Monday, October 3, 2011

ఈ ఆరోపణలు అనైతికం - ఉ.సా Andhra Jyothi 04/10/2011


ఈ ఆరోపణలు అనైతికం

- ఉ.సా

దొర గడీలను కాచే వారెవరైనా, దొరలచేత ఉసిగొల్పబడే దొర జీతగాళ్లెవరైనా వారిని తప్పకుండా తప్పుపట్టాల్సిందే. వారి నిజస్వరూపాన్ని బైటపెట్టి జనం ముందు దోషులుగా నిలబెట్టాల్సిందే. జనం వారిని తిరస్కరించి పక్కన బెట్టాల్సిందే. కానీ అలా తప్పుపట్టే నైతిక అర్హత ఆ తప్పు ఎన్నడూ చేయని నిర్దోషులకే వుంటుందిగాని దోషులకు ఉండదు. పీడిత ప్రజల పక్షాన నిలబడి అగ్రకుల పాలకులపై రాజీలేని పోరాటం చేయటానికి బదులు ఏదో ఒక సాకుతో ఎల్లప్పుడూ ఏదో ఒక అగ్రకుల దొరల పంచన జేరి వంచనకు పాల్పడే అసాంఘిక శక్తులకు అసలే ఉండదు.

అనునిత్యం దొర గడీలను కాచే అలాంటి అసాంఘిక శక్తులతో అంట కాగుతున్న గుడిపల్లి రవి లాంటి వారు 'దొర గడీలను కాచే వారితో జాగ్రత్త' (సెప్టెంబర్ 28, ఆంధ్రజ్యోతి) అని మాపై నిందారోపణకు పాల్పడ్డారు. ఇది 'దొంగే దొంగ దొంగ' అని బుకాయించటం తప్ప వేరు కాదు. వీరు తమ తెలంగాణ వ్యతిరేక, అసాంఘిక పాత్రను కప్పిపుచ్చుకోవటం కోసం, అదేమని ప్రశ్నించిన ప్రతివారినీ దళిత వ్యతిరేకులుగా, దొర గడీలను కాచే అగ్రకుల తొత్తులుగా ముద్రవేసి బ్లాక్ మెయిల్ చేసి వారి నోరు మూయించటం ఓ తంతుగా మారింది. అలాంటి వారికి వంత పాడటం ఇప్పుడు గుడిపల్లి వారి వంతుగా మారింది.

న్యాయమైన సామాజిక న్యాయాన్ని తెలంగాణకి అన్యాయం చేసే సాధనంగా, క్రమబద్ధీకరణకు మారుపేరైన వర్గీకరణను తెలంగాణకి అడ్డుపుల్లగా మారుస్తున్న వారి అక్రమాల నిజస్వరూపాన్ని బైటపెట్టినందుకు మాపై గుడిపల్లి బృందం కత్తికట్టింది. తమ దిగజారుడుతనాన్ని మాకు కూడా అంటగడుతూ మమ్మల్ని అప్రదిష్టపాలు చేస్తూ మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వ్యక్తిగత నిందారోపణలకు పాల్పడ్డారు.

మహనీయుల మార్గదర్శకత్వంలో గులాంగిరీకి తావులేని మా స్వతంత్ర ప్రత్యామ్నాయ సుదీర్ఘ ప్రజా ఉద్యమ జీవితంలో ఏనాడైనా ఏ సాకుతోనైనా ఏ అగ్రకుల దొరల పార్టీకైనా, జీతగాళ్లుగా మారి దొర గడీలను కాచిన సందర్భం ఒక్కటంటే ఒక్కటైనా ఏ ఒక్కడైనా చూపించగలడా? అని బహిరంగంగా సవాల్ చేస్తున్నాం. అసత్యాలతో అర్ధ సత్యాలతో, అసందర్భమైన అభూతకల్పనలతో గుడిపల్లి వారు మా పై ఎన్ని నీలాపనిందలు మోపినా వారు సైతం మా విషయంలో అలాంటి సందర్భం చూపించలేకపోయారు.

భౌగోళిక తెలంగాణ వాదాన్ని విమర్శనాత్మక దృష్టితో సమర్థిస్తూ తెలంగాణకి జైకొట్టే సామాజిక తెలంగాణ వాదం సైతం దొర గడీలను కాచే వాదమే అని వారు చేసిన అవగాహనా రాహిత్య ఆరోపణ సిద్ధాంత పరమైందే గాని వ్యక్తిగతమైంది కాదు. అందులోఎవరు ఏ గడీలను కాస్తున్నారో, సూడో సామాజిక న్యాయ ముసుగులో ఆ గూడుపుఠాణీ ఎలా దాస్తున్నారో ఈ 'అసాంఘిక శక్తుల' 'సామాజిక సమైక్యాంధ్ర వాదాన్ని' బైటపెడుతూ సైద్ధాంతికంగానే నిగ్గు తేల్చుకొంటాం. అంతకంటే ముందు గుడిపల్లి లాంటి అనైతిక అర్భకులు మాపై చేసిన నిరాధార నిందారోపణల అసందర్భ అసత్యారోపణలను వివరాల్లోకి వెళ్లి పరిశీలిద్దాం.

మొట్ట మొదటగా గుడిపల్లి అన్నట్లు 'సామాజిక న్యాయం గురించి, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు' నిజంగా మాకే వుంది. 'రాయితీలు మాకు రాజ్యాధికారం మీకు' అనే పరస్పర సహకార 'రహస్య' ఒప్పందాలతో అగ్రకుల పాలక వర్గ పార్టీల దొర గడీలను కాస్తూ స్వార్థపర సంకుచిత ప్రయోజనాల కోసం బహుజన ప్రజా ప్రయోజనాలను అనునిత్యం తాకట్టు పెట్టే దొర జీతగాళ్లకు లేదు. 'సాంఘిక ఆర్థిక రాజకీయ పరమైన సకల సామాజిక రంగాల్లో సమ భావ, సమ భాగ, సమతుల్య, సామాజిక ' పరివర్తక' సాధనమైన సామాజిక న్యాయాన్ని 'వర్తక' సాధనంగా తాకట్టు పెట్టే వాళ్లకు అసలే లేదు. ఉ.సా. సుదీర్ఘ ఉద్యమ జీవితంలో సగ జీవితం లేని గుడిపల్లి లాంటి వారితో సామాజిక న్యాయం గురించి గుణపాఠాలు చెప్పించుకునే దుస్థితి మాకు పట్టలేదు.

ఇక భౌగోళిక-సామాజిక తెలంగాణ వివాదంతో ఎలాంటి సంబంధం లేని మరో ముఖ్యమైన అంశంగా కుల-వర్గ-జమిలి సిద్ధాంతాన్ని అసందర్భంగా చర్చలకు తెచ్చాడు గుడిపల్లి. 'కుల -వర్గ దృక్పథం నుంచి తెలంగాణ సమస్యను విశ్లేషించి ఉ.సా. కొత్తగా భౌగోళిక-సామాజిక తెలంగాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కానీ ఉ.సా.కి తన సిద్ధాంతం పట్ల తనకే నమ్మకం, విశ్వాసం లేదని' గుడిపల్లి మరో ఆరోపణ చేశాడు. ఈ భౌగోళిక-సామాజిక తెలంగాణ సిద్ధాంతం ఇప్పుడు కొత్తగా ఉ.సా. ప్రతిపాదించింది కాదు.

1997లోనే ఉ.సా., వీరన్న ఇరువురూ కలిసి సంయుక్తంగా రూపొందించిన ఆనాటి 'తెలంగాణ మహాసభ' సిద్ధాంతం ఇది. 'చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటు'నిస్తుందనే అంబేద్కర్ ఆలోచనా విధానం స్ఫూర్తితో 'ప్రత్యేక తెలంగాణ! తెలంగాణలో దళిత బహుజన ప్రజారాజ్యం' ఆనాడు రూపొందించిన మేనిఫెస్టో 'తెలంగాణ మహాసభ' పత్రికలో ప్రచురితమయింది. ఈ విషయాన్ని ఆ పత్రికా సంపాదకుడే ఇటీవల టీ.వీ.ఛానెల్ చర్చలో స్వయంగా ప్రస్తావించాడు. ప్రజాయుద్ధ సాయుధ పోరాట పంథాలో ఆనాడు 1998లో వీరన్న స్థాపించిన సిపిఎస్‌యుఐ పార్టీని పార్లమెంటరీ పంథాలో పనిచేసే పార్టీగా దిగజార్చి, దాని ఆవిర్భావ సభకి దొర గడీలను కాచే వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన గుడిపల్లి మాటలకి ఏ విశ్వసనీయతా లేదు.

అలాగే ఒకప్పుడు మారోజు వీరన్నతో కుల వర్గ జమిలి పోరాటమే సరైనదని, ఒంటరి వర్గ పోరాటం ఒట్టి పోరాటమని చెప్పిన ఉ.సా. అందుకు విరుద్ధంగా ఒంటరి వర్గపోరాటమైనా, కుల పోరాటమైనా విజయవంతమవుతాయని బెంగాల్, యుపి అనుభవాలను ఉదాహరణగా చెప్పినట్లు అర్ధ సత్యాలతో, అసత్యాలతో గుడిపల్లి మరో కట్టు కథ చెప్పాడు. బెంగాల్ సిపిఎం అనుభవంలో అగ్రకులాధిపత్య స్వభావం, యుపిలో బిఎస్‌పి, ఎస్‌పి అనుభవంలో పెట్టుబడిదారీ సంపన్నవర్గ స్వభావం సంతరించుకోవటంతో అవి రెండు కులవర్గ అసమానతలను తొలగించలేని అసమగ్ర అనుభవాలేనని ఉ.సా. తేల్చి చెప్పారు. ఆయన ఎప్పుడూ తాను చెప్పిన మాట తప్పలేదు. పార్లమెంటరీ పంథా పార్టీ ఆవిర్భావ సభకి దొర గడీలను కాచే దొర జీతగాళ్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు తప్ప ఉ.సా.ని ఆహ్వానించలేకపోయారంటే ఎవరు దొర గడీలను కాచేవారో, ఎవరు దొర గడీలను కూల్చేవారో వేరే చెప్పక్కర్లేదు.

- ఉ.సా
కొంకల వెంకట నారాయణ
పావని నాగరాజు
సి.హెచ్.లక్ష్మణ్

Sunday, October 2, 2011

సంప్రదింపులకగ్గిదలగ...By -అల్లం నారాయణ Namasethe Telangana 03/10/2011

సంప్రదింపులకగ్గిదలగ...
పండగపూట మనం పస్తులుంటున్నప్పుడు.. పండుగపూట మనం పీడకలలు కంటున్నప్పుడు..
ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా.., ఇంత ఏక పక్షంగా వ్యవహరిస్తున్న పెత్తందారీ కాంగ్రెస్‌కు సమాధి
కట్టడమే ఇక దారి. ఇక్కడి దాకా వచ్చాం. ఇన్ని త్యాగాలనూ, బలిదానాలనూ చవిచూశాం. ఇంకా
పోయేదేముంది పోరాడితే.. బానిస సంకెళ్లు తప్ప. తెలంగాణ వారసత్వం పిడికివ్లూత్తి ఇక ఒకే నినాదం.
‘జీనా హైతో మర్‌నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో...’ ఊరేగింపు సాగుతున్నది.
వాళ్లు ఇచ్చేదేంది తెలంగాణ పోరాడి తెచ్చుకుందాం... తెలంగాణ.


తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి
ఆఫ్రికా గిరిజనులను, గ్రహాంతర వాసులను
సంప్రదించాలి-ఆజాద్. ఇదొక ఎసెమ్మెస్.


ముందు నవ్వొస్తున్నది. ఆనక ఏడుపొస్తున్నది. అసహనంగా అనిపిస్తున్న ది. తెలంగాణ తగలబడిపోతుంటే, నిలు మనుషులు దహించుకుపోతుం ఫిడేల్ వాయిస్తున్నాడు అపర నీరో చక్రవర్తి. ‘తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి మరికొంత వ్యవధి కావాలి. జాతీయస్థాయి నాయకులతో పాటు అవసరమైతే రాష్ట్రంలో కూడా సంప్రదింపులు జరపాలి’ ఇదీ ఆజాద్ తాజా మాట. నిజానికి ఢిల్లీకి భాష లేదు. తెలంగాణపై మడత మాటలు కూడా ఒడిసిపోయినాక నాలుకలా! అవి తాటిమట్టలా.. ఏడేండ్ల కిందటి మాట. ఆజాద్ ఒక్కసారి యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్షికమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని మీ ప్రభుత్వంలో రాసుకున్న మాట మళ్లీ గుర్తుకు తెచ్చుకో.. ‘అవసరమగు సంప్రదింపుల ద్వారా విస్తృత అంగీకారాన్ని కుదిర్చి, సరియైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేపడ్తుంది’ ఎంత విషాదం.

ఏడేళ్లు ఒక గడిచిన చరిత్ర కూడా కాదు. కానీ అది రెండోసారి ఒక ప్రహసనంగా రూపుకట్టింది. ఏమి విషాదం తెలంగాణది. తోలుమందం కేంద్ర ప్రభుత్వం. అక్రమాల్లో చిక్కిన కేంద్రం. అర్హతలు కోల్పోయిన చిదంబరంలు, ప్రణబ్‌ముఖర్జీలు, ఆజాద్‌లు తెలంగాణ నాలుగున్నర కోట్ల జన జీవితాల మీద తీర్పరులైన విషాదం. చావనివ్వరు. బతుకనివ్వరు. పోరాడనివ్వరు. ఢిల్లీకి ఇక్కడి చావులు కనిపించవు. ఆర్తరావాలు వినిపించవు. పార్లమెంటు భవనం సాక్షిగా చనిపోయిన శవం చెప్పిన రహస్యమూ వినపడదు. అవునది ఒక ధృతరాష్ట్ర సభ. సంజయా! ఏమి జరుగుతున్నదక్కడ. గుడ్డివా డా.. ఇక్కడ నెత్తురు డొల్లాడుతున్నది. రోజుకో శవం ప్రతినబూనుతున్నది. ఆత్మహత్యల రుతువునే చూశారు మీరు. కానీ తెలంగాణలో ఇప్పుడొక సకల జనుల సమ్మె ఉప్పెనై ఎగుస్తున్నది. చీకటి కమ్ముకుంటున్నది. జర పదిలం. మీ చీకటి కొట్టాలకు నిప్పులంటుకుంటున్నయ్.

ఉప్పెనలు పొంగుతున్నప్పు డు మాట్లాడే భాష వేరు. అది యుద్ధరావంలా ఉంటుంది. ఏమి సంప్రదించమంటావు ఆజాద్. ఇవ్వాల్టికివ్వాళ ఒక ఉపాధ్యాయుడు జై తెలంగాణ అని ప్రాణమిడిసిండు. ఇంటర్ విద్యార్థి ఒకడు జై తెలంగాణ అని రైలు కింద దుమికిండు. సంప్రదించగలవా ఆజాద్. తెలంగాణలో తిరిగే వాళ్ల కోసం రాళ్లు సిద్ధం చేసినవాడు నారాయణ. నిజమే తెలంగాణకు ఇగ ఉన్నదొకటే దారి కామ్రేడ్ నారాయణ దారి.. ఈసారి సంప్రదింపులు అంటే ప్రజలు రాళ్లతో కొడతారు’ నిజమే. మరి ఏమి చేయమంటారు. చెప్పేవాడికి లేకున్నా సిగ్గు వినేవాడికన్నా ఉండాలి. ఓపికకూ ఒక హద్దు, సహనానికీ ఒక హద్దు ఉంటా యి. ఇప్పటికే తెలంగాణ సకల జనుల సహనం హద్దులు చెరిపేసుకున్నది. ఒక్క బస్సూ నడవదు. ఒక్క ఆఫీసూ తెరుచుకోదు. ఒక్క బొగ్గుబావీ నడవ దు.

ఒక్క గుడి తలుపూ తెరుచుకోదు. దేవుడా.. దేవుడా.. ఎంత కఠినాత్ముల మధ్య, ఎంత పాపాత్ముల మధ్య మమ్మల్ని ఆగం జేస్తివి గదా! అని పూజారీ సమ్మెకట్టి అడుగుతున్నడు. ఇగ ఏం జెయ్యాలె తెలంగాణ. ఏడేండ్ల కిందటే మాటరాని బొమ్మ సోనియమ్మ ‘తెలంగాణ మనోభావాల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. మీ ఆకాంక్షలను సఫలం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం’ ఏమయిందమ్మా.. నీకు మాట కూడా రాదు. చిదంబరం జర నీ మాటలు ఆపుతావా! పుట్టెడంత విసుగొస్తున్నది. చెప్పిందే చెప్పకు. ‘తీవూవత అర్థమయింది’ బెంగాలీ బాబు ప్రణబ్‌ముఖర్జీ. అసలు కేంద్రంలో ఒక ప్రభు త్వం నడుస్తున్నదా! కిరణ్‌కుమార్‌డ్డి భాష మారింది. ‘కఠినంగా అణచివే స్తాం’.. నోరు పెరుగుతున్నది. ఏమి అణిచేస్తావ్ ముఖ్యమంత్రీ. నీ బానిసమంత్రి తెచ్చిన మందలో జై తెలంగాణ నినాదం.

మీ క్యాంప్ ఆఫీస్‌ను ఆవరించింది జై తెలంగాణ. వినపడలేదా.. ఒకే నినాదం. పోలీసు భాష మాట్లాడుతున్నడు చిత్తూరు నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి. ‘ప్రజలే ప్రతిఘటిస్తారు’. ఏ ప్రజలు ప్రతిఘటిస్తారు. మీ క్యాంపు ఆఫీసు ముందర జై తెలంగాణ, జై కేసీఆర్ అంటున్న ప్రజలేనా? వచ్చీరాని తెలుగులో మాట్లాడే సోకాల్డ్ హైదరాబాదీ ప్రతిఘటించడం మాత్రమే స్పష్టంగా పలుకుతున్నడు. ఇప్పుడిక కిరణ్‌కుమార్‌డ్డి బానిస ఏకాకి. మంద మందిల కలిసి జై తెలంగాణ నినాదమైపోయింది. ఇంకేం పరిశీలిస్తారు ఏలినవారు. ఇదే సమయంలో రాజ్‌భవన్‌లో ఒక మంత్రి రాజీనామా చేస్తున్నాడు. ఇదే సమయంలో అసెంబ్లీలో రాజీనామాలు ఆమోదించమని డిమాండ్ చేస్తూ నలుగురు శాసనసభ్యులు తాళం వేసుకుని గదిలో బంధించుకున్నారు. ఇదే సమయంలో గాంధీ భారీ విగ్రహం ముందున్న గన్‌పార్క్‌లో కాగడాలు వెలుగుతున్నాయి.

అవి జరుగుతున్న, జరగబోయే సకల జనుల తెలంగాణ ఉద్యమానికి దారి చూపుతున్న దివిటీలై వెలుగుతున్నాయి. ఢిల్లీలోనూ కాగడాలు దారిచూపుతున్నాయి. బతుకమ్మలో జై తెలంగాణ నినాదం మార్మోగుతున్నది. మొన్న నఢి వీధిలో ఒక మంత్రిని అరెస్టు చేశారు. ఒక ఎమ్మెల్యేను చొక్కా చింపి, గాయపరిచారు. మరో ఎమ్మె ల్యే శోష తప్పి పడిపోయాడు. ఒక కాంగ్రె స్ ఎంపీని అరెస్టు చేశారు. ఉద్యోగ సంఘ నాయకునిపై నడిమందిలో మఫ్టీ పోలీసులు హత్యావూపయత్నం చేశారు. ఇంకేమి చేస్తారు కిరణ్‌కుమార్‌డ్డి గారూ.. అయినా అయినా.. ఏదీ ఆగలేదు కదా! మీ తుపాకులు సింగరేణి బొగ్గును తవ్వలేదు కదా! ఒక్క బొగ్గు పెళ్లా బయటపడలేదు కదా! ఒక్క ఆఫీ సూ తెరుచుకోలేదు గదా! సాక్షాత్తూ ముఖ్యమంత్రి సచివాలయానికి పోలీసు కాపలా మధ్య ఎన్నడూ వెళ్లలేదు కదా! ఇక సంప్రదించండి తెలంగాణను. ఏమి బాధ తెలంగాణది.

సరే! సంప్రదింపులంటే అదే కావొచ్చు అనుకొని విస్తృత అంగీకారం కోసం ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి యూపీఏ పదకొండు పార్టీలు, బయటి నుంచి మద్దతిచ్చే ఏడు పార్టీలు, ఎన్డీఏ ఎనిమిది పార్టీలు, ఒక్క సీపీఎం, డీఎంకె తప్ప తెలంగాణకు సమ్మతించారు కదా! అదేమయింది. కొలువా కుమ్మరియ్యా! అంగీకారం ఉన్నందుకే గదా! డిసెంబర్ 9న సాక్షాత్ చిదంబరం ‘తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది’ అన్నది. ఏడున రాష్ట్రంలో రెండుకళ్ల చంద్రబాబు, సామాజిక మోసకారి చిరంజీవి.. ఆ జీవీ.. ఈ జీవీ అందరు ఆమోదిస్తేనే కదా డిసెంబర్ 9. పోనీ ఆ తర్వాత కృష్ణ కమిటీ అంటిరి ఆ నివేదికలో అణచివేత కోసం రహస్య ఛాప్టర్‌ను ఇప్పుడు అమలు చేస్తూ రెడ్డి రాకుండానే మొదలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలు ద్రోహి. తెలంగాణలో ఇప్పుడొక పోరాటం నడుస్తున్నది. ఆ సెగ ఆ కాక ఢిల్లీకి తాకింది. కానీ.. మళ్లీ అవే మాటలు.

ఫుజూల్ బాత్. రానివీ పోనివీ.. తీస్‌మార్‌ఖాన్‌ల లెక్కన, ఢిల్లీకి వెళ్లిన మన కాంగ్రెస్ నేతలను ఇప్పుడు అడగవలసి ఉన్నది. చూడుచూడు మా సుతారం అని ఆజాద్‌ను బతిమాలి, ప్రణబ్‌ను గీమాలి, సోనియమ్మ దర్శనం కూడా దొరకక ఆగమైపోయి. మైకుల ముందర వీరాలాపానలు ప్రవచించే తెలంగాణ కాంగ్రెస్ నాయకులారా! ఇప్పుడిక మాట్లాడండి. ఏం మాట్లాడ్తారో?మాట్లాడండి. ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేస్తున్న మీ పార్టీ నాయకత్వం మీద తిరగబడి, రాజీనామాలు అర్పించుకుని మందిల కలుస్తరా! లేదా! ఊరూరా.. జరుగుతున్న చెప్పులదాడి, కత్తుల కోలాటానికి కరుసై పోతరా! తేల్చుకోవలసింది మీరే. ఇకచాలు. కాంగ్రెస్ పార్టీ ఒక మోసకారి. తెలంగాణకు మొదటి ద్రోహం చేసినవాడు నెహ్రూ. పండిట్ పిల్లలని ప్రేమించాడు. కానీ తెలంగాణను బలవంతంగా విలీనం చేసి ఇప్పుడు తెలంగాణ పిల్లల ఉసురు తీసుకోవడానికి కారణమయ్యాడు. ఆయన కూతురు ఇందిరమ్మ మున్నూటా డ్బై మంది ప్రాణాలు బలిగొన్న ఏలిక. ఒక్కనాడూ తెలంగాణ అరిగోసను పట్టించుకోలేదు కాంగ్రెస్.

మన్‌మోహన్‌సింగ్‌లు, మాంటెక్‌సింగ్ అహ్లూవాలియాలు, చిదంబరంలు వేదాంతాలు వల్లిస్తున్నా రు. కానీ ఈ వేదాంతాల చిలుకపలుకులు ఆంతర్జాతీ య పెట్టుబడులవి. సమ్మెలను ఏ ప్రభుత్వమూ సమర్థించదు. రైల్‌రోకోలను ఏ ప్రభుత్వమూ ఇష్టపడదు. నిజమే. కానీ చిదంబరం నువ్వాడిన మాటను తప్పి, ఏడేండ్ల కింద, ఏడేండ్ల తర్వాత ఒకేమాట వినపడినప్పుడు, ఒకే తీరు ప్రకటన వెలువడినప్పుడు. ఏమి చెయ్యాలి తెలంగాణ. నీ సంప్రదింపులకు అగ్గిదల్గ. ఇక్కడ మా ప్రాణాలుపోతున్నయి. మీ ముచ్చట్లు పాడుగాను ఇక్కడ మా బతుకుల్ల చీకట్లు కమ్ముకుంటున్నయి. ఏదో ఒకటి తేల్చండి. జ్వరమాని బద్దలవుతున్నది. ఉష్ణం పెరుగుతున్నది. ఇక చాలు. కట్టిపెట్టండి. మీ కోర్ కమిటీల నాటకాలు. సంప్రదింపులు ఇప్పుడొక అసహ్యకరమైన మాట. కమిటీలు చూసినం. సంప్రదింపులు చూసినం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందనుకునే పార్లమెంటులో ప్రకటనలూ చూసినం. ఇక వశం కాదు. కనుకనే సకల జనులం సమ్మెకట్టినం. ఇక చాలు.

తెలంగాణ అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులారా! ముఖ్యంగా కాంగ్రె స్ ప్రతినిధులారా! ఈ నాటకాలు వద్దు. ఇచ్చుడు.., తెచ్చుడు.. అయిపోయిం ది. ఎనిమిదవ ఛాప్టర్ ఓపెన్ అయిన ఈ క్షణాన చచ్చుడు ఛాప్టర్‌లు మిగి లినయ్. మీరిక బరిగీసి నిలిచిన తెలంగాణ సమాజం వైపా? మీమీ అధినాయకుల వేపా? తేల్చుకోండి? ఇది నాలుగున్నర కోట్ల జన సమరం. ఆత్మలు మేల్కొన్నాయి. ఇక ఆగకూడదు. చావో రేవో.. ఉన్నదొక్కటే దారి. తెలంగాణ పోరాటం కొనసాగుతుంది. పండగపూట మనం పస్తులుంటున్నప్పుడు.. పండుగపూట మనం పీడకలలు కంటున్నప్పుడు.. ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా.., ఇంత ఏక పక్షంగా వ్యవహరిస్తున్న పెత్తందారీ కాంగ్రెస్‌కు సమాధి కట్టడమే ఇక దారి. ఇక్కడి దాకా వచ్చాం. ఇన్ని త్యాగాలనూ, బలిదానాలనూ చవిచూశాం. ఇంకా పోయేదేముంది పోరాడితే.. బానిస సంకెళ్లు తప్ప. తెలంగాణ వారసత్వం పిడికివ్లూత్తి ఇక ఒకే నినాదం. ‘జీనా హైతో మర్‌నా సీఖో కద మ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో..’ ఊరేగింపు సాగుతున్నది. వాళ్లు ఇచ్చేదేంది తెలంగాణ పోరాడి తెచ్చుకుందాం.. తెలంగాణ.
-అల్లం నారాయణ

హమ్‌నే దుష్మన్ కొ పహ్‌చాన్ లియే హై By -వరవరరావు Namasethe Telangana 03/10/2011


10/2/2011 11:06:26 PM
హమ్‌నే దుష్మన్ కొ పహ్‌చాన్ లియే హై
సకల జనుల సమ్మె శత్రువును పోల్చుకునే దిశగా సాగుతున్నది. శత్రువు కూడ సకల జనుల సమ్మె వెనుక సమీకరింపబడుతున్న ప్రజల్ని పోల్చుకుంటున్నాడు. నవంబర్ 29, 2009న క్యాంపస్‌లలో, ముఖ్యంగా ఉస్మానియా క్యాంపస్‌లో విద్యార్థులు పోల్చుకున్న శత్రు వు పొంచి ఉండి, ఉద్యమం పోరాటరూపం ఎంచుకున్నప్పుడల్లా విరుచుకపడుతున్నాడు. శత్రువు యూనిఫామ్ రూపంలో కనిపిస్తాడు. ఇనుపబూట్లు, బాష్పవాయుగోళాలు, ఇనుపకంచెలు, లాఠీలు, మూడువందల మంది న్యాయవాదుల ఊరేగింపుకు ఏడువందల ఖాకీ మూకల పహరాగా కనిపిస్తాడు. పదమూడేళ్ల మాణికేశ్వరనగర్ బాలుణ్ని పదిమంది చిప్పటోపీలు లాఠీలతో బాదడంగా కనిపిస్తాడు.

రామన్నగూడెంలో నలుగురు అమ్మాయిల్ని నలుదిశల్నుంచి చుట్టుముట్టి నినాదాల హోరు ముఖ్యమంత్రి చెవి సోకకుండా తోసుకపోవడంగా కనిపిస్తాడు. చీమలవలె అసెంబ్లీగేట్లు ఎగబాకుతున్న విద్యార్థులను వేయిపడగల పాములవలె కబళించే విషసర్పంవలె కనిపిస్తాడు. బొగ్గుగనుల్లో చెదురుమదురుగా ఉన్న సింగరేణి కార్మికులను కూడగట్టడానికి వెళ్లిన పిట్టల రవీందర్‌ను ‘పిట్టపిల్ల’ అనే భ్రమతో దాడిచేసే మాఫియావలె కనిపిస్తాడు. నిజాం కాలేజీ హాస్టల్‌లో దూరి బాత్‌రూంలో స్నానాలు చేస్తున్న, గదుల్లో చదువుకుంటున్న విద్యార్థుల్ని చితకబాదడంగా కనిపిస్తాడు. యాకూబ్‌డ్డిని ఎన్‌కౌంటర్ చేయడమొక్కటే తక్కువయిన డీఎస్పీ వెంకటనర్సయ్య వలె కనిపిస్తాడు. స్వామిగౌడ్ మర్మావయవాలను నలిపేసి హతం చేయడానికి కుట్రచేసే స్టీఫెన్ రవీంద్ర వలె కనిపిస్తాడు. అతడు తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావ్‌కు చిద్విలాసంగా బేడీలు వేయగలడు.

అత డు అకున్ సబర్వాల్ వలె నిజాం కాలేజీ విద్యార్థులను కొట్టిన బలంతో సచివాలయం లో దూరి డ్రైవర్లను అరెస్టు చేయగలడు. టీఎన్జీవోలను అరెస్టుచేయగలడు.కాని ‘ఆ ముగ్గురు డ్రైవర్లను విడుదల చేసేదాకా మేమూ ఇక్కడినుంచి కదలమ’ని ఒక్కటైన సచివాలయ ఉద్యోగుల చిగురిస్తున్న సంఘీభావాన్ని మాత్రం అధికారబలంతో కన్నుగానలేడు. వీళ్లంతా ఎవరు? ఎవరిదన్ను చూసుకొని ఇంత విస్తృతమైన ప్రజాఉద్యమం మీద ఉక్కుపాదం మోపగలుగుతున్నారు? ఇది ఖాకీల బలమేనా?
ఆ ప్రశ్నకు జవాబు ముఖ్యమంత్రి పదవికోసం తెలంగాణను అగ్నిగుండంగా మార్చడానికైనా సిద్ధమైన కిరణ్‌కుమార్‌డ్డిని అడగాలి. ల్యాంకోహిల్స్‌ను, ‘లిబ్బి’ మూటలను కాపాడడానికి తెలంగాణ బతుకుపోరు బతుకమ్మ సంస్కృతిని వెక్కిరిస్తున్న లగడపాటిని అడగాలి.

వీళ్ల మౌనదేవత సోనియాగాంధీని అడగాలి. 2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో చిక్కుకొని కూడ గ్రీన్‌హంట్ ఆపరేషన్‌లో భాగంగా తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణచివేస్తున్నందుకే పదవుల్లో కొనసాగుతున్న మన్‌మోహన్, చిదంబరంలను అడగాలి.

కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు 2009 నవంబర్ నుంచి కూడ నిరాహారదీక్షలను, పాదయావూతలను, ధూంధాంలను, లక్షలాది ప్రజల బహిరంగసభలను, వైవిధ్యంతో కూడిన సృజనాత్మక శాంతియుత పోరాటరూపాలను హింసాత్మకంగా మార్చడానికి చేయవలసినన్ని హింసాత్మక ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యవస్థీకృత విధ్వంసాన్ని,హింసను అమలుచేస్తున్నాయి. సాంస్కృతిక దాడులు చేస్తున్నాయి. ఆర్థిక దిగ్బంధాలను, నిర్బంధాలను కల్పిస్తున్నాయి. వీటన్నింటి కీ తెలంగాణ అధికార కాంగ్రెస్ పచ్చి పదవీలాలసతను, ప్రతిపక్ష టిడిపి నాయకత్వ కపటరాజనీతిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి.
2009 నవంబర్‌లో విద్యార్థులు వెలిగించిన కాగడాను కొడిగట్టకుండా చమురుపోసి కాపాడుతూ ఉంటే ఇవ్వాళ ఉద్యోగులు అందుకున్నారు.

ముఖ్యంగా సెప్టెంబర్ 13 నుంచి తెలంగాణ ఉద్యోగుల సమ్మె, సింగరేణి కార్మికుల సమ్మె, క్రమంగా ఆర్‌టిసి కార్మికుల సమ్మెగా విస్తరించి సంఘటిత, అసంఘటిత కార్మికరంగాలన్నీ ఇవ్వాళ సమ్మెకు దిగాయి. రెండువారాలు గడిచి ప్రభుత్వం ఎన్ని విభజించి పాలించే ఎత్తుగడలు వేసినా, ఎంత నిర్బంధం అమలుచేసినా, ఎన్ని తాయిలాలు చూపినా, ఎంత బెదిరించినా, ‘ఎస్మా’లకు కూడా వెరవకుం డా ఉద్యోగులు, కార్మికులు రెట్టింపు పోరాటశక్తితో ముందుకు వస్తున్నారు.

న్యాయానికి, ప్రజాస్వామ్యానికి ఉన్న బలమెటువంటిదంటే.. సెప్టెంబర్ 28న సచివాలయంలోకి మంత్రులను తీసుకపోతున్న ప్రభుత్వ వాహనాల డ్రైవర్లను సమ్మెలో ఉన్న సచివాలయ ఉద్యోగులు నివారించి ‘మంవూతులకైతే సిగ్గులేదేమో కానీ మీరు డ్రైవర్లుగా టీఎన్జీవోలు గదా, మీరు సమ్మెలోకి రండి’ అని ఆహ్వానించారు. వాళ్లు స్వచ్ఛందంగా వచ్చారు. డ్రైవర్లు కదా అనే చిన్న చూపుతో వాళ్లను అకున్ సబర్వాల్ అరెస్టు చేశాడు. వాళ్లను విడుదల చేయించుకోవడానికి సమ్మెలో ఉన్న సచివాలయ తెలంగాణ ఉద్యోగులు అడ్డగించి అరెస్టయ్యారు. నిన్నటిదాకా సచివాలయం ఉద్యోగాలకు వెళ్తున్న తెలంగాణేతర ఉద్యోగులు, బహుశా వనస్థలిపురంనుంచి పోలీసుభవూదతతో వస్తున్న ఉద్యోగులు తమ కళ్లముందరి ఈ అన్యాయాన్ని చూసి రెండుగంటలలో వాళ్లను విడుదల చేయాలనే డిమాండుతో వాళ్లూ సమ్మెకు దిగారు. న్యాయమైన డిమాండు, ప్రజాస్వామికమైన డిమాండు పోరాడేవాళ్ల సంఖ్యాబలాన్ని, నైతికబలాన్ని పెంచుతుంది. అణచివేసే శత్రువును ఏకాకిని చేస్తుంది.

వెంకటనర్సయ్యలు, అకున్‌సబర్వాల్, స్టీఫెన్వ్రీంవూద, ప్రవీణ్‌కుమార్, రామాంజనేయులు, అరవిందరావు, దినేశ్‌డ్డిలు (వీళ్లందరూ నిర్విచక్షగా మనం పిలుచుకునే సీమాంవూధవాళ్లేం కాదు. వీళ్లలో తెలంగాణ వాళ్లూ ఉన్నారు. దినేశ్‌డ్డి డిజిపి అయి రాజమండ్రి కేంద్రం గా ఒరిస్సా ఛత్తీస్‌గఢ్ అడవులను మానవరహిత విమానాలతో గాలించి మావోయిస్టులను ఏరిపారేస్తామంటే ఏ రాజకీయపార్టీ, మానవుడూ మాట్లాడలేదు. ఈ దినేశ్‌డ్డే 1984లో రాజమంవూడిలో మహిళా కార్యకర్తలను కూడా అరెస్టుచేసి రైతుకూలీసంఘం సభలు భగ్నం చేశాడు.) నలభైనాలుగేళ్లుగా తెలంగాణ మీద, భూమికోసం పోరాడిన దళితులు, వ్యవసాయకూలీలు,సింగరేణి కార్మికులు మీద, గోదావరిలోయ ఆదివాసుల మీద,యూనివర్సిటీల్లో విప్లవ, దళిత, బడుగువర్గాల విద్యార్థుల మీద, పాతబస్తీలో ముస్లిం యువకుల మీద దాడు లు చేసి, చిత్రహింసలు చేసి, ఎన్‌కౌంటర్లు చేస్తుంటే మనమంతా వాళ్లు నక్సలైట్లు కావచ్చుననుకున్నాం. మిలిటెంట్లు కావచ్చుననుకున్నాం. టెర్రరిస్టులు కావచ్చుననుకున్నాం.

మనం చట్టాన్ని గౌరవించే, చట్టప్రకారం నడుచుకునే బుద్ధిమంతులమైన పౌరులంగదా! మన తెరు రారనుకున్నాం.వచ్చినా వాళ్లగురించి మాట్లాడేవాళ్ల గురించి వస్తారు! గానీ మనగురించి రారనుకున్నాం. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చాల చట్టబద్ధంగా అడిగాం. శాంతియుతంగా పోరాడుతున్నాం. సహాయనిరాకర ణే అన్నాం తప్ప శాసనోల్లంఘన కూడ అనలేదు. విముక్తికోసం సాయుధపోరాటం చెప్పే విప్లవపార్టీలు కూడ తెలంగాణకోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ప్రజాస్వామిక పోరాటాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాయి. దూరంగా చూసేవాళ్లు అపోహపడుతున్నట్లుగా మావోయిస్టుపార్టీ పిడుక్కూ బియ్యానికీ ఒకేమంత్రం చెప్పడంలేదు. పిడుక్కూ బియ్యానికీ ప్రభు త్వం ఒకే జవాబు చెప్తున్నది. అణచివేత. మంత్రిని అరెస్టుచేసి, ఎమ్మెల్యేలకు బేడీలు వేసి, ఎన్జీవోసంఘం నాయకుణ్ని ‘బిలో ది బెల్ట్’ చిత్రహింసలు పెట్టి లగడపాటిని మాత్రం ఆయనకు పెట్రోల్‌ఖర్చు కూడ కాకుండా క్రేన్ ద్వారా ఆయన కార్లోనే ఆయన ఇంట్లో దిగబెట్టి ప్రభుత్వం తాను ఏ పక్షమో చెప్పుకున్నది.

కనుక మనం శత్రువును ప్రభుత్వంగా పోల్చుకుంటున్నాం.అయితే ఇవ్వాలిటి ప్రభుత్వం1969-72ల నాటి ప్రభుత్వం కాదు. ఆనాడు బ్రహ్మానందడ్డి చేసిన కుట్రలూ కుహకాలన్నీ ఇవ్వాళ కిరణ్‌కుమార్‌డ్డి చేస్తున్నాడు. కానీ ఆనాడు అవి కేవలం భూస్వామ్య, పెట్టుబడిదారీ శక్తుల కోసం. ఇవ్వాళ వాటి విశ్వరూపమైన కార్పొరేట్ కంపెనీల కోసం. ఖాకీల వెనుక ప్రభుత్వాన్ని పోల్చుకున్నట్లే, ఇవ్వాళ మన శత్రువును కార్పొరేట్ సంస్థల్లో పోల్చుకోవాల్సి ఉన్నది. మనం పోల్చుకోలేకపోతున్నామేమోనన్న దే లగడపాటి ఆక్రోశం. మనమింకా పోల్చుకోలేదేమోననే నిమ్మకు నీత్తినట్లున్నారు కావూరి, రాయపాటిలు.ల్యాంకోహిల్స్ దగ్గరో, ఎంఆర్ ప్రాపర్టీస్ దగ్గరో అరుణోదయ విమల చేసే ప్రతిఘటన చాలదు. వనస్థలిపురంలో కోస్తా బస్ యజమానులు చవిచూసిన ఆగ్రహం చాలదు. జెసి దివాకర్‌డ్డి, టిజి వెంక మాట్లాడేది అందమైన రాయలసీమ తెలుగుభాష కాదు, కార్పోరేటు బస్సుల భాష.

ప్రైవేట్ పరిక్షిశమల భాష.సీమాంవూధభాష లేదా ఆంధ్రతెలంగాణ భాషల సంఘర్షణ కాదిది. ఇది పెట్టుబడి, శ్రమల సంఘర్షణ భాష. మనమంతా ఒక్కసారి సింగరేణి బొగ్గు బావుల మీదికి పోతే సంఘర్షణ అర్థమవుతుంది. తమ రక్తాన్ని స్వేదంగా మార్చి నల్ల వవూజాలను విద్యుత్తుగా మార్చి అభివృ ద్ధి వెలుగుకింద నీడవలె (విద్యు త్తు ఉత్పత్తి చేసేవాళ్లకు విద్యుత్తుకోత కడుపుకోత) పోరాడుతున్న కార్మికులను చూస్తే అర్థమవుతుంది. బొగ్గుబావుల గుండెల నుంచి ఓపెన్‌కాస్ట్‌ల దోపిడీని ఎదుర్కొంటున్న ఆ శ్మశానంలోని ప్రళయరువూదుల భాష అర్థమవుతుంది. పోరాడి సాధించుకున్న భూములు సెజ్‌లలో, రియల్ ఎస్టేట్‌లలో పోగొట్టుకొని దూపకోసం గోదావరిని పోలవరం దగ్గర అడ్డుకుంటున్న ఆదివాసులనడిగితే తెలుస్తుంది.

కొమురంభీం నుంచి, ఇంద్ర నుంచి ఎందుకొరకు పోరాడుతున్నారు వాళ్లు. తమ ఊళ్లో తమ రాజ్యం కోసం. ఇవ్వాళ భద్రాచలంలో, ఏటూరునాగారంలో, ఆదిలాబాదులో అడవంతా గ్రీన్‌హం ట్ ఆపరేషన్ నిర్వాసిత ఆదివాసులు. వాళ్ల గోడు పట్టించుకుంటే మనభాష ఎంత సుసంపన్నమవుతుంది. వాళ్ల పోరాటాన్ని స్వీకరిస్తే మన పోరాటానికి ఎన్ని ఏనుగుల బలం వస్తుం ది. నల్లమలలో నెత్తురు పారించినపుడు నక్సలైట్ల బెడద పోయిందనుకున్నవాళ్లు, మావోయిస్టుల ఎత్తుగడల గురించి ఎద్దేవా చేసినవాళ్లు, చెంచుజాతిని నిర్మూలించే డీబీర్ కంపెనీల వజ్రాల వేట గురించి, గాలి, జగన్‌ల బళ్లారి నుంచి బయ్యారం దాకా గనుల దోపిడీ గురించి ఇవ్వాళ మాట్లాడి ఏం ప్రయోజనం? సర్కారీ ‘సారా’ మీద పాట రాస్తూ గద్దర్ ‘మమ్మేలే రాజ్యానికి మారుపేరువే నీవు’ అన్నాడు. ఇవ్వాళ మనను ై‘వెన్ అండ్ మైన్ ’ పరిపాలిస్తున్నాయి.

ఇవ్వాలిటి రాజ్యం ప్రాణం ఏడు సమువూదాల ఆవల ఉన్న మర్రిచెట్టు తొర్ర లో ఉన్నది. ఇక్కడ చిలుకపలుకుల, ఉక్కుగోళ్ల ఎన్నికల పార్టీలను నిలదీద్దాం. అక్కడి నుంచి ఆడించేవాని చేతిలోని కీలుబొమ్మలా? మన ఓటుకు పుట్టిన బిడ్డలా? తేల్చుకొమ్మందాం. మళ్లా ఒకసారి చెప్దాం. రాజీనామాల డ్రామాలు కాదు, సకలజనుల సమ్మె ప్రభుత్వాలకు, అధికారాలకు, పెట్టుబడికి ముకుతాడు వేసే సమ్మె కాబోతున్నది. సర్వజనుల సమ్మె కాబోతున్నది. రాజీనామాలు చేసి, అధికార ఆవాసాలు వదిలేసి, గన్‌మన్‌లను అప్పగించి (తెలంగాణ పోలీసు ఉద్యోగులు కూడ వెంటనే బెంగాల్‌లో పోలీసుల, ఉద్యోగుల వలె సమ్మెలో దిగేరోజు రాబోతున్నది) జనంలోకి రమ్మందాం. ఇప్పుడు జనం ప్రభంజనం అయ్యారు. ఈ ప్రభ కొత్తకొండ వీరన్న ప్రభ. దీనిని నమ్ముకున్న వాళ్లందరినీ కాపాడుతుంది. ఇది నియంతృత్వాన్ని ప్రశ్నించే ప్రజాస్వామ్య ప్రభంజనం.

ఇపుడేమిటి రాయల వాచకాల వలె రాయల తెలంగాణ ముచ్చట్లు? మనమిప్పుడు హైదరాబాదు గుండెకాయ అయిన తెలంగాణ గురించి మాట్లాడుదాం. కేంద్రం నేల మీదికి దిగి రావాలి. ఢిల్లీ పల్లెదారి పట్టాలి. రాష్ర్టం సాధించుకునే దాకా ఇంక సకలజనుల సమ్మెయే. ఇందులో ‘కల’ ఉన్నదనుకుంటే ఇది నిజం కావాలనుకుంటే ఇక సబ్బండరాశి సమ్మె
-వరవరరావు

దళితుల దరి చేరని బతుకమ్మ By Bumpally Kammari Renuka Surya News Paper 02/10/2011


దళితుల దరి చేరని బతుకమ్మ
hari
బతుకమ్మ పండుగను గత సంవత్సరం కోటి బతుకమ్మల జాతర పేరిట తెలంగాణ ఉద్యమంలో భాగం చేశారు. ఈ పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీకగా ఉన్నదనీ, గత కొద్ది సంవత్సరాలుగా తొక్కి పెట్టడం వల్ల తమ రాకతోనే ఈ సంస్కృతి బయటకు వచ్చినట్టు టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు కుటుంబ సభ్యులు, అనుచరులు ప్రజల్ని భ్రమల్లో పడేశారు. నిజానికి ఈ మలి దశ తెలంగాణ ఉద్యమం 1969 కంటె భిన్నంగా మెజారిటీ దళి త, బహుజన, ఆదివాసీ గిరిజన, మత మైనారిటీలు, పేద వర్గాలకు జనాభా దామాషా ప్రకా రం స్ర్తీ పురుషులకు అన్ని రంగాల్లో వాటా ప్రాతినిధ్యాన్ని సమానంగా పంపిణీ జరగాలనే డిమాండ్‌- అమరుడు మరోజు వీరన్న సారథ్యంతో తెలంగాణ మహాసభ ద్వారా మొదలైంది.


ఆనాడే బతుకమ్మ పండుగనే కాదు, సమస్త దళిత, బహుజన పీడిత కులాల, తెగల సంస్కృతులను వెలికి తీసి ఒక ప్రజా ప్రవాహంగా తెలంగాణ అంత టా వర్ధిల్లింపచేసింది. నాటి నుంచి నేటి వరకూ అనేకమంది అనుకరిస్తున్నారనేది కాదనలేనిది. ఎప్పుడైతే ప్రజా ఉద్యమ శక్తులను క్రమ క్రమం గా అగ్రకులాల దళారీ పాలకులు చుట్టివేసి, అణచివేయడం జరిగిందో ఆనాటినుంచి అగ్రకుల వర్గాల చేతుల్లోకి తెలంగాణ ఉద్యమాన్ని భౌగోళికం పేరుతో తీసుకోగలిగారు. తదనంతరం పరిణామాలు రోజుకో విధంగా నిత్యం బయటపడుతున్న విషయం విదితమే. టీఆర్‌ఎస్‌ పార్టీ అగ్రకుల ఉన్నత వర్గాల పార్టీ. ఈ ఉద్యమాన్ని తను, తన కుటుంబమే నిర్మిస్తున్నదన్నట్టు నేడు ప్రజలందరికీ నమ్మబలక చూస్తున్నారు. ప్రజా ఉద్యమకారులను తెరమీదకు రానివ్వక పోవడమే ఇందుకు నిదర్శనం.

కోటి బతుకమ్మల జాతర, లేదా ఊరూరా బతుకమ్మ పేరిట గత సంవత్సరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్విహంచారు. కేవలం ఒక బతుకమ్మ సంబరాలతోనే తెలంగాణ సంస్కృతిని రక్షించగలరా అనే ది ప్రశ్న. తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగతో బాటు జాంబవంతుడి (మాదిగ) సంస్కృతి, ఎరుకల, యానాది, కమ్మర, కుమ్మర, గౌడ, కురుమ, గొల్ల, చాకలి, మంగలి, ముస్లిం మతస్థుల ఆచారాలను, దళిత బహుజనుల సంస్కృతులను తెలంగాణ జాగృతిలో చేర్చవలసిన అవసరం లేదా? బతుకమ్మ పండుగలో ఉన్నత వర్గాల మహిళలు దళితులను దగ్గరకు రానివ్వని పరిస్థితి తెలంగాణ అంతటా ఉన్నది.

బతుకమ్మను కేవలం ఉన్నత (అగ్ర) వర్గాలు, బహుజనులైన బీసీ లు మాత్రమే జరుపుకుంటారు. ఒక వేళ జరుపుకున్నా, అగ్రకులాలతో సమానంగా ఆడకూడదని సంప్రదాయం ముసుగులో దళితులను వెలివేసిన పరిస్థితి గ్రామాలలో ఉన్నది. నిజాని కి గుమ్మడి ఆకు, తంగేడు పూలు, గునక పూలు తెచ్చి, గ్రామ చావిడి వద్దకు బతుకమ్మను మోయడం, తదుపరి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేసేవరకూ బడుగు వర్గాల పురుషు లు మాత్రమే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అగ్రకుల మహిళలు మాత్రం ఆడి, పాడి ఆనందం పొందడం ఎంతవరకూ న్యాయం? కేవలం సంపన్న అగ్రకులాలు, బీసీ మహిళలు జరుపుకు నే ఈ పండుగను తెలంగాణ సంస్కృతిగా దేశ విదేశాలకు పరిచయం చేయడం దురదృష్టకరం.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడినంత మాత్రాన దళితులకు సమాన హోదా రాదన్నది జగమెరిగిన సత్యం. ఈ పండుగను తెలంగాణ ప్రాంతం లో దళితులు జరుపుకోరన్న విషయాన్ని మరుగున పడవేసి విదేశాలలోని తెలంగాణ వాదులైన అగ్రకులాల వారిని బతుకమ్మ పండుగ జరుపుకోవాలని పిలుపు ఇవ్వడం కుల తత్త్వమే తప్ప తెలంగాణ వాదం కాదు. ఆశ్వయుజ మాసం లో దసరా, బతుకమ్మ పండుగలను అగ్రవర్ణ కులాలతో బాటు అభివృద్ధి చెందిన బీసీ కులాలవారు జరుపుకుంటున్నారు. ఆర్యేతర శూద్ర వర్ణ, జాతి తెగల్ని ఆర్యజాతికి చెందిన వారే నిర్మూలించి బ్రాహ్మణీయ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను సృష్టించారు. కింది కులాల ప్రజలను తమ బానిసలుగా మార్చుకున్నారు. కనుకనే వారు మాత్రమే దసరా పం డుగ సందర్భంగా బతుకమ్మ పండుగను విజయోత్సవాలుగా జరుపుకుంటున్నారు. దళిత మై నారిటీ మతస్థులను పక్కన పెట్టి అగ్రకుల ఉన్నత వర్గాల మహిళలతో జతకట్టి బతుకమ్మను ఆడుతున్నారని అర్ధం చేసుకోవాలి.

kammarirenuka
వేల సంవత్సరాలుగా ఈ దేశ గ్రామీణ సమాజం అంటరానితనానికి గురవుతున్నది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థగా ఏర్పడింది. ఊరు- వాడలుగా చీలి వివిధ రకాల వివక్షలకు, హత్యా కాండలకు, దోపిడీ అసమానతలకు గురవుతున్న దళితులను కూడా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని తెలంగాణ వాదులు పిలుపునివ్వడం లేదు? ఇందులో అగ్రకుల కోణం లేదా? యావత్‌ తెలంగాణలోను బడుగు వర్గాల మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకున్నప్పుడే, కులాల అంతరాలు తొలగి మహిళలందరూ కలసి బతుకమ్మ ఆడినప్పుడే ఈ పండుగను తెలంగాణ ప్రజల పండుగగా అభివర్ణించుకోవచ్చు. నేడు తెలంగాణను భౌగోళికం గా ప్రకటించాలని దళిత మహిళలు పోరాడుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కుల జనాభా దామాషా ప్రకారం స్ర్తీ పురుషులకు అన్ని రంగాలలో వాటా, ప్రాతినిధ్యం కావాలని పోరాడుతున్నారు. అప్పుడే దళితులు, బీసీలు, ముస్లిం మైనారిటీలు, గిరిజనులు బతుకమ్మ, ఇతర తెలంగాణ సంస్కృతులకు దరి చేరే అవకాశం ఉంటుంది.

Saturday, October 1, 2011

ఇంత ఉద్యమం గతంలో లేదు - ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్ Andhra Jyothi 02/10/2011


ఇంత ఉద్యమం గతంలో లేదు

- ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్

నలభై మూడేళ్ళ క్రితం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన నేతల్లో సంగంరెడ్డి సత్యన్నారాయణ ఒకరు. ఆనాటి ఉద్యమ సభల్లో- "రావోయి రావోయి చెన్నారెడ్డి.. రావేమి వెర్రి చెన్నారెడ్డి, తెలంగాణ సోదరా.. తెల్సుకో నీ బతుకు'' అని ఆయన పాడిన పాటలు పెద్ద హిట్. పంచాయితీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన సత్యన్నారాయణ ఎన్టీఆర్ కేబినెట్‌లో రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ఈ మధ్య వరకూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో, గతంతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన మార్పుల గురించి సత్యన్నారాయణతో ముఖాముఖి..

మీరు 1950ల తర్వాత జరిగిన ఉద్యమాలను చాలా దగ్గరగా చూశారు కదా.. అప్పటికి ఇప్పటికి ఎలాంటి తేడాలు ఉన్నాయి?
స్వాతంత్య్రం ముందు తెలంగాణ ప్రాంతమంతా నిజాం పరిపాలనలో ఉండేది. ఆయన పాలనలో ప్రజలందరూ బానిసలే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిజాం పాలన పోయింది. పేరుకు ప్రజాస్వామ్యం వచ్చింది. తెల్లదొరలు పోయి నల్లదొరల పాలన వచ్చింది. తెలంగాణాలో మెజారిటీ ప్రజలైన దళిత, బడుగు, బలహీన వర్గాల వారికి రాజకీయం తెలియదు.

అధికారపు రుచి తెలియదు. అధికారంతో సాధికారత కూడా వస్తుందని తెలియదు. తెలంగాణలో వెలమలు, రెడ్లు అగ్రవర్ణాల వారు. వెనకబడిన తరగతుల వారు అమాయకులు కావటంతో అగ్రవర్ణాల వారు అధికారంలోకి వచ్చారు. అయితే వారు కూడా ఆంధ్రప్రాంతంలో ఉన్న అగ్రవర్ణాల వారికి సలామ్ చేసేవారు. 1958 నాటికే తెలంగాణ ప్రజలకు ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే అభివృద్ధి చెందగలమని గ్రహించారు. ఆంధ్రనాయకులు చేస్తున్న రాజకీయాలను అర్థం చేసుకున్నారు.

ఆ సమయంలో సంజీవరెడ్డి మీద నేను రాసిన- 'సంజీవరెడ్డి మామ.. అయ్యో రామరామ' అనే పాట పెద్ద హిట్. ఏ సభకు వెళ్లినా అడిగి మళ్లీ మళ్లీ పాడించుకొనేవారు. ఈ పరిస్థితి బాగా ముదిరి 1969నాటికి ఉవ్వెత్తున ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎన్‌జీఓలు. ఇది పట్టణాల్లో బాగా పాకింది. ఆ సమయంలో మేమందరం పోరాడాం.

కాని తెలంగాణ ప్రజలను చెన్నారెడ్డి వంటి నాయకులు నమ్మించి మోసం చేశారు. కాని ప్రజల్లో మాత్రం ప్రత్యేక తెలంగాణ భావన బలంగా నాటుకుపోయింది. ఇక ప్రస్తుత ఉద్యమం విషయానికి వస్తే- ఇది అన్ని వర్గాల్లోకి బాగా పాకింది. కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు. విద్యార్థులు, ఇతర వృత్తుల వారు, కులసంఘాల వారు కూడా పాల్గొనటం మొదలుపెట్టారు. నా ఉద్దేశంలో ఈ సారి ఉద్యమాన్ని ఆపటం ఎవరి తరం కాదు. ఇంత బలమైన ఉద్యమం గతంలో జరగలేదు.

మీ ఉద్దేశంలో ఆ నాటి ఉద్యమాలు చల్లారిపోవటానికి కారణాలేమిటి? అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవా?
ఇప్పుడు ఉన్నంత చైతన్యం ఆ సమయంలో అంటే 1969లో లేదు. ఆ సమయంలో ఉద్యమాలు పట్టణ ప్రాంతాలలోనే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు పల్లెపల్లెకు పాకాయి. జెండాలు, అజెండాలు ఉన్నా లేకపోయినా- తెలంగాణ కావాలనే భావన బలంగా ఉంది. ఉదాహరణకు వరంగల్ ప్రాంతంలో ఉన్న ముచెర్ల మా ఊరు. ఆ గ్రామ ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నారు. కాని మీకు ఆ గ్రామంలో ఒక్క పార్టీ జెండా కూడా కనిపించదు. అంటే పార్టీ రహితంగా, నేతల ప్రమేయం లేకుండా ఉద్యమం పాదుకుపోయింది.

దీనికి ఒక ప్రధానమైన కారణం సాహిత్యం. ఇప్పుడు అనేక మంది కవులు, కళాకారులు గళాలెత్తి పాడుతున్నారు. రచయితలు తమ రచనల ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. గతంలో ఇంత మంది కవులు, రచయితలు, కళాకారులు లేరు. దీనితో పాటు హైదరాబాద్ ప్రాధాన్యాన్ని కూడా తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే- గత ఉద్యమాలలో పాల్గొన్న ప్రజలకు హైదరాబాద్‌కు ఉన్న 'అధికార శక్తి' తెలియదు. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొంటున్నవారికి హైదరాబాద్ ఎంత అవసరమో తెలుసు. వీటన్నింటితో పాటుగా ఈ సారి ఉద్యమంలో కులసంఘాలు చురుకుగా పాల్గొంటున్నాయి.

బొగ్గుకార్మికులు, ప్రభుత్వ సిబ్బంది, కులసంఘాలు, విద్యార్థులు- అందరూ కలిసి ఒక లక్ష్యం కోసం ఉద్యమం చేయటం ఇప్పటి దాకా జరగలేదు. గతంలో జరిగిన ఉద్యమాలలో కొన్ని వర్గాలు పాల్గొన్నాయి. కొన్ని పాల్గొనలేదు. అందువల్ల ఆ ఉద్యమాలు త్వరగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

గతంలో జరిగిన ఉద్యమాలలో యువకులు ఆత్మహత్యలు చేసుకోలేదు. ప్రస్తుత ఉద్యమంలో జరుగుతున్నాయి. వీటిని దేనికి సంకేతంగా భావించాలి?
ఉద్యమం ఎంత కాలం జరుగుతుంది? తెలంగాణ వస్తుందా?రాదా? అనే విషయానికి సంబంధించి ప్రజల్లో ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి. నాయకులు ప్రజలకు సమాచారాన్ని స్వేచ్ఛగా అందించకపోవటం వల్ల ఉద్యమాలు జరిగే సమయంలో అనేక అపోహలు, అనుమానాలు ఏర్పడతాయి. వీటి వల్ల మన పరిస్థితిలో మార్పు రాదేమోననే భయం ఏర్పడుతుంది.

సున్నితమనస్కులు, ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేని వారు ఆత్మహత్యలు చేసుకుంటారు. విద్యార్థుల విషయంలో ఇదే జరిగింది. గతంలో ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో కాల్పులు జరిపేవారు. వాటిలో ప్రజలు మరణించేవారు. కాని ప్రస్తుత ఉద్యమంలో- తెలంగాణ ఎటువంటి పరిస్థితుల్లోనైనా వస్తుంది.. మీరు భయపడకండి అని భరోసా లేకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఊ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులపై మీ విశ్లేషణ ఏమిటి?
తెలంగాణా ఇవ్వటం తప్ప మరో మార్గం లేదు. కాని తెలంగాణా రాకుండా అడ్డుపడటానికి అనేక శక్తులు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సారి ఉద్యమం పల్లెపల్లెకు పాకింది కాబట్టి తెలంగాణ వస్తుందనే నమ్మకం నాకు ఉంది. కాని మాట్లాడదాం.. చర్చిద్దాం.. అన్నప్పుడల్లా తెలంగాణ ఇక రాదేమోనని కొందరు భయపడటం సహజం. కాని ప్రజల ఆకాంక్షలను ఎవరూ అణిచివేయలేరనే నమ్మకం నాకు ఉంది.

- ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్

పంపకాల అంకంలోకి ప్రవేశిస్తున్నామా? - కె. శ్రీనివాస్ Andhra Jyothi Sampadakiyam 2/10/2011


సందర్భం


పంపకాల అంకంలోకి ప్రవేశిస్తున్నామా?
- కె. శ్రీనివాస్

ఉన్నదున్నట్టు ఉండడం సాధ్యంకాదు, ఏదో ఒకటి చేయవలసిందే. శ్రీకృష్ణకమిటీ నివేదిక సిఫార్సుల మతలబు ఎట్లా ఉన్నా, దానిలోని సారాంశం మాత్రం అదే. కాకపోతే, ఆ చేయదగిన వాటిలో మొట్టమొదటిదిగా సమైక్యరాష్ట్రంలో ప్రాంతీయ కమిటీ ఏర్పాటును సూచించింది. ఇప్పుడున్న రాష్ట్రాన్ని ఏ చికిత్సలూ లేకుండా కొనసాగించడం సాధ్యంకాదన్నదే ఆ కమిటీ నిర్ధారణ. ఇప్పుడు ఆజాద్ కూడా అదే మాట చెబుతున్నట్టున్నారు. ఎంతో రహస్యంగా రూపొందించి, రహస్యంగా చర్చిస్తున్న నివేదిక 'లోగుట్టు' ఏమిటో తెలియదు కానీ, రాష్ట్రంలోని రెండు ప్రాంతాలూ కలసి ఉండడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని బలంగా చెప్పినట్టు తెలుస్తోంది.

విభజన ఖాయమే అనిపిస్తోంది. కాకపోతే, అటువంటి సూచన ఏదో అధికార స్వరాలలో పలకకపోతే, రాష్ట్రంలో ఇప్పుడు సాగుతున్న సకలజనుల సమ్మె ఉపశమించేటట్టు లేదు. సమస్యను సాగదీసినవారే ఈ పరిస్థితిని చక్కదిద్దాలి కానీ, ఇప్పటికీ అలక్ష్యం ధ్వనించే వాయిదా మాటలే మాట్లాడుతున్న ఢిల్లీ పెద్దలకు ఆ విజ్ఞత కలుగుతుందో లేదో తెలియదు. దసరా తరువాత ఆశకు ఆస్కారం కలిగే ఏదో ఒక మాట వినిపిస్తే, సమ్మె ముగుస్తుంది కానీ, సమస్య అక్కడితో ముగిసిపోదు.

ఎందుకంటే, విభజన తప్పదన్న తెలివిడికి ఎంత ప్రయాస అవసరమయిందో, విభజన ప్రాతిపదికలపై అంగీకారానికి రావడానికి అంతటి యాతనా తప్పదు. మొదట బయటపడేది కాంగ్రెస్ అభిమతం, ఆ తరువాత తక్కిన పక్షాలలో కసరత్తు, అందరిమధ్యా సంప్రదింపులు, చర్చలు, వాదోపవాదాలు, అంగీకారం లేని అంశాలపై ఆందోళనలు- తప్పనిసరి ప్రక్రియ ఇది. రాష్ట్రం కలసి ఉండడం కానీ, రెండుగా విడిపోవడం కానీ కేవలం భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు కావు. విభజనతో కానీ, సమైక్యంతో కానీ ముడిపడిన అనేక సామాజికార్థిక రాజకీయ ప్రయోజనాలు సెంటిమెంటులో అంతర్లీనంగా ధ్వనిస్తున్నాయి.

కలసి ఉండడంలో ప్రయోజనాలున్నవారు సమైక్యాన్ని కోరితే, విడిపోవడంలో ప్రయోజనాలు చూస్తున్నవారు విభజన కోరుతున్నారు. సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రాబల్యవర్గాల, రాజకీయవాదుల ప్రయోజనాలు ఎటూ సమైక్యంలో ఉన్నాయి. వారితో నిమిత్తం లేకుండా కూడా సామాన్య, మధ్యతరగతి ప్రయోజనాలూ కొన్ని సమైక్యంతో ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రాబల్యవర్గాల, రాజకీయుల ప్రయోజనాలు విభజనలో ఉన్నాయి.

విశాల ప్రజానీకం కూడా తమ సొంత ప్రయోజనాలను, ఆకాంక్షలను ప్రత్యేక రాష్ట్రంలో చూస్తున్నారు. రెండు ప్రాంతాలలో రెండు రకాల వర్గాల ప్రయోజనాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయని కాదు. కానీ, ఇందులో సామాన్యుల ప్రయోజనాలూ ఉన్నాయన్నదే గమనించవలసిన అంశం. రాష్ట్రవిభజన నిర్ణయం తీసుకునేముందు, లేదా విభజన ప్రాతిపదికలను నిర్ణయించేముందు సాధారణ ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవలసిందే.

అయితే, ఈ ప్రయోజనాలు కేవలం హైదరాబాద్ నగరంతోనే ముడిపడి ఉన్నాయా? అదొక్కటే మొత్తం సమస్యకు కేంద్రమా? హైదరాబాద్‌లో సీమాంధ్రప్రజల ప్రయోజనాలు ఉన్నాయన్నది వాస్తవం. రాష్ట్రఅవతరణ జరిగినప్పటినుంచి ఉద్యోగులుగా వచ్చి ఇక్కడ స్థిరపడినవారు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉత్తరాంధ్రనుంచి, సీమాంధ్రలోని మెట్ట ప్రాంతాల నుంచి శ్రామికులుగా, వృత్తిపనివారిగా వచ్చి స్థిరపడినవారు పెద్ద సంఖ్యలోనే హైదరాబాద్‌లో ఉన్నారు. అలాగే, వ్యాపారులుగా, పారిశ్రామికులుగా స్థిరపడిన వారూ ఉన్నారు.

హైదరాబాద్‌లో కేవలం ఆస్తులను మాత్రమే కూడగట్టుకున్నవారూ ఉన్నారు. వీరంతా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కావడం వల్ల మాత్రమే వచ్చారనుకోలేము. ప్రభుత్వోద్యోగులు, రాజకీయవాదుల కుటుంబాలు అందువల్లనే వచ్చారనడంలో సందేహంలేదు. తక్కినవారు, ఆర్థికాభివృద్ధికి, ఉపాధికి అపరిమిత అవకాశాలున్న మహానగరానికి వచ్చారనే భావించాలి. రాష్ట్రావతరణ జరిగి ఐదున్నర దశాబ్దాలు గడుస్తున్నా, శాస్త్రీయంగా పట్టణప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రయత్నించింది లేదు.

ఒకటో రెండో మహానగరాల కంటె, వికేంద్రీకరించిన పట్టణీకరణ సమాజానికి అధికంగా దోహదం చేస్తుంది. అటు శ్రీకాకుళం నుంచి, ఇటు చిత్తూరు దాకా- వ్యవసాయసంక్షోభం వల్లనో, ఇతర కారణాల వల్లనో గ్రామాలు వదిలి వచ్చేవారిని స్వీకరించి ఆదరించగలిగే పట్టణాలులేవు. అందుకే, హైదరాబాద్‌లో పక్కనే ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందినవారూ, దూరాన ఉన్న ఉత్తరాంధ్రకు చెందినవారూ భవన నిర్మాణ కార్మికులుగా కనిపిస్తారు.

వీరందరికీ రాజకీయప్రతిపత్తితో సంబంధం లేకుండా హైదరాబాద్ ఆశ్రయాన్నీ, ఉపాధినీ కల్పిస్తూ పోవలసి ఉంటుంది. హైదరాబాద్ నగరం విస్తరించడానికి, 'అభివృద్ధి' చెందడానికి ఉన్న కారణాలను శాస్త్రీయంగా, చారిత్రకంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. అసలు ఆ అభివృద్ధి ఎంత వరకు ప్రజానుకూలమైనది? కేవలం ఉన్నతాదాయవర్గాల వారికి అవసరమైన జీవనప్రమాణాలను సిద్ధం చేసుకోవడమే అభివృద్ధా? అన్నవి చర్చించవలసిన ప్రశ్నలు.

రాష్ట్రవిభజన కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ఇతర ప్రాంతీయులలో అభద్రత ఏర్పడే అవకాశం ఉండవచ్చు, దాన్ని అర్థం చేసుకోగలము. విభజన ప్రాతిపదికలలో అవసరమైన రక్షణలు కల్పించడమే ఆ సమస్యకు పరిష్కారం. సామాన్యులే కాక, సంపన్నులు, వ్యాపారులు కూడా ఆకస్మిక పరిణామం కారణంగా, రాజకీయ నాయకత్వం మార్పిడి కారణం దెబ్బతినకుండా, వెసులుబాటు కల్పించవలసిన అవసరం ఉన్నది. తాత్కాలికంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమా, మరో పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకోవడమా- ఏ పరిష్కారం సమ్మతమో దానికి మార్గం సుగమం కావాలి.

అయితే, సమస్య హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులది మాత్రమేనా? ఆదిలాబాద్‌లో, నిజామాబాద్‌లో, వరంగల్, ఖ మ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో స్థిరపడిన సీమాంధ్రుల ప్రయోజనాల సంగతేమిటి? వారు తెలంగాణ రాష్ట్రంలో ధీమాగా ఉండగలుగుతారా? వారు ఉండగలిగితే హైదరాబాద్ వాసులు ఎందుకు ఉండలేరు? - ఇవీ ప్రశ్నలే. హైదరాబాద్‌తో సహా తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల భద్రత, భవితవ్యం మాత్రమే చర్చనీయాంశా లా? సీమాంధ్ర ప్రాంతాలలోని ప్రజలకు విభజనతో సమస్యలేమీ లేవా?

సీమాంధ్రలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ హైదరాబాద్ ఒక తప్పనిసరి గమ్యం. ఉద్యోగాలు అక్కడే దొరుకుతాయి మరి. కొత్త రాజధాని ఏర్పాటైనా అది ఆ అవసరాన్ని తీరుస్తుందని చెప్పలేము. ఎందుకంటే, ఏదైనా ఒక పట్టణం రాజధాని కావడం వల్ల కాక, దానికున్న మౌలికసదుపాయాల వ్యవస్థ, భూముల అందుబాటు, నైసర్గిక అనుకూలతల కారణంగా విస్తరిస్తుంది.

సీమాంధ్రలో ఏర్పడే కొత్త ప్రభుత్వం దూరదృష్టితో, వివేకంతో వ్యవహరించి ఉపాధిఅవకాశాల విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటుందనుకుందాం, అయితే దానికి సమయం పడుతుంది. అప్పటిదాకా హైదరాబాద్ వారికి అందుబాటులో ఉండాలి. మరి ఇన్ని అవకాశాలను కల్పిస్తూ పోతే, తెలంగాణ యువకుల సంగతేమిటి? అన్న ప్రశ్న అనివార్యంగా వస్తుంది. చిన్నవో చితకవో సీమాంధ్ర లో అనేక పట్టణాలున్నాయి. తెలంగాణ పరిస్థితి అది కాదు. వారికి హైదరాబాద్ లేకపోతే, ఉపాధి అవకాశాలు మృగ్యం. అంటే, హైదరాబాద్ ఆదాయాన్ని పంచుకున్నట్టే, ఇతర అవకాశాలను కూడా కొంతకాలం పాటు ఉభయులూ ఏదో ఒక నిష్పత్తిలో పంచుకోవాలి.

ఉద్యోగాలు, చదువులూ పక్కనపెడితే, సాగునీటి సమస్య చాలా కీలకమయినది, సంక్లిష్టమయినది. కృష్ణాగోదావరినదులు సుదీర్ఘంగా ప్రవహిస్తూ ఉన్నా తెలంగాణ నేలకు సాగునీటి లభ్యత లేదన్నది తెలంగాణ ఉద్యమం పుట్టడానికి ఒక ముఖ్యమైన కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, సాగునీటి కోసం జరిగే కొత్త ప్రయత్నాలు కానీ, తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్ల కానీ- దిగువ ప్రాంతమైన కోస్తాంధ్రకు నీరు అందదేమోనన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల మీద ఉభయప్రాంతాల ప్రయోజనాలు, వైఖరులు భిన్నంగా ఉన్నాయి. నీటిపంపకం పెద్ద సమస్యే కానున్నది.

నిజానికి హైదరాబాద్ కంటె అదే పెద్ద సమస్య. మహానగరంలో అమిత ప్రయోజనాలున్నవారు ఆ ఒక్కదానికే ప్రాధాన్యం ఇస్తూ, తక్కినవాటిమీద దృష్టి సారించకుండా జాగ్రత్త పడ్డారు. విభజన అసాధ్యమనే అభిప్రాయాన్ని పదే పదే కల్పించడం ద్వారా, సీమాంధ్ర ప్రాంత రైతాంగంలో తమ ప్రయోజనాల సాధన కోసం ముందే మేల్కొనే అవకాశం లేకుండా చేశారు. అంటే సీమాంధ్ర రైతాంగం తెలంగాణతో ఘర్షణ వైఖరి ద్వారా రక్షణలు పొందాలని, పొందగలరని కాదు. సాగునీటికి అధిక లబ్ధిదారులు గా కనిపిస్తున్న సీమాంధ్ర ఆయకట్టురైతాంగం, తమ ప్రస్తుత స్థితిని కాపాడుకోవడం అవసరం.

అందుకు, ఉభయప్రాంతాల మధ్య సంప్రదింపులు, సదవగాహన అవసరం. వాస్తవికత, సమాన న్యాయం ప్రాతిపదికలుగా కృష్ణా జలాల పునఃపంపిణీ అవసరం. ఆ పంపిణీలో రాయలసీమకు కూడా న్యాయం చేయవలసి ఉంటుంది. హైదరాబాద్‌తో ఉన్న ప్ర యోజనాల కంటె, అధికంగా కృష్ణాజలాలే రాయలసీమ రైతాంగానికి, అక్కడి రాజకీయ నాయకత్వానికి కూడా ముఖ్యం.

పరీవాహకప్రాంత హక్కులు లేని రాయలసీమకు తుంగభద్ర, పెన్న తప్ప పెద్దనదులు లేవు. తెలుగుగంగ పుణ్యమా అని కొన్ని నీళ్లు, రాజశేఖరరెడ్డి హయాం కారణంగా పోతిరెడ్డిపాడు నుంచి కొన్ని వివాదాస్పద జలాలు మాత్రమే సీమకు లభిస్తున్నాయి. ఎంతో కొంత జలవాగ్దానం జరగకపోతే, విభజన వల్ల రాయలసీమ అధికంగా నష్టపోతుంది. జీవనదులు ప్రవహిస్తున్నా సాగునీటికి గతిలేకుండా ఉన్న తెలంగాణ, రేపు కోస్తాకు, సీమకు నీటిని వాగ్దానం చేయవలసి రావడమే విచిత్రం.

ఇందరికి ఇన్ని సర్దుబాట్లు చేసిన తరువాత తెలంగాణకు ఏమి మిగులుతుంది? దాన్ని అభివృద్ధిబాటలో పాలకులు ఎట్లా నడిపిస్తారు?- అన్నవి ఆందోళనకరమైన ప్రశ్నలే. కానీ, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదకవలసిన సమయం వచ్చింది. విభజన ఖాయం అని తెలిసిన తరువాత, పంపకాల మీదనే చర్చ ప్రారంభం కావలసి ఉన్నది. వివక్ష వల్ల బాధితులైనవారు, ఇతరుల విషయంలో ఆ వివక్ష చూపించరు, ఉదారంగా కూడా ఉంటారు. ఉండాలి. కానీ, విభజన ప్రాతిపదికలను నిర్ణయించేటప్పుడు, విభజన ఉద్యమం ఎందుకు జరిగిందో, ఆ విలువలను ఆకాంక్షలను విస్మరించకుండా ఉండాలి. భౌతిక ప్రయోజనాలు శూన్యమై కేవలం భావోద్వేగాలు సంతృప్తి చెందితే కూడా ఉపయోగం లేదు.

- కె. శ్రీనివాస్

బహాజన శాస్త్రం (స్వయంపాలనతోనే గిరిజనాభివృద్ధి) By -గుమ్మడి లక్ష్మినారాయణ Namasethe Telangana 02/10/2011

బహాజన శాస్త్రం (స్వయంపాలనతోనే గిరిజనాభివృద్ధి)

‘మట్టిలో పుట్టిన మొక్క వేళ్లు లోతుగా పాతుకుపోయి ఉన్న వనమూలికల వంటివారే ఆదివాసీల’ని గాంధీజీ వర్ణించారు. రాష్ట్ర విభజన కన్నా.. తెలంగాణలోని షెడ్యూల్డ్ ఏజెన్సీ గ్రామాల్లో నివసించే ఆదివాసీలు స్వయంపాలన వైపే మక్కువ చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, ఆదివాసీలకు స్వయం పరిపాలనాధికారాలు కల్పించే దిశగా గవర్నర్ చొరవ చూపాల్సి ఉంది. రాష్ట్రంలోని 30 తెగల ఆదివాసులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన భూమి హక్కులు, ప్రత్యేక చట్టాలు, రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అవి అమలు జరగడం లేదు. తెలంగాణ ప్రాంతంలోని ఆదివాసీల ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వాటిని అమలు చేయాలి.

ఆదివాసులు స్వాతంత్య్ర పోరాటానికి పూర్వం నుంచి పోరాటం చేస్తున్నారు. తెలంగాణలో కాకతీయులపై సమ్మక్క, సారలమ్మ పోరాటం నుంచి నైజాం రజాకార్ల కాలం లో (1920-1947 ), రాంజీగోండు (1836-1860 ), కొమురం భీం జోడేన్ ఘాట్ పోరాటం (1930-1940 ) దాకా ‘నీరు భూమి అడవి ఆదివాసీలకే చెందాల’ని పోరాటాలు చేశారు. తెలంగాణ ఉద్యమం రెండో స్వాతంత్య్ర పోరాటాన్ని తలపించినా, ఆదివాసీలకు స్వయంపాలనతో కూడిన రాష్ట్రమే తక్షణావసరం. ఎందుకంటే 60 ఏళ్ల ‘స్వర్ణ’ భారతంలోనూ ఆదివాసీలు అభివృద్ధి ఫలాలు పొందలేదు. నేటికీ నాగరికతకు దూరం గా అటవీ ఏజెన్సీ గ్రామాల్లోనే దుర్భరజీవనం గడుపుతున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 17,59,554 మంది గిరిజనులున్నారు. వీరిలో ఏజెన్సీ గిరిజనులు (16 తెగలు ) 6,23,670 మంది ఉన్నారు. కనీస సౌకర్యాలు లేక కరువుకాటకాలకు తోడు పౌష్టికాహార లోపం, సీజనల్ వ్యాధులతో ప్రతిఏటా వేలాది మంది ఆదివాసులు చనిపోతున్నారు.

గిరిజన సంక్షేమం కోసం ఐటీడీఏ చేపట్టిన పథకాలు దళారీల వ్యవస్థ, అవినీతి అధికారుల వల్ల ఆదివాసులకు అందడం లేదు. ఈ కారణంగానే కొన్ని తెగల భాష, సంస్కృతి, ఆచారాలు అంతరిస్తున్నాయి. ఆదివాసీలు జన్మహక్కుగా భావించే 5వ షెడ్యూల్డ్‌లో రిజర్వేషన్లు, చట్టాలు, షెడ్యూల్డ్ ప్రాంత పరిపాలన, నియంవూతణ వంటి హక్కులు క్రమంగా కోల్పోతున్నారు. తెలంగాణలోని గిరిజనులు నేటికీ తీవ్రమైన అణచివేతకు గురౌతున్నారు. ఆదివాసీలు నష్టపోయిన వనరుల్లో భూమి, అటవీ సంపద, ఉద్యోగాలు ప్రధానమైనవి. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఆదివాసులకు శాపం గా మారింది. తమ పూర్వీకుల భూములను 1940 నాటికే గోండు ఆదివాసీలు కోల్పోయినట్లుగా హైమన్ డార్ఫ్ అధ్యయనం తెలిపింది. కోనేరు రంగారావు సిఫార్సులను బట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల వలస, ప్రైవేటు మైనింగ్ కంపెనీలు పెరగడంతో 48 శాతం భూమి అన్యాక్షికాంతం అయ్యింది.

గిర్‌గ్లానీ నివేదిక ప్రకారం కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి గిరిజనేతరుల ఆధీనంలో ఉంది. నైజాం ప్రభుత్వ విధానం వల్ల గిరిజనుల భూమి అన్యాక్షికాంతం తెలంగాణలోనే అధికంగా జరిగింది. భూమి పరాయీకరణ వరంగల్ జిల్లాలో 72 శాతం, ఖమ్మంలో 53 శాతం, ఆదిలాబాద్‌లో 61 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 3 శాతం ఉన్నట్లు గిరిజన సంక్షేమ శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. ఏజెన్సీ భూముల రక్షణకు భూ బదలాయింపు నిషేధ చట్టం (1/59, 1/70) ఉన్నా అమలుకు నోచుకోలేదు.
ఇతర రాష్ట్రాల్లో బీసీ జాబితాలో ఉన్న లంబాడాలను మన రాష్ట్రంలోని ఎస్టీల్లో కలిపారు. దీంతో 30 ఆదివాసీ గిరిజన తెగల సంక్షేమాన్ని లంబాడీలే కాజేస్తున్నారు. ఆరు శాతం రిజర్వేషన్లలో సింహభాగాన్ని లంబాడీలే అనుభవిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఎస్టీల ఉమ్మడి రిజర్వేషన్లలోనూ తెలంగాణలోని ఆదివాసీ గిరిజనులే ఎక్కువగా అన్యాయానికి గురైనారు.1986లో తెలంగాణ ప్రాంత ఉద్యోగాల పరిరక్షణకు 610 జీవో అమలుకోసం సభాసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల విద్య, ఉద్యోగ రంగానికి సంబంధించిన జీవో నెం.3 ను అమలు చేయడంలో న్యాయ స్థానాల తీర్పును సైతం విస్మరించారు. అలాగే పంచాయితీరాజ్, షెడ్యూల్డ్ పరిపాలనాధికారాలను నిర్ధేశించే ‘ఫీసా’ చట్టం (1996, 2006 )ను, గ్రామ కమిటీ తీర్మానాలను పాలకులు విస్మరిస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల్లో 275 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాల్లో తొమ్మిది గ్రామాలకు చెందిన 30 వేల ఎకరాల భూమిని ఎలిఫెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇంకా దేవాదుల, కంతనపల్లి, తదితర ప్రాజెక్టులు ఆదివాసులను నిర్వాసితులుగా చేస్తూ గిరిజనేతర ప్రాంతాలకు ఉపయోగపడుతున్నాయి. దీనిని పాలకులు అభివృద్ధిగా పేర్కొంటున్నారు.

గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి మూలమైన అక్షరాస్యత ఏజెన్సీ ప్రాంతాల్లో మెరుగుపడలేదు. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 60 శాతం ఉంటే.. గిరిజనుల్లో 37 శాతం మాత్రమే. ఆదివాసులకు ఆలవాలంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న గిరిజన ప్రాంతాన్నంతా కలిపి మన్యసీమ రాష్ట్రం, లేదా గోండ్వానా, దండకారణ్య రాష్ట్రం ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. 6.6 శాతం ఉన్న గిరిజనులకు ప్రభుత్వం కేవలం 1095 కోట్లు కేటాయించింది. గిరిజన సాధికార త ప్రకటించి మరో వెయ్యి కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు విస్తరించిన బొగ్గు గనులు, సిమెంట్ ఖనిజం అడవి ఆధారిత ముడి సరుకు కొల్లగొట్టబడుతున్నది. కొత్తగూడెం, ఇల్లందు, బయ్యారం, పాల్వంచ, మణుగూర్, భద్రాచలం, సిర్పూర్ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో గిరిజనులకు ఉపాధి దొరకలేదు.

రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులు నివసించే ప్రాంతాలు-ఆంవూధవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యవూపదేశ్, ఒడిషా, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో ప్రత్యేక గిరిజన చట్టాలు, రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 6వ షెడ్యూల్‌లో త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, అసోం, మిజోరాం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. అక్కడ ప్య్రతేక గిరిజన జిల్లాలు ఏర్పడి స్వయం పాలన కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలపై ఉందని ఐక్య రాజ్యసమితి సర్వవూపతినిధి సభ 1993లో తీర్మానించింది. అయినా పాలనా పరమైన లోపాలతో గిరిజనులు వెనుకబాటుకు, వనరుల పరాయీకరణకు బలిఅవుతూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో.. ఇప్పటికీ దుర్భర జీవితం అనుభవిస్తున్న ఆదివాసీ హక్కుల ఎజెండాను తెలంగాణ ఏర్పాటులో తెరమీదికి రానీయడం లేదు. దీంతో.. ఇప్పుడు రాష్టంలోని ఆదివాసులు స్వయం పాలనతో కూడిన రాష్ట్రాన్ని కోరుతున్నారు.

అందుకుగాను తెలంగాణ జేఏసీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) అనుబంధ సంఘాలు ఆదివాసీ జేఏసీలను ఏర్పాటు చేసింది. స్వయంపాలన కొరకు పోరాడుతోంది. దీనికి ఉత్తరాంధ్ర ఆదివాసీలు కూడా మద్దతు పలుకుతూ.. తమకు స్వయం పాలన డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసుల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయదలిచిన అన్ని రకాల అభివృద్ధి పథకాలను, ‘భూరియా కమిటీ’ సిఫార్స్‌లను అమలు చేయాలి. అలాగే గిరిజన ప్రాంతాలకు విశిష్ట అధికారాలతో కూడిన పాలనా ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. గిరిజనులకు ‘స్వయం సాధికారత’ కల్పించాలి.
-గుమ్మడి లక్ష్మినారాయణ