Monday, July 8, 2013
Sunday, July 7, 2013
పీడితుల విముకి ్తబాట దండోరా ------గోవిందు నరేష్ మాదిగ
మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపంగా అంబేద్కర్ సాధించిపెట్టిన ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషాకనుగుణంగా వర్గీకరించి సమాన పంపిణీ చేయాలనే సామాజిక న్యాయ సూత్రం తో మాదిగ దండోరా ఉద్యమం జూలై ఏడుతో 20 వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ రాష్ట్రంలో చెక్కు చెదరని నిర్మాణం,విశాల పోరాట దృక్పథం కలిగి నిరంతర పీడిత జనపక్షం వహిస్తూ రెండు దశాబ్దాలుగా పేద వర్గాల గొంతుకగా వర్ధిల్లుతున్నది మాదిగ దండోరా. 1994లో ప్రకాశం జిల్లా ఈదుముడి అనే చిన్న గ్రామంలో మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో 20మంది యువకులతో ప్రారంభమైన ఉద్యమం ఇరవై ఏళ్లుగా నిలువడం చారివూతాత్మకమైన క్రమం. ఉద్యమానికి ఎన్నో అవరోధాలు,అవమానాలు, నిందలు, నిర్బంధాలు,కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ఇరవైఏళ్లుగా సజీవంగా ఉద్యమ ప్రయాణంలో ఉండడానికి దండోరాకు మందకృష్ణ నాయకత్వమే కారణం. గడిచిన రెండు దశాబ్దాలకాలంలో అనేక సామాజిక సమస్యలపై పోరాటాలను నిర్మిస్తూ వాటికి పరిష్కారాలు చూపుతూ ముందుకు సాగడమే కారణం. రాజకీ య పార్టీలకు ధీటైన ప్రత్యామ్నాయ రాజకీయేతర శక్తిగా ఎంఆర్పీఎస్ను మంద కృష్ణ తీర్చిదిద్దారు. చాలా మంది ఈ ఉద్యమ సంస్థను మాదిగలకు నీడనిచ్చే చెట్టుగానే భావించారుగానీ,అది యావత్ పేదవర్గాలకు నీడను పరిచే మహా వృ క్షంగాఎదుగుతుందని ఊహించలేకపోయారు.ఈ క్రమంలోనే మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజల కోసం వర్గీకరణ కోసం, వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాజకీయ రిజర్వేషన్లు, వితంతువుల పెన్షన్ల కోసం ఎంఆర్పీఎస్ పోరాడింది. పేదవారికి కడుపునిండా అన్నం కోసం రేషన్ బియ్యం పెంపు కోసం పోరాటం కొనసాగిస్తున్నది.
కులం పేరు చెప్పుకోవడానికి బాధపడిన మాదిగల్లో ఆత్మ గౌరవాన్ని నింపి ఐక్యతను తెచ్చి హక్కుల కోసం పోరాడే చైతన్యాన్ని తీసుకురావడంలో ఎంఆర్పీఎస్ గణనీయమైన కృషి చేసింది. చిన్నారుల ఆరోగ్యాల కోసం, గుండెజబ్బుల పిల్లల కోసం దండోరా పోరాడి సరికొత్త మానవీయ ఉద్యమానికి పురుడు పోసిం ది. ఇలా సమాజంలోని సమస్త వర్గాల హక్కులు, సమస్యల కోసం పోరాడి ఉన్నతమైన మానవీయ హక్కుల ఉద్యమంగా దండోరా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మొదటిదశలో ఆరేళ్లు అలుపెరుగని పోరాటం చేసి 2000 సంవత్సరంలో ప్రభుత్వం మెడలు వంచి వర్గీకరణ సాధించడం జరిగింది. దీంతో ఎస్సీల్లోని అట్టడుగు ఉపకులాలు రిజర్వేషన్లు పొంది ఎన్నో ఫలాలను అనుభవించారు. కానీ ఇది గిట్టని కొన్ని స్వార్థపరశక్తులు సుప్రీంకోర్టుకు ఎక్కి సాంకేతిక కారణాల సాకుతో వర్గీకరణను రద్దు చేయించడం జరిగింది. దీంతో అనివార్యంగా రెండోదశ వర్గీకరణ పోరాటం చేయాల్సివస్తున్నది. వర్గీకరణ న్యాయమే అని జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ కేంద్రానికి నివేదిక సమర్పించడంతోపాటు, రాష్ట్ర అసెంబ్లీ మూడుసార్లు వర్గీకరణ కోసం తీర్మానం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ పార్లమెంటులో బిల్లు పెడితే మద్ధతిస్తామని ప్రకటించాయి. ప్రధానికి లేఖలు రాశాయి. ప్రస్తుతం వర్గీకరణ చట్టంగా కావడానికి సాంకేతిక ప్రక్రియలన్నీ ముగించుకున్నది.
ఈక్రమంలోనే దండోరా నాయకత్వం యూపీఏ ప్రభుత్వ పెద్దలకు వర్గీకరణ చేయాలని లేఖలు కూడా రాయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది మాల స్వార్థపర శక్తులు తప్ప వర్గీకరణను వ్యతిరేకించే శక్తలేవీ లేవు. ఈ నేపథ్యంలోనే వర్గీకరణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి, కాంగ్రెస్ పెద్దల నిద్దుర మత్తు వదిలించడానికి దండోరా ఉద్య మం సమాయత్తమవుతున్నది. ఇంత సుదీర్ఘ ఉద్యమంలో చేసి న త్యాగాలను చూసైనా మాల సోదరుల వర్గీకరణకు సహకరించాలని దండోరా కోరుతున్నది. ఇరవైఏళ్ల దండోరా ఉద్యమం లో మాల సోదరులను సోదర ఉద్యమ సహచరులుగానే చూ స్తుంది తప్ప శత్రువులుగా చూడటం లేదు. కాబట్టి సామాజిక పీడితులుగా సాటి పీడితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నది.దండోరా ఉద్యమం రాష్ట్ర రాజకీయ, ఉద్యమ ముఖ చిత్రం మీదనే కాదు, మొత్తంగా దేశ ఉద్యమాల ముఖ చిత్రం మీదనే ప్రత్యేక ముద్ర వేసింది. తమ జాతి సమూహాల సమస్యల పరిష్కారం కోసం మాత్రమేగాక, సమాజంలోని సకల పీడితుల సమస్యలను తమ భుజస్కంధాలపై వేసుకుని పోరాడటం ద్వారా దండోరా ఉద్యమం ఉద్యమాల చరివూతలో సరికొత్త అధ్యాయాన్ని రచించింది. వికలాంగులకు పెన్షన్ పెంచాలన్న డిమాండ్తోపాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని దండోరా డిమాండ్ చేస్తున్నది. తెల్ల రేషన్ కార్డుమీద బియ్యం కోటా పెంపు కోసం ఉద్యమం మరింత ఉధృతంగా దండోరా నిర్వహిస్తున్నది. పిల్లలు, వృద్ధులు, వితంతువులు ఇలా సకల వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం దండోరా ఉద్యమిస్తున్నది.
భారత దేశ చరివూతలో దండోరా ఉద్యమం సరికొత్త పుటగా నిలిచింది. చెప్పులు కుట్టే చేతులతో చరిత్ర తిరగరాసిన ఉద్యమం దండోరా. కులం పేరు చెప్పుకోవడానికి ఆత్మన్యూనతకు గురైన జనాన్నే తలెత్తుకుని నేను మాదిగను అని సగౌరవంగా చెప్పుకునే స్థితికి దండోరా ఆత్మగౌరవ పోరాటం తెచ్చింది. ఈ నేపథ్యంలోనే సమాజంలోని అనేక నిమ్న, వెనుకబడిన బడుగు కులాలన్నీ దండోరా స్ఫూర్తితో కుల చైతన్యంతో ఉద్యమాల బాట పట్టినయ్. అదే క్రమంలో అన్ని అణచబడ్డ కులాల పోరాటాలకు మాదిగ దండోరా ఉద్యమం బాసటగా నిలిచి ప్రోత్సహించింది.ఆ ఉద్యమాల విజయానికి చేయూతనిచ్చింది. దండోరా ఉద్య మం కుల సంఘమే. అయినా అది కులతత్వంతో ఆలోచించకుండా సబ్బండ వర్గాలను సోదరత్వంతో చూసి వారిని అక్కున చేర్చుకున్నది. వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటునందించింది. మాల మాదిగల ఐక్యతను కోరుతూనే మాల ఐఏఎస్ అధికారి అర్జునరావుకు అన్యాయం జరిగినప్పుడు, గద్దర్పై కాల్పులు జరిపినప్పుడు, ఢిల్లీలో చందర్రావు అనే మాల ఉద్యోగిపై టీఆర్ఎస్ నేత హరీష్రావు దాడిచేసినప్పుడు, మాజీ మంత్రి శంకర్రావుపై అగ్రకులాలు దాడిచేసినప్పుడు, గీతాడ్డిపై కోదండరాం అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో లక్షింపేటలో జరిగిన హత్యాకాండ ఘటనపై కూడా దండోరా ఉద్యమించింది. బాధితుల పక్షాన నిలిచి అన్యాయాన్ని ఎదిరించింది. ఇలా పోరాడడం ద్వారా మాదిగ దండోరా ఉద్యమం మాలలకు వ్యతిరేకం కాదని చాటాం.
అలాగే విప్లవోద్యమాలపై ప్రభుత్వాల దమ నకాండను నిరసిస్తూ ఉద్యమాల పక్షాన నిలిచి నిర్బంధకాండను ఖండించాము. ఉద్యమాలను అణచడానికి తీసుకురాదలచిన ‘పోటా’ చట్టా న్ని ఎంఆర్పీఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. విప్లవోద్యమనేతలు ఎన్కౌంటర్ల పేరుతో అమరులైనప్పుడు ఆ బూటకపు ఎన్కౌంటర్లను ఖం డించింది. ప్రజాస్వామిక, విప్లవోద్యమాల పట్ల రాజ్యహింసకు వ్యతిరేకంగా దండోరా ఉద్య మం గొంతు విప్పంది.అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఉద్యమానికి మద్ధతు నిచ్చిం ది. అనేక తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నది.అలాగే తెలంగాణ జిల్లాల్లో మెజార్టీగా ఉన్న ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కాలనే డిమాండ్తో సామాజిక తెలంగాణకోసం దండోరా ఉద్యమం కదులుతున్నది.అణగారిన వర్గాలుగా మూడు ప్రాంతాల్లో ఉన్న వారిని కూడగట్టి తెలంగాణ ఉద్యమానికి మద్ధతును కూడగట్టింది. చెరుకు సుధాకర్పై రాజ్యనిర్బంధం, విమలక్కపై కుట్ర కేసుల సందర్భంలోనూ దండోరా ఉద్యమం బాధితుల పక్షాన నిలిచి రాజ్యహింసను వ్యతిరేకించింది. సామాజిక ఉద్యమాలను ప్రజాస్వామిక పోరాటాలతో మమేకం చేస్తూ.. దండోరా ఉద్యమం దిక్సూచిగా నిలిచింది. ఇదే సందర్భంలో భవిష్యత్ తరాల నిజమైన విముక్తి కోసం సమస్త పీడక కులాల ప్రజలందరి విముక్తి లక్ష్యంతో ఫూలే, అంబేద్కర్ ఆశయాల వెలుగులో నూతన రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు మంద కృష్ణ సమాయత్తమవుతున్నారు. సమస్త పీడితుల విముక్తి కోసం మహాజనుల పార్టీ నిర్మాణం కాబోతున్నది. ఇదే దేశంలో సమస్త పీడితుల వెలుగుబాటగా మారబోతున్నది. బహుజనుల రాజ్యం రాబోతున్నది. దీనికి దండోరా సమరశంఖం పూరించి ముందుకు కదులుతున్నది.
-గోవిందు నరేష్ మాదిగ
ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
(మాదిగ దండోరా ఉద్యమానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా..)
Namasete Telangana Telugu News Paper Dated : 08/07/2013
Saturday, July 6, 2013
దళిత సాంస్కృతిక శిఖరం (చంద్రశ్రీ దళిత ఉమెన్ థియేటర్ వ్యవస్థాపకురాలు) ----కృపాకర్ మాదిగ
July 07, 2013
కదిలించేంది. ఆమె అడుగులు తప్పెట దరువులై వేదికలపై చిందులాడేవి. ఆమె-చంద్రశ్రీ. ఆమె ఒక గుంపు శ్రీ. దళిత సాంస్కృతిక శిఖరశ్రీ. చంద్రశ్రీ దళిత ఉమెన్ థియేటర్ వ్యవస్థాపకురాలు. దళిత, విప్లవోద్యమాలలో అత్యద్భుత ప్రతిభ పాటవాలు సాగించిన అరుదైన కళాకారిణి. పాటలు పాడడంలో, చిందు ఆడడంలో నాటకం వెయ్యడంలో, స్క్రిప్టు రాయడంలో, దర్శకత్వం వహించడంలో, సంగీతం కూర్చడంలో, నటన, నిర్మాణంలో, బృంద నిర్వాహకురాలిగా, నాయకురాలిగా ప్రయోక్తగా తానే ఒక సైన్యంగా, ఆమెకు ఆమే సాటిగా చంద్రశ్రీ బ్రతికింది. దళిత సాంస్కృతిక కళారంగాల్లో చంద్రశ్రీ పెద్ద విదుషీమణి. కొండ గుర్తు వేగు చుక్క.
చంద్రశ్రీ జీవనరంగస్థలం నుంచి కనుమరుగయ్యే వరకు అంబేద్కరైట్ ఐడెంటిటీతో బతికింది. ఆమెది స్పష్టమైన దళిత దృష్టి కోణం. మహాకవులు గుర్రం జాషువా,బోయి భీమన్న, శివసాగర్, మాష్టార్జీ, కలేకూరి ప్రసాద్, గోరటి వెంకన్న వంటి ఎందరో ప్రజాకవుల పదాలు, పద్యాల నుంచి, స్వీయ గేయాల వరకూ ఆమె గొంతులో దళిత జీవన పోరాటాలే పల్లవించేది. బోయ భీమన్న గారి 'అంబేద్కర్ సుప్రభాతం'ని సొంతంగా సంగీతాన్ని సమకూర్చుకుని అద్భుతంగా పాడింది. రికార్డు చేసి భవిష్యత్తు తరాల కందించింది.
కుటుంబ రాజ్యం నుంచి బయటికొచ్చింది. కుటుంబ సంబంధాలు, స్త్రీ, పురుషసంబంధాలు ప్రజాస్వామ్యీకరించబడాలని కోరుకుంది. అందుకోసం పోరాడింది. స్త్రీపురుష సమానత్వం పాటించేతోడు కోసం వెతికింది తపించింది. పొందలేకపోయింది. జీవితాన్ని అణచివేతలపై తిరుగుబాటుగా మార్చుకుంది. ఎదురీదింది. హింసాత్మక సంప్రదాయాలను సమర్థంగా తోసిపుచ్చింది. అవమానాలను ప్రశ్నించే ధిక్కారంతో, స్వాభిమానంతోబతికింది.
దళిత సాంస్కృతిక వికాసానికి చంద్రశ్రీ 'దళిత ఉమెన్ థియేటర్' స్థాపించింది. నిరుపేద దళిత, ఆదివాసీ మహిళల్లో సాధికార చైతన్యం రగిలించడానికి సాంస్కృతిక శిక్షణలు ఇచ్చంది. అణగారిని సామాజిక వర్గాల మహిళలు, వారి అభివృద్ధికి వారే కారకులు కావడానికి చంద్రశ్రీ తనకున్న కళాసాంస్కృతిక నైపుణ్యాలను ఉపయోగించింది. డప్పు దరువులై పాడేది. తానున్న తావునల్లా దళిత సాధికార చైతన్యాన్ని పూయించేది, కాయించేది. కుల, లింగ వివక్షల నిప్పులపై మంచు వెన్నెలలు కురిపిస్తూ చంద్ర శ్రీ సాగిపోయింది.
దోపిడీ పీడనల వ్రణాలను చీల్చుకుంటూ చంద్రశ్రీ మిగిలిపోయింది. చంద్రశ్రీ గొప్ప స్నేహశీలి. మనిషిన మనిషే ప్రేమించాలనేది. దళిత మహిళలు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో తమ ముద్రలు, అడుగులు బలంగా వేస్తున్నారు. ఈ దారిలో చంద్రశ్రీ పెద్ద స్ఫూర్తికారి . మైలురాయి. అదిగో చంద్రశ్రీ గొంతుక! అంబేద్కర్ సుప్రభాతమై దళిత పొద్దుల్ని నిద్దర లేపుతోంది. స్నేహితురాలు చంద్ర శ్రీ కి కన్నీటి దండాలు. ఆమెకివే నా నిండు నివాళులు.
రాజ్యాధికారం స్వాతంత్య్రం కోసమే! - కదిరె కృష్ణ
July 05, 2013
కుల విధానం గురించి ఫూలే' (ఆంధ్రజ్యోతి, జూన్ 6, 7) అన్న సుదీర్ఘ వ్యాసంలో రంగనాయకమ్మ పరిశోధించి మరీ కనుగొన్నది చాలా కాలంగా ఆమె పాడుతున్న పాత పాటే. 'వృత్తి నుంచి కులం వచ్చిందనీ, కులాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ, కులం వృత్తి ధాతువు నుంచి జనించినందువల్ల దాన్ని శ్రమ సంబంధాల కోణంలోనే అర్థం చేసుకొని, వర్గ దృక్పథంతో మార్క్స్ వారసులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు పోరాటం చేయాలనేది ఆ వ్యాస సారాంశం. ఈ వేదన రంగనాయకమ్మకు కొత్తేమీ కాదు. బుద్ధుడు, అంబేద్కర్ లాంటి భారతీయ మేధావులను ఆమె గత కొంత కాలంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే వంతు వచ్చినట్లుంది. ఈ చర్చ కొత్తగా రంగనాయకమ్మతో ప్రారంభం కాలేదు. గతంలో దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో, పత్రికల్లో, రాజకీయ పార్టీల్లో పెద్దఎత్తున జరిగింది. ఈ కారణంగానే కొందరు మధ్యేవాదులు (మధ్యస్థ మార్గాలను అన్వేషించేవాళ్లు) 'వర్గకుల దృక్పథం' అనే మరో మార్గాన్ని కనిపెట్టి విఫలమైనారు.
'గులాంగిరి' (1873) పుస్తకానికి ఫూలే రాసుకున్న పీఠికను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఫూలే కుల విధానం సరైనది కాదని రంగనాయకమ్మ అన్నారు. 'ఆర్యులని విదేశీయులుగా భావిస్తూ, వారి దాడుల వల్లే ఈ దేశ మూలవాసులైన బహుజనులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) శూద్ర (అంటరాని), అతిశూద్ర (మిక్కిలి అంటరాని) కులాలుగా వర్గీకరణ అయి బానిసత్వంలోకి నెట్టివేయబడ్డారని, ఆర్యుల దుర్రాకమణ దుర్నీతి, అసమాన నిచ్చెనమెట్ల కుల దొంతరల వ్యవస్థకు ప్రధాన కారణ'మని ఫూలే సూత్రీకరణ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. అంతేగాక ఆర్యుల దాడుల వంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయని, అది సర్వసాధారణమని ఆమె చెప్పారు. మరి అలాంటప్పుడు అగ్రరాజ్యాలైన అమెరికా వంటి దేశాలపై కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు దేశాలు ఎందుకు నిష్ఠూరంగా ఉండడం? దోపిడీ సహజమే అయినప్పుడు ఇంత రాద్ధాంతం దేనికి? బలవంతుడు, సాయుధుడు బలహీనుడిని, సామాన్యుడిని దోచుకోవడం, హింసించడం సహజమే అయినప్పుడు వర్గం (శ్రామిక-పేద/పెట్టుబడిదారుడు-ధనవంతుడు) ప్రాధాన్యం ఏమిటి? వర్గ పోరాటం ఎందుకు? అసలు మార్క్స్ ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. మరొక విషయం, ఈ దాడులు చాలా అనాది నుంచి జరుగుతూనే ఉన్నాయని రంగనాయకమ్మ అన్నారు. అలాగైతే పురుషులు స్త్రీలను హింసించడం, అనేక రకాలుగా దోపిడీ చేయడం ఈనాటిదా? అనాదిగా వస్తున్న ఈ పురుషాహంకారాన్ని ఇప్పుడు ప్రశ్నించడం ఎందుకు? రంగనాయకమ్మ ఫెమినిజం బేస్గా చేసిన రచనలన్నింటినీ ఇప్పుడు ఏమనాలి?
'విజేతలైనవాళ్లు ఎవరైనా దుర్లక్ష్యాలతోనే ఉంటారు. భారతీయులే ఇతర ప్రాంతాల మీద దాడులు చేసి విజేతలైవుంటే అప్పుడు వీళ్లూ అలాగే చేసి ఉండేవారు' అంటూ రంగనాయకమ్మ ఒక నూతన వ్యాఖ్యానం చెప్పారు. నిజమే! యజమానులు/పెట్టుబడిదారులు/సంపన్నులు గనుక విజేతలైతే అలాగే ప్రవర్తిస్తారు. బాధితుడు విజేత అయితే అలా జరగడానికి అవకాశం లేదు. అందుకే మార్క్సిస్టులు కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ అధికారానికి వచ్చి సంపన్నులై బహుజనుల త్యాగాలను పునాదులుగా చేసుకొని బలి పశువులను చేస్తున్నట్టుంది! ఇప్పుడున్న కమ్యూనిస్టులంతా భూస్వాములు, పెత్తందార్లు, పెట్టుబడిదారులే కదా! మూడు వేల సంవత్సరాలుగా జరిగిన, జరుగుతున్న విధ్వంసం రంగనాయకమ్మకు అంత మామూలుగా కనిపించడం వెనుక ఆంతర్యమేమై ఉంటుంది? ఫూలే కులాన్ని గురించిన అంశాన్ని లేవనెత్తిన రంగనాయకమ్మ, ఫూలే తనని బహుజనుల్లో ఒకడిగా గుర్తించుకొని 'ఇతర చిన్న కులాల గురించి...' అన్నారు. ఫూలే చిన్న కులాలుగా ఎవరినీ గుర్తించలేదు. రంగనాయకమ్మ సృష్టి ఈ చిన్న కులాలు. చిన్న కులాలు అంటే ఏ పరిమాణం (సైజు) ప్రకారం నిర్ణయించాలి? జనాభా పరంగానా? సామాజికంగానా? శ్రామికంగానా? ఎలా? వీటిలో దేన్ని తీసుకున్నా శూద్ర అతిశూద్ర కులాలు చిన్న కులాలేమీ కావు. అగ్రకులాలుగా చెబుతున్న ఆర్య బ్రాహ్మణ కులాలే నిజానికి చిన్న కులాలు.
భారతదేశంలో కుల వ్యవస్థకు విజేతలైన ఆర్యులే పేరు పెట్టారు అని ఫూలే చెప్పిన విషయాలను ఇంకొన్ని విషయాలను ఉదహరించి, ఇంతకంటే ఎలాంటి వివరాలను ఆయన ఏమీ ఇవ్వలేదని రంగనాయకమ్మ వాపోయారు. బహుశా రంగనాయకమ్మ 'గులాంగిరి' పీఠిక మాత్రమే చదివి ఉంటారు. కేవలం పీఠిక చదివి ఫూలేపై ఇలా ఒక వక్ర నిశ్చితాభిప్రాయానికి ఎలా వచ్చారు ఈవిడ? చదివినా మార్క్స్ అద్దాలతో చదివి ఉంటారు. ఆర్యుల రాక, దాడులు, దురాక్రమణ, స్థానిక జాతుల బానిసీకరణ క్రమాన్ని విశదంగా చర్చించారు ఫూలే. ఆయన మొత్తం సాహిత్యంలో ఈ దృక్పథమే ఎక్కువగా కనిపిస్తుంది. తరువాత వచ్చిన అనేకమంది చరిత్రకారులకు ఫూలే మార్గదర్శకుడయ్యారు. ఆర్యులు సృష్టించిన దశావతారాల గుట్టు మైథాలజీ రూపంలో ఉండగా, వాటిని పరిశోధించి దానిలోని చరిత్రను బట్టబయలు చేసినవాడు ఫూలే. ఆర్యులు భూదేవతలుగా తమను తాము ఎలా చేసుకోగలిగారో ఫూలే సహేతుక విమర్శ ద్వారా నిరూపించారు. భారతదేశ చరిత్రను ఇంత క్షుణ్ణంగా పరిశీలించి మూలవాసీ దృక్పథంతో చరిత్రను పునర్లిఖించి చరిత్ర రచనలో ఒక నూతన ఒరవడిని సృష్టించిన భారతీయుడు మరొకరు లేరు. రంగనాయకమ్మ ఇంకా ఏమంటారంటే 'ఫూలే విమర్శ పద్ధతి హిందూ మత గ్రంథాల్లోని రాతలను బట్టి ఊహించింది'.
ఈ పద్ధతి తప్పెలా అవుతుంది? ఆర్య బ్రాహ్మణులు చేసిన గందరగోళమంతా పురాణ, ఇతిహాస, స్మృతి, వేదాల రూపంలోనే ఉన్నది కదా? నిజానికి భారతీయ చరిత్ర పరిశోధనలో అవే కీలకం. పరిశోధనలో పటుత్వం, విషయ పరిశీలన, ప్రయోగం, వాస్తవాల వెలికితీతలో నిజాయితీ వుండడం ప్రధానం కానీ ఫలానా వాటిని ఆధారంగా చేసుకొని ఎలా నిర్ణయిస్తామనేది సరైంది కాదు. మార్క్సిస్టులు కట్టూ బొట్టూ కంకణం సంస్కృతిలో కొట్టుమిట్టాడుతూ బ్రాహ్మణవాదాన్ని మోస్తున్న విధానం గమనిస్తే ఫూలే తరహా విమర్శాదృక్పథం లోపించడమేనని స్పష్టమవుతుంది. కాలక్రమంలో శ్రమవిభజనే సామాజిక విభజన అయిందనేది వ్యాసకర్త అభిప్రాయం. అదే మార్క్సిస్టుల వాదన కూడా. రంగనాయకమ్మ ఊహే నిజమైతే మరి యాచక కులాల సంగతేమిటి?నాకు తెలిసి మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రాతిపదికన కుల నిర్మూలన జరుగదు. కానీ, ఫూలే అంబేద్కరిజపు సిద్ధాంత వెలుగుధారలో కుల నిర్మూలన జరిగి తీరుతుంది. విద్యా చైతన్యం (బోధన), సమీకరణ (విడిపోయిన కులాల ఐక్యత), పోరాటం (కోల్పోయిన ఓటు కోసం), కులనిర్మూలనకు ఫూలే-అంబేద్కర్ ప్రతిపాదించిన సోపానాలు, విద్య కులాంతర వివాహాలు, రాజకీయ అధికారం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. బోధించడం ద్వారా చైతన్యం, ఫలితంగా సాంస్కతిక విప్లవం, తదనంతరం మూలవాసీ చైతన్యధారతో అణగారిన స్టేట్ సోషలిజం, సమ విద్య, సమపాలన మొత్తంగా సామాజిక న్యాయం.
సమస్త కులాల సమానత్వమే సోషలిజం. శూద్రుల్లో పాలకులు బయలుదేరినా కులం పోదనేది తప్పుడు అవగాహన. దీన్నిలా సవరించాలి 'శూద్రుల్లో పాలకులు కాదు శూద్రులు పాలకులు కావాలి'.శూద్రులు పాలకులైనా ఏ మార్పూ ఉండదని రంగనాయకమ్మ అంటారు. కానీ కాకతీయ సామ్రాజ్యం విచ్ఛిన్నం నుంచి భూపతులు, సామంతులు, దండనాయకులుగా ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ కులాలు శూద్రత్వం నుంచి బయటపడి అగ్రకులాలుగా మారలేదా? డాక్టర్ బిఆర్ ఆంబేద్కర్ చెప్పినట్లు 'మన పోరాటం అధికారం కోసం కాదు. స్వాతంత్య్రం కోసం' అనే దిశగా నేటి బహుజనులు ఆలోచించాలి. ఫూలే-అంబేద్కర్ తాత్విక పునాదుల మీద ఉద్యమాలు ఉధృతం చేయడమే రంగనాయకమ్మలాంటి వారికి సరైన సమాధానం.
- కదిరె కృష్ణ
కన్వీనర్, మూలవాసీ బహుజన లిబరేషన్ మూవ్మెంట్
'గులాంగిరి' (1873) పుస్తకానికి ఫూలే రాసుకున్న పీఠికను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఫూలే కుల విధానం సరైనది కాదని రంగనాయకమ్మ అన్నారు. 'ఆర్యులని విదేశీయులుగా భావిస్తూ, వారి దాడుల వల్లే ఈ దేశ మూలవాసులైన బహుజనులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) శూద్ర (అంటరాని), అతిశూద్ర (మిక్కిలి అంటరాని) కులాలుగా వర్గీకరణ అయి బానిసత్వంలోకి నెట్టివేయబడ్డారని, ఆర్యుల దుర్రాకమణ దుర్నీతి, అసమాన నిచ్చెనమెట్ల కుల దొంతరల వ్యవస్థకు ప్రధాన కారణ'మని ఫూలే సూత్రీకరణ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. అంతేగాక ఆర్యుల దాడుల వంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయని, అది సర్వసాధారణమని ఆమె చెప్పారు. మరి అలాంటప్పుడు అగ్రరాజ్యాలైన అమెరికా వంటి దేశాలపై కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు దేశాలు ఎందుకు నిష్ఠూరంగా ఉండడం? దోపిడీ సహజమే అయినప్పుడు ఇంత రాద్ధాంతం దేనికి? బలవంతుడు, సాయుధుడు బలహీనుడిని, సామాన్యుడిని దోచుకోవడం, హింసించడం సహజమే అయినప్పుడు వర్గం (శ్రామిక-పేద/పెట్టుబడిదారుడు-ధనవంతుడు) ప్రాధాన్యం ఏమిటి? వర్గ పోరాటం ఎందుకు? అసలు మార్క్స్ ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. మరొక విషయం, ఈ దాడులు చాలా అనాది నుంచి జరుగుతూనే ఉన్నాయని రంగనాయకమ్మ అన్నారు. అలాగైతే పురుషులు స్త్రీలను హింసించడం, అనేక రకాలుగా దోపిడీ చేయడం ఈనాటిదా? అనాదిగా వస్తున్న ఈ పురుషాహంకారాన్ని ఇప్పుడు ప్రశ్నించడం ఎందుకు? రంగనాయకమ్మ ఫెమినిజం బేస్గా చేసిన రచనలన్నింటినీ ఇప్పుడు ఏమనాలి?
'విజేతలైనవాళ్లు ఎవరైనా దుర్లక్ష్యాలతోనే ఉంటారు. భారతీయులే ఇతర ప్రాంతాల మీద దాడులు చేసి విజేతలైవుంటే అప్పుడు వీళ్లూ అలాగే చేసి ఉండేవారు' అంటూ రంగనాయకమ్మ ఒక నూతన వ్యాఖ్యానం చెప్పారు. నిజమే! యజమానులు/పెట్టుబడిదారులు/సంపన్నులు గనుక విజేతలైతే అలాగే ప్రవర్తిస్తారు. బాధితుడు విజేత అయితే అలా జరగడానికి అవకాశం లేదు. అందుకే మార్క్సిస్టులు కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ అధికారానికి వచ్చి సంపన్నులై బహుజనుల త్యాగాలను పునాదులుగా చేసుకొని బలి పశువులను చేస్తున్నట్టుంది! ఇప్పుడున్న కమ్యూనిస్టులంతా భూస్వాములు, పెత్తందార్లు, పెట్టుబడిదారులే కదా! మూడు వేల సంవత్సరాలుగా జరిగిన, జరుగుతున్న విధ్వంసం రంగనాయకమ్మకు అంత మామూలుగా కనిపించడం వెనుక ఆంతర్యమేమై ఉంటుంది? ఫూలే కులాన్ని గురించిన అంశాన్ని లేవనెత్తిన రంగనాయకమ్మ, ఫూలే తనని బహుజనుల్లో ఒకడిగా గుర్తించుకొని 'ఇతర చిన్న కులాల గురించి...' అన్నారు. ఫూలే చిన్న కులాలుగా ఎవరినీ గుర్తించలేదు. రంగనాయకమ్మ సృష్టి ఈ చిన్న కులాలు. చిన్న కులాలు అంటే ఏ పరిమాణం (సైజు) ప్రకారం నిర్ణయించాలి? జనాభా పరంగానా? సామాజికంగానా? శ్రామికంగానా? ఎలా? వీటిలో దేన్ని తీసుకున్నా శూద్ర అతిశూద్ర కులాలు చిన్న కులాలేమీ కావు. అగ్రకులాలుగా చెబుతున్న ఆర్య బ్రాహ్మణ కులాలే నిజానికి చిన్న కులాలు.
భారతదేశంలో కుల వ్యవస్థకు విజేతలైన ఆర్యులే పేరు పెట్టారు అని ఫూలే చెప్పిన విషయాలను ఇంకొన్ని విషయాలను ఉదహరించి, ఇంతకంటే ఎలాంటి వివరాలను ఆయన ఏమీ ఇవ్వలేదని రంగనాయకమ్మ వాపోయారు. బహుశా రంగనాయకమ్మ 'గులాంగిరి' పీఠిక మాత్రమే చదివి ఉంటారు. కేవలం పీఠిక చదివి ఫూలేపై ఇలా ఒక వక్ర నిశ్చితాభిప్రాయానికి ఎలా వచ్చారు ఈవిడ? చదివినా మార్క్స్ అద్దాలతో చదివి ఉంటారు. ఆర్యుల రాక, దాడులు, దురాక్రమణ, స్థానిక జాతుల బానిసీకరణ క్రమాన్ని విశదంగా చర్చించారు ఫూలే. ఆయన మొత్తం సాహిత్యంలో ఈ దృక్పథమే ఎక్కువగా కనిపిస్తుంది. తరువాత వచ్చిన అనేకమంది చరిత్రకారులకు ఫూలే మార్గదర్శకుడయ్యారు. ఆర్యులు సృష్టించిన దశావతారాల గుట్టు మైథాలజీ రూపంలో ఉండగా, వాటిని పరిశోధించి దానిలోని చరిత్రను బట్టబయలు చేసినవాడు ఫూలే. ఆర్యులు భూదేవతలుగా తమను తాము ఎలా చేసుకోగలిగారో ఫూలే సహేతుక విమర్శ ద్వారా నిరూపించారు. భారతదేశ చరిత్రను ఇంత క్షుణ్ణంగా పరిశీలించి మూలవాసీ దృక్పథంతో చరిత్రను పునర్లిఖించి చరిత్ర రచనలో ఒక నూతన ఒరవడిని సృష్టించిన భారతీయుడు మరొకరు లేరు. రంగనాయకమ్మ ఇంకా ఏమంటారంటే 'ఫూలే విమర్శ పద్ధతి హిందూ మత గ్రంథాల్లోని రాతలను బట్టి ఊహించింది'.
ఈ పద్ధతి తప్పెలా అవుతుంది? ఆర్య బ్రాహ్మణులు చేసిన గందరగోళమంతా పురాణ, ఇతిహాస, స్మృతి, వేదాల రూపంలోనే ఉన్నది కదా? నిజానికి భారతీయ చరిత్ర పరిశోధనలో అవే కీలకం. పరిశోధనలో పటుత్వం, విషయ పరిశీలన, ప్రయోగం, వాస్తవాల వెలికితీతలో నిజాయితీ వుండడం ప్రధానం కానీ ఫలానా వాటిని ఆధారంగా చేసుకొని ఎలా నిర్ణయిస్తామనేది సరైంది కాదు. మార్క్సిస్టులు కట్టూ బొట్టూ కంకణం సంస్కృతిలో కొట్టుమిట్టాడుతూ బ్రాహ్మణవాదాన్ని మోస్తున్న విధానం గమనిస్తే ఫూలే తరహా విమర్శాదృక్పథం లోపించడమేనని స్పష్టమవుతుంది. కాలక్రమంలో శ్రమవిభజనే సామాజిక విభజన అయిందనేది వ్యాసకర్త అభిప్రాయం. అదే మార్క్సిస్టుల వాదన కూడా. రంగనాయకమ్మ ఊహే నిజమైతే మరి యాచక కులాల సంగతేమిటి?నాకు తెలిసి మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రాతిపదికన కుల నిర్మూలన జరుగదు. కానీ, ఫూలే అంబేద్కరిజపు సిద్ధాంత వెలుగుధారలో కుల నిర్మూలన జరిగి తీరుతుంది. విద్యా చైతన్యం (బోధన), సమీకరణ (విడిపోయిన కులాల ఐక్యత), పోరాటం (కోల్పోయిన ఓటు కోసం), కులనిర్మూలనకు ఫూలే-అంబేద్కర్ ప్రతిపాదించిన సోపానాలు, విద్య కులాంతర వివాహాలు, రాజకీయ అధికారం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. బోధించడం ద్వారా చైతన్యం, ఫలితంగా సాంస్కతిక విప్లవం, తదనంతరం మూలవాసీ చైతన్యధారతో అణగారిన స్టేట్ సోషలిజం, సమ విద్య, సమపాలన మొత్తంగా సామాజిక న్యాయం.
సమస్త కులాల సమానత్వమే సోషలిజం. శూద్రుల్లో పాలకులు బయలుదేరినా కులం పోదనేది తప్పుడు అవగాహన. దీన్నిలా సవరించాలి 'శూద్రుల్లో పాలకులు కాదు శూద్రులు పాలకులు కావాలి'.శూద్రులు పాలకులైనా ఏ మార్పూ ఉండదని రంగనాయకమ్మ అంటారు. కానీ కాకతీయ సామ్రాజ్యం విచ్ఛిన్నం నుంచి భూపతులు, సామంతులు, దండనాయకులుగా ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ కులాలు శూద్రత్వం నుంచి బయటపడి అగ్రకులాలుగా మారలేదా? డాక్టర్ బిఆర్ ఆంబేద్కర్ చెప్పినట్లు 'మన పోరాటం అధికారం కోసం కాదు. స్వాతంత్య్రం కోసం' అనే దిశగా నేటి బహుజనులు ఆలోచించాలి. ఫూలే-అంబేద్కర్ తాత్విక పునాదుల మీద ఉద్యమాలు ఉధృతం చేయడమే రంగనాయకమ్మలాంటి వారికి సరైన సమాధానం.
- కదిరె కృష్ణ
కన్వీనర్, మూలవాసీ బహుజన లిబరేషన్ మూవ్మెంట్
Andhra Jyothi Telugu News Paper Dated : 05/07/2013
Friday, July 5, 2013
అక్షరానికి అరవయ్యేళ్ళు ( ఆచార్య కొలకలూరి ఇనాక్) రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి
July 01, 2013
ఈ ఊరు, ఈ దేశం ఎంతకాలం జీవిస్తాయి?
ప్రేమ ప్రాతిపదిక మీద బతికే
సమాజం, వ్యవస్థ ఏ రోజు పుడతాయి?
(ఊరబావి: 1969)
వ్యక్తిగా డెబ్భై అయిదో పడిలో అడుగిడుతున్న (01.07.1939) ఆచార్య కొలకలూరి ఇనాక్ రచయితగా అరవయ్యవ ఏడాదిలోకి పరుగిడుతున్నారు (1954-2013). రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతుండగా పుట్టిన కొలకలూరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమింపబడి ఎన్నికల రాజకీయాలు దేశ భవిష్యత్తును నిర్ణయించడం మొదలవుతున్న దశలో రచనను చేపట్టారు. 1954లో 'ఉత్తరం' కథ, సీసపద్యం వంటివి రాయడంతో ఆయన రచనా జీవితం మొదలైంది.
అతిచిన్న వయసులోనే రచనను ప్రారంభించి అరవయ్యేళ్ళుగా రచయితగానే జీవిస్తున్నారు కొలకలూరి. ఆయన స్వాతంత్య్రానంతర తొలితరం తెలుగు రచయిత. మధురాంతకం రాజారాం, కాళోజీ, గూడూ రి సీతారాం, సురమౌళి, నవీన్, ఇల్లిందల సరస్వతీదేవి, ముదిగంటి సుజాతారెడ్డి, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, కేతు విశ్వనాథరెడ్డి, కె.సభా, ముంగర శంకరరాజు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య వంటివాళ్ళు కొలకలూరికి కొంచెం ముందు, కొంచెం వెనకలుగా సమకాలిక రచయితలు. ఇవాళ దళిత రచయితలుగా మనం కీర్తిస్తున్న గుర్రం జాషువా, కుసుమ ధర్మన్న, బోయి భీమన్నల తరువాత పేర్కొనదగిన ప్రసిద్ధ దళిత రచయిత కొలకలూరి. వాళ్లలోని అభ్యుదయాంశను తనదైన ఆధునిక మార్గంలో కొనసాగిస్తున్న రచయిత కొలకలూరి.
కొలకలూరి కవి, కథకులు, నవలా నాటక రచయిత, విమర్శకులు, పరిశోధకులు, సమీక్షకులు. తెలుగు సాహిత్య చరిత్రలో స్తబ్ధతా యుగమని కొందరు భావిస్తున్న యుగంలో కొలకలూరి రచనలు ప్రారంభించారు. కొలకలూరి రచనల పట్టిక కన్నా ఆయన రచనాతత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. కొలకలూరి అభ్యుదయ సాహిత్యం మలి దశలో రచన ప్రారంభించి విప్లవ, స్త్రీ, దళిత బహుజన, మైనారిటీ, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల ద్వారా రచయితగా నడుచుకుంటూ వస్తున్నారు. ఆయనది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఏ సంస్థలోనూ చేరకుండా ఆ సంస్థల భావజాలాలలోని అనుకూలాంశాలను స్వీకరించి సమకాలీన సామాజిక వాస్తవికతను వస్తువుగా చేసుకొని రచనలు చేస్తున్నారు కొలకలూరి.
ఆచార్య కొలకలూరికి ఒక సామాజిక స్వప్నముంది.
పైసా లేనివాడు - పైగా హరిజనుడు
ప్రధానమంత్రి కాగలిగి - అయిదేళ్ళు పదవిలో ఉండి
ఆపైన పదవి వదిలి -పైసా లేకుండా
పాత మనిషిగా - బ్రతగ్గలిగిన్నాడు
భారతదేశం - బాగుపడ్డట్టు (అభ్యుదయం)
1970ల నాటికే స్వాతంత్య్రం మీద తెలుగు రచయితలకు నమ్మకం సన్నగిల్లింది. ఆ అపనమ్మకాన్ని వ్యక్తం చేయడానికి ఆరుద్ర, కాళోజీ, జాషువాల నుండి నేటిదాకా ప్రజా రచయితలు వెనకాడలేదు. కొలకలూరి ఆ కోవలోనివారే. దళితులకు రాజ్యాధికారం దక్కడం ఒక పార్శ్వమైతే, ఆ దళితులు అవినీతికి పాల్పడకుండా పాలించడం కొలకలూరి రాజకీయ స్వప్నంలో మరో అంశం. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమి అన్నట్లు తయారైన ప్రస్తుత సందర్భంలో కొలకలూరి 'అభ్యుదయం' కవితకు గొప్ప ప్రాముఖ్యముంది. గత నలభయ్యేళ్ల మన దేశ రాజకీయ పరిణామాలను చూసి, ఈ కవిత చదివి ఈ దేశం ఏమౌతుందోనన్న దిగులు కలగకమానదు.
మనిషిని నమ్మడం, మనిషిని ప్రేమించడం కన్నా వ్యక్తిత్వ వికాసమింకేముంటుంది. ఈ రెండూ లోపించడం వల్లనే మన దేశం అనేక అసమానతలలోకి, వివక్షలలోకి నెట్టివేయబడింది. కొలకలూరి గొప్ప మానవ ప్రేమికుడు. మన దేశంలోని సాంఘిక వివక్షల కారణంగా ఆయన వంశీకులు మతాలు మార్చుకున్నా కొలకలూరి అచ్చమైన మనిషి విశ్వాసిగా నిలిచారు.
లేకుంటే మనిషి నా గీత, నా బైబిల్ నా ఖురాన్..
మనిషి నా ఊపిరి, ప్రాణం, రక్తం
మనిషి నా చైతన్యం నా జీవితం నా వ్యక్తిత్వం
అని అనలేరు. భారతదేశ ప్రజలంతా కలిసి మనిషికి మాత్రమే విలువనిస్తే, మనిషిని మాత్రమే ప్రేమిస్తే ఎంత సామాజిక శాంతి చేకూరుతుంది! మన దేశం ఎంత నాగరికమౌతుంది!
దేశభక్తి అనే మాట ఇవాళ అర్థం కోల్పోయిన పదమైపోయింది- దేశభక్తి అంటే రొమ్ములు గుద్దుకోవడం, జబ్బలు చరుచుకోవడం, తొడలు గొట్టడంగా మారిపోయింది. అది దేశభక్తి కాదు. ఒక దేశంలోని ఒక వ్యవస్థలో బాగుపడ్డవాళ్ళు మా దేశం గొప్పది అంటారు. మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నామంటారు. ఆ వ్యవస్థలో నష్టపోయిన వాళ్లు ఈ మాటలనలేరు. కొలకలూరి భారతదేశంలో అవమానాల పాలైన, అణచివేయబడ్డ వర్గాలకు చెందిన కవి. ఆయన ఎలాగో పైకి వచ్చి ఉండవచ్చు. కాని దళితులకు ఈ దేశంలో జరిగిన అవమానాలు, చూసి కూడా
భూషించినా దూషించినా
స్వాగతం పలికినా వీడ్కోలు చెప్పినా
సన్మానించినా అవమానించినా/నా యీ దేశాన్ని ప్రేమిస్తున్నాను
అని ప్రకటించారు. దేశం మీద నిజమైన గౌరవం ఉంటే తప్ప ఇలా అనడం సాధ్యం కాదు. ఈ దృష్టితో చూచినప్పుడు వ్యాపారులు సంపన్నులు ఆధిపత్యవాదులు ప్రదర్శించే దేశభక్తి కృతకమైందని, అణచివేతకు గురైనవారు ప్రదర్శించే దేశభక్తి సహజమైందని చెప్పవచ్చు.
నిన్న తలవంచిన వీళ్లు/నేడు ప్రతిఘటించారు
రేపు విజయులౌతారు....
ప్రతిఘటించే పంచముడు/పంచభూతాలకు ప్రాణదాత
జాషువ ఏ కావ్యం రాసినా అందులో దళిత స్పృహ, దళిత వేదన అంతస్సూత్రంగా కనిపిస్తూ ఉంటుంది. అది కొలకలూరి సాహిత్యంలోను ఉంది. ఆయన సాహిత్యంలోని కీలకాంశం ఇదే. సమత (దళిత విద్యార్థి జీవితం) అనాధ (దళిత స్త్రీ జీవితం) ఇరులలో విరులు (కుల ప్రసక్తి లేని మానవ సంబంధాలు) సర్కారు గడ్డి (కష్టకాలంలోను దళితులను పెద్దవాళ్లు దోచుకోవడం) దిక్కులేనోరు (అబద్ధపు నేరం మోపి దళితుని చంపడం) దర్శనం (ఆలయ ప్రవేశం) కూలి (దళితుల శ్రమఫలితం) ఊరబావి (నీళ్లకోసం దళిత స్త్రీ తిరుగుబాటు) పశ్చాద్భూమి (కక్కసు ఉద్యోగుల జీవనం) ఆకలి (తిండికోసం దళిత అమ్మాయి సాహసం) అస్పృశ్యగంగ (పట్టణంలోనూ అస్పృశ్యత) సూర్యుడు తలెత్తాడు (చదువుకొని పైకి వచ్చిన దళితుడు) కాకి (మాదిగల ఇండ్ల దగ్గర మాత్రమే అడుక్కునే దళితుడు) విఘ్ననాయకుడు (ప్యాపిలి సంఘటన) -ఇలా కొలకలూరి సర్వ ప్రక్రియలలోనూ దళిత జీవితం పరచుకొని కనిపిస్తుంది. 'ఊరబావి' కథానిక దళిత జీవిత ప్రతిఫలనంలో గత శతాబ్ది ఆధునిక సాహిత్యంలోనే ఒక ఇతిహాసం. 1913లో మంగిపూడి వెంకటశర్మ 'నిరుద్ధ భారతం' రాసి భారతదేశ చరిత్రలో దళితుల శ్రమను కీర్తించారు. 21వ శతాబ్దం ప్రారంభంలో కొలకలూరి 'ఆదిఆం«ద్రుడు' అనీ పద్యకావ్యంలో భుజంగరాయుడనే దళితసేనానిని ప్రదర్శించారు. 'నా కన్నీళ్ళే నా సాహిత్యం' అన్నారు కొలకలూరి ఒక సభలో. అవి పీడిత జనం కన్నీళ్లు. దళితులు బహుజనులు స్త్రీలు మైనారిటీలు- ఇదీ కొలకలూరి పక్షం.
భారతదేశాన్ని మోసే అర్ధాకలి బోయీలకు
భారతభవనం గోడలుగా స్థిరంగా నిలబడ్డ
దళితులకు గిరిజనులకు/ముస్లిములకు వెనుకబడినవారికి
అణగారిన వర్గాలకు నమస్కారం
కులం, మతం, ధనం- ఈ మూడు భారతీయ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించాయని కొలకలూరికి తెలుసు. అవి అల్ప సంఖ్యాకులకు మేలు చేసి, అధిక సంఖ్యాకులకు చెడు చేశాయని కూడా ఆయనకు తెలుసు. ఆర్థిక సాంఘిక రుగ్మతలకు మూలాలైన ఈ మూడింటిని నిర్మూలించి, వీటి ప్రమేయం లేని భారతదేశం పుట్టాలని ఆయన ఆకాంక్ష. ఆయన సాహిత్య మంతా విస్తరించిన అంశం ఇది. భారతదేశం నాగరికమూ, శాస్త్రీయమూ కావాలని, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలతో పరిమళించాలని కొలకలూరి తపన. భారతదేశం ఐక్యంగా ఉండాలన్నది కొలకలూరి కోరిక. అయితే అది వైరుధ్యాలను కప్పి పెట్టే వ్యాపారులు కోరుకునే ఐక్యత కాదు. వైరుధ్యాలు, వివక్షలు లేని ఐక్యత, మానవీయ ఐక్యత.
దేశం బాగుపడాలనీ, పాడు కారాదనీ
కులం బాధా, ధనం హింసా తొలగాలనీ
భూమి మిగతా భూతాల్లా అందరిదనీ
పీడన ఏ రూపంలోనూ ఉండరాదనీ....
వ్యవస్థ వ్యక్తిగా, సమిష్టి వ్యక్తిగా
లోకం నేనుగా రోదించింది
ఇదీ కొలకలూరి రోదన. ఇది ప్రజాపక్షం వహించే రచయితల ప్రజాస్వామిక ఆకాంక్ష. కొలకలూరి ఈ ప్రజాస్వామిక ఉద్యమంలో భాగస్వామి.
లోకమంతా ప్రేమై/హృదయమంతా దయై
ఉంటే తప్ప/ఈ జీవితాలకు మోక్షం లేదు
అన్నది కొలకలూరి తీర్పు.
సాహిత్య శిల్పిగా కొలకలూరి సరళవాది. ఆయన సాహిత్యంలో పాఠకులను దూరం చేసుకునే ప్రయోగాలు కనిపించవు. వస్తువులోను శిల్పంలోను కొలకలూరి ప్రజాపక్షమే. పాఠకులను బోల్తా కొట్టించే మలుపులు ఆయన కథలలోను, నవలలోనూ ఉండవు, కొన్నిచోట్ల కథలలో ముగింపు పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరచినట్లు కనిపిస్తుంది. ఆయన ఎవరి జీవితాన్ని గురించి రాస్తున్నారో, ఆ జీవితాన్ని అనుభవిస్తున్నవాళ్లు చదివి, విని, అందులో తమ ముఖాలు చూచుకోగలిగేట్టుగా ఉంటుంది కొలకలూరి సాహిత్య శిల్పం. ఆయన వచన కవిత్వం కుందుర్తి చెప్పినట్లు, తిలక్ చెప్పినట్లు పాఠకులకు చాలా దగ్గరగా ఉంటుంది. వ్యంగ్యం, అధిక్షేపం కొలకలూరి కవిత్వ శిల్పాయుధాలు. చిన్న చిన్న వాక్యాలు ఆయన రచనలకు పట్టాలు. అసలైన తెలుగు వాక్యాలు ఆయన సొంతం. జీవిత శకలాలలో నిండిన వస్తువు లోపల సుడులు తిరుగుతున్నా, శిల్పం ఉద్రేకపడదు. తిరుగుబాట్లు, ప్రతిఘటనలు ఉన్నా అవి తిట్లు బూతులు జుగుప్సలు కాకపోవడం కొలకలూరి విశిష్టత. కొలకలూరి సాహిత్యశిల్పంలో క్రమ పరిణామం.
పాఠకులకు దగ్గర కావడం కనిపిస్తాయి. రచన తనకోసం కాదు, పాఠకులకోసం అనే స్పృహ ఆయనకు మొదటినుంచీ ఉంది. కొలకలూరి పాపులర్ మార్గంకాదు, ప్రజా మార్గం. తన ప్రాంతం నుండి నలభయ్యేళ్ల క్రితం రాయలసీమకు వచ్చేసినా, ఆ భాష మాత్రం ఆయన సాహిత్యంలో ఇంకా స్వచ్ఛంగా నిలిచి ఉండడం ఆశ్చర్యం. ఏ భాషలో రాసినా, ఆయన రాయలసీమలో బతికినందుకు, ఆ ప్రాంతం జీవితాన్ని కూడా తన సాహిత్యంలో ప్రదర్శించారు. సాహిత్య విమర్శకుడుగా, పరిశోధకుడుగా కొలకలూరిది కొత్త చూపు. సాహిత్య వ్యాసాలు (1974) మొదలుకొని జానపదుల సాహిత్య విమర్శ (2009) దాకా విశ్వవిద్యాలయ పరిశోధకులు సాధారణంగా స్పృశించని 'తెలుగు వ్యాస పరిణామం' మీద పరిశోధించడమే ఆయన మౌలిక శ్రమకు నిదర్శనం. గత పదేళ్లలో కొలకలూరి మూడు పరిశోధనాత్మక విమర్శా గ్రంథాలను ప్రచురించారు.
అవి 1.ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం 2.శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం 3.జానపదుల సాహిత్య విమర్శ. ఇవి మూడూ పునర్మూల్యాంకన విమర్శ గ్రంథాలు. అలాగే నరహరిగోపాలకృష్ణమశెట్టి నవల 'శ్రీరంగరాజచరిత్ర'ను దళిత సాహిత్యోద్యమ నేపథ్యంలో పునర్ముద్రిస్తూ, కొలకలూరి రాసిన పరిశోధనాత్మక ముందుమాట కూడా ఇందులో భాగం. విరసం ఏర్పడిన తర్వాత తెలుగు సాహిత్యంలో చర్చకు వచ్చిన నిబద్ధత, నిమగ్నతలకు కొలకలూరి నిబిడత (స్వీయానుభవంతో రాయడం) అనే మూడవ సూత్రాన్ని జోడించి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఈ మూడు సూత్రాలు ప్రాతిపదికగా విశ్లేషించారు. ఇది కొత్తచూపుతో కూడిన కృషి. రామరాజభూషణుడు శూద్ర కవి. ఆయన అసలు పేరు శుభమూర్తి. వసుచరిత్ర శూద్ర కావ్యమంటూ కొలకలూరి చేసిన పరిశోధన ఆ కావ్యం మీద అంతకు ముందు వచ్చిన విమర్శలన్నిటికీ భిన్నమైనది, విశిష్టమైనది. 'తెలుగు జానపదుల సాహిత్య విమర్శ వయస్సు వెయ్యేళ్ళు' అంటూ తెలుగు చాటువులలో, సంప్రదాయ సాహిత్య చరిత్రలలో గల కథనాలను కొలకలూరి జానపదుల సాహిత్య విమర్శగా గుర్తించడం విశేషం. దళిత స్వర్శ ఉన్న కారణంగా, ఎన్ని లోపాలున్నా శ్రీరంగరాజ చరిత్ర తొలి తెలుగు నవల అనే ప్రతిపాదనను అనేక ఉపపత్తులతో చేశారు కొలకలూరి.
ఆచార్య కొలకలూరి ఇనాక్ ఇప్పటిదాకా 70 రచనలు చేశారు. బైబిల్ను వ్యవహారిక భాషలోకి అనువదించారు. ధనికులు పేదలు ఉన్న సమాజంలో కొలకలూరి పేదల పక్షం. పై కులాలు, కింది కులాలు ఉన్న సమజంలో ఆయన కింది కులాల పక్షం. మెజారిటీ మైనారిటీలు ఉన్న సమాజంలో ఆయన మైనారిటీ పక్షం. పురుషులు, స్త్రీలు ఉన్న సమాజంలో ఆయన స్త్రీల పక్షం. ప్రేమ, ద్వేషం ఉన్న సమాజంలో కొలకలూరి ప్రేమ పక్షం. విభజిత సమాజంలో తానొక పక్షం వహించినా ఆయన కోరుకునేది సమష్టి సమాజాన్నే.
మనమంతా కలిసి ఆనందించిందాకా
నాకు సుఖం లేదు, శాంతి లేదు (కులం-ధనం)
డెబ్భై అయిదవ పడిలో అడుగిడుతూ, రచనా జీవితంలో షష్ట్యబ్దిలోకి పరుగిడుతున్న కొలకలూరి ఇనాక్ గారికి శుభాకాంక్షలు.
- రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి
94402 22117
(నేడు తిరుపతిలో ఆచార్య కొలకలూరి ఇనాక్ అమృతోత్సవం-
సాహితీ వజ్రోత్సవం జరుగుతున్న సందర్భంగా)
Andhra Jyothi Telugu News Paper Dated : 1/07/2013
Subscribe to:
Posts (Atom)


