Thursday, May 1, 2014

ఓటు బ్యాంకుగా దళిత కార్మికులు By దొంత భద్రయ్య


అనుబంధ సంస్థలుగా కార్మిక సంఘాలు
అన్ని పార్టీలకూ ఉద్యోగ సంఘాలు 
బడుగులకు అగ్రకుల నాయకత్వం 
కుల కోణాన్ని గుర్తించని కామ్రేడ్లు 
ఫలితంగా పాలక కులాలకే సేవ 

భారతదేశం సర్వతోముఖాభివృద్ధికి పెట్టుబడిదారీ విధానం, కుల అణిచివేత (క్యాపిటలిజం, క్యాస్టిజం) ప్రధాన ఆటంకాలని రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్‌. అంబేడƒ్కర్‌ స్పష్టం చేశాడు. బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వంలోప్రొవె న్షియల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోయేముందు 1936లో ఆయన ఇండిపెండెంట్‌ లేబర్‌పార్టీని స్థాపించే సందర్భంలో ఈ విషయం చర్చించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆనాటికి అన్ని దేశాలలో పెరిగిపోతున్న పేదరికానికి పెట్టుబడిదారీ విధానం కారణంగా అనేకమంది తత్త్వవేత్తలు చెప్పారు. వారిలో ప్రముఖులు కార్‌‌ల మార్‌‌క్స. కానీ భారత దేశానికి క్యాపిటలిజం కంటే ప్రమాదకారి క్యాస్టిజం. అంబేడƒ్కర్‌ అప్పటికే అమెరికా, లండన్‌, జర్మనీలలో ఎకనామిక్‌‌స, న్యాయశాస్త్రం, రాజనీతిశాసా్తల్రలో మాస్టర్‌‌స డిగ్రీలు పొంది పి.హెచ్‌.డి. చేసి ప్రపంచ రాజకీయాలపై క్షుణ్ణంగా చర్చించే నైపుణ్యాన్ని సాధించాడు. 1937లో బొంబాయి ప్రావిన్‌‌సలో జరిగిన ఎన్నికల్లో అంబేడ్కర్‌ స్థాపించిన ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ ఎస్‌.సి.లకు రిజర్‌‌వ చేసిన 15 స్థానాలతోపాటు మరో రెండు జనరల్‌ సీట్లలో కూడా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 15 స్థానాలలో విజయం సాధించి, ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీ అవతరించింది. ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీని స్థాపించేటపుడు బొంబాయిలో ఉన్న కమ్యూని„స్టు నాయకులైన ఎమ్‌.ఎన్‌. రాయ్‌, డాంగే విమర్శించారు. ఈ దేశంలో కార్మికులు, కర్షకులు పెట్టుబడిదారి విధానాల వల్లనే కాకుండా కులతత్వం వల్లకూడా అణిచివేతకు గురవుతున్నారని కమ్యూని„స్టు పార్టీలు పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకిస్తున్నాయిగానీ, కుల వివక్షపై పోరాడడం లేదని, కాబట్టి ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీని స్థాపించా ల్సివచ్చిందని ప్రకటించాడు. 1936లో చెప్పిన ఈ అభిప్రాయం గురించి ఇప్పటి కమ్యూనిస్టు పార్టీలుకూడా ఆలోచించాలి.

ఈ దేశంలో కార్మికులు, రైతు కూలీలు, బాల కార్మికుల్లో దళిత ఆదివాసీలే మెజారిటీ. బలహీనవర్గాలవారు కొద్దిసంఖ్యలో ఉన్నారు. భారతదేశం మొత్తం కార్మికుల్లో 70 శాతం మంది గ్రామీణ వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. వీరంతా దళిత ఆదివాసీలే అనేది వాస్తవం. వీరికి భూమి ఉండదు. భూమి ఈనాటి వరకు కొన్ని కులాల చేతుల్లోనే కేంద్రీకృతం కావడానికి కారణం కుల ప్రభావమే. వేద ధర్మం పరిధిలోనే జీవితాలను కొనసాగించాలని, ఆ పరిధి దాటితే ఎవరైనా శిక్షార్హులౌతారని చెప్పడం జరిగింది. ఈ ధర్మనీతిని సవాలు చేస్తూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే, ప్రతి మనిషికి ఒకే విలువ. ఒకే ఓటు దానిని ఆచరణలో నిజం చేస్తుంది. కానీ ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేవారు పాత సామాజికవ్యవస్థ పునాదుల్లోనుండి వచ్చినవారు కావడంవల్ల గత సామాజిక కట్టుబాట్లు, విలువలనే ఎక్కువగా ఆచరణలో చూపడం వల్ల రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. 
42వ సవరణద్వారా రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదాన్ని చేర్చడం జరిగింది. ఈ దేశంలోని కార్మిక, కర్షకులకు వెలుగులు ప్రసాదించడానికి సామ్యవాద సూత్రీకరణలు ఉపయోగ పడతాయి. సామ్యవాదం విజయవంతం కావాలంటే దేశంలోని ప్రధానవనరుగా ఉన్న వ్యవసాయ భూమిని రైతు కూలీలైన దళిత ఆదివాసీలకు పంపిణీచేయాలి. 

ఇది ఇప్పటికీ రాజకీయ నినాదంగానే ఉంది. ఎన్ని భూమి పరిమితి చట్టాలు వచ్చినా, ఎన్ని కౌలుదారు చట్టాలు వచ్చినా భూమి ఈ వర్గాలకు చెందడంలేదు. భూమిని దళిత ఆదివాసీలకు పంపిణి చేసినట్టు చూపించి, అదే భూమిలో గతంలో యజమానులైన వారే కబ్జా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు తమ రికార్డుల్లో భూమిని దళిత ఆదివాసీలకు పంపిణీ చేశామని ప్రచారం చేసుకొంటున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు వ్యతిరేకంగా ఉంది. సామ్యవాద సూత్రీకరణ ప్రకారం పరిశ్రమలను జాతీయం చేయాలి. ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ, సరళీకరణ సంస్కరణలు వచ్చాయి. వీటివల్ల సామ్యవాద ఆశయానికి తీవ్ర గండి పడింది. ప్రభుత్వాలు ప్రైవేటీకరణ మోజులో సర్వరంగాలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రైవేటుపరం చేయడం అంటే దళిత ఆదివాసీలను నిరుద్యోగులుగా మార్చడమే. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత ప్రజాస్వామికంగా ఏర్పడిన ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ ప్రభుత్వాలు పెట్టుబడిదారి, వలసవాద, సామ్రాజ్యవాద కంపెనీలకు అన్ని రంగాలను ధారాదత్తం చేస్తున్నాయి. ప్రైవేటుపరం చేయడం వల్ల ప్రభుత్వాలు తమ బాధ్యతలనుండి తప్పుకున్నట్లు భావించాలి. ఈ ప్రభుత్వ పెట్టుబడిదారీ అనుకూల విధానాలను ప్రశ్నించాలంటే, అంబేడ్కర్‌ స్థాపించిన ఇండిపెండెంట్‌ లేబర్‌పార్టీ లాంటి రాజకీయ పార్టీలు రావాల్సిన అవసరం ఉంద

ఇ„ప్పుడు దాదాపు ప్రతిరాజకీయపార్టీ ఒక కార్మిక సంఘాన్ని అనుబంధంగా ఏర్పాటు చేసుకొని ఓటుబ్యాంకుగా ఉపయోగించుకొంటున్నాయి. ఇందులో ఒకటి రెండు కార్మిక సంఘాలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేƒ విధానాలపై పోరాటం చేస్తున్నప్పటికి ఈ పార్టీలు కులప్రభావానికి లోబడిఉన్నట్లుగానే అనిపిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీకి ఐ.ఎన్‌.టి.యు.సి., బిజెపికి ఎన్‌.ఎమ్‌.యు, సిపిఐకి ఎ.ఐ.టి.యు.సి, సిపియంకి సి.ఐ.టి.యు, తెలుగుదేశం పార్టీకి టి.ఎన్‌.టి.యు, టిఆర్‌ఎస్‌ పార్టీకి బొగ్గుగని కార్మిక సంఘం- ఆయా పార్టీల ప్రణాళికలను అమలు చేసుకోవడానికి లేదా ఆ పార్టీల విధానాలను ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. కార్మిక కర్షకుల్లో దళిత ఆదివాసి బలహీన వర్గాలు మెజారిటీగా ఉంటే, కొద్దిమంది కార్మికులుగా ఉన్న అగ్రకులాలవారు ఆ సంఘాలకు నాయకులుగా చెలామణి అవతున్నారు. ఏ పార్టీలైతే దళిత ఆదివాసి ప్రజల రాజ్యాంగపరమైన రక్షణలను, ప్రయోజనాలను రాపాడడంలో విఫలం అవుతున్నాయో, అవే రాజకీయ పార్టీలకు అండగా ఉన్న కార్మికసంఘాల్లో- ఈ కులాల కార్మికులు ఇతర కులాధిపత్య నాయకుల క్రింద పనిచేయడం విచారిం చదగిన పరిణామం. భూమి పంపిణీలో పాలకులు అనుసరిస్తున్న ఉదాసీన, నిర్లక్ష వైఖరులను ఎండగట్టడానికి, బాల కార్మికుల వెట్టిచారిపై, అందులో బాలికల అక్రమ రవాణాపై ఏ కార్మిక సంఘం స్పందించిన దాఖలాలులేవు. 

ఈ బాలకార్మికులు మెజారిటీగా దళిత ఆదివాసీలు కావడమే. అందువల్ల ఇతరుల నాయకత్వంకింద ఉన్న కార్మికసంఘాలు స్పందించడంలేదు. బాలకార్మిక అక్రమ రవాణా ప్రస్తుతం రాజకీయ పార్టీలకు మాఫియా రూపంలో అండగా కొనసాగుతోందని చె„ప్పవచ్చు. కార్మిక సంఘాలు తమ కంపెనీల్లో లేదా ఫ్యాక్టరీల్లో యాజమాన్య విధానాలపై ప్రశ్నించడంవరకే పరిమితమౌతున్నాయి. దళిత ఆదివాసీ ప్రజలకు రక్షణగా అంబేడ్కర్‌ సైద్ధాంతిక భావజాలాన్ని కొనసాగించేదిగా ఏర్పడిన బహుజనసమాజ్‌ పార్టీ- ఉద్యోగులను సమీకరించేందుకు- బాంసెఫ్‌-ను ఏర్పాటు చేసింది. కానీ ప్రత్యేకమైన ఒక కార్మిక సంఘాన్ని స్థాపించలేకపోతున్నది. సమాజ్‌వాది పార్టీ కూడా ఏ కార్మిక సంఘాన్ని స్థాపించలేదు. మెజారిటీ సంఖ్యలోఉన్న దళిత ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీలు కార్మిక సంఘాలను తక్షణమే స్థాపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, వేరే పార్టీలకు అండగాఉన్న కార్మిక సంఘాల్లో ఉన్న దళిత ఆదివాసీ బలహీన వర్గాలు ఆ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారుతున్నాయి.

Surya Telugu News Paper Dated: 2/5/2014 

No comments:

Post a Comment