Thursday, August 14, 2014

రక్తమోడుతున్న గాజా By -డేవిడ్


‌ 
యూదు జాత్యహంకార దాడులకు 'గాజామరోమారు రక్తమోడుతుందిగత కొంత కాలంగా ఇజ్రాయెల్‌ విసురుతున్న ఆధునిక క్షిపణి దెబ్బలకు అతి పెద్ద బహిరంగ జైలుగా ప్రసిద్ది గాంచిన గాజా నేడు నిలువెల్లా గాయాలతోతడిసిపోతుందిజాత్యహంకారంతో దురాక్రమణపూరితంగా ఒక జాతి మొత్తాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్‌ మరణహోమాన్ని సృష్టిస్తుంటేమౌనంగా వున్న ప్రపంచ అత్యున్నత వ్యవస్థల చేతగాని తనాన్ని గాజా ప్రశ్నిస్తోందిపౌరులఆవాలసాలనే యుద్ధ క్షేత్రాలుగా మిగిల్చిన దశాబ్దాల ఇజ్రాయెల్‌ దురాక్రమణ ముందు తానే దురాక్రమణదారుగా చిత్రీకరించబడుతున్న వైనాన్ని నివ్వెరపోయి చూస్తోందిముగ్గురు ఇజ్రాయెలీ యువకులను కిడ్నాప్‌ చేసిహత్య గావించారనేసాకుతో  సారి అమానవీయ దాడులకుపాల్పడుతున్నఇజ్రాయెల్‌,మహిళలనుపిల్లలనే టార్గెట్గా చేసుకొని దాడలకు పాల్పడుతోందిగత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ పాలస్తీనీయుల్ని అడపాదడపా కవ్విస్తున్నప్పటికీఈమధ్యకాలంలో తన జాత్యాంహంకారాన్ని నగ్నంగా ప్రదర్శిస్తూ ప్రత్యక్ష యుద్ధానికి కాలుదువ్వుతున్నదిగత 20 రోజులుగా సాగుతున్న  దాడుల్లో వందలాది మంది అమాయకులు మృత్యువాత పడుతున్నారుముగ్గురు ఇజ్రాయెలీ యువకులహత్యలకు తామే బాధ్యలమని ఇస్లామిక్‌ జిహాది సంస్థ ప్రకటించుకున్నప్పటికీ ఇజ్రాయెల్‌ ప్రధాని మాత్రం కళ్ళూచెవుతూ మూసుకుని హమాస్‌ సంస్థదే బాధ్యత అని ప్రకటిస్తూ గాజా పౌరులపై ప్రతీకారం అమలు చేస్తున్నాడుదీనిని బట్టేఅర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్‌ తోడేలు న్యాయం ఎలా ఉందో!
అగ్రదేశాలకుట్రలకుబలైనపాలస్తీనా:        వేల సంవత్సరాల క్రితం కలిసిమెలిసి సహజీవనం సాగిస్తున్న యూదుపాలస్తీనీయుల మధ్య యూరోపియన్‌ దేశాలు చేసిన దండయాత్రలు ఇరువర్గాలవారిని శత్రువులుగా తయారుచేశాయిపాలస్తీనాపై గ్రీకులురోమన్లు చేసినదండయాత్రల మూలంగా యూదులు ప్రపంచంలోని అన్నివైపులకు వలస వెళితే,  పాలస్తీనీయులు మాత్రం యూరోపియన్‌ దేశాలతో పోరాడుతూమరణిస్తూ అక్కడే జీవించారువలస వెళ్ళిన యూదులు వివిధ దేశాల్లో స్థిరపడిధనవంతులుగా మారారుఅయితే రెండో ప్రపంచ యుద్ధంలో జాత్యాంహంకారంతో రెచ్చిపోయిన హిట్లర్‌ యూదుల్ని ఉచకోత కోయడంతో వారి జీవితం ప్రశ్నార్థంగా మారిందియుద్దానంతరం యూదుల ఆస్తులపై కన్నువేసిని అమెరికా,ఇంగ్లాండ్‌ దేశాలు హిట్లర్‌ యూదులపై జరిపిన జాతి హత్యకాండకు పరిహారం చెల్లించే పేరుతో పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా అక్రమించి 1948 మే 15 తేదీన అమెరికాబ్రిటన్లు ఇజ్రాయెల్‌ దేశాన్ని స్థాపించాయిలక్షల మందిపాలస్తీనీయులను వారి ఇళ్ళ నుండి భూముల నుండి బలవంతంగా తరిమేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీయులను పాలస్తీనాకు రప్పించారుపాలస్తీనీయుల ఆస్తులుభూములను కట్టబెట్టారువాస్తవానికి యూదు హత్యకాండనురచించింది హిట్లర్‌ నేతృత్వంలోని జర్మనీబాధితులు యూదులుయూదులకు పరిహారం ఇవ్వవలసింది జర్మనీ లేదా సాటి యూరోపియన్‌ దేశాలు కాని న్యాయం (పరిహారంపేరుతో జరిగిన కుట్రకు యూదు హత్యకాండకు ఏమాత్రంసంబంధం లేని పాలస్తీనీయులు బలయ్యారుబలవుతూనే వున్నారుయూరోపియన్‌ దేశాల కుట్ర మూలంగా గత డెబ్బై ఎండ్లుగా పాలస్తీనా యుద్ధక్షేత్రంగా మారిపోయింది.  అగ్రదేశాల అండదండలతో లక్షల పాలస్తీనియులను ఇజ్రాయెల్సైన్యం వెంటాడి వేటాడిందితమ ఇళ్ళను వదిలి పక్క దేశాలకు పారిపోయేదాక వెంటబడి తరిమిందిఆరు దశాబ్దాల నుండి పాలస్తీనా అరబ్బులు తమ సొంత ఇళ్లకూపొలాలకూ తిరిగి రావడానికి ప్రయత్నించడంతో ఘర్షణలుతలెత్తుతున్నాయి. .
స్వంత గడ్డపైనే నిర్వాసితులుగా మారిన పాలస్తీనియన్లు :
ఇజ్రాయెల్ని సృష్టించడానికి పాలస్తీనా ప్రజల భూములనుగ్రామాలనుఇళ్లను నీళ్లనుపచ్చని పంట పొలాలను లాక్కున్నారుసహస్రాబ్దాలుగా వారు నడిచిన నేలను వారికి కాకుండా చేశారుఐరాస తీర్మానం ద్వారా ఇజ్రాయెల్కికేటాయించిన భూమికంటే ఎక్కువ లాక్కుని పాలస్తీనీయులను తరిమితరిమి కొట్టారు.బ్రిటన్‌- ఫ్రాన్స్‌- అమెరికాల సహాయంతో యూదు సైన్యాలు సాగించిన ఆరాచకాల ధాటికి పాలస్తీనీయులు పొట్టచేతపట్టుకొని పొరుగు రాజ్యాకు వలసపోయారు.పాలస్తీనా భూభాగంలో నివసించిన పాలస్తీనా అరబ్బులలో దాదాపు 85శాతం మంది  విధంగా బలవంతంగా వెళ్లగొటట్టబడినవారే.
2012 ఐరాస అంచనా వేసిన లెక్కల ప్రకారం వెస్ట్బ్యాంక్‌, గాజాలతో పాటు పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనా శరణార్థుల సంఖ్య 5.1 మిలియన్లువీరికి ఇంతవరకు ఒక దేశం అంటూ లేదు. 1967నాటిఅరబ్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం తర్వాత ఐరాస తీర్మానం ప్రకారం పాలస్తీనా అరబ్బులకు కేటాయించిన భూములను కూడా ఇజ్రాయెల్‌ దురాక్రమించిందిఅప్పటి నుండి సదరు దురాక్రమణ కొనసాగుతునే ఉందిపాలస్తీనా భూములనే కాక సిరియా,లెబనాన్‌, ఈజిప్టుజోర్దాన్‌ దేశాలకు చెందిన భూభాగాలను కూడా కొన్నింటిని ఇజ్రాయెల్‌ ఆక్రమించిందిఇలా అక్రమించిన భూముల్లో ఇజ్రాయెల్‌ యూదుల కోసం ఆక్రమంగా సెటిల్మెంట్లు నిర్మిస్తూవస్తోందిప్రపచం నలుమూలల్లోనివశిస్తున్న యూదులను పిలిచి వారికి  సెటిల్మెంట్లు కేటాయిస్తోందితద్వారా సరికొత్త వాస్తవాలను భౌతికంగా ఏర్పాటుచేసుకొని పాలస్తీనా మొత్తం ఇజ్రాయెల్గా ప్రకటించుకోవాలని అమెరికా అండతో కుట్రలు చేస్తోంది నేరాలను,దుర్మార్గాలను ప్రశ్నించే వారిని అరెస్టు చేసి విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో కుక్కుతున్నారు.
మౌనం వహిస్తున్న అంతర్జాతీయ సమాజం:
ఇజ్రాయెల్‌ సాగిస్తున్న  దురన్యాయాలను అంతర్జాతీయ సమాజం గత యాభై సంవత్సరాలుగా చూస్తూ కూడా మౌనం పాటిస్తూ వచ్చిందినిజానికి ఐరాస ప్రధానంగా అమెరికా పనిముట్టుగానే పనిచేస్తోందిఇదే తరహా దురహంకారయుద్ధాన్ని 2007 డిసెంబర్లో ఇజ్రాయెల్‌ కొనసాగించినప్పుడు 1400 మందికి పైగా పౌరులు చనిపోతే రిచర్డ్‌ గోల్డ్‌ స్టోన్‌ చేత ఐరాస విచారణ జరిపించిందిఆయన చేసిన సిఫారస్సులను ఇంతవరకు ఐరాస పట్టించుకోలేదుగాజాసహాయార్థం వచ్చిన అంతర్జాతీయ నౌకలపై ఇజ్రాయెల్‌ సైన్యం ముష్కర దాడిచేసి 11మందిని చంపేసిన ఘటన విషయంలోనూ నిర్ణయాలు గానీ చర్యలు గానీ లేవుఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమెన్‌ నేతన్యాహూ ఒక అడుగు ముందుకు వేసియుధావిధిగా మానవ హక్కుల సంస్థ తీర్మానంపైకూడా విషం కక్కాడు. ''మానవ హక్కుల సంస్థ తన తీర్మానానికి తానే సిగ్గు పడాలి'' అని హుంకరించాడుఅగ్రరాజ్య అమెరికా అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే ఇజ్రాయెల్ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తోందిఐరాస అమెరికా మాట జవదాటకుండా కేవలం తన పరిధిల్లో ఐరాస ప్రకటనలు కేవలం నామమాత్రమే ప్రకటనల వల్ల వాస్తవంగా ఎటువంటి ఫలితమూ ఉండదుధైర్యం కలగడం అన్నది ఒట్టిమాట.అయితే గతంలో అలీనోద్యమంలో కీలక పాత్రను పోషించిన భారత్‌ నేడు మౌనంగా వహిస్తుందిఅంతర్జాతీయ చట్టాలనున్యాయాన్ని యధేచ్ఛంగా ఉళ్లంగిస్తూ ఇజ్రాయెల్‌ మరణహోమానికి పాల్పడుతుంటే ఇరుదేశాలు సంశమనం పాటించాలనిభారత్‌ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఉపదేశం చేస్తుంది!. భద్రాత సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కాంక్షిస్తున్న భారత్‌ పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న దాష్టికాం పట్ట మౌనంగా వుండడం ఆక్షర్యకరంపాలస్తీనా సమస్యకు త్వరిత గతినపరిష్కారారం కనుగోనాలని గతంలో పిలుపు నిచ్చిన భారత్‌ ఇవ్వాళ మౌనంగా ఉండడం జాత్యహంకారులకు వత్తాసు పలకడమే అవుతుందివాస్తవానికి ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా సమస్యపై ప్రపంచ దేశాలు చేసిందేమి లేదు. 2012లోరెండు లక్షల మంది నివసించే అతి చిన్న పాలస్తీనా భుభాగంపై దురహంకార ఇజ్రాయెల్‌ అత్యాధునికి ఆయుధ సంపత్తితో ఏకపక్షంగా విరుచుకుపడి 1400 మంది ఆమాయక పౌరులను బలితీసుకుంటే ఇరాన్‌ తప్ప నోరు మెదిపిన అలీనదేశమే లేదు.
      జెనీవా సదస్సు ఆమోదించిన అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా విచక్షణా రహితంగా బలప్రయోగం చేయడం చట్టవిరుద్ధంఒకవేళ హామాస్‌ మిలిటెంట్లే నిజంగా ముగ్గురు ఇజ్రాయెలీ యువకుల్ని చంపారని వాదనకు అంగీకరించినప్పటికీదానికి ప్రతికారంగా అమాయకులైన పాలస్తీనియన్లను శిక్షించడం చట్టవిరుద్దంపౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంవారిని చంపడం జెనీవా సదస్సు తీర్మానాలకుమానవ హక్కుల చట్టాలకు కూడా విరుద్ధమేఅంతర్జాతీయచట్టాలను యధేచ్ఛగా ఉళ్లంగిస్తూ యుద్దనేరాలకు పాల్పడుతున్నప్పటికీ అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండటం ప్రమాధకరంవాస్తవానికి యుద్ధనేరాలు పాల్పడడం ఇజ్రాయెల్కు  కొత్తకాదుతన పెద్దన్న అమెరికా అడుగుజాడల్లోనడుస్తున్న ఇజ్రాయెల్‌ చరిత్ర కూడా రక్తం మరలతో నిండిపోయిందే
దాడుల వెనక అమెరికా ఉద్ద్యేశం:
 కుట్రకు అమెరికాఐరోపాల మద్దతు ఉందిముఖ్యంగా అమెరికా అండతో ఇజ్రాయెల్‌ రాజ్యం చెయ్యని నేరం లేదుఅమెరికాఐరోపాలకు చమురు సంపదలకు నిలయమైన అరబ్బు దేశాల మధ్య ఒక త్రోజాన్‌ హార్స్‌ కావాలిదానిసాయంతో అరబ్బు దేశాలను నియంత్రిచాలితద్వారా అక్కడి చమురు సంపదలను తమ చేతుల్లో పెట్టుకోవాలిఅమెరికాఐరోపా సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేరాలంటే ఇది తప్పనిసరి దేశానికైనా ఇంధన వనరు అత్యవసరమే.కాకపోతే  అవసరం ఎలా తీర్చుకోవాలి?. మన ఉత్పత్తులను వారికి ఇచ్చి వారి చమురు మనం తీసుకోవాలికానీ వలసవాద దోపిడీకిబల ప్రయోగంతో స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు అలవాటు పడ్డ సామ్రాజ్యవాద దేశాలకుస్నేహపూరిత వాణిజ్యం ద్వారాసరుకులు ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా అవసరాలు తీర్చుకోవడం అంటే తెలియదువారికి తెలిసిందల్లా కుట్రలు చేయడందండెత్తడందురాక్రమించడంలొంగదీసుకోవడంభారత దేశంలోపాటు ఇతరఅసియా దేశాలనుఆఫ్రికాదక్షిణ అమెరికా దేశాలనుకొన్ని తూర్పు ఐరోపా దేశాలను వారు ఇలాగే దురాక్రమించివందలయేళ్లు వలసలుగా పాలించారువాణిజ్యం పేరుతో వచ్చి సంపదలను దోచుకెళ్ళి కుప్పలు పోసుకున్నారు.జాతీయెద్యమాలతో  దేశాలు నామమాత్ర స్వతంత్ర దేశాలుగా అవతరించాక దోచుకెళ్ళిన డబ్బునే అప్పులుగా ఇచ్చిఫెనాన్స్‌ ద్వారా ఆయా దేశాల ప్రభుత్వాలను తద్వారా అక్కడి సహజ సంపదలను నియంత్రిస్తున్నారుఇదే తరహాలోపాలస్తీనాను ఇజ్రాయెల్‌ దురాక్రమించిందిఅక్రమించిందిఇజ్రాయెలే అయినా దాని వెనుక ఉన్న అసలు శక్తులు అమెరికాఐరోపాలువాటి మద్దతు లేకుండా ఇజ్రాయెల్‌ ఉనికి ఒక్క రోజన్నా ఉంటుందా అన్నది అనుమానమే.
గాజాపై దాడుల అసలు లక్ష్యం:
      1947లో ఐరాస ఇజ్రాయెల్ను ఏర్పాటు చేసినప్పుడు దానికి కేటాయిచింది దాదాపు 50 శాతం పాలస్తీనా భుభాగం కాగా పాలస్తీనాకు నేడు వెస్ట్బ్యాంక్‌, గాజాలు మాత్రమే మిగిలాయిహమాస్కు ఉగ్రవాద నేపథ్యం ఉన్నప్పటికీప్రజాస్వామ్యబంద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే గాజాలో అధికారంలోకి వచ్చింది కానీ హమాస్పై ఉగ్రవాద సంస్థగా ముద్రవేసి ఇజ్రాయెల్‌, అమెరికా గాజాపై దిగ్బంధాన్ని సాగిస్తున్నాయిగత కొన్ని సంవత్సరాలుగా గాజాలో విద్యుత్తునీటిసరఫరా నిలిపివేస్తూఆహారం,మందులు అందకుండా చేస్తున్నారు. ప్రాంతంలోకి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను అనుమతించాలని తమ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం వారు పాటించలేదు.  కేవలం 40కి.మీ పొడవు, 10 కి.మీవెడల్పు ఉన్న అతి చిన్న భూభాగం గాజా భూభాగంలో 17 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారుప్రత్యేకంగా యుద్ధ క్షేత్రాలను నిర్మించుకునే వసతి గాజాలో లేదుగాజా ప్రజలు ఏమి చేసినా  పరిమిత భూభాగంలోనేజరుపుకోవాలిప్రభుత్వ భవనాలుజనవాసాలుమిలట్రీ బ్యారక్‌ అంటూ  వేరుగా నిర్మించుకునే వసతి అక్కడ లేదునిజానికి గాజాపై ఇజ్రాయెల్‌ తరచుగా చేసే విశృంఖల దాడులకు అదే అసలు కారణంగాజా ప్రజలను ఎంత గట్టిగా,ఎంత సూటిగాఎంత భారీ నొప్పి కలిగేంతగా బాధిస్తే వారు అంత కుక్కిన పేనుల్లా పడి ఉండారని ఇజ్రాయెల్‌ భావిస్తుందిఅందుకోసం ఒక జాతిమొత్తాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకొని తరచుగా మరణహోమాన్ని సృష్టిస్తుంది.                      2012 నాటి గాజా యుద్ధంలోకూడా పాలస్తీనాను మధ్యయుగాల్లోకి నెట్టివేయడమే లక్ష్యంగా దాడులు చేయాలని వివిధ ఇజ్రాయెల్‌ నాయకులు ప్రకటనలు విడుదల చేశారుఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఏరియల్షరాన్‌ కుమారుడు గిలాద్‌ షరాన్‌ అయితే ఒకడుగు ముందుకు వేసీ గాజాను నేలమట్టం చేయాలని జెరూసలేం పోస్టు పత్రికలో ఏకంగా ఆర్టికల్‌ రాశాడు. ''గాజా మొత్తాన్ని నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందిఅమెరికన్లు హీరోషిమాపైదాడితోనే ఊరుకున్నారాలేదు జపనీయులు అనుకున్నంత త్వరగా లొంగిరావడం లేదుఅందువల్ల నాగసాకి పైన కూడా వాళ్లు (అణుబాంబుదాడిచేశారుగాజాలో విద్యుత్‌ అనేదే
ఉండకూడదుగ్యాస్‌ ఉండకూడదుఅసలు ఎటువంటి వాహనమూ అక్కడ రోడ్లపై తిరగకూడదు'' అని గిలాబ్‌ రాశాడుదీనిని బట్టి ఇజ్రాయెల్‌ పాలకులు ఎంత కరుడుగట్టిన జాత్యంహకారులో తేటతెల్లం అవుతుంది.          
      అయితే పాలస్తీనియన్లకు యుద్ధం అన్నది కొత్తకాదుఏడున్నర దశాబ్దాల నిరంతర పోరాటంలో యుద్ధం వారి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది సుదీర్ఘ యుద్ధంలో ఇజ్రాయెల్‌ సైనికులు నిత్యం సాగిస్తున్న మారణహోమాలనుండిస్వజాతిని రక్షించుకోవడానికి ప్రతి ఇంటినీ యుద్ధ శిబిరంగా మలుచుకోనే దుస్థితి అగ్రరాజ్యాలు కల్పించాయిఇవ్వాళ స్వస్థలంలోనే పాలస్తీనియన్లు దురాక్రమణదారులు , టెర్రరిస్ట్గా చిత్రీకరించబడుతుడున్నాడుజాత్యంహకార ఆధిపత్యంతో,ఆధునిక ఆయుధ సంపత్తితోఅగ్రరాజ్య అండదండలతో మారణహోమానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్ను అంతర్జాతీయ సమాజం నిలువరించకపోతే ఒక జాతిమొత్తం హరించుకుపోయి చివరకు మిగిలేది ఇజ్రాయెల్‌ మాత్రమేసామ్రాజ్యవాదదేశాల ఆధిపత్యానికిజాత్యహంకారానికి వ్యతిరేకంగా పాలస్తీనియన్లు నిర్వహిస్తున్న పోరాటానికి ప్రజాస్వామికవాదులు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.

Surya Telugu News Paper Dated: 15/08/2014 

No comments:

Post a Comment