Tuesday, April 22, 2014

దళితులకు న్యాయం ఎండమావేనా? By దుడ్డు ప్రభాకర్, కులనిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు


Updated : 4/23/2014 2:00:08 AM
Views : 43
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న మన దేశంలో రాజ్యాంగ చట్టం, పాలనావ్యవస్థ, రక్షణ వ్యవస్థ క్రమంగా ప్రజలకు దూరమవు తున్నాయి. ఈ దశలో న్యాయవ్యవస్థను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయా అనే ఆందోళన కలు గుతున్నది. దేశంలో పీడిత ప్రజల బతు క్కి భద్రత, రక్షణ కల్పించే దిక్కు లేకుండా పోతున్నది.ఎంతోకొంత ఎస్సీ, ఎస్టీలకు అనివార్య పరిస్థితుల్లో చివరి ఆశగా న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నా రు. చివరకు ఇవ్వాళ ఆ ఆశ కూడా ఆవిరవుతున్న పరిస్థితు లు వచ్చాయి. దీనికి నిదర్శనంగా చుండూ రు నరమేధం కేసులో ముద్దాయిలు 21 మంది కూడా నిర్దోషులుగా ప్రకటించబడ్డారు! అయితే ఇక్కడ ఆలోచించాల్సింది..చుండూరులో నరమేధం జరిగింది అవాస్తవమా..!? నిర్దోషులుగా ప్రకటించబడ్డ వారికి ఆ ఊచకోతతో సంబంధమే లేదా? అసలు వారు దోషులే కారా? అంతా.. గజం మిథ్య.. ,పలాయనం మిథ్య.. అన్న నీతేనా..? 

నిజానికి ఆనాడు చుండూరులో ఏం జరిగింది? 1991 ఆగస్టు 6న దళిత నెత్తుటి చరిత్రలో మరో నెత్తుటి మరక చోటు చేసుకున్న రోజు. చుండూరు దళితవాడపై చుండూరు, మోదుకూరు వలివేరు మున్నంగివారి పాలెం గ్రామాలకు చెందిన రెడ్లు, కాపులు మారణాయుధాలతో దళితులపై పథకం ప్రకారం విచక్షణారహితంగా దాడిచేశారు. ఉదయం 11గంటల నుంచి వందమందికి పైగా పోలీసులు లాఠీలతో పల్లెలోకి ప్రవేశింంచి ఉన్నా.., కాపులు, రెడ్లు మూకుమ్మడిగా మారణాయుధాలతో పల్లెపైకి వచ్చారు. దీంతో.. మేం తక్కువ మందిమి ఉన్నం. వాళ్లను ఆపలేం. పారిపోయి ప్రాణాలు దక్కించుకోండి అంటూ పోలీసులు ఇల్లిల్లూ తిరిగి చెప్పారు. ప్రాణభయంతో పారిపోయే దళితుల్ని అగ్రకుల ఉన్మాదశక్తులు ట్రాక్టర్లలో కత్తులు, గొడ్డళ్లు, బరిసెల తో వెంటాడి, వేటాడి నరికారు. శవాలను గోతాల్లో కుక్కి తుంగభద్రలో వేశారు. మూడురోజులు కాల్వ లో వెతగ్గా మొత్తం ఎనిమిది శవాలు దొరికాయి. శరీరమంతా ఛిద్రమై గుర్తించలేనంతగా కుల్లిపోయి ఉన్న రమేష్ అనే డిగ్రీ విద్యార్థి శవాన్ని చూసి అత ని అన్న పరిశుద్ధరావు గుండె పగిలి చనిపోయాడు. హంతకుల అరెస్టు కోసం ఉద్యమం నడుపుతున్న కొమ్మెర్ల అనిల్ కుమార్‌ను పట్టపగలు దళితవాడలో జరుగుతున్న నిరాహారదీక్ష శిబిరంలో పోలీసులు కాల్చిచంపారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో రోడ్డు దాటుతుండగా గూడూరు కయమ్మ యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఇలా మొత్తం11 మంది చుండూరు బాధితులు పోలీసులు, అగ్రకులాల పకడ్బందీ వ్యూహంలో బలయ్యారు. ఈ చుండూరు దళితుల కు తగిన న్యాయం జరగాలని, నేరస్తులు శిక్షించబడాలని చుండూరు దళితులే కాదు, రాష్ట్రవ్యాప్తంగా దళితులు పోరాటం చేశారు. ఇప్పటిదాకా అలుపెరుగకుండా పోరాడుతున్నారు. ఈ సుదీర్ఘ 16 ఏళ్ల పోరాటం తర్వాత, ఇంత న్యాయం కోసం ఇంత కాలయాపన తర్వాత చుండూరులోని ప్రత్యేక కోర్టు 2007 జూన్ 31న 25 మంది ముద్దాయిలకు జీవితఖైదు, 35 మందికి సంవత్సరకాలం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 

అయితే ఈ కేసులో అనేక మలుపులు, సుదీర్ఘ విచారణలో అనేక చిత్రవిచిత్రాలు జరిగాయి. సహ జ న్యాయ సూత్రాలకు భిన్నంగా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. 16 ఏళ్ల తర్వాత ముద్దాయిల కు శిక్షపడితే..దాన్నుంచి తప్పించుకునే క్రమంలో నేరస్తులు పైకోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నా రు. కేసులో మొత్తం 219 మందిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, భారత శిక్షాస్మతి 302, 307 సెక్షన్ల కింద పోలీసులు చార్జ్‌షీట్ వేశారు. వీరిలో ఏడుగురిని కొన్ని టెక్నికల్ కారణా లు చూపి కేసు నుంచి మినహాయించి ,పోలీసులు వారిని అరెస్టు చేయలేదు. మిగతా వారిని కేసు నుంచి మినహాయించి కేసును వేరుచేసి 1993లో కేసు విచారణకు వచ్చే సరికి, బాధితులు క్రిస్టియన్ మతానికి చెందిన వారు కాబట్టి వారిని బీసీ (సీ)గా గుర్తించాలని అంటూ కేసును ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల చట్టం కిందకు రాదని వాదించారు. కాబట్టి ప్రత్యేక కోర్టును రద్దు చేయాలని ప్రత్యేక కోర్టులో వాదనలు లేవనెత్తారు. హై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ఇలా కొంత కాలయాపన తర్వాత కోర్టు ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులోనే విచారణకు సిద్ధపడింది. దీనిపై కూడా అగ్రకుల పెద్దలు హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మరోవైపు చుండూరులోనే కోర్టు పెట్టి విచారణ జరిపితే తమ ప్రాణాలకు రక్షణ ఉండదని అగ్రకులస్తులు మళ్లీ హైకోర్టు నుంచి విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హక్కుల సంఘానికి చెందినవాడు కాబట్టి వారికి నక్సలైట్లతో సంబంధం ఉంటుంది కాబట్టి అతన్ని తప్పించాలని వాదించి మరి కొంతకాలం కాలయాపన చేశారు. 

ఎట్టకేలకు 2004 డిసెంబర్1న ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రారంభమయ్యే నాటికి ఏడుగురు అరెస్టే కాలేదు. 23 మంది చనిపోయారు. మిగిలిన 183 మందిపై విచారణ ప్రారంభమయ్యింది. 79 మంది సాక్షుల్ని విచారించారు. చివరకు తీర్పు ప్రకటించారు. ఈ తీర్పుతో కంగు తిన్న అగ్రకుల భూస్వాములు తమ ధన,కుల బలం అండతో హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కూడా అగ్రకుల భూస్వాముల తరఫున అనేక వింత వింత కాలయాపన వాదనలు చేశారు. చాలాకాలం పాటు అంతూ పొం తూ లేని వాదనలతో కోర్టులో కేసు విచారణను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బాధితులు దళితుల తరఫున నిలిచిన న్యాయవాదులు కోర్టు చేస్తున్న జాప్యానికి అనేక రూపాల్లో తమ నిరసనను తెలిపారు. జరుగుతున్న తతంగం పట్ల అభ్యంతరాలను తెలిపారు. అయినా కోర్టు తనదైన శైలిలో విచారణ ను కొనసాగించి చివరకు తీర్పును వెలువరించిం ది. ముద్దాయిలపై సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు భావించింది. అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది! స్వతంత్ర భారతంలో దళితులకు చట్టపరంగా దక్కాల్సిన న్యాయాన్ని ఈ అగ్రకుల భూస్వామ్య వ్యవస్థ దక్కకుండా చేసింది. రాజ్యాంగబద్ధంగా రక్షణ దొరకాల్సిన చోట రక్షణ కరువవుతున్న తీరు.. మన సామాజిక వ్యవస్థ హింసాముఖాన్ని బహిర్గతం చేస్తున్నది. దళితులకు అందని ద్రాక్షగా ఉన్న రక్షణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మూలంగానే నేటిదాకా జరిగిన దళితుల మారణకాండలన్నింటిలో ఎక్కడా దళితులకు న్యాయం దక్కలేదు. దోషులు శిక్షించబడలేదు. ఒక్క చుండూరే కాదు, కారంచేడు, పదిరికుప్పం మొదలు ఖైర్లాంజి దాకా ఏ మారణకాండలోనూ నేరస్తులు శిక్షించబడలేదు. రాజ్యాంగ రక్షణ లు, హక్కులు కొన్ని సామాజిక సమూహాలకు అందని స్థితి సమాజ శ్రేయస్సుకు గొడ్డలి పెట్టు. ఈ వ్యవస్థీకతమైన దురన్యాయాన్ని సామాజిక ఉద్యమాల ద్వారానే ఓడించాలి. పీడితులు, బలహీనులకు అండగా, రక్షణగా రాజ్యాంగాన్ని నిటారుగా నిలబెట్టాలి. ఆత్మగౌరవ పోరాటాల మార్గంలోనే విముక్తి పోరులో మునుముందుకు సాగాలి. అంతిమంగా సమ న్యాయ వ్యవస్థ స్థాపనకు నడుంకట్టి నడవాలి. అప్పుడే చుండూరులూ ఉండవు. చుండూరు లాంటి బాధితులకు అన్యాయాలకు స్థానం ఉండదు. 

No comments:

Post a Comment