Saturday, September 8, 2012

సంచారజాతుల స్థానం ఎక్కడ? --- బుద్ధారం రమేష్




భారతదేశం సకల జనుల సమ్మేళనం. విభిన్న జాతులు,మతాలు భాషల సంస్కృతుల సమ్మిళితం.అయితే కొందరు రాజభోగాల్లో తులతూగుతుంటే, మరికొందరు కటిక దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. 65 వసంతాల స్వతంత్ర భారతం అసమానతలను, వివక్షను, అణచివేతను అరికట్టలేకపోతున్నది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు, నిధుల కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయి. దేశం సాంకేతికపరంగా ఎంత ముందుకు దూసుకెళ్లినా సామాజిక సమానత్వం సాధించడంలో వెనకపడిపోయిం ది. ఎన్నోఏళ్లుగా ఆంగ్లేయుల పాలనలో నేరస్త జాతులుగా అపకీర్తి మూటగట్టుకొ ని స్వతంత్ర దేశంలో విముక్త జాతులు/సంచార జాతులుగా పిలవబడుతున్న కులాలు, అభివృద్ధికి నోచుకోక కొన్ని అవసాన దశలో కొట్టు మిట్టడుతున్నాయి. తరాలు మారినా వీరి తలరాతలు మారడం లేదు. 1952లో నేరస్థ జాతుల చట్టం నుంచి విముక్తి పొందిన ఈ తెగలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లో చేర్చబడ్దాయి. బాలసంతు, బహురూపి, బందర, బుడబుక్కల, దొమ్మర,గంగిడ్ల వారు, జంగం, జోగి,కావటిపాపల, కొర్చ, మొండివారు, మొండిబండ, బండ, పిచ్చకుంట్ల, వంశరాజ్, పాముల, పార్థి, నీర్ షికారి, పంబాల, దమ్మలి, పెద్దమ్మలవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలవాండ్లు, వీర ముష్టి, నెత్తికోటల, వీరభవూదీయ, గుడాల, కంజరబట్ట, రెడ్డిక, మొండిబట్ట, నొక్కర్, పరికి ముగ్గుల, యాత, చొపమెరి, కైకాడి, మందుల, మేథర్, కూపపులి, పొందర, పట్రా, కురాకుల, సిక్లిగర్, పూసల, కెట్లు, గుడియా జక్కల, గుడ్ది ఎలుగువాళ్లు, బుడ్ బుడ్కలవాళ్లు, తేరుగాడు, డీరా ఫకీర్లు, బొంతల ఇలా ఇంకె న్నో కులాలను బీసీ జాబితాలో చేర్చారు. రెడ్డిక, తోట నాయక్, సుగాలి,యనాది, దొంగ యానాది, రెడ్డి యానాది, కొండ దొర, దొంగ యెరుక, లంబాడాలను ఎస్టీ జాబితాలో, అనిపి మాల, యెదురుపాక మాల, అన్నబోయిన మాల, రెల్లి, దొంగ మాలలను ఎస్సీ జాబితాలో చేర్చారు.వీరి వర్తమాన పరిస్థితులు దినదిన గండంగా తయారయ్యాయి. బుక్కెడు బువ్వ కోసం పడరానిపాట్లు పడుతున్నారు. బాలసంతు, బహురూపి కులస్తులు బహుళ కలల ద్వారా ప్రజలకు వినోదాన్ని కలిగించే వీరి వృత్తి కనుమరుగైపోయింది. ఇప్పు డు వారు ఏవిధంగా బతుకుతున్నారో తెలియదు. దొమ్మరి విద్యలు దుమ్ము రేపే వి. వీరి విన్యాసాలు ఒలింపిక్ ఆటలను తలపించేవి. ప్రస్తుతం వీరిలో చాలామంది జీవనాధారం లేక పడుపు వృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. బలమైన ఇను ప ముక్కను తమ సమ్మెట పెట్టుతో అందంగా తీర్చిదిద్దే బహిర్ కమ్మరులు తమ జీవితాలను దిద్దుకొలేకపోయారు. గంగిడ్ల వారి గోవులు గుమ్మాలు తొక్క టం మానేశాయి. శైవ మత ప్రచారంలో తరించిన జంగం, జోగి కులాల వాళ్లు బిక్షగాళ్ళుగా మారిపోవాల్సి వచ్చింది. బందర కులస్తులు బందిపోటు దొంగలుగా ముద్రవేయబడ్డారు. బుడబుక్కల కులస్తులకు యాచక వృత్తే జీవనాధారం అయింది. జక్కుల వాళ్లు చెప్పే పురాణకథలు, భాగవతాలు, వినే ఓపిక తీరిక జనా ల్లో ఎపుడో నశించింది. పూసల వాళ్ళు పనిలేని వాళ్లు అయ్యారు. దాసరులవి వలస బతు కులు అయ్యాయి. డక్కలొల్లు దిక్కులేని వాళ్లయ్యారు. కాటిపాపల వాళ్లు కానరాకుండపోయారు. విద్యా, వైద్యం, ఉపాధి వీరికి అందని ద్రాక్షలే. ఆధునీకరణ, ప్రపంచీకరణ, నూతన పారిక్షిశామికీకరణ దెబ్బతో వీరి జీవితాలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి. ఎన్నో కులాలు నిర్వీర్యమైపోయాయి. మరికొన్ని అంతరించిపోయాయి. లక్షలాది కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి.

రాష్టంలో వీరి పరిస్థితి ఈ విధంగా ఉంటే పభుత్వాలు మాత్రం తమ కు ఏమి పట్టనట్టు హామీలు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నాయి. ఎన్నికల సమయానికి ఎక్కడున్నా జనాల్ని వెతికి పట్టుకొచ్చి ఓట్ల జాతర కానిస్తున్నాయి. రాష్టంలో ఈ జాతుల హక్కుల కోసం పని చేస్తున్న సద్భావన ఫౌండేషన్ సంస్థవారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరడ్డితో పలుమార్లు చర్చించారు. ఈ జాతుల అధ్యయనానికి రాష్ట్రంలో ప్రత్యేక కమిషన్‌ను, వీరి ఉపాధి కల్పనకు ప్రత్యేక ఫెడరేషన్‌ల స్థాపనకు హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ అలాగే మిగిలిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. దేశంలో మొదటిసారిగా ఈ జాతుల సమస్యలపై గళం ఎత్తిన ఘనత మానవ హక్కుల కార్యకర్త, రచయిత్రి మహాశ్వేతదేవికే దక్కుతుంది. ‘డి నోటిఫైడ్ ట్రైబ్స్ రైట్స్ యాక్షన్ గ్రూప్’ పేరుతో ఒక సంస్థను స్థాపించి ఆ జాతుల హక్కుల కోసం ఆమె పోరాటం చేస్తూ 1990లో మొదటిసారిగా సంచార విముక్త జాతుల ఉనికి గురించి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రొఫెసర్ గణేష్ డెవి, ప్రొఫెసర్ రామకృష్ణాడ్డి, ప్రొఫెసర్ ఆశీర్వాదం ఈ జాతుల సమస్యలపై తమవంతు కృషి చేశారు. వీరి కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2006లో బాలకృష్ణ రెనకె అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఆయా జాతుల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి విలువైన సిఫార్సులను చేసింది. ఈ జాతుల వారు అత్యంత నిరుపేదలని, కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని, అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవ నం సాగిస్తున్నారని వివరించింది. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ తమ కమిషన్ ప్రతిపాదించిన సిఫార్సులు అమలుకావడం లేదని, ప్రభుత్వం వారికి కేటాయించిన నిధులను వారి సంక్షేమానికి ఖర్చు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.

ఏదైనా జాతి అభివృద్ధి చెందాలంటే దానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉన్నప్పుడే అది సాధ్యం. కానీ రాష్ట్రాల వారీగా, దేశవ్యాప్తంగా జాతులకు సంబంధించిన లెక్కలు సమాచారం ప్రభుత్వాల దగ్గర లేకపోవడం విడ్డూరంగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే స్వాతంవూత్యానంతరం ఈ జాతులపైన ఎలాంటి సమగ్ర అధ్యయనం జరగలేదు. దేశం వైజ్ఞానిక రంగంలో సాధించి న పురోగతి సామాజికశాస్త్ర పరిశోధనలో సాధించలేదన్నది అక్షర సత్యం. దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక సామాజిక పరిశోధక సంస్థలు వె లిశాయి. అయినప్పటికి వారి దృష్టి ఈ జాతులపై లేకపోవడం శోచ నీయం. భారత సామాజిక పరిశోధన మండలి అనేది దేశంలో సామజిక పరిశోధనలకు పెద్దపీట వేసే ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ ఈమధ్య కాలంలో ఈ జాతులపై పరిశోధనలకు నిధులు కేటాయించడం శుభ పరిణామం. ఐతే కొంత కాలంగా హైదరాబాద్‌లోని సామాజిక అభివృద్ధి మండలి (సి.ఎస్.డి), ముంబాయిలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అలాగే మరికొన్ని విశ్వవిద్యాలయాలు ఈ జాతులపైన పరిశోధనకు పూనుకోవడం హర్షించదగిన పరిణామం. ఇప్పటికైనా ప్రభుత్వాలు సంచార జాతు ల పట్ల నిర్లక్ష్య ధోరణిని విడనాడాలి. రెనకె కమిషన్ సిఫారసును అమలు చేయాలి. ఈ జాతులపై ఆంగ్లేయుల కాలం నుంచి జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టాలి. స్వతంత్ర దేశంలో ప్రతి ఒక్కరికీ సమ న్యాయం, అభివృద్ధి ఫలాలు సమంగా అందేలా చూసే బాధ్యత పాలకులపై ఉన్నది.

-బుద్ధారం రమేష్ 
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్, హైదరాబా

Namasete Telangana News Paper Dated : 09/09/2012 

No comments:

Post a Comment