Saturday, July 7, 2012

దళితులపై దాడులు.. న్యాయాన్యాయాలు----దొంత భద్రయ్య





మం త్రి కొండ్రు మురళి దళితుడే అయినప్పటికి ఆయన ప్రభుత్వ భాగస్వా మి. ఈయనకు దళిత స్వభావం ఉన్నదో లేదోకానీ, ఈ ప్రభుత్వానికి అగ్రకుల స్వభావం పుష్కలంగా ఉన్నది. ప్రభుత్వంలో భాగస్వామి గా ఉన్న ఆయన అగ్రకుల స్వభావంతో ఉండక పోయినా అది ఆయనకు ఉన్న దళిత స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అగ్రకుల స్వభావం కలిగిన నాయకులు లక్షింపేట ఊచకోతలో తమ కుల ప్రజలకు అండగా ఉండడంలో ఆసక్తి కలిగినంతగా, కొండ్రు మురళి తాను మంత్రిగా ఉంటూ ఊచకోతకు బలైన తన కుల ప్రజల పక్షాన నిలవడానికి ఎందుకు ముందుకు రాలేకపోయాడు? ప్రభుత్వంలో కీలకంగా ఉన్న బొత్స సత్యనారాయణ అగ్రకుల స్వభా వంతో దాడి చేసినవారికి అండగా నిలి చాడు. కానీ దాడికి గురైన బాధిత ప్రజల ప్రతినిధి అయిన కొండ్రు మురళి అంతే స్థాయిలో తన ప్రజలకు అండగా రాజకీయ పాత్ర పోషించలేకపోయాడు. ఆధిపత్యం చెలాయించి భయవూభాంతులతో ప్రలోభాలకు గురి చేసి రాజకీయ మనుగడను కొనసాగించుకోవచ్చనే ధీమాతో అగ్రకుల నాయకుడు ఉంటే, దయాదక్షిణ్యాలతో రాజకీయ మనుగడను సాగించాలనుకునే స్థితిలో దళిత ప్రజావూపతినిధి ఉన్నాడు.



ఆటవికరీతిలో దాడిచేసిన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన నాయకుడి కంటే, గండ్ర గొడ్డళ్లు, బరిసెలకు ఆహుతయిన దళిత ప్రజలకు అండ గా ఉండడానికి ముందుకురాని మంత్రి ఏవిధంగా కూడా సమర్థనీయుడు కాదు. రాజకీయంలో ఉంటే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితులలో ఉంటే ఏ నాయకుడైనా కొండ్రు మురళిలాగే వ్యవహరిస్తారు. దేశంలో మనుగడలో ఉన్న సమాజాన్ని ప్రశ్నించాలం ఏటికి ఎదురీదే తత్వం ఉన్న వారితోనే సాధ్యపడుతుంది. కాని ఏటిలో కొట్టుకుపోయే వారితో ఈ సమాజ క్రమాన్ని మార్చలేము. ఈ సందర్భంలో ఈ మంత్రి కావచ్చు వేరొక సందర్భంలో ఇంకెవరైనా కావచ్చు. ఎవరైనా ఈ సమాజ పురోగతికి వారు ఏవిధంగానూ ఉపయోగపడరు. లక్షింపేట ఘటనకు ఈ ప్రభు త్వం సిగ్గు పడదు. కారంచేడు, చుండూరు ఘటనలకు బాధపడలేదు. నిజానికి సాటి మానవుల పట్ల కనీస మానవ మర్యాదలను చూపించలేని ఈ సమాజంలో దళితుల స్థితి మరోలా ఉంటుందని ఆశించడం అత్యాశ. సహజంగా అణచివేయబడుతున్న కులాలు ఆధిపత్యం చేస్తున్న కులాలపై ద్వేషాన్ని, ఆక్రోశాన్ని కలిగి ఉండాలి. కాని ఈ దేశంలో అణగారిన కులాలు వారిపై ఎన్ని దాడులు జరిగినప్పటికీ ఈ సమాజం పై ద్వేషాన్ని పెంచుకోవడం లేదు. కారంచేడులో కమ్మ కులస్తులు మాదిగలను నరికి చంపినా, చుండూరులో మాలలను రెడ్డికులం వారు ముక్కలుగా నరికినా తిరు గుబాటు చేయలేదు. 




మహరాష్ట్ర ఖైర్‌లాంజిలో సాక్ష్యం చెప్పిన పాపానికి ఇంటిని తగులబెట్టి తల్లీకూతుళ్లను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన క్రమం నుంచి నేటి లక్షింపేట ఘటనలో మాలలను కాపు కులస్తులు గండ్ర గొడ్డళ్లతో నరికి చంపినప్పటికీ ఈ అణగారిన కులాలు ఈ సమాజంపై ద్వేషాన్ని పెంచుకోవడం లేదు. వీరికి మానవ హక్కుల పట్ల అవగాహన లేదా? దాడుల వెనుక మూలాలు తెలియవా? వీరు దాడులు చేస్తు న్న వారిని ఎదుర్కొవడానికి చేతకానివారా? అసలు వీరికి ఆత్మగౌరవము లేదా? ఈ అణగారిన వర్గాలు తలుచుకుంటే వేల సంవత్సరాలుగా తమ కులాలపై జరుగుతున్న దాడులకు కారణమైన పీడక కులాలు ఈ పాటికి కనుమరుగు అయ్యేవి. అంబేద్కర్ అందించిన ప్రజాస్వామిక ఆలోచన విధానంతో పోరాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఆధిపత్య కులాల ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నది. అది ఏవిధంగాను కింది కులాలకు ఉపయోగపడదని అంబేద్కర్ చెప్పారు. అందుకే అంబేద్కర్ హింస ఒక శక్తి మాత్రమే అది సమస్యకు పరిష్కారం కాదని చెప్పాడు. అంబేద్కర్ చెప్పినట్టు హింసలో నమ్మకం లేకనే ఇంత ప్రజాస్వామికంగా ఉంటున్నారు. లేదంటే ఈ దేశం హింసతో వేగిపోతుంది. ఈ ప్రజాస్వా మ్య పరిధిలో అణగారిన వర్గాలకు రక్షణలను కల్పించే విషయంలో ఇంకా విఫలమైతే ఈ కులాల నుంచి తీవ్రమైన పోరాటాలు రాకమానవు. అవే వస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో ఈ ప్రభుత్వాలు, ఆధిపత్య కులాలు ఆలోచించాలి. బానిసల లాగా చచ్చేబదులు విముక్తి కోసం పోరాడుతూ చావడమే గొప్పదని చెప్పిన స్పార్టకస్ మాటలను ఈ వర్గాలు అనుసరిస్తే.. పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఈ సమాజం తెలుసుకోవాలి.




కారంచేడు, చుండూరు ఘటనల్లో నిందితులకు శిక్షలు ఖరారు కావడానికి 15 సంవత్సరాల కాలం పట్టింది.ఒకవేళ మాల మాదిగలు ఏ ప్రాంతాలోనైనా కమ్మలు, రెడ్డి, కాపుల మీదనో దాడులు చేస్తే శిక్షలు ఖరారు కావడానికి 15 సంవత్సరాలు పడుతుందా? కేవలం నెలల వ్యవధిలోనే విచారణ జరిపించి మరణ శిక్షలు లేదంటే యావజ్జీవ శిక్షలు ఖరారు అయ్యేలాగా ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఇంకా అవసరమైతే దళితులు ఆ విధమైన దాడులు చేస్తే సమాజంలో శాంతిభవూదతల సమస్య కారణాన్ని చూపించి వారిని ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చివేస్తున్నది. మాల మాదిగలు కమ్మల మీద, రెడ్డిల మీద, కాపుల మీద దాడులు చేస్తే శాంతిభవూదతల సమస్య అవుతుంది. దాంతో వారిని చంపడానికైనా సిద్ధపడే ప్రభుత్వం అదే మాల మాదిగల మీద కారంచేడు నుంచి 25 సంవత్సరాల కాలంగా ఎన్నో ప్రాంతాల్లో అగ్రకులాలు దాడులు చేస్తే హత్యాకాండ కొనసాగిస్తే అది శాంతిభవూదతల సమస్యగా ఈ ప్రభుత్వాలకు కనిపించదా? కారంచేడు, చుండూరు ఘటనల్లో నిందితులను శిక్షించేందుకు దళితులు జాతీయస్థాయిలో సుదీర్ఘ కాలంపాటు ఉద్యమా లు చేయాల్సివచ్చింది. అయినప్పటికీ శిక్షలు ఖరారు కావడానికి 15సంవత్సరాలకాలం పట్టిం ది. అంటే మాల మాదిగలపై దాడులు చేసిన వారికి శిక్షలే పడాలంటే జాతీయస్థాయిలో పోరాటాలు చేస్తూ సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలి. మాల మాదిగలు ఒకవేళ అగ్రకులాలపై దాడులు చేస్తే వారిని శిక్షించడానికి జాతీయస్థాయి ఉద్యమం అవసరముంటుందా? రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్ణయం జరుగుతుంది. దానికి ఉదాహరణ చిలుకలూరిపేట బస్సు దహనం కేసు. ఆ ఘటన చాలా హేయమైనది, క్షమించరాదనిది. 




ఆ ఘటనలోపాల్గొన్న దళితులు విజయవర్ధన్‌రావు, చలపతి నిందితులు. వారిపై నేరం రుజువు కావడానికి ఒకటి, రెండు సంవత్సరాలోనే జరిగి వారికి మరణ శిక్షపడింది.కారంచేడు,చుండూరు ఘటనలో ఇప్పుడు లక్షింపేట ఘటనల్లో పథకం ప్రకారం నరికి చంపేశారు. ఇంతటి మారణకాండ జరిగినప్పటికీ ఆ ఘటనల్లో పాల్గొన్న నిందితుపూవరికి మరణ శిక్షలు ఖరారు కాలేదు. వీరికి శిక్షలు తగ్గించాలని ఏ ఉద్యమం చేయాల్సిన అవసరం కమ్మలకు, రెడ్డిలకు రాలేదు. అంటే దాడులు చేయడంలో కుల ఆధిపత్యం ఉన్నది. శిక్షలు పడేందుకు విచారణను నడిపించడంలో ప్రభుత్వానికి కుల స్వ భావం ఉన్నది. ఈవిధమైన వివక్షాపూరితమైన ప్రభుత్వాల వైఖరి ఇలాగే ఉంటే అణగారిన వర్గాలు ఏదో ఒకరోజు అగ్ర కులాలపై సామూహిక దాడులు చేసే పరిస్థితి వస్తుంది. అంబేద్కర్ చెప్పినట్టు హింస ఒక శక్తి మాత్రమే అది సమస్యకు పరిష్కారం కాదని చెప్పినప్పటికీ కొంతకాలం ఆ శక్తిని కూడా ప్రభుత్వాలకురుచి చూపించే రోజు రాకముందే కళ్ళు తెరిచి లక్షింపేట ఘటనలో పాల్గొన్న నిందితులను కఠినంగా శిక్షించాలి.

-దొంత భద్రయ్య
Namasete Telangana News Paper Dated : 08/07/2012

Tuesday, July 3, 2012

Half of SC/ST teaching posts unfilled in Central varsities--RAHI GAIKWAD


In the filled slots, SCs constitute just 12% against the stipulated 15% and STs 5% instead of 7.5%
Among the ills that plague the Indian higher education system is the continued poor stake of the Scheduled Castes and Scheduled Tribes in it. Year on year, the huge backlog of vacancies in teaching positions in SC/ST categories remains a constant concern with little change in its position.
Nearly half the teaching positions for SCs and STs in Central Universities are still unfilled. According to the data provided by the government of India in December 2011 to a Right to Information query by Lucknow-based activist Mahendra Pratap Singh, 48.5 per cent of posts in these two categories in 24 Central varsities were vacant during 2010-2011. The stipulated quota for SCs and STs in Central institutions is 15 per cent and 7.5 per cent respectively.
For the year, 2010-211, the total backlog in SC category at the entry-level position of Lecturer was 341 out of 740 required posts. Thus, 46 per cent of these posts were unfilled. In the ST category, 197 or 53 per cent of posts were vacant out of the required posts of 369.
Under-representation
The huge gap points to the under-representation of these marginalised communities in educational institutions. The SCs constitute 12 per cent of the total filled positions in Central Universities and STs constitute five per cent of the filled posts.
Climbing up to the prestigious ranks of Reader and Professor, their share gets alarmingly dismal. Over 84 per cent of posts for Readers in the SC-ST category were vacant in 2010-2011. And, over 92 per cent Professor’s positions in these categories are vacant.
The Banaras Hindu University (BHU) has consistently had the poorest record of clearing the backlog. There was a whopping 59.7 per cent of SC and ST vacancies in lecturer positions itself in 2010-2011.
A BHU source confirmed the situation remained the same in 2012 as well, since the University had not undertaken a recruitment drive in the past few months to clear this backlog.
In fact, the current position is as bad if not worse, compared to previous years. As per the 2007-08 figures, obtained by The Hindu under RTI, SC-ST vacancy in BHU for the lecturer position was at 52 per cent.
“The problem,” remarked Subhash Lakhotia, Professor Emeritus at BHU, “is that candidates are often not found suitable.” — a reason cited across the board for poor implementation of the reservation policy.
“The university has to consider certain minimal requirement. Many teaching positions are for specialised candidates. The quality of degrees our education system gives is not [of a very high standard]. So, although candidates meet the eligibility criteria, they are not found suitable. A large number of open posts are also vacant,” Mr. Lakhotia told The Hindu on the phone.
“The fallacy lies in the system. The graduates coming out today are unemployable,” he pointed out.
The overall concerns over standards notwithstanding, the approach to implementation of reservation is complicated by a notional linking of the reservation policy with impoverishment of “quality” of education.
“I would not like reservation anywhere. Higher education is about quality. The government says launch a special drive to fill posts; it is in their interest. But in the process you lose out on quality,” remarked Mr. Lakhotia.
“Reservation has made things worse,” remarked a source from BHU. “You don’t get quality people. SC/ST candidates are competent. The ones from Maharashtra and the northeast are good. Tezpur University is doing very well. That’s because their graduates return to their native place.”
Another reason cited by BHU was the increase in the retirement age to 65 years (as per 2006 UGC recommendations). “For some years, no one retired and then there were mass retirements creating a sudden vacancy. In Banaras, availability of housing and other facilities is a major problem. So no one wants to take up jobs here,” an official remarked.
Making matters worse, the quota policy itself is looked upon as a benevolent act towards the lower sections, rather than an affirmative and necessary provision to ensure the fair share of SCs and STs in education, long denied due to the caste system.
“Let me point out,” said a BHU professor in a letter to the BHU Vice-Chancellor, obtained through RTI by Mr. Singh, “that we are aware of our social responsibilities and compulsions which implies some reservation to be done for [the] weaker section.”
Arguing for “phased reservation,” he wrote that the university must ensure that “the weaker sections get advantage at the entry level through phased reservation, but at the same time the academic profile/glamour/reputation of the university remains intact.”
‘Centre of excellence’
One argument put forth by the BHU is also that it is considered a “centre of excellence.” Therefore, it should be excluded from the reservation policy.
Dr. Vikas Gupta from the Delhi University said that filling posts roster-wise would help ease the backlog. That entailed marking posts in departments as per each category and so on.
“Roster implementation takes care of many of the [gaps] in filling reserved posts. Every department has to maintain a roster of posts to ensure full reservation and avoid manipulation. Rosters should be made public by all universities.”
According to Mr. Gupta, earlier universities in their advertisements would mention only the number of reserved posts without specifying which post was for which community — SC/ST/OBC. So, a candidate did not know which post she/he was applying for.
This way, universities “got the free ground to keep people confused.” Everyone is applying for everything. After the interview, the decision is made [on selection for a particular department post]. “This is unfair. This is how it is manipulated,” Mr. Gupta said.
He remarked the situation was changing with universities going in for the roster system.
Despite, repeated attempts, the University Grants Commission did not respond to The Hindu’s queries on the issue.

The Hindu News Paper Dated : 02/07/2012 

Sunday, July 1, 2012

India: Condemn the murder of Dalits, and support the resistance of dalits and adivasi!



REVOLUTIONARY DEMOCRATIC FRONT (RDF), Press Release22 June 2012
  • RDF strongly Condemns the Dalit Massacre in Lakshimpeta in Srikakulam
  • Punish the Culprit Upper Caste Brahmanical Forces Including their Abettors, the Ruling Party Leaders
  • RDF Hails the Exemplary Courage of Dalit People of Lakshimpeta for Putting Up Brave Fight to Own the Land.
  • Rally Around All Dalit and Adivasi People’s Struggles for Self-Assertion and Dignity
  • Develop Self-Defense to Protect the Movement and its Gains Against Murderous Attacks of the Brahmanical Forces.
Yet another massacre on dalit people in Andhra Pradesh shows that the landowning castes still turn violent when dalits assert themselves to take over land.  Four dalit people were hacked to death, and about 30 dalit men and women were critically injured in a well-orchestrated attack by Turpu Kapu backward caste brahmanical forces in Lakshimpeta village of Vangara block in Srikakulam District on 12 June 2012. The brahmanical forces targeted 60 dalit families in the village with crude and brutal weapons like bombs, sickles, hatchets and axes supported and patronised by the ruling Congress Party leaders of the region. Burada Sundara Rao (45), Chitri Appadu (35), Nivarti Venkati (65) and Nivarti Sangameshu (40) died in the bloodbath. Bodduru Papaiah died in King George Hospital, Vishakhapatnam on 20 June while taking treatment. With his death, the number of people killed in the massacre increased to five.
Land was acquired by government for Madduvalasa reservoir built on two tributaries of Nagavali river, Suvarnamukhi and Vegavathi which, while displacing thousands of people irrigated 15000 acres of land. In Lakshimpeta village, after the construction of the reservoir, 240 acres of land intermittently comes out of the submergence when water dries up. As the land turns fertile, rich crops were being raised on it with profitable cultivation in the past five years. The government paid a compensation of two lakh rupees per acre to Kapu land owners and settled 190 Kapu families and 60 dalit families about seven kilometres away from the reservoir. The dalit families were not paid any compensation or given employment though they were also displaced and resettled except for four families, who had assigned lands—only 40 thousand rupees per acre were paid to each of these four dalit families. Meanwhile one each from 40 families of the Kapu caste was provided with employment in the reservoir office departments in addition to compensation amount for land. All 250 families were settled in pacca houses built by the government. Having been deprived of land for centuries, the dalits of Lakshimpeta, as in most other cases, aspired to take over the unaffected land under the project and they have been asserting their rights over the land which now falls under the control of the government.
As the 240 acres of land—that once belonged to Kapu community became government land after compensation was being paid—came out of submergence every now and then,  180 acres of land has been cultivated by the Kapu families while only 60 acres by 60 dalit families in the last five years.  Kapu community in the village claimed that the entire land belongs to them as it once belonged them. Dalits argued with the local revenue administration that they should be allowed to cultivate this land as it was now government land.
The local administration maintained silence as the Kapu caste people were supported by powerful lobbies within the ruling party from the state to the bloc levels within the same caste. Both sides of the dispute approached the court for justice. The court as usual stayed the cultivation from both sides till its judgment. This triggered fury among the Kapu backward community and they blamed squarely the dalit community for the court order, though both communities had approached the court. The former local block president of Congress Party, Botsa Vasudevanaidu instigated the Kapus against the dalit people with the active encouragement from PCC chief, Botsa Satyanarayana. Congress leaders like Botsa Satyanarayana, Dharmana Prasada Rao (Minister for Roads and Buildings in Andhra Pradesh Government) from North Andhra Region have become the powerful agents of land grab in the region for thermal power plants, industrial corridor projects and mining. They are maintaining land mafia’s and have acquired thousands of acres of for their own families. They are responsible for the police firings and state-sponsored killings of the people, who are protesting against land grab in the region. They are the powerful political leaders of the region who are in real sense representatives of globalisation and displacement of hundreds of thousands of people in the region.
As the tension in the village grew, the government put up a police picket in the village, instead of solving the issue and the bloc has been placed under the atrocitiy-proned area. This shows such an attack as the one on dalits on 12 June has been expected to happen. In these circumstances, the government itself is directly responsible for the massacre of dalits. On June 12, majority of police personnel at the picket were sent away on by-election duty. The police forces returned to the village only after giving enough time to the caste chauvinists to carry out the massacre unhindered. History testifies to this set pattern of conduct of the state forces as every time they remained mute witnesses to the upper caste brahmanical fascist attacks on dalits. In fact the India state forces like police, paramilitary and army always either sided with upper caste big landing owning communities or stayed as onlookers over the atrocities as they represented the interests of the brahmanical upper caste Indian state.
As the dalit people were not prepared to face the brutal attack from the brahmanical casteist forces, they either prayed their attackers to leave them or couldn’t move away to safety. The motivated and calculated nature of the attackers was evident from their preparedness to strike on the dalits fatally. All the victims targeted were the main bread-winners of their respective families. All of them were mainly landless peasants.
The infuriated dalits of Lakshimpeta refused to bury the dead for the next three days as the government did not arrest the culprits and their abettors, the kingpins in the massacre and the ruling parties’ leaders. The dalit people protested the government’s inaction placing the dead bodies of their kith and kin in front of the village. The administration did not use SC and ST Atrocities Act against the culprits and their abettors till all dalit and democratic forces raised their voices in protest. A week after when the law was evoked, it was used against small insignificant elements among the culprits, leaving out safely the main abettors and political leaders like Botsa Vasudeva Naidu, Botsa Satyanarayana and others.
The political leaders of all ruling parties hovered over the surviving victims of dalit families pouring out their crocodile tears and false promises of jobs, lakhs of compensation and distribution of land. People have seen through the cunningness of these leaders as well as the empty rhetoric of their false promises. The upper caste brahmanical forces would never allow land to come into the hands of dalits as it is both symbolically and in real sense economic and political power. Further it will nullify all the coercive methods of surplus maximisation of the landed through the forced rendering of the dalits landless and hence dependent on the upper castes for their survival. The powers that be have only ensured through their police and paramilitary hand in glove with politician and the landowning classes to perpetuate this system by careful promotion of their interests. Dalit people of Lakshimpeta village have shown exemplary self-assertion to own the land despite continuous threats and atrocities from the powers that be.
RDF appeals to all democratic, progressive and revolutionary individuals and organisations to rally around the dalits in their attempt to self-assertion for dignity and to acquire land as a source of livelihood. Traditionally land mainly remained in the hands of the upper caste brahmanical feudal landowners. It is important to understand that at present the biggest land grab by the upper caste feudal and comprador forces in the name of projects, companies, mining, etc, are further depriving the dalits and adivasis, while at the same time preaching them that agriculture is not a profitable profession to live on. But the dalit and adivasi people are increasingly asserting themselves for their rights over land and other natural resources as they provide livelihood to the largest number people in the subcontinent. The movement for self-assertion and dignity is invariably linked to the land question for the vast majority of the oppressed people from oppressed castes and communities like Dalits, Adivasis, Muslims, and a vast majority of oppressed other weaker castes, though a section of the land owning among them turned brahmanical and caste oppressors.
The Dalit, Adivasi, Muslim and other communities of oppressed people need to have self-defence mechanisms while asserting themselves in every aspect in life, otherwise they are being massacred or facing genocidal attacks. In this context it is important to remind ourselves of the call given during Dalit Panthers upraising for self-defence of dalits in 1970s.
Most of the demands raised by all democratic organisations are for more compensation for the deceased and injured families of dalits. While compensation is required as an immediate relief and justice by punishing the culprits, what is important as the permanent solution is to build self-defence cover for dalits to protect themselves as well as a sound deterrent against the massacres from brahmanical upper caste fascist forces. Only through acts of retaliation can we stop and prevent atrocities on dalits.
(This statement is based on Fact-finding done by various people’s organisations in which an RDF executive member was part).
President                                                                                             General Secretary
Varavara Rao                                                                                      Rajkishore
09676541715                                                                                      09717583539

REVOLUTIONARY DEMOCRATIC FRONT (RDF)
Contact: revolutionarydemocracy@gmail.com



Saturday, June 30, 2012

దళితులపై దాడులు ఆగేదెన్నడు? ----యెపూరమల్ల రాములు, రాష్ట్ర అధ్యక్షుడు మాలమహానాడు -కె. కాశీవిశ్వనాథం,




CM00 talangana patrika telangana culture telangana politics telangana cinema


శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేట దళితులపై ఓ వర్గం వారు దాడి చేసి ఐదుగురిని హత్యచేశారు. 30 మందిని తీవ్రంగా గాయపర్చారు. లక్షింపేట కుల వివక్షకు కేంద్రంగా ఉన్నది. గ్రామ సర్పంచ్ చిత్తి రి సింహలమ్మను గ్రామ పంచాయితీ సమావేశంలో ఏనాడూ కుర్చీలో కూర్చోనివ్వలేదు. గ్రామ సచివాలయంలో మొత్తం ఒక వర్గం వారే కావడంతో వారు చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. వారు ఆడిందే ఆటగా, పాడిందే పాట గా ఉన్నది.



ఈ నేపథ్యంలో దళితులపై దాడికి ఆ గ్రామంలో జరుగుతున్న పరిణామాలకు చాలా చరివూతనే ఉన్నది. వంగర సమీపంలో మడ్డువలస జలాశయం నిర్మాణం కోసం చుట్టుపక్కల గ్రామాల రైతుల భూములును ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగే లక్షింపేట గ్రామంలో కాపులు, మాలల ఇళ్లు, కాపు రైతు ల పంటభూములు, మడ్డువలస డ్యామ్ నిర్మాణం కోసం సేకరించారు. కొత్త కాలనీకి తరలింపునకు మొదట కాపు కులస్తులు నిరాకరించగా,మాలలు తమ నివాసాలు విడిచిపెట్టి, కొత్త లక్షింపేట కాలనీలోని స్థలంలో గృహాలు నిర్మించుకున్నారు. తరువాత కాపు కులస్తులు కూడా సదరు కాలనీకి తరలి ప్రభు త్వం రైతుల భూములకు పరిహారం చెల్లించి ఉపాధి కోసం కుటుంబానికి ఒక్కరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. కానీ మాల కులస్తులకు ఎటువంటి ఉపాధి చూపించలేదు. కాలనీ తరలించుటలో జలాశయంలో ముంపునకు గురికాకుండా ఉన్న భూమిలో మాలలు పంటలు పండించుకోవడానికి అధికారులు హామీ ఇచ్చారు. అదే ప్రభుత్వం మాలలకు చూపిన ఉపాధి హామీ. 



మడ్డువలస డ్యామ్ నిర్మాణం పూర్తయ్యి, నీటితో జలాశయం నిండినా, లక్షింపేట గ్రామం భూములు ముంపునకు గురికాకుండా ఉన్నందున వాటిని దళితులకు ఇచ్చారు. కానీ అదే కాపు కులస్తులు మాత్రం సుమారు 195 ఎకరాలను ఒక్కొక్కరు 5నుంచి 10 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. దేవకివాడ గ్రామం నుంచి సేకరించిన 60 ఎకరాల భూమిని 75 దళిత కుటుంబాల వారు సాగు చేసుకొని బతుకుతున్నారు. ఈ భూములు లక్షింపేట గ్రామానికి ఒక కిలోమీట రు దూరంలోనే ఉన్నాయి. అలాగే డ్యామ్ చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు కూడా ముంపునకు గురి కాకుండా ఉన్న ప్రాంతాన్ని సాగుచేసుకొంటున్నారు. నేడు సీతారాంపురం, మద్దివలస సరిహద్దులో ఉన్న డ్యామ్ భూములు కూడా దుక్కులు దున్నుతున్నారు. డ్యామ్ భూములను లక్షింపేట మాలలు సాగు చేసుకోవడాన్ని అక్కడి కాపులు సహించలేకపోయారు. దీని ఫలితమే లక్షింపేట దళితులపై దాడి.
ఇది తక్షణ కారణంగా కనిపించినా.. లక్షింపేటలో కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు దీనికి ఆజ్యంపోశాయి. లక్షింపేటలో కాపులు, మాలలు కలిసి ఎస్సీ రిజర్వుడు పంచాయితీకి ఏకగ్రీవంగా చిత్తిరి సింహాలమ్మను కాంగ్రెస్ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. కాపులకు ముఖ్య నాయకుడుగా ఉన్న వంగర మండలానికి చెందిన బొత్స వాసుదేవరావు నాయుడుదే ఆధిపత్యం.



ఏ పని జరగాలన్నా ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది. ఈయన గారే లక్షింపేట దాడికి సూత్రధారి అని దళితులు అంటున్నారు. అలాగే.. ఏకక్షిగీవంగా ఎన్నికైన సింహాలమ్మను ఏనాడూ గ్రామ పంచాయితీ సమావేశాలలో కుర్చీపై కూర్చోనివ్వలేదు. కానీ పంచాయితీ సభ్యులు మాత్రం కుర్చీల్లో కూర్చుంటారు. కాపులు చెప్పిందే, సూచించిందే చేయాలి. గ్రామంలోని పాల కేంద్రాన్ని దళితుడైన గణపతి నిర్వహిస్తున్నాడు. దీనికి అందరూ పాలు పోసేవారు. తరువాత ఏమైందో ఏమో.. కాపులు మరో పాలకేంవూదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గణపతి పాలకేంవూదానికి కాపులు పాలు ఇవ్వడం మానేశారు. కాపులతో సమానంగా దళితులు ముంపునకు గురికాని భూములను సాగు చేసుకోవడాన్ని సహించలేక రగిలిపోతున్నారు. దళితులు సాగుచేసుకుంటున్న భూముల నుంచి దళితులను ఎలాగై నా తరిమేయాలని పథకం పన్నారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన వారిని గ్రామానికి పిలిపించి, దళితులు భూములు దున్నరాదని వివాదం సృషించారు.



దీంతో దళితులు తాము దున్నుకుంటున్న భూములను తమకే అప్పగించాలని శ్రీకాకు ళం జిల్లాకపూక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, డ్యామ్ అధికారులు, రాజకీయ నేతలు, మంత్రి కొండ్రు మురళి సమక్షంలో ఇరు పక్షాలు వివాద పరిష్కారానికి ప్రయత్నించారు. మాలలకు భూమి ఇవ్వడానికి కాపులు అంగీకరించలేదు. పీసీసీ అధ్యక్షడు, మంత్రి బొత్స ముఖ్య అనుచరుడైన బొత్స వాసుదేవరావు నాయుడు మాలలపై కక్షగట్టి దళితులపై దాడికి పథక రచన చేశాడు. ‘మిమ్మల్ని నలుగురినో, ఐదుగురినో చంపితే గానీ భూములు వదలర’ని హెచ్చరించాడు. ఈవిధంగా లక్షింపేటలో కాపులు, దళితుల మధ్య రోజురోజుకూ ఘర్షణ వాతావరణం పెరిగిపోతున్నా శాంతిభవూదతలు కాపాడవలసిన వంగర పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. గ్రామంలోని ఉద్రిక్తతల నేపథ్యంలో 18 మార్చి నుంచి నేటి వరకు లక్షింపేట గ్రామస్తులపై సీఆర్‌పీసీ 107 సెక్షన్ అమలులో ఉన్నది. కాపు లు 54 మంది, మాలలు 53 మందిపై బైండోవరు కేసులు పోలీసులు పెట్టారు.



ఆ తరువాత గ్రామంలో 144 సెక్షన్ కూడా నెలరోజుల పాటు కొనసాగింది. శాంతి కమిటీని ఏర్పాటుచేశారు. భూ వివాదానికి సంబంధించి సీఆర్‌పీసీ 145 ఆర్డర్ కూడా లక్షింపేట గ్రామస్తులపై విధించారు. నేటికీ ఆ గ్రామంలో 107 సెక్షన్ అమలులో ఉన్నది. లక్షింపేట సర్పంచ్ సింహాలమ్మ బంధువు పంటచేనును పక్క గ్రామానికి చెందిన వ్యక్తి పశువులు పాడు చేశాయి. దీనిని అతను ప్రశ్నించాడు. దీంతో.. కాపులు ముందుకు వచ్చి తిరుపతిరావు నాయకత్వంలో దళిత రైతు అప్పడును కులం పేరుతో దూషించి కొట్టారు. దీంతో చేసేది లేక దళితులు కులం పేరుతో దూషిం చి కొట్టినందుకు వంగర పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. దీనిపై విచారించిన డీఎస్పీ కాపు కులస్తులైన ముద్దాయిలను అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన కాపులు తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినందుకు మాల కులస్తులను బెదిరించసాగారు. బెదిరించినట్లుగానే 12-06-2012నాటి దాడిలో అప్ప డును బల్లెంతో పొడిచి దారుణంగా చంపారు.



అట్రాసిటీస్ కేసు నమోదైన నాటినుంచీ లక్షింపేటలోపోలీస్ పికెట్ పెట్టారు. కానీ ఇంతలో ఎన్నికలు రావడంతో పికెట్‌లోని పోలీసులను ఎన్నికల నిర్వహణకు పంపారు. పోలీస్ పికెట్‌లేని సమయాన్ని అదనుగా భావించిన కాపులు దళితులపై దాడికి పన్నాగం పన్నారు.



జూన్ 11న బొత్స వాసుదేవరావు నాయు డు ఇంట్లో 20మంది కాపులు సమావేశమయ్యారు. హత్యాకాండకు పథక రచన చేశారు.12న ఉదయం ఏడు గంటలకు కాలనీ రహదారి పక్కన ఆవు తిరుపతిరావు ఇంటి దగ్గర కాపులు సమావేశమయ్యారు. దాడి కుట్ర తెలియని దళితులంతా తమ పనుల్లో మునిగిఉన్నారు. ఏడున్నర గంటల ప్రాంతంలో దళితవాడలో బాంబులు వేసి భయవూబాంతులు సృష్టించారు. కాపు స్త్రీలు కారం చల్లుతూ మాలలపై దాడికి దిగారు. దొరికిన వారిని దొరికినట్లు కత్తులు, బల్లాలతో పొడిచారు. కర్రలు, బండరాళ్లతో బాది నలుగురిని చంపారు. ఇంటి తలుపులు పగుల కొట్టి ఇళ్లలోని వారిని బయటకులాగి దారుణంగా నరికి చంపారు. 30 మందిని తీవ్రంగా గాయపరిచారు. దాడితో దళితులు హాహాకారాలు చేస్తుం కాపులు వికటాట్టహాసం చేస్తూ.. హత్యాకాండ కొనసాగించారు. ఆ సమయంలో మంచినీళ్లు తెచ్చుకుంటున్న కలమటి సంఘమ్మను కట్టెలతో తీవ్రంగా కొట్టి చేతులు, కాళ్లు విరగ్గొట్టారు. ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. 



ఈ హత్యాకాండ వెనుక కాపుల దౌర్జన్యకాండ ఎంత ఉన్నదో, దీనికి పరోక్షంగా సహకరించిన పోలీసుల పాత్ర కూడా అంతే ఉన్నదని చెప్పకతప్పదు. కాపులు జూన్ 12 ఉదయం సమావేశమవుతున్నారని పోలీసులకు సమాచారమందించినా సకాలంలో స్పందించలేదు. సుమారు పది గంటల ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ వచ్చి జరుగుతున్న దౌర్జన్యాన్ని చూసి వెంటనే వెళ్లిపోయాడు. తిరిగి పదకొండున్నరకు వచ్చి హంతకులు పారిపోయేందుకు వీలుగా విజిల్స్ వేస్తూ ఊళ్లోకి వచ్చారు. పారిపోతున్న కాపులను పట్టుకొనేందుకు ప్రయత్నించలేదు. అప్పటికే శ్రీనివర్తి వెంకట్, బూరాడ సుందరరావు చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న శ్రీనివర్తి సంఘమేషు, చిత్తరి అప్పడు దారిలో చనిపోయారు. జూన్ 20న మరో క్షతగావూతుడు పాపయ్య చనిపోయాడు. 



గ్రామంలోని ఘర్షణ వాతావరణం, కాపుల బెదిరింపులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా..పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే లక్షింపేట హత్యాకాండ జరిగింది. నెలల తరబడి పోలీస్ పికెట్ పెట్టి, ఎన్నికల నెపంతో పోలీసులను ఉపసంహరించిన ఉన్నతాధికారులు పరోక్షంగా దళితులపై దాడికి కారణమయ్యారు. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేయడంలోనూ పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్యం చూస్తూనే ఉన్నాం. అసలు దోషులను విడిచి పెట్టి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ దాడిలో బొత్స సత్యనారాయణకు దగ్గరి బంధువులున్నారన్న విషయం దాచేస్తే దాగని సత్యం. వీరిని కాపాడేందుకు ఉన్నత స్థాయిలో పైరవీలు సాగుతున్నాయి. లక్షింపేట దాడిని, పోలీసులు, పాలకులు వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రంలోని ప్రజాసంఘాలు, హక్కుల సంఘా లు, మేధావులు తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దళితులపై దాడి వెనుక ఉన్న కుట్ర బయటకి రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలి. చనిపోయిన వారికి పది లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షలు పరిహారం చెల్లించి బాధిత కుటుంబాలకు రక్షణ, ఉపాధి కల్పించాలి. దళితల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దళితుల ఆత్మరక్షణకు దళితుల తోకూడిన గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేయాలి. 

-యెపూరమల్ల రాములు, రాష్ట్ర అధ్యక్షుడు మాలమహానాడు
-కె. కాశీవిశ్వనాథం, రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ దళిత కూలీ రైతు సం

Namasete Telangana News Paper Dated 1/7/2012

సారాంశం, సామాజిక సంక్షోభమే! - కె. శ్రీనివాస్



ఇరవయ్యేడేళ్ల కిందట కారంచేడు జరిగినప్పుడు అదొక సంచలనం. షాక్. పత్రికా కార్యాలయాల్లో పెద్ద సంరంభం. 'పంట పొలాల్లో పులిచంపిన లేడి నెత్తురు' అన్న శీర్షికలో దళితుల మారణకాండను మానవీయంగా కథనం చేసిన సందర్భం. మరణాల సంఖ్య పెద్దగా లేకపోవచ్చును. కానీ, ఆ సంఘటన రాష్ట్రాన్ని దేశాన్ని కల్లోలితం చేసింది. దళిత కారంచేడు ఖాళీ అయిపోయి చీరాలలో విడిది చేసింది. ఒకనాటి దాడే కావచ్చు, కానీ అది రాష్ట్రంలో దళిత ఉద్యమానికి నాంది పలికింది. సామాజికోద్యమాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని తెరచింది. 

మరో ఆరేళ్లకు చుండూరు సంఘటన. మరింత దారుణంగా, భీకరంగా, దుర్మార్గంగా దళితులను వేటాడి నరికారు. ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అనేక అంతర్గత విభేదాల మధ్యనే అయినా దళితుల ఐక్యత ప్రస్ఫుటమైంది. దళితుల్లో ఆత్మగౌరవభావన మరింత బలపడింది. మరి మొన్న జూన్ 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా లక్షింపేటలో జరిగిన మారణకాండ, ఉత్తరాంధ్ర భూసామాజిక సంబంధాల్లోని వైరుధ్యాలను బహిర్గతం చేసింది. కారంచేడు, చుండూరు సంఘటనలనుంచి రూపొందిన దళిత నాయకత్వం లక్షింపేట వెళ్లి నిజనిర్ధారణలు చేసింది. మానవహక్కుల కమిషన్లకు, ప్రభుత్వాలకు నివేదికలు పంపింది. 

విప్లవ, వామపక్ష ప్రజాసంఘాలు, వివిధ ప్రధాన స్రవంతి రాజకీయనాయకులు బాధితులను పరామర్శించారు. కానీ, ఎందువల్లనో, గతంలోని ఆక్రోశం, ఆవేదన, ఆవేశం కనిపించడం లేదు. ఉప ఎన్నికల రాజకీయ సంరంభం వల్ల ఈ సంఘటన మరుగున పడిందని అనిపించినా, అందులో పూర్తి వాస్తవం లేదని అర్థమవుతూనే ఉన్నది. ఎక్కడో ఏదో లోపించింది. నిప్పు భగ్గున మండకుండా, గోరువెచ్చగానే మిగిలిపోయింది. ఏమిటి కారణం? గత రెండు దశాబ్దాల కాలంలో దళిత ఉద్యమం చీలిపోవడం వల్ల కలిగిన పరిణామమా ఇది? బాధితుల ఉపకులానికి సంబంధించిన సంఘాలు సైతం సమరశీలంగా కనిపించకపోవడానికి- కాలం తీసుకువచ్చిన మార్పు కారణమా? వారిలో అధికులు వ్యవస్థలో క్రమంగా సంలీనం అవుతున్నారా? 

పై ప్రశ్నలకు వచ్చే సమాధానాలు కూడా నేటి పరిస్థితికి కొంతమేరకు కారణం కావచ్చు. అయితే, సంఘటన జరిగిన ప్రాంతం స్థితిగతులు కూడా ముఖ్యమైన కారణమనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతం తక్కిన రాష్ట్రం నుంచి విడిగా, దూరంగా ఉంటున్నదా? యావత్ రాష్ట్ర సమాజంలో అది అంతర్లీనం కాలేదా? అక్కడి పరిణామాలను తక్కిన రాష్ట్రం తమవిగా స్వీకరించడం లేదా? కారంచేడు, చుండూరు సంఘటనలు జరిగినప్పుడు, నిందితుల సామాజిక వర్గాలు రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న రాజకీయపార్టీల నేపథ్యవర్గాలు. పైగా, అవి రాష్ట్ర సామాజిక, రాజకీయ చిత్రపటాన్ని దీర్ఘకాలంగా శాసిస్తున్న కులాలు. 

వాటి ఉనికి, వ్యాప్తి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను ఆవరించినవి. లక్షింపేట సంఘటనలో నిందితులుగా ఉన్నవారి సామాజిక వర్గం ఉత్తరాంధ్ర ప్రాంతానికే పరిమితమైనది. ఇతర ప్రాంతాలలో కాపు కులస్తులతో వారికి స్థూలమైన సమీకరణం ఏర్పడుతున్నది కానీ, సాంస్క­ృతికంగా ఐక్యత ఇంకా ఏర్పడలేదు. ఉత్తరాంధ్రలోని తూర్పు కాపులు రాష్ట్ర రాజకీయరంగంలో ప్రాబల్యం పొందుతున్న మాట నిజమే కానీ, దాని ప్రభావం రాష్ట్రవ్యాప్తమైనది కాదు. 

దళితులమీద దాడిచేయడానికి కావలసిన అహంకారాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది కొత్తగా సమకూరుతున్న ప్రాబల్యమే అయినప్పటికీ, దానికి కూడా పరిమితులున్నాయి. కారంచేడు, చుండూరు సంఘటనల నిందితులకు సమాజంలోని వివిధ శ్రేణులలో ప్రాతినిధ్యం ఉండడంతో, వారిని వెనకేసుకువచ్చినవారు కూడా గణనీయంగా కనిపిస్తారు. కానీ, లక్షింపేట నిందితుల వర్గానికి అంతటి హంగు ఇంకా ఏర్పడలేదు. అయితే, ఇంకా అధికారపు సానువులకు సమీపానికి వచ్చీ రాగానే సాంప్రదాయిక ప్రాబల్యశక్తుల మాదిరిగా దళితులపై కత్తిఝళిపించడం ప్రమాద సంకేతం. 

రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితి కారణంగా ఒక సామాజిక దౌర్జన్యం జనం దృష్టిలో పడలేకపోయిందనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే, ఆ రాజకీయపరిస్థితే ఒక సామాజిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల వెనుక ఒక పెద్ద సామాజిక సమీకరణం ఉన్నది. ఆ సమీకరణంలో లక్షింపేట బాధితుల కులం కూడా ఒక భాగస్వామే. రాజకీయంగా తమ ప్రాధాన్యాన్ని ప్రకటించడానికి వారు ఒక వర్గంగా ఏ మాత్రం వెనుకాడలేదు. కానీ, సమరశీల పోరాటానికి మాత్రం వారు సంసిద్ధంగా కనిపించడంలేదు. 

ఉప ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి చర్చలోకి వచ్చిన రాష్ట్రవిభజన అంశం కూడా సామాజికంగా తీవ్రమైన పర్యవసానాలున్న అంశం. విభజనను వ్యతిరేకిస్తున్న వారు కానీ, తెలంగాణవాదులు కోరుతున్న సరిహద్దులకు మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్నవారు కానీ సామాజికమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నవారే. తమ మతవర్గానికి చెందినవారు అధికంగా ఉన్న మరోప్రాంతాన్ని కూడా తెలంగాణలో కలిపితే ప్రత్యేక రాష్ట్రానికి అభ్యంతరం లేదని మజ్లిస్ భావిస్తున్నది. 

రాయలసీమలోని రెండు జిల్లాలను కలిపితే, తెలంగాణలో తమ ప్రాబల్యానికి గ్యారంటీ ఉంటుందని రెండు ప్రాంతాలలోను బలంగా ఉన్న రెడ్డి కులస్థులు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే, సామాజికమైన సమీకరణాల కారణంగా, జగన్‌మోహన్‌రెడ్డి ప్రాబల్యాన్ని పరిమితం చేయవచ్చునని, పనిలో పనిగా చంద్రబాబును బలహీనపరచవచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నది. తెలంగాణ వస్తే, ఇంతకాలం పెత్తనం చేసిన భూస్వామ్య ప్రాబల్యవర్గాలు బలహీనపడి, బిసిల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఉద్యమకారులు ఆశపడుతున్నారు. ఆంధ్రప్రాంతం విడిపోతే, తమను అణచివేస్తున్న స్థానిక ప్రాబల్యకులస్థులు బలహీనపడతారని, అంకగణితాలు మారిపోయి తమ పలుకుబడి పెరుగుతుందని అక్కడి దళితులు ఆశిస్తున్నారు. 

అందరి ఆశలూ నెరవేరే అవకాశమైతే లేదు కానీ, రాష్ట్ర విభజన మాత్రం ఊహించిన మార్పులనే కాక, అనూహ్యమైన మార్పులను కూడా సామాజిక రంగంలో తీసుకువచ్చే అవకాశం ఉన్నది. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, కాపు- రాష్ట్రంలో అధికారపీఠాలు సంక్రమిస్తున్న ఈ క్రమం బిసిలకు, దళితులకు చేరువ కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నది. ఈ లోపున లక్షింపేట వంటి సంఘటనలు అనేకం జరిగి, మన వాస్తవికతను గుర్తుచేస్తుంటాయి. 

పదేళ్ల కిందటే, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకోల్‌లో నామాల బాలస్వామి అనే దళితుడి హత్య తెలంగాణ సమాజానికి ఒక హెచ్చరిక పంపింది. ఉద్యమక్రమంలో ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణతిని, అవగాహనను సంతరించుకున్న తెలంగాణవాదులు సామాజికమైన ప్రహేళికను పరిష్కరించుకున్నప్పుడే వాస్తవమైన విజయం సాధించగలరు. లక్షింపేట బాధితులకు సంఘీభావం తెలపడానికి ఉస్మానియా విద్యార్థులు తరలివెళ్లారనే వార్త అటువంటి ఆశను కలిగిస్తోంది. 

కారంచేడు నుంచి ప్రారంభమైన ఆత్మగౌరవ అస్తిత్వాల ప్రస్థానం, తమను తాము చాటిచెప్పుకునే క్రమంలో సాంప్రదాయిక ప్రగతిశిబిరాలను ప్రశ్నించాయి, నిలదీశాయి. దూరంగా నడిచాయి. సొంత అస్తిత్వాల నుంచే ప్రారంభమయ్యే ప్రశ్నలు, ఆ అస్తిత్వాలను కూడా విభజించాయి. వివక్ష, అసమానత్వం ఎక్కడ ఉన్నా వేరుమాటలు మాట్లాడాయి. ఇప్పుడు, అనేక సంఘాలు, అనేక సంస్థలు, అనేక అస్తిత్వాలు. తాము విస్మరించిన కోణాలను, పార్శ్వాలను వామపక్ష ప్రగతిశీల శక్తులు సరిదిద్దుకోలేక తప్పలేదు. 

స్థైర్యంతో తాము నమ్మిన మార్గంలో నడవడమూ విరమించలేదు. ఇప్పుడు అనేక శక్తులు ఇంకా అనేకంగా ఉండడమే పెద్ద సమస్య. ఒకరి ఉనికిని మరొకరు మింగేసే విలీనాలు అక్కరలేదు కానీ, ఒకరి చేతులను ఒకరు పెనవేసుకునే ఐక్యత కావాలి. బాధిత కులాలు, ఉపకులాలు, మతాలు, జెండర్, ప్రాంతాలూ, ప్రజాస్వామిక సంస్థలూ ఉద్యమాలూ- అవసరమైనప్పుడు ఒకటిగా నిలబడాలి. వాస్తవమైన అర్థంలో ఆ ఐక్యత ఇప్పుడే ఉండి ఉంటే, లక్షింపేట ఉదంతం త్వరగా మసకబారే ప్రమాదం ఉండేది కాదు. 

మనకు స్పష్టంగా తెలియకపోవచ్చును కానీ, ఈ నేల మీద పెద్ద సామాజిక సుడిగుండమే చెలరేగుతున్నది. రకరకాల మారువేషాల్లో వాటి సంకేతాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అధికార రాజకీయ క్రీడ వెనుక పెద్ద సామాజిక సంక్షోభం ఉన్నది. తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాల వెనుక సామాజిక కోణమే ప్రభావం వేస్తున్నది. సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పడే కొత్త అధికార సమీకరణలను, చేజిక్కనున్న కొత్త అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఎదుగుతున్న కులాలు జబ్బ చరుస్తున్నాయి. లక్షింపేట అందుకు సంకేతం. ఇంత పెద్ద రంగస్థలాన్ని సామాజికోద్యమాలు ఎట్లా వినియోగించుకుంటాయన్నది సమస్య. 

- కె. శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated : 1/7/2012

Friday, June 29, 2012

Four Dalits done to death in Srikakulam village

Karamchedu in Laxmipeta By Katti Padma Rao


Kathi Padma Rao
(This is a translation of his recent article 'Lakshimpetalo 'Karamchedu'')
The oppression of the Dalits continues unabated in the state. Whichever dominant castes are in power, people belonging to those castes continue to conduct violent attacks on the Dalits. When NTR was in power, six Dalits were brutally killed in Karamchedu, his samdhi's village. When Nedurumalli Janardhan Reddy was in power, they chopped off the heads of eight Dalits in Chunduru of Guntur district, and dumped them in the Tungabhadra. Now when Botsa Satyanarayana, who calls himself a BC, is the Pradesh Congress President, Botsa Vasudeva Naidu and his horde of Toorpu Kapus, armed with swords and axes, have tortured and killed the Dalits of Lakshimpeta in Srikakulam district.
lakshim_pamphlet


What really happened? The landowning Toorpu Kapus of Lakshimpeta village in Vangara mandal of Srikakulam district surrounded the Dalitwada of the village at seven in the morning. Groups of around twenty people each, armed with deadly weapons, laid siege to every house. They dragged the people from their homes and showered inhuman abuse and insults on them. 'You Mala ba#$%^s, you think you've grown big enough to be cultivators?' they ranted in their caste arrogance. Shouting 'You think you can till fields alongside us?' they launched a brutal attack on Nivirti Venkati (60), his son Nivirti Sangamesu (35), Burada Sundar Rao (35) and Chittari Appadu (25).
According to Chintapalli Guruprasad, Andhra Pradesh Dalit Mahasabha President, and his associates P. Benjamin, Nuthalapati Chandrasekhar, Bokara Narayana Rao who had visited the scene, each body bore around 40-50 knife or spear wounds. This attack was caused by a grudge. Planning, strategy, hatred – all of them are behind this attack. The victims died almost immediately after they received the injuries. They have become martyrs in the struggle for land. Offerings to the fire of caste hatred. Bodduri Papaiah, another victim who was injured during the attack on these four Dalits, died in King George Hospital, Visakhapatnam, on Wednesday. Which means five people have died in the Lakshimpeta massacre until now.
Since the formation of the state, landowning castes in the various regions – be it Kammas or Reddies or Kapus or Kalingas or Velamas or Kshatriyas – have been unable to bear the sight of Dalits tilling land on their own, developed grudges against them claiming that the Dalits have no right to land, conducted violent attacks on them or expelled them from villages. There is a strong bond between state power and caste hatred of this kind. This attack has the support of the powerful. In this brutal, inhuman incident which all Telugus should feel ashamed about, around 20 people have been seriously injured, apart from the five who died.
They are undergoing treatment in RIMS Hospital in Srikakulam now. Kalamata Ganapati (35), Kalamata Prakash (50), Kalamati Simhachalam, Kalamati Gangulu, Gonela Ravi (25), Nivirti Gangaiah (50), Kalamata Gaddiah (Lachchaiah's son), Kalamati Gaddaiah (Chinna Mutyalu's son), Nivirti Simhachala, Nivirti Narsaiah, Nivirti Rama Rao, Bodduri Bhogesu, Gongada Shivudu, Nivirti Darappadu, Nivirti Gangaiah, Kalamati Sangamma, Chittari Yellaiah, Kalamati Gangulu, Bodduri Gowraiah are fighting for their lives in the hospital.
Lakshimpeta is the biggest massacre by the upper castes after Karamchedu and Chunduru. These caste villains surrounded the Dalits, chased and hunted them for two and half hours with deadly weapons and derived perverse pleasure from attacking even dead bodies with swords and axes. The Toorpu Kapu landlords here, even though BCs in name, are great believers in caste supremacy. The Kalingas, Koppula Velamas and Toorpu Kapus in Srikakulam district perform the role undertaken by the Kammas, Reddies and Kshatriyas in Coastal Andhra.
The Kapus of neighbouring villages, following the bonds of blood and caste, also participated in the attack headed by the Kapus of Lakshimpeta. 26 year old Chittari Sridevi, Borada Kasalu, Nivirti Ramudamma, Nivirti Venkatamma were widowed and rendered helpless by this gruesome attack. Most of them are between the ages of 30-40, all mothers. Women who had husbands at 5 in the morning lost them by 7.30. What was their crime?
Was it because 80 Dalit families chose to cultivate 60 acres of government land? Joint Collector Satyanarayana had allocated this land to the Dalits in 2002 and they had divided it among themselves, every family getting 45 cents of land, and started tilling the land. Is it a crime for Dalits to cultivate land in this country? Should that cause burning rage among others? The Chief Minister Kiran Kumar Reddy's visit to the village, even before the dead were laid to rest, and announcement of nominal compensation, was an attempt to pre-empt any demand for a CBI probe and an indicator of his upper caste feudal loyalties. Why are these powerful people who order a CBI probe into every trivial issue not ordering one into this great tragedy? Is it because they are scared of big people being caught?
These are the facts disclosed by Lakshimpeta victims Chittari Gangaiah, Gongoda Gangaiah, Nivirti Simhachalam, Nivirti Tirupati Raju and Bodisingu Ramu: The lands they are cultivating now were acquired from various castes ten years ago when the Madduvalasa reservoir was being built. The government had paid full compensation to the landowners when the land was acquired. Now it is assigned land and the government has every right to allot it to anyone. Why did not the Chief Minister announce that he was allotting this 250 acre land to the Dalits even after so much blood has sunk into it now? Here, the Chief Minister has taken an anti-Dalit stand. This is Dalit Minister Kondru Murali's constituency.
It is shameless that Dalit Ministers have neither demanded a CBI inquiry, nor have they urged the government to allot the 250 acres of land to the Dalits but have remained faithful courtiers to the ruling classes and have clung to their seats in their power lust even when fellow Dalits were being cut down with swords. They have forgotten how they became ministers through the reservations Ambedkar had won for them. Today Dalit organizations and left affiliated Dalit, people's organizations are fighting together. This is the historic moment when all pro-people forces have to come together to bend upper caste state power and lead the self-respect movement of the Dalits towards victory.
The unity of Dalit movements determines the form of this resistance. The blood of the Dalits which has sunk into the earth shall not go to waste. History has to answer this question soaked in blood. The martyrs have sounded the great drum of self-respect. The Dalit camp is raising the slogan of self-defense in Lakshimpeta. The Dalits have not lost courage even after losing five people. This battle will not stop until the Dalits win rights over the 250 acres of land. All the forces, under the red and blue banners, which have come together for this movement, should not rest until these demands are met.
Andhra Pradesh Dalita Mahasabha shall work together with the victims and other organizations. This Dalit self-respect movement should challenge caste, feudal and political hegemony in these times of historic resistance. Dalits Bahujans Minorities! Put aside your party affiliations and respond to the resounding cries emanating from the blood drenched land. Prepare as Dalit warriors for battle. History belongs to the oppressed, not the oppressors. Revolt is the way to victory.
We have taken up a 'Chalo Hyderabad' programme on July 17th to take forward this movement. We request all to participate.
Update: 
Program to take forward the Movement
~ A Representation is being given to State Human Rights Commission on June 27th
~ Protest rally to be organized as 'Chalo Srikakulam' on July 2nd
~ Chalo Hyderabad on July 17th
Demands
• CBI enquiry must be ordered to thoroughly investigate the circumstances that led to the brutal massacre.
• The state government should support every victims' family with Rs.10 lakhs. One person from each victim family should be accommodated with a government job. All the dalit children in the village should be admitted in AP Residential Schools.
• 250 acres of assigned land should be handed over to dalits.
• Action should be taken against all the culprits responsible for this attack under the provisions of the SC/ST (Prevention of Atrocities) Act, 1989.
• Botsa Vasudeva Rao Naidu should be booked as A1 and all the accused should be arrested within ten days. The main abettors Botsa Satyanarayana and others should not be spared. 
• Special court should be established in Lakshimpeta village and ensure that justice is delivered within six months.
[Translated from Telugu by Kuffir]