Wednesday, June 5, 2013

Kalekuri Prasad = కలేకూరి ప్రసాద్



క నిజయితి గల వ్యక్తి తనను తను అంతం చేసుకోవడానికి, ఒక్క నమ్మకం వమ్ము అయితే చాలు, కానీ కలేకూరి ప్రసాద్ కు తను నమ్మిన మూడు నమ్మకాలూ వమ్ము అయినాయి, ఒక్కటి. నిజాయితి లేని, విప్లవకారులుగా చలామణి అవుతున్న నకిలీలు, రెండు రాజకీయలలో బాగంగా ప్రేమికురాలుగా నటించిన ప్రేమికురాలు, మూడు నిజయితిలేని దళిత నాయకత్వం. కలేకూరి ప్రసాద్ కి తాగుడు నేర్పింది, తాగుబోతుగా ప్రచారం చేసింది పై మూడు కేటగిరి లకూ చెందిన వ్యక్తులే. కలేకూరీ ప్రసాద్ తాగడం వల్ల అతని శరీరం నాశనం అయింది, ప్రక్కన ఉన్న స్నేహితుల డబ్బులు కర్చు అయినాయి అనే రెండు చిన్న నష్టాలు జరిగాయి కానీ, అతన్ని తాగుబోతుగా ప్రచారం చేయడం వల్ల సమాజం ఒక నిజాయితీ కలిగిన మేధావిని కోల్పోయింది. తాగడం వల్ల జరిగిన నష్టం కంటే, తాగుబోతుగా జరిగిన ప్రచారం వల్ల జరిగిన నష్టం ఎక్కువ.
 వ్యవస్తీకరించబడని వ్యక్తిగా, తాగుబోతుగా ప్రపంచానికి ప్రచారం చేయబడిన కలేకూరి ప్రసాద్ ఒక నిజాయితీగలిగిన మేధావి, కవి, రచయిత, సాహితి విమర్శకుడుల గొప్ప భావుకుడు. అతను ఒక పోస్ట్ మోడెర్నిస్ట్ కాదు యే ఎజెండా లేకుండా ఎప్పుడు బ్రతకలేదు. మనుషులంతా స్వచ్చంగా, సమానంగా, సమగ్ర సంస్కృతిక విలువలతో బ్రతకాలని తపించిన ఒక తాత్విక భైరగి. తనకంటూ ఏమీలేని నిజమైన బౌద్ధ బిక్షువు, నిజమైన కమ్యూనిస్ట్. ఒక పూర్తికాలం సామాజిక కార్యకర్త. పీపుల్స్ వార్ వ్యవస్థాపకులలో ఒకరు, ప్రముఖ దళిత విప్లవ మేధావి కె. జి‌. సత్యమూర్తి లాగా కలేకూరి ప్రసాద్ కూడా  ఏమి దాచుకోలేదు, వారిద్దరి జీవిత ఆచరణ లో సారూప్యత ఉంది. నిజానికి వీరిద్దరికి వ్యక్తిగత జీవితం అనేదే లేదు. వీరిద్దరు సమాజనికి అంకితమైన గొప్ప సామాన్యులు.
కలేకూరి ప్రసాద్, అందరూ వ్యక్తిగతమైన విషయాలనుకొనే పెళ్లి, సెక్స్, ఆస్తి, పేరు ప్రతిష్టలు చివరికి తాను రాసిన రచనలు అన్నీ ఏ విషయాలను వ్యక్తిగతం అనే ముసుగు కింద దాచుకోలేదు, తన జీవితాన్ని గురించిన ఏ విషయాన్ని అయిన ఎవరితోనైనా పంచుకొనేందుకు ఏ క్షణంలోనైనా సిద్దంగా ఉండే అత్యంత అరుదైన మనిషి.
కలేకూరి ప్రసాద్ ని తాగుబోతుగా  తయారు చేయడంలో, తాగుబోతుగా ప్రచారం చేయడంలో కులం ఉంది, కుట్ర ఉంది. తాగుడు అలవాటు అయిన నుండి, ఏ రోజు తాగకుండ లేడు, అలాగని తగినంత కాలం, చచ్చే వరకు  ఏ రోజు తాగి స్పృహ కోల్పోయిన సందర్బం లేదు, తాగిన తాగక పోయిన తాను చెప్పదల్సుకున్న విషయాన్ని అంతే సమర్ధంగా అంతే నిజాయితీతో చెప్పగలిగిన వ్యక్తి కలేకూరి ప్రసాద్. తాగుబోతుగా ప్రచారం జరిగింది చాలా ఎక్కువ. ఒకవేళ ప్రచారం జరిగినంత అతను తాగి ఉన్నట్లయితే, రెండు దశాబ్దాలుగా బ్రతికిఉండేవాడు కాదు. మనచుట్టూ అంతకన్నా ఎక్కువగా తాగే మేధావులు, కవులు ఉన్నారు కానీ వారికి తాగుబోతు బిరుదులు మాత్రం ఈ సమాజం యివ్వలేదు అతను తాగింది మాత్రం తక్కువ ప్రచారం మాత్రం ఎక్కువ
384769_2368545425381_485425323_n

అతనిది సంచార జీవితం, ఏమీలేనివాడికి ప్రపంచమంత తన సొంతం. తనకంటూ ఒక గిరిగీసుకున్న కుటుంబం లేనివాడికి మానవాళి అంతా కుటుంబ సబ్యులే, సరిగ్గా అలాగే బ్రతికాడు, సరిగ్గా అలాగే చని పోయాడు. మే 17 2013 నా ఒంగోల్ లోని అంబేడ్కర్ భవన్ లో చనిపోయాడు, ఎప్పుడు కూడా తన కుటుంబం తో లేడు. ఒకరోజు కటిక దరిద్రన్ని అనుభవిస్తే, మరుసటిరోజు 5 నక్షత్రాల హోటల్ లో బస చేశాడు, ఒకరోజు లారీలో ప్రయాణం చేస్తే ఆ మరుసటి రోజే విమానంలో ప్రయాణం చేశాడు, అందుబాటులో ఉన్న ఏ సౌకర్యమైన, అసౌకర్యమైన అది తన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేది కాదు. అతని ఆచరణలో తేడా ఉండేది కాదు. లోయర్ టాంక్ బాండ్ లో ఉన్న అంబేడ్కర్ భవన్ ముందు మురికి కాలవ ప్రక్కన, ప్రజాశక్తి బుక్ హౌస్ ముందు రోడ్ ప్రక్కన నిద్ర పోయిన రోజులు కూడా కలేకూరి ప్రసాద్ జీవితంలో ఉన్నాయి. ఆర్దికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం నుండి వచ్చి, తోటి కుటుంబ సబ్యులు ఆర్ధికంగా అనేక అవకాశాలు  కల్పీంచడానికి సిద్దంగా ఉన్నా, అన్నీ సౌకర్యాలను తిరస్కరించి జీవితాంతం తన చుట్టూ ఉన్న పేదలతో, స్నేహితులతో జీవితమంతా గడిపేశాడు.
మేధావులతో ఎలా మాట్లాడేవాడో, సామాన్యులతో అలాగే మాట్లాడేవాడు, స్త్రీలతో ఎలా మాట్లాడేవాడో పురుషులతో అలాగే మాట్లాడేవాడు, పెద్దలతో ఎలమాట్లాడేవాడో పిల్లలతో అలాగే మాట్లాడేవాడు. మనుషుల ఆర్థిక సామాజిక, స్థాయినిబట్టి వారికిచ్చే గౌరము మారేదికాదు, మనుషులందరిని సమానంగా చూడడం అనే ఒక గొప్ప మానవీయ విలువను కలేకూరి ప్రసాద్ పాటించినంతగా మరెవరూ పాటించలేదు.
మనుషులంటే అపారమైన ప్రేమ అతనికి, పరిచయస్తులైన, అపరిచయస్తులైన, అప్పుడే పరిచయమైన వారయిన ఏమాత్రం తేడా లేకుండా అందరినీ ఒకే రకంగా పలకరించడం, గౌరవించడం కలేకూరి ప్రసాద్ కె సాధ్యం.  ఎవరైనా ఏదైనా సమస్యతో కలేకూరి ప్రసాద్ దగ్గరికి వస్తే, ఆ సమస్య అతనికి అర్థమైన మరుక్షణం నుండి ఆ సమస్య అతనిదే అయిపోతుంది, దానిని పరిష్కరించడానికి తనకు అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను శోదించి అందులో పూర్తిగా ఇమిడిపోయి అది పరిస్కారం అయ్యే వరకు వదిలిపెట్టేవాడు కాదు.
ఎన్నో గొప్ప గొప్ప సిద్ధాంతాలు చెప్పి, ఏ మాత్రం పాటించని వ్యక్తులంటే నిజానికి ఎవరికైనా అసహ్యం వేయాలి, కానీ ప్రసాద్ ఎవరిని అసహ్యించుకోలేదు కానీ వారిని చాలా సున్నితంగా విమర్శిచేవాడు. ఆ విమర్శ కేవలం విమర్శ కాకుండా వారు ఏ విధంగా మారాలో సూచించే విధంగా ఉండేదే గాని విమర్శ కేవలం విమర్శ దగ్గర నే ఆగిపోయేది కాదు. కలేకూరి ప్రసాద్ ఎవరినైనా విమర్శిస్తున్నాడు అంటే అదీ ఆ విమర్శ కు గురి అవుతున్న వ్యక్తికి తప్పకుండ ఉపయోగ పడేది అయిఉండేది. అందుకే కలేకూరి విమర్శలంటే అవి ఎదుటి వారి అభివృద్దికి సలహాలు మరియు సూచనలు మాత్రమే. అందుకే కలేకూరి విమర్శిస్తే కోపగించుకొనే వ్యక్తులు లేరు అందరూ అతని విమర్శ్లను స్వీకరించిన వారే.
 390632_2368548025446_1608039444_n
కలేకూరి ప్రసాద్ నాకు చాలా లేట్ గా పరిచయం అయ్యాడు, 2005 మే లో చంపాపేట్ లో ఉండే మా రూమ్ తెనాలి వెంకటేశ్వర్లుతో కల్సీ వచ్చాడు అప్పటినుండి 2005 నవంబర్ వరకు, మద్య మద్యలో బయటకు వెళ్ళినా,  దాదాపు మాతోనే ఉన్నాడు . అదే రూంలో మా అన్న, సామాజిక కర్యాకర్త  బత్తుల ప్రకాష్ నేను కలసి ఉండేవాళ్లం, కె.జి. సత్యమూర్తి మా రూమ్ కి తరుచూ వాస్తు ఉండేవారు. అతనితో మేము బరించిన ఏకైక సమస్య డబ్బులే, యింకే సమస్యలేదు.
ఎన్నో రకాల విషయాలపై చర్చలు చేసిన, కలేకూరి ప్రసాద్ కులాంతర వివాహాలపై నేను మొదలు పెట్టిన చర్చ లో చాలా సీరియస్ గా నాతో చర్చకు దిగాడు. చంపాపేట్ చౌరస్తా నుండి ఈస్ట్ మారుతినగర్ రూమ్ కి వెళ్ళే వారకు, దాదాపు 20 నిమిషాలు కులాంతర వివాహలి ఎలా ఉండాలనే విషయాన్ని వివరించాడు. కాలాంతర వివాహలంటే వధువు వైపున ఉండే వందలాది కుటుంబాలు వరుడివైపున ఉండే వందలాది కుటుంబాల మద్య బందుత్వానికి ఈ వివాహాలు దారి తీయాలని. కానీ అది జరగక పొగా, రెండు సమూహాల మద్య శతృత్వానికి ఈ కులాంతర వివాహాలు దారి తీస్తున్నాయని చెప్పాడు. దానికి విప్లవ కుటుంబాలు తే చెప్పుకుంటున కుటుంబాలు కూడా మినహాయింపుగా లేవని చప్పడు.
2009 మే నెలలో తన చెల్లెలు దగ్గరికి వెళ్ళి కేవలం నెల రోజులు ఉండి, ఇక అక్కడ ఉండలేనని హైదరాబాద్ కు వచ్చేశాడు, వస్తు వస్తు మా అన్న, కలేకూరి చెల్లెలు తాగుడు మాన్పించే చికిత్స కోసం తీసుకువెళ్లారు. అది అర్ధమైన ప్రసాద్, వారి నిర్ణయాన్ని వ్యతికేరించి హైదరాబాద్ కు వచ్చేశాడు. జులై 2009 నుండి డిశంబర్ 2009 వరకు మా అన్న బత్తుల ప్రకాష్ వరంగల్ తీసుకువెళ్లి అక్కడి మిత్రులు, సిద్దేశ్వర్, నరేందర్ ల సహాయంతో ఒక హోటల్ లో పెట్టి అవసరమైన చికిత్స చేయించారు. అక్కడ ఉన్నపుడే, తనకు తెలియకుండా తాగుడు మాన్పించే చికిత్స చేయిస్తున్నారని అనుమానించి హోటల్ రూమ్ లోనుండి కిందకి దుకాడు, నిజానికి అది డి అడిక్షన్ ట్రీట్మెంట్ కాదు. కాలు విరిగింది ఆ తర్వాత కావలిసినా చికిత్స చేయించి అతని సొంత ఊరు కంచికచెర్ల కు పంపించారు.ఇక అప్పటినుండి దాదాపు చనిపోయే వరకు కంచికచర్ల, ఒంగోల్ లోని మిత్రులు పల్నాటి శ్రీరాములు మరియు యితరుల వద్ద గడిపాడు. అప్పటినుండి హైదరాబాద్ వచ్చింది తక్కువ. ఎప్పుడు వచ్చిన ఒకటి, రెండు రోజులు తప్ప ఎక్కువ రోజులు ఉండలేదు.
కలేకూరి ప్రసాద్, ఆంధ్ర ప్రదేశ్ సాహితి రంగం లో ఒక సంచలనం. జన నాట్య మండలి తొలి నాల్ల లో రాసిన ప్రతిపాట లో కలేకూరి ప్రసాద్ ది కనీసం ఒక చరణం అయిన ఉంటుంది  జన నాట్య మండలి కార్య కర్త, డప్పు ప్రకాష్ ఇచిన సమాచారం ప్రకారం కలేకూరి ప్రసాద్ ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు వందలాది  పాటలు వ్రాసారు. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు ఉన్నాయి.  నిజానికి ప్రసాద్ ఏది మాట్లాడినా కవిత్వంగా ఉండేది, అతని మాటలు వినడానికి చాలా మండి ఆసక్తి చూపించేవారు.
నా మొదటి పుస్తకం, దలిత్ ఆవాజ్ ఆవిష్కరణ సభలో మార్చి 10, 2007 నాడు ప్రెస్ క్లబ్ లో మాట్లాడినాడు, ఆ రోజు సభ 9 గంటలకు ముగియాలి, కానీ కలేకూరి ప్రసాద్ 8:45 కు వచ్చాడు, అతని రాకతో వెళ్లిపొవాదానికి సిద్దపడిన వాళ్ళంతా మళ్ళీ కూర్చున్నారు, దాదాపు 40 నిమిషాలు ఉపన్యసించాడు, యే ఒక్కరూ కదలలేదు. మీటింగ్ ఆపేయమని వచ్చిన ప్రెస్ క్లబ్ సిబ్బందికూడా శ్రద్దగా విన్నారు. అ తర్వాత రోజున అదే పుస్తకానికి విశ్లేషణ వ్రాశాడు అది 2007 మార్చ్ 11 నాడు వార్తా పత్రికలో అచ్చు అయింది. విశ్లేషణ ఒకే పుస్తకానికి అయిన, మాట్లాడిన పదాలు ఏవి రాయలేదు. అది అతనికి తెలుగు బాష పైన ఉన్న పట్టు.
దాదాపు 70 పుస్తకాలు ఇంగ్లీష్ నుండి తెలుగు లోకి అనువాదం చేసాడు, చేగువేరా లాంటి అంతర్జాతీయ విప్లవ నాయకులను తెలుగు ప్రజలకు పరిచయం చేసింది కలేకూరి ప్రసాద్, స్వామి ధర్మతీర్థ రాసిన హిందూ సామ్రాజ్యవాద చరిత్ర, అరుంధతి రాయ్ రాసిన తే గొద్ ఒఫ్ స్మాల్ థింగ్స్ లాంటి అతి ముక్యమైన పుస్తకాలను అనువాదం చేసింది కలేకూరి ప్రసాద్. ఈ రాష్ట్రంలో అత్యంత గొప్ప విద్యా వేత్త గా పేరున్న ఒక పెద్దాయన, కలేకూరి ప్రసాద్ తో అబ్దుల్ కలామ్ పుస్తకాన్ని అనువాదం చేయించి తన పేరుతో అచ్చు వేయింధుకున్నారు. ఎలా అనేక వందల పుస్తకాలను అనధికారంగా అనువాదం చేసి పెట్టాడు
ఒకవేళ నువ్వు చచిపోతే నీపై నేను ఒక వ్యాసం వ్రాస్తాను, ఆ వ్యాసానికి “దళిత తాత్విక భైరగి కలేకూరి ప్రసాద్” అనే టైటిల్ పెడతాను అని చెప్పి, ఈ టైటిల్ బాగుందా అని ఆడిగాను, దానికి ఎలాంటి భావోద్వేగాలు లేకుంట “బాగుందిరా” అన్నాడు. ఒక్కసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు అడిగినా చిన్నన నవ్వి. నువ్వు ఎలా వ్రాయగాలవో అలాగా ఉందిరా నీ వ్యాసానికి టైటిల్, అనేవాడు. కానీ కలేకూరి ప్రసాద్ ని టైటల్స్ వద్దు అనే ఉద్దేశ్యంతో ఈ వ్యాసానికి ఆ టైటిల్  పెట్టలేదు. కలేకూరి ప్రసాద్ అంటే కలేకూరి ప్రసాద్ అంతే.
Photo0151
చావుని, ఆ లేక్కకొస్తే జీవితాన్ని ఎ మాత్రం లెక్క చేయని మనిషి కలెకురీ ప్రసాద్. జీవితాన్ని ఎగతాళి చేసిన మనిషి, విప్లవ సిద్ధాంతాలు వల్లిస్తూ మత సంప్రదాయాలతో బ్రతుకులు వెళ్ళదీస్తున్న ప్రధాన స్రవంతి విప్లవ మేధావులుకు, నాయకులకు, కవులకు సాహితి విమర్శకులకు అంతు బట్టని, అంతు చిక్కని గొప్ప ఆచరణ కలేకూరి ప్రసాద్ ది. ఆచరణ లేని ఆదిపత్యకుల విప్లవ వాదుల పెరట్లో పాములాంటి వాడు కలేకూరి ప్రసాద్.
వ్రాయటమంటే ఇంత నీరసం ఎప్పుడు రాలేదు, కలేకురి గురించి వ్రాయటమంటే, చాల ఉంది కదా ఒక్క వ్యాసంలో ఏమి వ్రాయగలం అని? కలేకూరి ప్రసాద్ కవిత్వం,పాటలు, సాహిత్యం, వ్యాసాలు,  అనువాదాలు, సాహితి విమర్శల గురుంచి ఎంతైనా వ్రయవచు. గ్రంధాలే అవుతాయి. అంతకన్నా అతని వ్యక్తిత్వం గురించి సామాజిక వ్యక్తిగత ఆచరణ గురించి ఎంతైనా వ్రాయవచ్చు. అదృష్ట వశాత్తు కలేకూరి ప్రసాద్ ఒక అంటరాని కులంలో పుట్టాడు, అందుకే అతను పేదలకు, దళితులకు, పీడితులకు అందుబాట్లో ఉండే మేధావి కాగలిగాడు. అదే ఒక ఆధిపత్య కులంలో పుట్టి ఉన్నట్లయితే అతను ఈ ప్రజలకు అందుబాటులో కి వచ్చేవాడు కాదు, ఏ విశ్వ విద్యాలయంలోనో, ఏదో ఒక డిపార్ట్మెంట్ లో స్మారక ఉపన్యాసం అయిపోయేవాడు. కానీ యిప్పుడు ఆ ప్రమాదం లేదు. అతను ప్రజల్లో బ్రతికి ఉంటాడు
కలేకూరి ప్రసాద్ రచనలు అన్నీ ప్రచురించి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, అతని కులం రీత్యా ఈ పని ఏ విశ్వవిద్యాలయం చేయక పోవచ్చు. అది అతను కోరుకోలేదు కూడా, కానీ ఆ రచనల ప్రసంగికతను బట్టి, దళిత విప్లవ సామాజిక రంగం లో పని చేస్తున్న వారూ ఆ పని చేయాలి. అది కూడా కలేకూరి ప్రసాద్ కోసం కాదు, మన కోసం. అందులో బాగంగానే రవిచంద్రన్ అనే దళిత హక్కుల కార్యకర్త కలేకూరి ప్రసాద్ ని అతని జీవితం పై, సాహిత్యం పై ఇంటర్వ్యూ చేసి ఆ వీడియొలను దలిత్ కెమెరా వెబ్ చానల్ లో అప్లోడ్ చేశారు
అనేక పరిమితులనుబట్టి, అనేక విషయాలు ఈ వ్యాసంలో రాయలేదు, ఈ వ్యాసం కలేకూరి ప్రసాద్ అనే ఒక గ్రంధానికి కేవలం ముందుమాట లేదా వెనుక మాట లాంటిది.
                                                                                                                                                                                                                   -      బత్తుల కార్తీక్ నవయన్

No comments:

Post a Comment