Monday, April 28, 2014

పాలమూరులో పౌరహక్కులు By హరగోపాల్


Updated : 4/27/2014 1:40:10 AM
Views : 39
కనీసం 2019 ఎన్నికల వరకన్నా స్వేచ్ఛగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే వాతావరణం ఏర్పడాలి. డీఎస్పీ గారి ముందు దోషిగా నిలబడి, అనుమతి కావాలి అని బతిమిలాడే పద్ధతికి స్వస్తి చెప్పాలి. పోలీసుస్టేషన్‌కు ఎవ్వరూ వెళ్లినా కనీసం మర్యాదగా మాట్లాడే సంస్కతి నేర్పాలి. ప్రజలు తమ పాలకులు అనే స్పహ కలిగించాలి. ఈ కషి తెలంగాణ నాయకులు చేయకపోతే, పోరాటాల అనుభవమున్న తెలంగాణ ప్రజలు మళ్లీ తిరగబడతారన్న చారిత్రక సత్యాన్ని మరిచిపోవద్దు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకంటే మహబూబ్‌నగర్ అతి ఎక్కువ వెనకబడిన జిల్లా అనే అంశం తెలంగాణ ఉద్య మ సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అవగాహనకు వచ్చింది. ఈ జిల్లాలోని కరువు, వలసలు, ఆత్మహత్యలు, పడుకున్న ప్రాజెక్టులు, జోగి ని వ్యవస్థ, మహిళలపై వేధింపులు, దళితుల పరిస్థితులు, మూఢ విశ్వాసాలు, భూస్వామ్య సంబంధాలు, బాధ్యతారహిత రాజకీయ నాయకత్వం జిల్లా వెనుకబాటుతనాన్ని కొట్టవచ్చినట్టు చాటుతున్నాయి. గత రెండు, మూడు దశాబ్దాలుగా పౌర సమాజం నుంచే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రజాస్వామ్యవాదులు కరువు వ్యతిరేక కమిటీ గా ఏర్పడి, జిల్లా పరిస్థితులను నిశితంగా పరిశీలించడమే కాక సమస్యలను ప్రజల దష్టికి తేవడానికి తమ వంతు పాత్ర నిర్వహించారు. ఈ కమిటీ ప్రజల చైతన్యంలో మార్పు తీసుకవస్తున్నదని గమనించిన పాలకవర్గం కమిటీ కార్యక్రమాలకు ఆటంకాలు కలిగిస్తూ, చివరికి కమిటీ తన కార్యక్రమాలను కొనసాగించకుండా అడ్డుపడ్డారు. 

కొంతవరకు అప్పటి కషికి కొనసాగింపుగా పాలమూరు అధ్యయన వేదిక ఇతర ప్రజా సంఘాలతో కలిసి సమస్యల మీద లోతైన అధ్యయనంతో పాటు నిరంతరంగా చర్చను సజీవంగా ఉంచే ప్రయత్నం చేసింది, చేస్తున్నది.
కరువు వ్యతిరేక పోరాట కమిటీ గతంలో జరిగిన ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తూ, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు తీసుకునేది. ఎన్నికలప్పుడు ప్రతిసారి ఏదో మిష మీద పోలీసులు మీటింగులకు అనుమతులు నిరాకరించడం, ఒక్కొక్కసారి వాళ్లతో వాదించి మీటింగ్‌లు పెట్టుకోవడం, ఒక్కొక్కసారి వాళ్లు వద్దన్నా మీటింగ్‌లు పెట్టడం జరిగేది. గతంలో ఒక పర్యాయం (2004 ఎన్నికలు అనుకుంటా) ఎన్నికల సందర్భంలో ఒక్కరోజు ధర్నా చేస్తామని అడిగితే పోలీసులు నిర్దందంగా అనుమతి నిరాకరించారు. ఈ విషయం బాలగోపాల్‌తో ప్రస్తావిస్తే, ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేసి అనుమతి సాధించాడు. హైకోర్టు ఆర్డర్స్‌తో ధర్నా నిర్వహించి కలెక్టరేట్ దాకా ప్రొసెషన్‌లో వెళితే అప్పటి జాయింట్ కలెక్టర్ స్వయాన ప్రొసెషన్‌నుఉద్దేశించి ప్రసంగించాడు. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ప్రజలు తమ సమస్యలను కాబోయే ప్రతినిధుల దష్టికి తీసుకపోవడం ఒక సహజ హక్కు. ఇలాంటి అవకాశాలు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థంలేదు. 

ఎన్నికలప్పుడు కూడా బందోబస్తు పేరు చెప్పి అనుమతులు నిరాకరించడం పోలీసు యంత్రాంగానికి అలవాటైపోయింది.
తెలంగాణ ఉద్యమం దీర్ఘకాలం జరగడానికి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడానికి, ప్రజలు ఎదుర్కొన్న నిర్బంధం ఒక కారణం. తమ రాష్ట్రమంటూ వస్తే తమ సమస్యలపై ఉద్యమించడాని కి, పోలీసులు పరాయి పాలకుల దౌర్జన్యం నుంచి బయటపడి, తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటారని ప్రజలు ఉద్యమించారు. తీరా రాష్ట్రం ప్రకటించిన తర్వాత జరుగుతున్న ఇప్పటి ఎన్నికలలో పాలమూరు పోలీసుల వైఖరిలో ఎలాంటి మార్పులేదు. ఇప్పుడు మనం మన రాష్ట్రంలో ఉన్నాం అనే ఆనందం ఏం లేదు. ఉద్యమాలు రాజ్య స్వభావంలో కొంచమైన మార్పు తేలేకపోతే దాన్ని ఉద్యమ వైఫల్యంగా పరిగణించవలసి ఉంటుంది. 

2014 ఎన్నికలు 2004 ఎన్నికలకు లేక అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు ఏ మాత్రం భిన్నంగా లేవని పోలీసు యంత్రాంగం ప్రవర్తనలో రవ్వంత మార్పు లేకపోవడం పాలమూరు లో అనుభవపూర్వకంగా విశదమవుతున్నది. ప్రజా సంఘాలు ఏప్రిల్ 26నాడు ఒక శాంతియుత ర్యాలీ తీస్తామని నాలుగు ఐదు రోజుల ముందే పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చినా డీఎస్పీ అది తన దష్టి కి రాలేదని అనుమతి ఇవ్వనని, చంద్రబాబు మీటింగ్‌తో తాను చాలా ఒత్తిడిలో ఉన్నానని అన్నప్పుడు, ఇంత పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకుంటే తెలంగాణలో కూడా మీరు ఇలా ప్రవర్తిస్తే ఉద్యమానికి ఏం అర్థం? అని అడిగితే,అంత లోతైన విషయాల గురించి తాను ఆలోచించలేదని, అనుమతి అయితే ఇవ్వనని మొండికి వేశాడు. మా సభ్యులు భిన్న ప్రాంతాల నుంచి వస్తున్నారని అందరికి ఇబ్బంది అవుతుందని మా తరఫున ఎలాంటి శాంతిభద్రతల సమస్య ఉండదని అంటే, మా అనుమతి లేకుండామీరు అందరిని ఎలా పిలిచారని ప్రశ్నించాడు.ఈ ప్రవర్తన ఒక మహబూబ్‌నగర్ డీఎస్సీకి మాత్రమే పరిమితమైంది కాదు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పనికట్టుకుని మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఇలా తయారు చేశారు. తమ పనులు చేసిపెట్టినంత కాలం, వాళ్లు ప్రజలతో ఎలా ప్రవర్తించినా పట్టించుకున్న పాపానపోలేదు.

నిజానికి 2004, 2005 సంవత్సరంలో పాలమూరు జిల్లా అత్యంత దారుణమైన పోలీసు అణచివేతను ఎదుర్కొంది. అప్పటి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పాత కాలం కరీంనగర్, వరంగల్, నల్గొండ దొరల ప్రవర్తనను గుర్తుకు తెచ్చాడు. ఎస్పీ నియంతత్వాన్ని మహబూబ్‌నగర్ ప్రజాప్రతినిధుల దష్టికి తీసుకెళితే ఎస్పీని ట్రాన్స్‌ఫర్ చేసేంత పలుకుబడి తమకు లేదని తప్పించుకున్నారు. అప్పటి హోంమంత్రి జానారెడ్డి దష్టికి తీసుకెళితే తాను నిస్సహాయుడినని, తన మాట ఎస్పీ ఖాతరు చేయడం లేదని అన్నాడు (అవి రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రాంచందర్‌రావు చక్రంతిప్పిన రోజులు) ఇదే ప్రతినిధులు ఆ ఎస్పీ తర్వాత వచ్చి న ఎస్పీ చారుసిన్హాను (ఆమె నా విద్యార్థి ని) తమ మాట వినలేదని నాలుగైదు నెల ల్లో ట్రాన్స్‌ఫర్ చేయించారు. ఇది పాలమూ రు ప్రజా ప్రతినిధుల ప్రజాస్వామ్య ప్రవర్తన.
ఇప్పుడు కొత్త రాష్ట్ర ఆవిర్భావం జరుగుతున్నది.

ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రమిది. ఇప్పుడు తెలంగాణ వలస పాలకుల చేతిలో లేదు. ఇది పాత తెలంగాణ కాదు. పాలమూరు నాయకులైనా, తెలంగాణ రాష్ట్ర నాయకులై నా దీన్ని పూర్తిగా గుర్తించవలసిన అగత్యం వాళ్లకుంది. రాష్ట్రం ఏర్పడుతూనే పోలీసు యంత్రాంగం మీద సివిలియన్ అధికారాన్ని పునరుద్ధరించాలి. కలెక్టర్ల అధికారాన్ని, వాళ్ల ఎస్పీ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు రాసే పద్ధతి మళ్లా ప్రవేశపెట్టాలి. పోలీసులు కలెక్టర్లను లెక్కచేయకపోవడం, ఎస్పీలు చెబితే కలెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేసే పద్ధతికి పూర్తిగా స్వస్తి చెప్పాలి. సభలకు ధర్నాలకు, ప్రొసెషన్లకు పోలీసుల అనుమతివ్వడం రద్దు చేసి, ప్రజలు కేవలం పోలీసులకు సమాచారం ఇవ్వడానికి మాత్రమే కుదించాలి. 

కనీసం 2019 ఎన్నికల వరకన్నా స్వేచ్ఛగా ప్రజలు తమ సమస్య లు చెప్పుకునే వాతావరణం ఏర్పడాలి. డీఎస్పీ గారి ముందు దోషిగా నిలబడి, అనుమతి కావాలి అని బతిమిలాడే పద్ధతికి స్వస్తి చెప్పాలి. పోలీసుస్టేషన్‌కు ఎవ్వరూ వెళ్లినా కనీసం మర్యాదగా మాట్లాడే సంస్కతి నేర్పాలి. ప్రజలు తమ పాలకులు అనే స్పహ కలిగించాలి. ఈ కషి తెలంగాణ నాయకులు చేయకపోతే, పోరాటాల అనుభవమున్న తెలంగాణ ప్రజలు మళ్లీ తిరగబడతారన్న చారిత్రక సత్యాన్ని మరిచిపోవద్దు. 

Namasete Telangana Telugu News Paper Dated: 27/4/2014 

No comments:

Post a Comment