వారా సాధికారత సాధించడం ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి దళిత కవితోత్సవం అనేది జరిగిపోయిన ఒక పీడకల. దాన్ని నిర్వహించిన వ్యక్తిగా తప్పును ఒప్పుకోవాలి. లెనిన్ చెప్పినట్టు చేసిన తప్పును ఒప్పుకోకపోవడం అంటే వంద తప్పులు చేసినట్టు లెక్క.
- పసునూరి రవీందర్
కవి, రీసెర్చ్ స్కాలర్, సెంట్రల్ యూనివర్సిటీ
Andhra Jyothi News Paper Dated : 11/07/2010
Posted by Dalit Blog at 11:32 AM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: పసునూరి రవీందర్

మానుకోట ఏమంటున్నది? - పసునూరి రవీందర్


నేషనల్ దళిత్ ఫోరం తరఫున ఇటీవల మానుకోటను నిజనిర్ధారణ కమిటీ సందర్శించింది. ఆ కమిటీలో 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం తరఫున సభ్యుని గా పాల్గొన్న నేను బాధితులతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లా డి, ఈ ఘటన వెనుక దాగిన నిజానిజాల పట్ల ఒక దృష్టికోణాన్ని మానుకోట ఘటనను అర్థం చేసుకోవలిసిన తీరును వివరిస్తున్నాను. 

కొన్ని దశాబ్దాలుగా వరంగల్ జిల్లా గడ్డ మీద మానుకోట పోరాటాల నిలయంగా వర్ధిల్లుతున్నది. మానుకోట, ఆ చుట్టుపక్కల తండాలు, పల్లెల జనమంతా ఏదో ఒక ఉద్యమంతోటో లేక రాజకీయ పార్టీతోనో ప్రత్యక్ష సంబం ధం కలిగి క్రియాశీలంగా పనిచేసిన చరిత్ర ఉన్నవారు. బలవంతపు విలీనానికి ముందే తెలంగాణ కోసం పోరాడిన చరిత్ర కూడా మానుకోటకు ఉంది.

పోలీసు యాక్షన్ తరువాత ప్రభుత్వ ఉద్యోగాలలో దొంగ ముల్కీ సర్టిఫికెట్ల ద్వారా ప్రవేశించిన స్థానికేతరుల మీద 1952లో గైర్ ముల్కీ ఉద్యమం వరంగల్‌లోనే ప్రారంభమైంది. స్థానికేతరులైన ఆంధ్ర ప్రజలు ఇక్కడి ఉద్యోగాలను ఆక్రమించి, తమ పొట్ట గొడుతున్నారంటూ వరంగల్ విద్యార్థులు ఉద్యమాన్ని ప్రారంభించారు. 

navya.ఆ ఉద్యమంలో భాగంగా 1952 ఆగస్టు ఎనిమిదవ తేదీన మానుకోటలో విద్యార్థులు వెయ్యిమంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి ప్రదర్శనలు తీశారు. వరంగల్ విద్యార్థి సంఘం పిలుపు మేరకు 'బే ముల్కీలు వాపసు పోవాల'ని సమ్మె చేశారు. మళ్ళీ అదే మానుకోట జగన్ గో బ్యాక్ అని 58 ఏళ్ల తరువాత కూడా నినదించింది. 

మానుకోట కాల్పుల్లో గాయపడ్డ వారిలో తొమ్మిది మంది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నారు. మహబూబాబాద్ వెళ్ళడానికి ముందు బాధితులను పరామర్శించడమే ప్రథమ కర్తవ్యమ ని మా టీం భావించింది. అందువల్ల వరంగల్ నగరంలోని ఎంజిఎం ఆసుపత్రికి వెళ్ళాము.

దాదాపుగా అందరి కాళ్ళ కు, నడుముకు బుల్లెట్లు తాకాయి. మమ్మల్ని చూడగానే కొంచెం సవరించుకుని ధైర్యంగా ఘటన వివరాలు చెప్పడానికి సిద్ధమయ్యారు. గాయపడిన వారిలో కానీ, వారి కుటుంబ సభ్యులలో కానీ దిగులు కనిపించలేదు. మరో యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కనిపించారు. ఈ ఒక్క దృశ్యం చాలు తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి..

తొమ్మిది మందిలో ఐదుగురు లంబాడీలు, ఇద్దరు బీసీలు, ఇద్దరు దళితులు. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఈ జిల్లాలో లంబాడీల పోరాట పటిమ సజీవంగానే ఉందనడానికి ఈ ఐదుగురు ప్రత్యక్ష సాక్షులుగా కనిపించారు. అక్షర పరిజ్ఞానం అంతంత మాత్రమే కలిగిన వీరంతా తెలంగాణను అధ్యయనం చేసిన విద్యావంతులు. 

మొదటగా వ్యవసాయ కూలీ రావోజీ నాయక్‌ను కలిశా ము. తొడ నుండి బుల్లెట్ దూసుకుపోయి కదలలేని స్థితిలో ఉన్నాడు. కూలీ చేసుకుంటే తప్ప బతుకు గడవని రావోజీ నాయక్ కదిలిస్తే తెలంగాణ ఉద్యమ చైతన్యం ధార లై ప్రవహించింది. అతని ముఖం మీద చెరగని గుండె ధైర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.

వాంకుడోతు హచ్యా అనే ఒక సినిమా థియేటర్ గేట్ కీపరు కు కూడా సరిగ్గా తొడభాగం లో బుల్లెట్ గాయమైంది. తన పని తాను చేసుకుని బతికే హచ్యానాయక్ తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించాలనుకున్నా డు. అందుకోసం ఆ రోజు పని మానుకుని పోరాటంలో పాల్గొనడమే పనిగా పెట్టుకున్నాడు. తన తండాకు చెందిన విద్యార్థులు జగన్‌ను అడ్డుకోవడానికి వెళుతున్నారని తెలిసి, తాను కూడా స్వచ్ఛందంగా నిరసన లో పాల్గొన్నాడు. ఎలా జరిగిందో చెప్పమంటే ఒక పోరాట నవల కావాల్సినంత కథాంశాన్నే కళ్ళ ముందుంచాడు హచ్యానాయక్. 

'మాది ఒక చిన్న తండా సారు. రెక్కల కూలీ తప్ప ఇంకో అదెరువు లేదు. తెలంగాణ కోసం నడుస్తున్న ఉద్యమాన్ని చూసి నా రక్తం ఉడికి పోయింది. తెలంగాణ వస్తే మా బాధలు తీరుతాయని సమజైంది. చిన్న పిల్లలు సదువులు పక్కన పెట్టి పోరాడడం నాక్కూడ పోరాడాలనే బుద్ధినిచ్చింది. ఇట్లా మా ఊరి విద్యార్థులతో కలిసి తెలంగాణ పోరాటానికి నేను కూడా పోయిన. కానీ, మా జిల్లోల్లే బయిటోళ్ళకు మద్దతుగా నిలబడుతున్నారని తెలిసి కడుపు రగిలిపోయింది. ఇగ పానం పోయినా పర్వా లేదనుకున్న' - ఈ మాటలు వింటుంటే స్వాతంత్య్ర పోరాటం గుర్తుకొచ్చింది. 

జగన్ యాత్రను అడ్డుకోవాలని మానుకోట చుట్టుపక్క ల గ్రామాల ప్రజలు, తండాల్లో జీవించే లంబాడీలు ఒక్కటయ్యారు. తాము చేసే కూలీ పనులను పక్కన పెట్టి ఆ రోజుకు అదే తమ కర్తవ్యంగా భావించారు. తమ కోసం తాము బతకాలనుకోవడం లేదు ఇవాళ తెలంగాణ జనం. అందరి బాగు కోసం, రేపటి తమ బిడ్డల భవిష్యత్తు కోసం తమ వంతుగా త్యాగాలు చేయాలనుకుంటున్నారనడానికి బంజార బిడ్డల మాటలే ఆధారాలు.

వీరి మాదిరిగానే మిగిలిన వారు కూడా. గాయపడ్డ వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. మానుకోట చుట్టుపక్కల గల పల్లెలు, తండాల నుంచి అందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, సొంతంగా చార్జీలు పెట్టుకుని ఆటోలల్ల మానుకోట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. నినాదాలు చేసి శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్నారు.

కానీ వీరి కన్నా ముందే వర్గీయులైన దంపతులు తమ అనుచర గణాలతో ఖద్దరు బట్టలేసుకుని ప్లాట్‌ఫాం మీదున్నారు. అయి నా కూడా వెనుకడుగు వేయని తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ర్యాలీ తీస్తూ జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశా రు. ఇది సహించని ఖద్దరు వేషాల్లోని జగన్ గణం ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది.

తెలంగాణ ఉద్యమకారులను కొట్టడం ప్రారంభించింది. తమపై దాడి చేస్తున్న వారు రాయలసీమకు చెందిన వారని తెలంగాణ ఉద్యమకారులు గ్రహించారు. ఒకరిద్దరిని పట్టుకుని నిలదీయగా, వారు ఈ విషయం అంగీకరిం చి వదిలివేయమని బతిమిలాడారు. దీంతో ఉద్యమకారులు వారిని వదిలివేశారు. ఇంతలో జగన్ సొంత పత్రికకు చెంది న వాహనాల్లో మందీ మార్బలం దిగి రాళ్ళు రువ్వడానికి యత్నించారు. ఈ విధంగా మానుకోట రైల్వేస్టేషన్ తెలంగాణ ఉద్యమకారులతో, జగన్ అనుచరగణంతో రెండు శిబిరాలుగా తయారైంది. 

కాల్పులు జరిపిన వారిలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారని గాయపడ్డ తెలంగాణ బిడ్డలు చెప్తున్నారు. మానుకోట విశ్రాంతి గదిలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రివాల్వర్ తో కాల్పులు జరిపిన విషయం మీడియా కూడా చిత్రీకరించింది. అయితే రివాల్వర్‌తో కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరనేది ప్రభుత్వానికి, పోలీసులకు తెలుసు. అయినా చెప్పడం లేదు. 

తెలంగాణ విద్యార్థులు చనిపోయినప్పుడు రాని జగన్ ఇప్పుడు ఎందుకు వస్తున్నడన్న అని తొమ్మిదవ తరగతి చది వే వెంకటేశ్ అడిగిండు. ఐస్‌క్రీంలు అమ్మే నర్సయ్య కొడుకు వెంకటేశ్ రోజూ తెలంగాణ కోసం ర్యాలీలు,ధర్నాలలో పాల్గొంటున్నాడు. వీరంతా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, ఉద్యమావశ్యకతను ఎంతో అవగాహనతో వివరించడం విశేషం. 

జగన్ ఆధిపత్యయాత్రను అడ్డుకుందాం అనే పోస్టర్లు మాకు మానుకోట వీధుల్లో, రైల్వే స్టేషన్లో కనిపించాయి. జగన్ పర్యటనను అడ్డుకోవాలని తెలంగాణ జెఎసి నాయకులు పత్రికల ద్వారా కూడా పిలుపునిచ్చారు. అయినా జగ న్ యాత్ర చేపట్టడం వల్ల, దానిని ముఖ్యమంత్రి రోశయ్య నిలిపివేయించకపోవడం వల్ల పరిస్థితి విషమించింది. 

ఆ రోజు ఏమి జరిగిందనేది స్టేషన్ మాస్టర్ చెప్పడానికి వెనుకాడాడు. డోర్నకల్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో అడగమని దాటవేశాడు. స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళితే కేసు సిబిఐకి పంపా ము అంటూ దాటవేశాడు తప్ప నోరు మెదపడానికి సాహసించడం లేదు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు ప్రజానీకం సిద్ధంగా ఉన్నారనడానికి మానుకోట ఘటన ఉదాహరణ. 

- పసునూరి రవీందర్ 
(రీసెర్చి స్కాలర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం)
Andhra Jyothi News Paper Dated : 13/6/2010
Posted by Dalit Blog at 11:30 AM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: పసునూరి రవీందర్

'అల సెంద్రవంక'లో ఆ పాటలేవి?--పసునూరి రవీందర్

'అల సెంద్రవంక'లో ఆ పాటలేవి?

ఎంకన్న తన గొంతునుండి సమస్త తెలంగాణ దుఃఖాన్ని, నిరసనను, ధిక్కారాన్ని పలికించినోడు. పక్షుల కిలకిలరావాలు లేకుండా తెలంగాణ పల్లె తుపాకి మోతలతో అల్లాడిపోతుందని ఒంటరిగా కూర్చొని ఏడ్చినోడు, ఏడ్పించినోడు. తెలంగాణ కోసం ఏ పాటగాడు రాయనన్ని పాటలు రాసి ధూంధాం సభలల్లో అంతెత్తున ఎగిరి దుంకి పాడి జనం గుండెల్లో నిలిచినోడు. కానీ 'అలసెంద్రవంక' పుస్తకంలో మాత్రం ...

నిజానికి ఎంకన్న ఇట్లా ఉద్యమానికి దూరంగా జరుగుతూ, చెట్ల మీద పుట్ల మీద పాటలు రాసేలా పురిగొల్పుత్నుది ఎవరు? అలా ఎంకన్నను కేవలం ప్రకృతి కవిని చేస్తున్నది ఎవరు? ప్రకృతి అంటే అందులో మనిషి లేడా? అందులో తెలంగాణ లేదా? దోపిడి లేదా? వివక్ష లేదా?

తెలంగాణ ప్రాంతంలో ఇవాళ జరిగే ఏ సభైనా జై తెలంగాణ నినాదాలతో మార్మోగుతున్నది. ఇక గోరటి వెంకన్న పాల్గొన్న సభలయితే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము. కానీ స్వయంగా గోరటి వెంకన్న పుస్తకావిష్కరణ సభలో ఇలాంటి ఆశలు ఆవిరైపోయాయి. గోరటి పాటల పుస్తకం ఆవిష్కరణ అదొక తెలంగాణ ధూంధాం లాగే ఉంటుందని అందరూ ఆశించారు. కానీ తీరా ఆ సభలో వేదిక మీదున్న తెలంగాణేతర సాహిత్యకారుల వక్రోపన్యాసాలకు జై తెలంగాణ నినాదం చిన్నబోయింది.

సభలో ఉన్న తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛగా నోళ్లు కదుపలేకపోయారు. వచ్చిన వక్తలు మాత్రం తమకిష్టమొచ్చినట్టుగా ఎంకన్నను హైజాక్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సమయాన ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురుకావడం.. యావత్ తెలంగాణ ఉద్యమకారులకు ఎంతో బాధ కలిగించింది..

'ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు, వారిని నిద్రపుచ్చాలంటే పాటను ఆశ్రయించాలి' -ప్లేటో
ఇటీవల ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న తన మూడో పాటల సంపుటి 'అలసెంద్రవంక'ను ప్రచురించాడు. ఈ సంపుటి ఆవిష్కరణకు ముందే విమర్శల పాలయ్యింది. తెలంగాణను వ్యతిరేకించే కోస్తా సాహిత్యకారులతో ముందుమాటలు రాయించుకున్న విషయం తెలంగాణ బిడ్డలు జీర్ణించుకోలేకపోయారు. 

ఎందుకంటే గోరటి వెంకన్న గత మూడు దశాబ్దాలుగా పాటలు రాస్తున్నప్పటికి, అతని స్థానాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లింది మాత్రం తెలంగాణ ఉద్యమమే. తెలంగాణకు గత యాభైయేండ్లుగా జరిగిన అన్యాయాలపై నిప్పుకణికల్లాంటి పాటల్ని రాసి పల్లెపల్లెన పాడినవాడు ఎంకన్న. కానీ, ఇయ్యాల ఈ పుస్తకం విషయంలో మాత్రం ఎంకన్న తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పెట్టి వలసాంధ్రవాదుల అండగా నిలిచాడు. 

సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ పురిటిగడ్డ అనేకమంది ప్రజావాగ్గేయకారులను అందించింది. నిత్యం ఉద్యమాల కార్యాచరణతో వర్థిల్లడం ఈ నేలన సహజమైన విషయం. అట్లే తెలంగాణ ఉద్యమం తన విముక్తి కొరకు తానే, అనేకమంది కవులకు, కళాకారులకు జన్మనిచ్చింది. అట్లా వెలుగులోకి వచ్చిన పాటగాళ్లు ఈ విషయాన్ని మరిచి, తాత్కాలిక ప్రయోజనాలకోసం ఉద్యమ ఆకాంక్షలను మరిచిపోవడం క్షమార్హం కాదు! బెల్లి లలిత పాట కోసం ప్రాణమిడిసింది. తన చివరి శ్వాసదాకా ప్రజాపోరాటాల సాహిత్య చిరునామాగా నిలబడ్డాడు చెరబండరాజు. అట్లాంటి గడ్డ మీద వారి వారసత్వాన్ని బతికించడానికి వందలాదిమంది ప్రజాకళాకారులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. 

ఫలితంగా తెలంగాణ ప్రజల చైతన్యం సజీవమై కొట్లాడుతున్నది. గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ, మిత్ర, జయరాజుల పాటలు లేని తెలంగాణ సాంస్కృతిక రంగాన్ని ఊహించడం ఎవరివల్లా కాదు. తెలంగాణ ప్రజల బాధలకు పల్లవులై, చరణాలై ప్రవహించారు ఈ గడ్డమీద పాట కవులు. అలాంటి నేపథ్యం కలిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కవైనా, కళాకారుడైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. 

ఎంకన్న మాత్రం నాలుగు కోట్లమంది ప్రజల డిమాండ్‌ను, రెండువందల ఎనభైమంది బలిదానాలను మరిచి పదిమంది సీమాంధ్ర కవులను తృప్తిపరచేందుకు పూనుకున్నాడు. తెలంగాణ పల్లెను గురించి కన్నీరు పెట్టి న కవి, ఎందుకోసం ఇట్లా మారుతున్నాడనే ఆవేదన తెలంగాణ ఉద్యమకారులందరి మనసులను తొలుస్తున్నది.

తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి సుద్దాల హన్మంతు, బండి యాదగిరి తమ వంతు పాత్రను పోషించారు. ఇప్పటికీ జనం నోళ్లల్లో నానే పాటలైన పల్లెటూరి పిల్లగాడ, బండెనుక బండి కట్టి వంటి పాటలు రాశారు. ప్రత్యేక్షంగా పోరాటంలోనూ పాల్గొని చరిత్రను ధన్యం చేశారు. కానీ వాళ్ల సాహిత్యమంతటి గొప్ప సాహిత్యాన్ని సృజించిన ఎంకన్న ఆ పాటలకు తన పుస్తకంలో స్థానం దక్కకుండా చేశాడు. ఇప్పటిదాకా తాను రాసిన తెలంగాణ ఉద్యమ పాటలను పక్కన పెట్టి ఈ అలసెంద్రవంకను ప్రచురింపజేశాడు.

తెలంగాణ ఉద్యమం ఈనాడు పదిజిల్లాల నిండా నాలుగు వేల టెంట్లుగా వర్థిల్లుతున్నది. ప్రపంచంలో ఇంతటి మహత్తర పోరాటం జరుగుతున్న ప్రాంతం మరొకటి లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రతీ టెంటు దగ్గర ఎంకన్న రాసిన తెలంగాణ పాటలు పాడుకోవాలని ప్రజలు కోరుకుంటారు. అంతటి రిలవెన్సు కలిగిన పాటలు ఎంకన్నవి. కానీ ఎంకన్న మాత్రం ప్రజాకవి అనే బాధ్యత నుండి వైదొలగడానికి సిద్ధమయ్యాడు. తన పాటలు సినిమాల్లో, టీవీ రియాల్టీ షోలల్లో మాత్రమే ఆ క్షణానికి అలరిస్తే సరిపోతుందని ఎంకన్న చెప్పకనే చెప్పినట్టయ్యింది. 

వ్యాపార వ్యామోహం కలిగిన వ్యక్తులు, సంస్థలు ప్రజా సాహిత్యాన్ని కూడా బిజినెస్ చేయడం కాలాతీతమేమీ కాదు. కానీ, బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజా కవులు ఇలాంటి మాయలను ఛేదించుకొని ప్రజల పక్షం నిలవాలి. నలుగురిని ఎంటర్‌టైన్ చేయడం కోసం నాలుగు కోట్లమంది ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను తోసిపుచ్చడం కన్నా నేరం మరొకటి ఉండదు.

ఎంకన్న తన గొంతునుండి సమస్త తెలంగాణ దుఃఖాన్ని, నిరసనను, ధిక్కారాన్ని పలికించినోడు. 'పొమ్మంటె.. పోవేందిరా పోరా ఓ ఆంధ్ర దొర' అని ప్రశ్నించాడు. సేతాన ఉన్నా తెలంగాణ సేలన్ని బీడెందుకైనయని ప్రశ్నించినో డు. ఏ ఆఫీసు మెట్లెక్కినా.. గుమ్మాలకు బొమ్మలోలె ఆంధ్రావారే కనబడతారని కడుపు రగిలి శపించినోడు. పాలమూరు మట్టి బిడ్డలు వలసబోయిన డబ్బుతో అప్పులకు వడ్డీ కడతారని తెలంగాణ గోసను కళ్ల ముందుంచినవాడు. విషాదాలకు స్వస్తి పలికి తెలంగాణ కోసం కుస్తి చెయ్యాలన్నాడు. 

మహబూబ్‌నగర్ ఎండిపోతా ఉంటే ఆంధ్రావారికి మూడు పంటలు ఎట్లా పండుతాయని అగ్నిపర్వతమై మండినోడు. పక్షుల కిలకిలరావాలు లేకుండా తెలంగాణ పల్లె తుపాకి మోతలతో అల్లాడిపోతుందని ఒంటరిగా కూర్చొని ఏడ్చినోడు, ఏడ్పించినోడు. తెలంగాణ కోసం ఏ పాటగాడు రాయనన్ని పాటలు రాసి ధూంధాం సభలల్లో అంతెత్తున ఎగిరి దుంకి పాడి జనం గుండెల్లో నిలిచినోడు ఎంకన్న. కానీ 'అలసెంద్రవంక' పుస్తకంలో మాత్రం ఈ నెత్తురసొంటి శక్తున్న పాటలను అంటరాని పాటలను చేశాడు.

'అలసెంద్రవంక'ప్రచురణకర్తలు ఎంకన్నను తెలం గాణకు దక్కనివ్వకుండా చేసే సమైక్యాంధ్ర కుట్రకు పాల్పడుతున్నారు. నిజానికి వాళ్లు తెలంగాణ న్యాయమైన పోరాటానికి మద్దతునిచ్చేవాళ్లు కాదు. సంకుచి త గోడల నడుమ, ఊహాలోకాల్లో నలుగురి నడుమ గౌరవాలు, కీర్తి కిరీటాలు పెట్టుకుని ఊరేగే ఆశల పల్లకీలు. ఎంకన్నను కూడా తమ ముగ్గులోకి లాక్కొని, తెలంగాణ పాటలను చేర్చకుండా అడ్డుపడ్డారు.

ఎంకన్న తెలంగాణ కోసం రాసిన పాటలు ఈ పుస్తకంలో చేర్చి ఉంటే.. ఈ రోజు ఆ పుస్తకం తెలంగాణ పల్లెల నిండా ఒక ఆయుధమయ్యేది. ఆ పాటలు వలసాంధ్ర దోపిడి కోటల మీద బల్ల్యాలుగా ప్రజలు ప్రయోగించి ఉండేవారు. దీనిని గమనించారు గనుకనే ప్రచురణకర్తలు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. పైగా ఎంకన్న పాటలను గేయరూప కవిత్వమని ప్రకటించారు. 

ఎంకన్న రాసిన కవిత్వం గురించి మాట్లాడుకొని తాదాత్మ్యం చెందడానికి ఇదేనా సందర్భం? ఎంకన్న పాటలు కవిత్వంగా చదువుకున్నా గొప్పగానే ఉంటాయి. అట్లా ఎంకన్న పాటల పుస్తకాన్ని కొని, చదువుకొనేవారు పిడికెడుమందే. కానీ, గోరటి పాటలను భుజానేసుకొని, జనాన్ని చైతన్యం చేసే కళాకారులు వందలు, వేలు. పిడికెడుమంది సంతృప్తికోసం వీటిని తమకిష్టమొచ్చినట్టుగా ప్రచురించి తెలంగాణ చరిత్రకు మాయని మచ్చను తెచ్చినట్టయింది.

ముందుమాటలు రాసినవారి ద్రోహం గురించీ చెప్పుకోవాలి. మార్క్సిజం సులోచనాలలో నుంచి ఎంకన్న పాటలను చూసిన పేరున్న పెద్దకవి- ఎంకన్న పాటలకు ప్రాపంచిక దృక్పథాన్ని అన్వయిస్తూనే ఎంకన్న సృజనకు తెలంగాణ జీవితమే కారణమనే స్థానీయత ఎక్కడ బయటపడకుండా ప్రయత్నించాడు. తాను రాసిన వెయ్యి పదాల ముందుమాటలో ఒక్కసారి కూడా తెలంగాణ పదం ఉచ్ఛరించకుండా తన (అ)విశాల దృక్పథాన్ని బలంగా చాటుకున్నాడు. 

ఎంకన్న పుస్తకానికి రెండోసారి ముందుమాట రాస్తున్నప్పటికీ తెలంగాణ ప్రాం త నేపథ్యమే ఎంకన్నను వాగ్గేయకారునిగా నిలబెట్టిందన్న వాస్తవాన్ని ఒప్పుకోలేకపోయాడు. పైగా ఎంకన్నకు అంతర్జాతీయ దోపిడిని అర్థం చేసుకునే చైతన్యమున్నదని తీర్మానించాడు. కానీ, వలసాంధ్ర దోపిడీదారులను కూడా ఎండగట్టే కసి ఉన్నదని మాత్రం వ్యాఖ్యానించలేకపోయాడు.

ఎంకన్నను అందరివాడు చేయాలనే ఆరాటంలో తనను తీర్చిదిద్దిన అర శతాబ్దపు తెలంగాణ దుఃఖం కూడా ఉంద ని గుర్తించకపోవడం విచారకరం. ప్రపంచ సాహిత్య సాంస్కృతిక పరిణామాలను ఒడిసిపట్టుకునే అధ్యయనశీలి, ఈ వాస్తవాన్ని మాత్రం ఎందుకొరకు దాచిపెడుతున్నట్లో సాహిత్యజీవులు ఆలోచించాలి! తాను తెలంగాణ న్యాయ పోరాటానికి మద్దతుగా నిలవాల్సింది పోయి, తెలంగాణ తల్లి ముద్దుబిడ్డను కూడా పక్కదారి పట్టించడమెందుకో ఆలోచించాలి.

ఇక మరో పెద్దమనిషి- 'మానవ సమాజంలోని వెలితిని మనిషి అంతరంగంలోని కోల్పోయినతనాన్ని పోగొట్టుకున్నతనాన్ని శైథిల్యాన్ని పాటలు పాటలుగా తోడి సమాజం సేదదీరుస్తున్నాడు' అన్నాడు. అదేకాదు, తెలంగాణ మట్టిబిడ్డలు యాభైమూడేండ్లుగా సమస్తం పోగొట్టుకున్నతనం గురించి కూడా ఎంకన్న రాసిన పాటల్లో ఎందుకు గుర్తించలేకపోయాడో ఈ విమర్శకుడు. నైసర్గిక కవి అంటూనే ఆ నైసర్గిక దుఃఖం గురించి ఎంకన్న రాసిన పాటలు ఈ పుస్తకంలో ఎందుకు లేవని ఒక్క విమర్శకుడు కూడా ప్రశ్నించకపోవడం విచారకరం.

ఎంకన్న ఇప్పుడు ఎవరిని మెప్పించడానికి ఉగా ది పాటలు రాస్తున్నాడు? దళిత, బహుజన కాన్సె ప్ట్‌తో పాటలు రాసిన కలం ఎందుకు పక్కదారి పడుతున్నది? ఎంకన్న రాసిన దళిత ఉద్యమ పాటలను ఊరూరా పాడి ఉద్యమాన్ని నడిపిన మారోజు వీరన్న బతికి ఉంటే ఎంకన్న ఇలాంటి పాటలు రాసేవాడా? ఎంకన్న ఇట్లా ఉద్యమానికి దూరంగా జరుగుతూ, చెట్ల మీద పుట్ల మీద పాటలు రాసేలా పురిగొల్పుత్నుది ఎవరు? అలా ఎంకన్నను కేవలం ప్రకృతి కవిని చేస్తున్నది ఎవరు? ప్రకృతి అంటే అందు లో మనిషి లేడా? అందులో తెలంగాణ లేదా? దోపిడి లేదా? వివక్ష లేదా? ప్లేటో చెప్పిన రాజ్యానుకూలమైన నిద్రపుచ్చే పాటలలాగా ఈ బుద్ధిజీవులం తా ఎంకన్న ఆ క్షణానికి ఎంజాయినిచ్చే పాటలు రాయాలని కోరుకుంటున్నా రు. 

అట్లాంటి ఉదారస్వభావంలో, లౌక్యం మరిచినతనంతో అమాయక బైరాగి లా నగ్నదేహంతో జీవించాలని చాటే పాటలకు వీళ్లు జడ్జీలై మార్కులేస్తున్నారు. ఆదిమ సమాజ జీవితాన్ని తిరిగి కోరుకుంటున్నారు. ఆధునికతను వ్యతిరేకించ డం అంటే ఆదిమసమాజాన్ని కోరుకోవడమనే తప్పుడు నిర్ధారణకు వస్తున్నా రు. ఈ పాపంలో ఎంకన్నక్కూడా భాగస్వామ్యం లేకపోలేదు.

అవార్డులు, అభి నందనల నడుమ సెలబ్రిటీగా మారుతూ తన బాధ్యతను గాలికొదిలేస్తున్నా డు. ఈ కుట్రలను ఛేదించుకొని తెలంగాణ ఉద్యమాన్ని మీదేసుకొని పనిచేయాల్సిన బాధ్యత ఎంకన్నమీద, ఎంకన్న పాటల మీదున్నది. లేకుంటే తెలంగాణ బిడ్డలు ఈ 'అలసెంద్రవంక'ను తిరస్కరిస్తారు.

- పసునూరి రవీందర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
Andhra Jyothi News Paper Dated : 3/5/2010
Posted by Dalit Blog at 11:28 AM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: పసునూరి రవీందర్

Thursday, February 2, 2012

చారిత్రక తప్పిదాలకు సెలవెప్పుడు? - పసునూరి రవీందర్


'మార్క్సిజం పిడివాదం కాదు. నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట విశ్లేషణే మార్క్సిజానికి ప్రాణం' - వి.ఐ.లెనిన్. సమాజ గమనాన్ని అర్థం చేసుకోవడానికో, లేదా ఆ గమనం సరైన దిశలో లేనట్లైతే మార్చడానికో, సరిచేయడానికో శాస్త్రీయ సిద్ధాంతాల అవసరం ఏర్పడుతుంది. అలా భారతదేశంలోకి ఇంచుమించు ఒక శతాబ్దకాలం కిందట (1920లో) అడుగుపెట్టిందే కమ్యూనిస్టు సిద్ధాంతం. దానికి తాత్విక పునాదిగా ఉన్న మార్క్సిజం ఆధారంగా అనేక రకాల కమ్యూనిస్టు పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటన్నింటి లక్ష్యం విప్లవ సాధనే. కానీ, ఆయా పార్టీలను నడిపిస్తున్న నాయకత్వాలు చేసే అసమగ్ర దిశానిర్దేశం ఈ పార్టీలకే శాపంగా పరిణమిస్తున్నది. 

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు)గా పిలువబడే జాతీయ పార్టీ అయిన సిపిఎం తెలుగు సమాజంలో ఈ కోవలోనే పయనిస్తున్నది. సిపిఐ నుండి విడిపోయినప్పటికీ తనదైన ముద్రతో పోటాపోటీగా తెలుగు నేల మీద అనేక పోరాటాలు చేసి, రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఐదేళ్లకొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ దినదిన కార్యాచరణతో 'బతుకు జీవుడా' అనుకుంటూ ముందుకు సాగుతున్నది. ఐదేళ్ల పొడవునా ఎన్నిసార్లు రోడ్లెక్కి గొంతు చించుకున్నా ఓట్లు ఎట్లాగు రాలవన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, ఏ 'ప్రపంచబ్యాంకు ఏజెంట్ల'తోనైనా జట్టుకట్టి అభాసుపాలవుతున్నది. 

చేసేదంతా చేసి ఐదు పదేండ్లకో, కుదరకపోతే యాభైయేళ్ల తరువాతనో ఒక సమీక్ష సమావేశంలో 'కామ్రేడ్స్ మనం ఆ విషయంలో చారిత్రక తప్పు చేశాం' అని జరగాల్సిన నష్టం జరిగిపోయాక లెంపలేసుకోవడం, ఆ తరువాత అలాంటి తప్పే మరోసారి చేయడం వీరికి రివాజుగా మారింది. రాజకీయ పార్టీ అన్న తర్వాత రాజకీయాలు చేయకుండా ఎలా ఉంటుంది. అది ఆ పార్టీకి చెందిన విషయంగా వదిలెయ్యొచ్చు. కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడైనా ఏ దేశ కమ్యూనిస్టు పార్టీలైనా పనిచేయాలి. అది మార్క్సు చెప్పినా, మావో చెప్పినా మాకినేని బసవపున్నయ్య చెప్పినా సారాంశం ఇదే. 

సిపిఎం తెలుగు రాష్ట్రంలో ఒక్కే ఒక్క సామాజిక వర్గ నాయకత్వం కింద పనిచేస్తూ, ఒక ప్రాంత ప్రయోజనాలకే కొమ్ముకాయడం బహుశా ఈ శతాబ్దపు విషాదాల్లో ఒకటిగా నమోదుకాక తప్పదు. ఇందుకు ఈ పార్టీలో ఎక్కువమంది కోస్తాంధ్రకు చెందిన ధనిక రైతు సామాజిక వర్గానికి చెందినవారు ఉండడమే కారణమనేది బహిరంగ రహస్యం. అందుకే ఔట్‌డేటెడ్ పచ్చడిలా మారిన భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతాన్ని వల్లిస్తూ తన పబ్బం గడుపుకుంటున్నది. రాష్ట్రంలో సగం జనాభా మనోభావాల్ని, ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తూ మరో చారిత్రక తప్పిదానికి తెరలేపుతున్నది. 

ఫ్యూడల్ సమాజాన్ని మార్చడానికి ముందుకొచ్చిన మార్క్సిజం అగ్రవర్ణాల చేతిలో పడడమే ఈ దేశానికి నష్టంగా పరిణమించింది. అందువల్లనే మూడువేల ఏళ్లుగా వేళ్లూనికుని ఉన్న మనువాద కులవ్యవస్థను ఒక సమస్యగా గుర్తించడంలో భారత కమ్యూనిస్టులు విఫలమయ్యారు. ఒక్క కుల సమస్య విషయంలోనే కాకుండా, ప్రాంతీయతను అర్థం చేసుకోవడంలో కూడా ఇంకా విఫలం చెందుతూనే ఉన్నారు. ఈ ప్రాంతానికి జరిగిన అనేక అన్యాయాల పునాదిగా తెలంగాణ రాష్ట్ర కాంక్ష ముందుకొచ్చింది. 

ఈ పరిణామాన్ని అధ్యయనం చేయకుండా దీన్ని కేవలం ప్రాంతీయతత్వంగా కొట్టిపారేయడం సిపిఎంకు గల కోస్తాంధ్ర ఆధిపత్యాన్ని సూచిస్తుంది. 'తెలంగాణ ఇస్తే వద్దనం, కేంద్రం దీన్ని వీలైనంత త్వరగా తేల్చాలి' అనే సిపిఎం గోడమీది పిల్లవాటపు వైఖరి ఏ వర్గ ప్రయోజనాల కోసం? 1969 నాటి ఉద్యమానికి ఇప్పటి ఉద్యమానికి ఉన్న తేడాను సిపిఎం గుర్తించలేకపోతున్నది. ఆనాడు మధ్యతరగతి కేంద్రంగా ఉద్యమం మొదలైతే ఇవాళ సాధారణ కూలితల్లి కూడా తెలంగాణ ఎప్పుడొస్తదని రోజూ అడిగి తెలుసుకునే స్థాయి వరకు ఉద్యమం వెళ్లిందనేది సత్యం. 

శ్రామికవర్గ విముక్తి మాత్రమే లక్ష్యంగా రూపొందించబడ్డ సిద్ధాంతం కింద పనిచేసే పార్టీ కులనిర్మూలన జరగాలని ఎందుకు తన వైఖరి మార్చుకున్నది. పైగా కులసంఘాలను కూడా ఏర్పాటు చేసుకొని ఎందుకు పనిచేస్తున్నది. పార్టీ పుట్టిన నాడు లేని కులపోరాటం మధ్యలో ఎందుకు చొప్పించవలసి వచ్చింది? అంటే కుల సమస్యను పట్టించుకోకపోవడం అనేది ఒక చారిత్రక తప్పిదంగా గుర్తించడమే. సోషలిజం పాఠాలు వల్లించే వారు తెలంగాణ ప్రజాస్వామిక డిమాండ్ సోషలిజానికి ఏ విధంగా వ్యతిరేకమో చెప్పడం లేదు. 

సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను వట్టిపోయిన ఆవుగా మార్చి, సంపదనంతా తరలిస్తున్న దోపిడీపై సిపిఎం వైఖ రి ఏమిటి? ఏడువందల మంది విద్యార్థుల బలిదానాలు జరిగితే సిపి ఎం నోరుమెదపకుండా ఎందుకున్నది? తెలంగాణ సాయుధపోరాటానికి మద్దతుగా నిలిచిన సుందరయ్యలాంటి నాయకులు తెలంగాణ మే లు కోరుకుంటే, ఇవాళ్టి నాయకత్వం ఆంధ్రా సంపన్న వర్గాల ప్రయోజనాలకు వంతపాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు, సీమాంధ్ర పెట్టుబడిదారులకు మధ్య జరుగుతున్న చారిత్రక ఉద్యమమిది. ఈ కీలక సమయంలో ప్రజలకోసం పనిచేసే పార్టీ, ఎటువైపో ఆలోచించుకోవాలి. 

అవకాశవాద ప్యాకేజీల డిమాండ్ ఎప్పుడో బూటకమని తేలిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో మరోసారి అమెరికన్ సామ్రాజ్యవాదం మీదో, ప్రజల ఆకలిమంటలొదిలేసి అణుఒప్పందాల మీదో, లేదా బిజెపి మతతత్వం మీదో కాకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సిపిఐ దారిలో తెలంగాణకు అనుకూల వైఖరి తీసుకోవాలి. పోరాటాల గుమ్మంగా ఉన్న ఖమ్మం జిల్లా తెలంగాణకు సరిహద్దు. ఇప్పుడు సిపిఎం 23వ మహాసభలు నాయకుల సామాజిక వర్గం అండతో ఈ సరిహద్దుల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకమైన ప్రతికూల వైఖరి తీసుకుంటే ఇక ఆ సరిహద్దు అవతలే సిపిఎం పార్టీ ఉంటుందన్న సత్యాన్ని గుర్తిస్తే మరో చారిత్రక తప్పిదానికి తావుండదు. 

- పసునూరి రవీందర్
(ఖమ్మంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భంగా)
Andhra Jyothi News Paper Dated 03/2/2012 
Posted by Dalit Blog at 9:10 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: పసునూరి రవీందర్
Older Posts Home
Subscribe to: Posts (Atom)

Labels

  • ‘ఆకలి కేకల పోరుయాత్ర’ (2)
  • AISF (1)
  • Anand Teltumbde (1)
  • Asaiah (3)
  • Avitikathalu (12)
  • Chandraiah Gopani (1)
  • DIET (2)
  • Discrimination in Universities (1)
  • Dr K. Satyanarayana (4)
  • Dr. Chinnaiah Jangam (1)
  • Dr. P Kanakaiah (2)
  • Education (3)
  • EFLU (1)
  • EGS (3)
  • HBT (1)
  • ICDS (1)
  • Kalpana Kannabiran (2)
  • KCR TRS (1)
  • KG .సత్యమూర్తి (17)
  • Kuldeep Nayar (1)
  • Laxmipeta atrocity on Dalits (19)
  • manual scavengers (1)
  • Nelson Mandela (1)
  • Nikhila Henry (1)
  • Novel (1)
  • P.S. KRISHNAN (1)
  • Palla Trinadha Rao (1)
  • Poverty (1)
  • Praveen Kumar IPS Issue (3)
  • R S Praveen Kumar (3)
  • Renowned Scholars (1)
  • S R Shankran IAS (2)
  • Sub Plan (6)
  • Suicieds (2)
  • Sukhadeo Thorat (1)
  • SWAEROES (1)
  • UDIT RAJ HANY BABU (1)
  • Universities (2)
  • YK (1)
  • అత్యాచార ఘటన (7)
  • అనుబంధకులాలు (1)
  • అరూరి సుధాకర్ (1)
  • అల్లం నారాయణ (9)
  • అవినీతి (3)
  • ఆచార్య అడపా సత్యనారాయణ (1)
  • ఆదినారాయణ (2)
  • ఆదివాసీలు (56)
  • ఆహార భద్రతా చట్టం (2)
  • ఇనప ఉపేందర్ & కోట రాజేశ్ (1)
  • ఇఫ్లూ రస్ట్‌గేషన్ (3)
  • ఈశ్వరీబాయి వర్ధంతి (2)
  • ఉ.సా (8)
  • ఉ.సా. (7)
  • ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్) (7)
  • ఎన్. వేణుగోపాల్ (7)
  • ఎస్వీ సత్యనారాయణ (1)
  • ఎస్సీ వర్గీకరణ (5)
  • ఓల్గా (2)
  • కంచ ఐలయ్య (36)
  • కత్తి పద్మారావు (11)
  • కదిరె కృష్ణ (14)
  • కనీజ్ ఫాతిమా (4)
  • కాకి మాధవరావు (1)
  • కాన్షీరాం (1)
  • కార్తీక్ నవయాన్ (3)
  • కులం (9)
  • కులం వర్గం (6)
  • కృపాకర్ మాదిగ (16)
  • కొంగర మహేష్ (2)
  • కొప్పుల రాజు IAS (3)
  • కొలకలూరి ఇనాక్ (2)
  • కోనేరు కమిటీ (1)
  • గజ్జల కాంతం (1)
  • గాదె వెంకటేష్ (1)
  • గాలి వినోద్ కుమార్ (2)
  • గిన్నారపు ఆదినారాయణ (2)
  • గుడపల్లి రవి (1)
  • గుర్రం సీతారాములు (11)
  • గెడ్డం ఝాన్సీ (1)
  • గోగు శ్యామల (7)
  • ఘంటా చక్రపాణి (15)
  • చరిత్ర (1)
  • చర్మాలు శుభ్రం (1)
  • చిక్కుడు ప్రభాకర్ (5)
  • చిందు ఎల్లమ్మ (1)
  • చినువా అచెబే (1)
  • చుక్కా రామయ్య (2)
  • చుండూరు తీర్పు (5)
  • చెట్టుపల్లి మల్లికార్జున్ (1)
  • జయధీర్ తిరుమలరావు (1)
  • జాన్‌వెస్లి (1)
  • జి. రాములు (1)
  • జి. వివేక్‌ (1)
  • జిలుకర శ్రీనివాస్ (12)
  • జూపాక సుభద్ర (20)
  • జోగిని వ్యవస్థ (1)
  • డా. ఎ. సునీత (1)
  • డా. పి. కేశవకుమార్ (1)
  • డా. వెంకటేష్ నాయక్ (1)
  • డా.కాలువ మల్లయ్య (1)
  • డాక్టర్‌ నాగరాజు అసిలేటి (1)
  • డేవిడ్ (13)
  • డొక్కా మాణిక్యవరప్రసాద్‌ (1)
  • తెలంగాణ (24)
  • దళిత ప్రతిఘటనా నినాదం (2)
  • దళితులు (38)
  • దుడ్డు ప్రభాకర్ (9)
  • నయనాల సతీష్ కుమార్ (1)
  • నలమాస కృష్ణ (1)
  • నలిగంటి శరత్ (1)
  • నిజాం బ్రిటిష్ (1)
  • పసునూరి రవీందర్ (7)
  • పి. ఎస్. కృష్ణన్ (1)
  • పిడమర్తి రవి (1)
  • పైడి తెరేష్‌బాబు (1)
  • పౌరహక్కులు (8)
  • ప్రభాత్‌ పట్నాయక్‌ (3)
  • ప్రొఫెసర్‌ జి. కృష్ణారెడ్డి (1)
  • ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ (1)
  • ప్రొఫెసర్ భంగ్యా భూక్యా (10)
  • బండమీది శ్రీనివాస్ (1)
  • బతుకమ్మ (2)
  • బామ (1)
  • బి సి (6)
  • బి.ఎస్.రాములు (1)
  • బిసి (1)
  • బీఫ్ ఫెస్టివల్ Articles (22)
  • బృందాకరత్‌ (4)
  • బొజ్జా తారకం (2)
  • భగత్ సింగ్ (1)
  • భూ సంస్కరణల చట్టం (1)
  • భూతం ముత్యాలు (1)
  • మందకృష్ణ మాదిగ (18)
  • మల్లెపల్లి లక్ష్మయ్య (3)
  • మహిళలు (20)
  • మహెజబీన్ (1)
  • మానవ హక్కులు (1)
  • మాన్యువల్‌ స్కావెంజర్స్‌ (2)
  • ముస్లిం (6)
  • మూడో జెండర్ (1)
  • యం.ఎఫ్.గోపీనాథ్ (14)
  • యింద్రవెల్లి రమేష్ (1)
  • రంగనాయకమ్మ (4)
  • రమేశ్ హజారి (2)
  • రావెల కిషోర్‌ బాబు (1)
  • వరవరరావు (12)
  • వికలాంగులు (22)
  • విప్లవ సాంస్కృతిక (1)
  • విభజన (4)
  • విమల. కె (1)
  • విశారధన్ (1)
  • వేముల ఎల్లయ్య (4)
  • వేలుపిళ్లై ప్రభాకరన్ (1)
  • సంగిశెట్టి శ్రీనివాస్ (5)
  • సా మాజికన్యాయం (13)
  • సామజిక తెలంగాణా (10)
  • సామాజిక శాస్త్రాల (1)
  • సామాజికన్యాయం (13)
  • సి. కాశిం (10)
  • సిలువేరు హరినాథ్ (2)
  • సీపీఐ (మావోయిస్టు) (2)
  • సుజాత సూరేపల్లి (25)
  • హరగోపాల్ (33)
  • హైదరాబాద్‌ రాష్ట్రం దళితుల పోరాటం (1)
  • హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ 2014 (2)

Followers

Blog Archive

  • ▼  2016 (5)
    • ▼  April (4)
      • మార్క్సి‌స్టు‌దృక్కోణంలో కులం By -ప్రభాత్‌ పట్నాయక...
      • పాలనలో చెరగని సంతకం Byరావెల కిషోర్‌ బాబు సాంఘిక, ...
      • భారత ‘అమూల్య రత్న’ బాబూజీ! By Krupakar Madiga
      • జాతీయ నాయకుడు జగ్జీవన్‌రామ్‌ By డొక్కా మాణిక్యవరప్...
    • ►  February (1)
  • ►  2015 (8)
    • ►  December (2)
    • ►  October (1)
    • ►  May (3)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2014 (94)
    • ►  December (4)
    • ►  November (2)
    • ►  October (3)
    • ►  September (1)
    • ►  August (10)
    • ►  July (24)
    • ►  June (7)
    • ►  May (13)
    • ►  April (13)
    • ►  March (3)
    • ►  February (11)
    • ►  January (3)
  • ►  2013 (263)
    • ►  December (14)
    • ►  November (27)
    • ►  October (25)
    • ►  September (29)
    • ►  August (14)
    • ►  July (16)
    • ►  June (10)
    • ►  May (21)
    • ►  April (30)
    • ►  March (23)
    • ►  February (30)
    • ►  January (24)
  • ►  2012 (443)
    • ►  December (36)
    • ►  November (20)
    • ►  October (18)
    • ►  September (14)
    • ►  August (24)
    • ►  July (33)
    • ►  June (32)
    • ►  May (29)
    • ►  April (60)
    • ►  March (61)
    • ►  February (74)
    • ►  January (42)
  • ►  2011 (269)
    • ►  December (31)
    • ►  November (40)
    • ►  October (30)
    • ►  September (167)
    • ►  April (1)

About Me

My photo
Dalit Blog
The education and political power are the two main weapons... And it is democratic right.
View my complete profile
Travel theme. Powered by Blogger.