Friday, April 25, 2014

చుండూరు తీర్పు Vaartha Sampadakiyam


భారతీయ శిక్షాస్మృతిలో సాక్ష్యం ఎంతో కీలకమైంది. న్యాయమూర్తులు సాక్ష్యాలు,వాంగ్మూలాలు,రికార్డు లపై ఆధారపడాల్సిందేతప్ప తమ సొంత విచక్షణతో వ్యవ హరించే అవకాశం తక్కువని చెప్పొచ్చు. ఈ సాక్ష్యాలు, రికార్డుల మాయాజాలంలో ఎన్నోకేసులు తారుమారైపోతు న్నాయి.ఎంతోమంది దోషులు చట్టాన్నుంచి తప్పించుకుం టున్నారు. ఇందుకు ప్రధానంగా నిందించాల్సింది, తప్పుప ట్టాల్సింది దర్యాప్తు చేస్తున్న అధికారులనే. చట్టాల్లో ఉన్న లొసుగులతోపాటు దర్యాప్తు అధికారులకు ఉన్న ఇబ్బందులు వారికి ఉన్నమాట నిజమేకావచ్చు.ఏదిఏమైతేనేం నేరాలను రుజువ్ఞ చేసేందుకు అవసరమైన,తిరుగులేని సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానాల ముందుపెట్టి, నేరస్థులకు శిక్షలు వేయించడంలో పోలీసులు విఫలమవ్ఞతున్నారు. అందుకే పోలీసులుపెడ్తున్న కేసుల్లో అధికశాతం కేసులు కోర్టుల్లో వీగి పోతున్నాయి. దీంతో అనేకమంది నేరస్థులు నిర్భయంగా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. కేసులన్నా, పోలీసులన్నా భయభక్తులు లేకుండాపోతున్నాయి.మళ్లీమళ్లీ నేరాలకుపాల్ప డుతున్నారు. దీనికితోడు పెరిగిన కేసులకు అనుగుణంగా కోర్టులు, సిబ్బందిని పెంచకపోవడంతో విచారణలు దశాబ్దాల తరబడి జరుగుతున్నాయి. సంవత్సరాల తరబడి జాప్యం జరగడంవల్ల కొందరు సాక్షులు,నిందితులు మరికొందరు బాధితులు,ఫిర్యాదుదారులు మరణిస్తున్నారు. దర్యాప్తుచేస్తు న్న అధికారులు కూడా బదిలీలైపోవడం, మరికొందరు పదవీ విరమణతో కేసులపట్ల పెద్దగాశ్రద్ధ చూపడం లేదు.
నిన్న మంగళవారం వెలువడిన చుండూరు మారణకాండ తీర్పు ఉదహరించవచ్చు. గుంటూరుజిల్లా తెనాలి మండలం, చుండూరులో 1991 ఆగస్టు ఆరోతేదీన ఎనిమిది మంది దళితులు దారుణహత్యకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తంమీద 219మందిపై పోలీసులు ఆనాడు కేసు నమోదు చేసారు. దళితసంఘాల ఉద్యమాలు,ఆందోళనలు, విజ్ఞప్తుల మేరకు భారతదేశంలోనే తొలిసారిగా సంఘటన స్థలంలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. 1991లో జరిగిన ఉదంతంపై 2004 నవంబరులో ప్రారంభమైన విచారణ 2007 మార్చి నాటికి ప్రత్యేక కోర్టు పూర్తి చేసింది.123మందిని నిర్దోషులుగా తేల్చి,56 మందిని దోషులుగా పేర్కొంటూ అందులో 21 మందికి జీవితకారా గారశిక్ష, మిగిలిన 35 మందికి ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీస్‌ 2007 జూలై 31న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ 2007లో నిందితులు హైకోర్టులో పిటిషన్‌ వేసారు. విచారణచేపట్టిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ ఘట నకు బాధ్యులుగా పేర్కొంటూ 21 మందికి జీవితకారాగార శిక్ష, మరో 35మందికి ఏడాదిపాటు జైలుశిక్ష వేస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసి అందరూ నిర్దోషులుగా ప్రక టించింది. దళితులపై దాడికి బాధ్యులను గుర్తించడంలోనూ, సంఘటన జరిగిన ప్రాంతాన్ని రుజువ్ఞ చేయడంలోనూ, చని పోయినవారు ఫలానాసమయంలో చనిపోయారని నిరూ పించడంలోనూ విచారణ కోర్టులో ప్రాసిక్యూషన్‌ విఫలమై నట్లు ధర్మాసనం అభిప్రాయపడింది.అంతేకాదు కిందికోర్టు జరిపిన విచారణలో విధానపరమైన లోపాలున్నాయని హైకోర్టు ప్రస్తావించింది. ఈ విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం కాబట్టి విచారణ కోర్టులు నైతికశిక్ష  విధించిందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సాక్ష్యాలు చెప్పిన దాని ప్రకారం దాడిచేసిన వారి వివరాలు వేర్వేరుగా ఉన్నాయన్నది. తనకు తీవ్రగాయాలైనా సమీపంలోని పంట కాల్వలోకి దూకి సుమారు మూడు కిలోమీటర్లు ఎదురీదు కుంటూ వెళ్ళానని సాక్ష్యం చెప్పినవ్యక్తి (పిడబ్ల్యు15)క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో తనకు ఈతరాదని ఒప్పుకున్నారు. ఈత రాని వ్యక్తి తీవ్రగాయలైనా ఏటికిఎదురీదుతూ వెళ్లానని చెప్పిన సాక్ష్యం ప్రత్యేకకోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇక ఈతరాకపోయినా పది అడు గుల లోతులోఉన్న కాల్వలో ఈదుకుంటూ తెనాలిలోని తన బంధువ్ఞల ఇంటికి చేరుకున్నానని 1991 ఆగస్టు పదోతేదీ వరకు అక్కడే తలదాచుకున్నానని వివరించిన వ్యక్తి ఆచూకీ తెలియకుండాపోయిన తన సమీపబంధువ్ఞల గూర్చి పోలీ సులకు ఫిర్యాదుచేయలేదంటూ ప్రాసిక్యూషన్‌లోని లోపా లను ధర్మాసనం ఎత్తిచూపింది. ప్రధాన సాక్ష్యులు (1నుంచి 7)ఉన్న అందరూ ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్నవ్యక్తి వికలాంగుడని ఒప్పుకున్నారు. ఒకచేతిని కాలుపైవేయకుండా ముందుకు వెళ్లలేడని స్పష్టంచేసారు. అయినా ఆరోనింది తుడు ముగ్గురిని వెంటాడి చంపాడని చెప్పినసాక్ష్యాన్ని ప్రత్యే కకోర్టు పరిగణనలోకి తీసుకుందని ధర్మాసనం ఆక్షేపించింది.
మొత్తంమీద ఈ కేసులో ప్రాసిక్యూషన్‌లో ఎన్నో లోపా లున్నాయని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన దళిత కుటుంబాలకు కలిగిన వేదన తీర్చలేనిదని ప్రభుత్వం ఎంత సహాయం చేసినా ఆ బాధతీర నిదని అయితే అభియోగాలపై 15ఏళ్లకుపైగా 200మందిపై కొనసాగుతున్న విచారణ,ప్రతిదాడులు,ఆయా కుటుంబాలు సైతం ఎంతో ప్రభావం చూపింది. ఇప్పటికైనా ఈ కక్షలకు స్వస్తిపలికి పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ మాన వతావిలువలతో కలిసిమెలిసి జీవించాలని ధర్మాసనం హిత వ్ఞపలికింది. మొత్తంమీద ఈ తీర్పుతో దళితసంఘాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి.సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సంసి ద్ధమవ్ఞతున్నట్లు ఆ సంఘాలు ప్రకటించాయి. ఏదిఏమైనా అక్కడ మళ్లీ ఉద్రిక్తత ఏర్పడకుండా ప్రశాంతతను కాపా డాల్సిన గురుతరబాధ్యత ప్రభుత్వంపై ఉంది.కేసుల దర్యా ప్తు విషయంలో అధికారులు మరింత పటిష్టంగా పక డ్బందీగా వ్యహరించాల్సిన అవసరం ఉంది.

Vaartha Telugu News Paper Dated : 24/4/2014 

No comments:

Post a Comment